Thursday, 18 October 2018

వృషభము-మిధునము-ఖగోళము


వృషభము-మిధునము-ఖగోళము

https://cherukuramamohanrao.blogspot.com/2018/10/blog-post.html
కాళిందీం శుక్ష సలిలాం నిరీక్ష్య 'వృషకేతనః'l
ప్లక్షజాం స్నాతు మగమడంతర్దానంచశాగతా ll
కాళింది లో నీరు ఎండియుండుట జూచి ప్లక్షజా నదిలో స్నానము చేద్దామని చూడగా అక్కడా నీరు ఎండిపోయి ఉండుట శంకరునకు అగుపించినది. ఈ సందర్భమున ఈశ్వరునకు 'వృషకేతనుడు' అన్న పదమును వాడుట  వామన పురాణము పరమేశ్వర బ్రహ్మహత్యాపాతక నివారణ ఘట్టము నందు మనము చూడగలము.
శివ సహస్ర నామములోని 6వ శ్లోకము ఈ విధముగా వున్నది.
విశ్వరూపో విరూపాక్షో వాగీశః శుచిసత్తమః ।
సర్వప్రమాణసంవాదీ వృషాఙ్కో 'వృషవాహనః'
ఇందు వృషవాహనః అన్న ప్రయోగమును ఈశ్వరునికి మనము చూడవచ్చు.
దీనిని బట్టి శివునకు ‘వృష కేతనుడు’ ‘వృష వాహనుడు’ అన్న రెండు పేర్లూ గలవని మనకు రూఢియగుచున్నది. ఇక అసలు విషయమునకు వద్దాము.                                                                                                                                                                                                                                                        
                                            
                               

మనము గమనించితే ఆకాశము అర్ధ గోళముగానూ భూమిని దాని వ్యాసముగానూ ఊహించుకొనవచ్చును. B తూర్పు దిక్కు అనుకొంటే A పడమర అవుతుంది అని నేను చెప్పనవసరము లేదు. మనకు ప్రతి దినమూ B నుండి సూర్యుడు ఉదయించినట్లు అనిపిస్తుంది. దీనిని సాపేక్షత అనవచ్చు. ఇపుడు సూర్యుదయసమయమున మిధునరాశి ఉన్దినదిఒ అనుకొందాము. అంటే సూర్యోదయమునకు పూర్వము ఉన్న వృషభరాశి పైకి జరిగినది. ఎందువలన అంటే రాశుల వరుసక్రమములో వృషభము ముందు పిదప మిధునము వస్తుంది కాబట్టి. ఆ విధముగా ఒక్కొక్క ర్రషి వద్ద ఉదయించుతూబోతే ఒకర్తోజు ఈ వృషభరాశి వద్ద సూర్యుడు అస్తమించ వలసి వస్తుంది. అప్పుడు మిధున రాశి వృషభ రాశి పైన ఉండుట తటస్థించుతుంది. ఇప్పుడు మొదట చెప్పిన ఉదయమును ఇప్పుడు చెప్పిన అస్తమానమును పరిగణన లోనికి తీసుకొందాము.
పై చిత్రములో ఉదయమున మిధునము క్రింద వృషభము పైన వున్నది. ఊహాజనితముగా మిధునము ఉన్న రథమునకు వృషభము కేతనము లేక ఝండా అనవచ్చు. వృషభము అంటే నంది. శివునికి ‘వృషకేతనుడు’ అన్న పేరుందని పైన తెలుసుకొన్నాము. మరి ఇక్కడ మిధునము కదా వుండేది అన్న సందేహము మీలో కలిగి వుంటుంది. మిథునము అంటే దంపతులు అన్నది మనకు తెలిసిన విషయమే! దంపతులు అంటే ఆదిడంపతులే. ఆది దంపతులన్న పేరు పార్వతీపరమేశ్వరులకు మాత్రమే వుంది. వారిది అర్ధనారీశ్వర తత్వము. ఆవిధముగా మిథునమునకు  వృషభము కేతనమైనది. ఈ 12 రాశులూ జరిగి జరిగి చివరకు A వద్దకు వస్తాయి. అప్పుడు వృషభము క్రింద మిధునము పైన వుంటుంది. కావున మిదునమునకు వృషభము ఇపుడు వాహనమౌతుంది. వేద వేద పురాణ రూపమునగాక ఖగోళ శాస్త్ర ప్రమాణముతో మనము ఇపుడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా కూడా ‘వృష కేతనుడు’ వృష వాహనుడు’ అయినాడు. పై పెచ్చు శాస్త్రము ఈ విధముగా తెలుపుచున్నది.
‘యస్యయో వాహనః ప్రోక్తః ధ్వజస్తస్య సయేవతు’
దేవతా వాహనమే ఆదేవత రథ కేతనమౌతుంది. కావున ఇంతవరకూ చేసిన వివరణలో సందిగ్ధమునకు తావు లేదు.
ఇక ఆది దంపతులగు పార్వతీపరమేశ్వరులను రఘువంశ కావ్యములో స్థుతిస్తూ కాళీదాసు
 వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||
వాక్కు అర్థములవలే కలసి ఉన్న , సమస్త జగత్తునకు మాతాపితరులగు పార్వతీ పరమేశ్వరులకు, వాక్కు అర్థముల ప్రతిపత్తి కొరకు నమస్కరిస్తున్నాను. వారి ఆదిదాంపత్యము మనకిక్కడ తెలియవస్తూవున్నది. చెప్పినది శ్యామలా ఉపాసకుడు కాళిదాసు కదా!
భాగవతము రుక్మిణీ కళ్యాణ ఘట్టములో గౌరీ పూజ సమయమున అమ్మవారిని ఈ విధముగా ప్రార్థించుతూ వున్నది.
'నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము ఋరాణదంపతుల మేలు భజింతు'
ఈ మాట వాళ్ళ కూడా పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అని తెలయస్తూవున్నది.
ఇక రెండవ విషయమునకు వద్దాము. అది ‘క్షీరసముద్రము-గంగావతరణము’.
కాశీ ఖండములో శ్రీనాథ కవి సార్వభౌముడు శివుని రాకను గూర్చి, ఆయన కార్తీక శుద్ధ పాడ్యమి నాడు భూమిపై కాశీ క్షేత్రమున అవతరించినట్లు మనకు తెలియవస్తుంది.
మరొక విషయము చెప్పవలసినది వుంది. కార్తీక మాసములో  ఆర్ద్రా నక్షత్రమును సాయం సమయములో మనము చూడవచ్చు. ఆనెలలో మనము నక్తము వుండి నక్షత్రదర్శనము చేసి భోజనము చేయుట కద్దు. మరి నక్షత్ర దర్శనము అంటే ఏ నక్షత్రము?

శ్రుతిగత ప్రభయా ప్రభాయుతం
హరి పదాబ్జ భవా శిరసా ధృతం’
బ్రహ్మాండ భాండ సంపత్తి కుక్షిన గల్గు
పద్మనాభుని పదాబ్జమున బుట్టి
అఖిల లోకాధ్యక్షుడై మించి విహరించు
శివ జటా జూటాగ్ర సీమ నిలిచి
ఈశుడు ‘సర్వలోకాధ్యక్షుడు’ అని మనకు తెలియవస్తూ వుంది. శ్రీ మహావిష్ణు పాదోద్భవ యగు గంగను నిలువరిమ్పగలిగిన వాడు  లోకాధ్యక్షుడైన శివుడే! వేదము కూడా ఇదే మాట చెబుతుంది. ‘ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం ....బ్రహ్మా శివోమే’ అన్నది వేదవాక్కు. అంతక్తి ఉధృతి గలిగిన గంగను ఆయనే నిలువరించ గలడు. అందుకే ఆయన ఈశానుడు . ఈశానుడు అంటే Controler అని ఆంగ్లములో అర్థము. సర్వభూతములకు ఆయన ఈశుడు. అందుకే ఆయన దేనినయినా, గంగను కూడా, నియంత్రించగలిగినాడు. ఆ కారణము చేతనే  ఆయన ఈశాన్యమునకు అధిపతి అయినాడేమో!
ఇక పాల కడలిని గూర్చి తెలుసుకొందాము. మనము రాత్రిపూట ఒక మైదానములో నిలబడి ఆకాశము వంక చూస్తే  దక్షిణము నుండి ఉత్తరమునకు చిక్కని పాల వెలుగు వ్యాపించి ఉంటుంది. ఆ వెలుగు నిజమనకు కొన్ని కోట్ల కోట్ల కోట్ల నక్షత్రముల సమూహము. మనవారు దానిని ‘పాలపుంత’ (Milky Way)అనుట కద్దు. ఇది ద్మోదట దట్టముగా ఉంటూ రానురానూ ఉత్తరము వైపునకు వచ్చుసరికి పలుచబడుతుంది. ఈ దట్టముగా వున్నా వెలుగే క్షీర సముద్రము. పలుచగా వున్నా వెలుగును ఆక్కాష గంగ అంటూ వుంటారు. ఈ పలుచటి తెల్లటి జలపాతమును బోలిన వెలుగు ఏటవాలుగా ఈశాన్యమునకు జారుతూ వున్నట్లుంటుంది. ఆ ప్రవాహము ఒక నక్షత్రము పైన పడుచున్న చందమున మనకు గోచరించుతుంది. ఆ నక్షత్రమే ఆర్ద్రా నక్షత్రము. శివునిది ఆర్ద్రా నక్షత్రమే! ఇక్కడ మనము గ్రహించావలసినది ఏమిటంటే శ్రీమహావిష్ణువు పాద కమలముల నుండి బయలుదేరిన గంగ శివుని తలపై జటాజూటములచే బంధింపబడి వున్నది అని మనము అన్వయించుకోవలసి యుంటుంది. అసలు మరొక విషయము ఈ చిక్కటి పలుచని వెలుగుల నడుమ వెలుతురు వున్నట్లు అగుపిస్తుంది గానీ పిండి ఆరబోసినట్లు ఉండదు. సంకేతముగా అక్కడ హంసలు విహరించుతాయని చెప్పబడినది. ఈ హంసల గూర్చి నేను ఇంకా తెలుసుకొనవలసి యున్నది.
ఎంతటి విజ్ఞానము మన ఖగోళ శాస్త్రము కలిగి యున్నదో చూడండి. పురాణములను తెలియనితనముతో  పుక్కిటి పురానములని కొట్టివేయవద్దు.
మన పూర్వులు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సంపన్నులు. అణువు మొదలు ఆకాశము వరకు, ఆకాశము మొదలు అనంతము వరకు, ఆ అనంతమునకు అధిపతివరకూ అన్నీ తెలిసినవారు వారు.
ఈ భూమిపై పుట్టుటయే మన పురాకృతము. అందుకు ఆ భగవంతునికి అంజలి ఘటించుదాము.
స్వస్తి.