ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న
పద్యం తెలియజేస్తుంది.
కంస వధకు ముందు బలరామకృష్ణులు మథురా నగరంలో ప్రవేశించినారు.
పురజనులు వారిని సందర్శించి మురిసిపోతున్నారు. బలరామకృష్ణులు ఆ దృశ్యాలను చూస్తూ
రాజవీధిలో ముందుకు నడిచి వస్తూవున్నారు. తమను ధిక్కరించిన రజకుడిని భంగపరచి, అతని మూటలోని
ధౌతవస్త్రాలు(ఉతికిన బట్టలు) తీసుకొని ధరించినారు. దారిలో పరమ భక్తుడైన సుదాముడనే
మాలాకారునిగృహానికి చేరుకున్నారు.
వారిద్దరికీ సుదాముడు ప్రణమిల్లి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తగురీతిన
సత్కరించినాడు.వారు కోరిన వరాలిస్తామన్నారు. అప్పుడు అతను పైపద్యంలో చెప్పిన
విధంగా కోరుకున్నాడు. మాధవుడు తదాస్తు అన్నాడు.
ఇపుడుపైపద్యంలో
సుదాముడు ఏమి కోరినాడు అన్నది తెలుసుకొందాము. ఆ పరమ భక్తుడు అధికారం కోరలేదు.
దానివల్ల అహంకారం పెరుగుతుంది కాబట్టి. అది రజోగుణ లక్షణం. అది చివరికి దుఃఖదాయకం
అవుతుంది. ధనం కోరుకోలేదు. ‘ధనమెచ్చిన మదమెచ్చును’ అనేది ఉండనే ఉన్నది. ‘ పద్మముల
బోలిన నీ పాదసేవను ప్రసాదించు, నిన్నుఅర్చించే భక్తుల సహవాసము కావలెనన్నాడు,అధికము, అవ్యయము అగు
భూత దయ అంటే సాటి ప్రానులపై దయ, అనగా జీవహింస చేయకుండా ఉండు సుగుణమును కోరుచున్నాడు.
భగవంతుని తాపస మందార అని సంబోధించుచున్నాడు, అంటే భక్తులకు కల్పవృక్షము వంటివాడు అని అర్థము.
సుదాముడు పుట్టుకచే ఒక బ్రాహ్మణుడో, క్షత్రియుదో కాదు. అయినా ఎంతటి ఉన్నత భావములు
కలిగినాడో మనము గమనించితీరవలసిన విషయము. భగవంతుడు సేవ్యుడు (సేవించదగిన వాడు).
భక్తుడు సేవకుడు- ఈ సేవ్యసేవక భావమే మనము అనుసరించవలసిన సాధనామార్గము. ఇది
కలియుగానికి ఎంతగానో తగినది. భగవానుడి పాదసేవ వల్ల అహంకారం అడుగంటిపోతుంది. అదే
సత్వ గుణ లక్షణం. ఈ సత్వగుణమే క్రమంగా దివ్యానంద ప్రదమైన భగవత్ సన్నిధానానికి
దారితీస్తుంది.
Subrahmanyam Karoor : Dhanyosmi. For the last 15 to 20 days, I was not active on FB. What a tremendous ocean of information is give by you Sir. Many many thanks. We are enlightened by such information. Thanks once again. I will be reading the other parts also now. Very interesting.
Reply7y
భారతీయ శాస్త్ర విజ్ఞానము - 1
ఉపోద్ఘాతము
‘భారతీయ శాస్త్ర విజ్ఞానము’ అన్న పేర నేను ఒక 8 సంవత్సరముల క్రితము నాకు తెలిసిన మేరకు వివరముగా ఋషులు మనకు అందించిన శాస్త్ర విజ్ఞాన సంపదను ‘ఆస్యగ్రంధి’ లో ఉంచియుంటిని. అప్పుడు చదివినవారెందరో చదువని౯ వారెందరో నాకు తెలియదు. దానిని అవసరమైన చోట్ల విస్తృత పరచుచూ తిరిగీ మీముందు ఉంచుచున్నాను. ఉత్సాహముతో చదివెదరన్నది నా ఆశ. శృంఖల రేపటినుండి ప్రారంభించుతాను.
తల్లిని భారతిన్ మదిన తత్పరత న్నుపవిష్ఠ జేయుచున్
వల్లెయనంగ ప్రేమమున వారువ కంఠుడు నోట నిల్వగన్
ఎల్లలు లేనిరీతి నను ఎల్ల విధమ్ముల సవ్య మూర్తి నా
ఉల్లము నిల్వ, తెల్పెదను ఓర్మి తపోభృత జ్ఞాన సంపదల్
చదువుల తల్లియగు సరస్వతీ దేవిని మదిలో స్థిరాసనముపై కూర్చుండజేసి, ఎంతో ఆదరముతో కూడిన హయగ్రీవుని ఆశీస్సులను పొంది, ఎల్లలు లేని రీతిగా ఆ దక్షిణామూర్తి దయను చూపించగా, మనసును కుదుటపరచుకొని, నేను విన్న, చదివిన, తెలుసుకొన్న మేరకు తెలుప ప్రయత్నించెదను. చదువుటచే ఇటు మీకు అటు దేశానికి కూడా లాభము.
'జ్ఞ' అంటే ఎరుక అని అర్థము,నాకు తెలిసినంత వరకు. జ్ఞానము ఇందు నుండి పుట్టినదే. 'విజ్ఞానము అన్న మాటకు ఒకవిధంగా సంపూర్ణ అవగాహన అని చెప్పుకోవచ్చు. 'Science' అన్నది విజ్ఞానమునకు సమానార్థకము కాదు అన్నది నా ఉద్దేశ్యము. విజ్ఞానము అంటే ఆంగ్లములో Worldly or profane knowledge, knowledge derived from worldly experience. Monier Williams (1899; rev. 2008) provides the following definition:
To distinguish, discern, observe, investigate, recognize ascertain, know, understand - Rig Veda (RV.), etc., etc. (with na and inf.: 'to know not how to');
To have right knowledge - Katha Upanishad (KaṭhUp.)
To become wise or learned - Mn. IV, 20;
To hear or learn from (gen.) - Chandogya Upanishad (ChUp.); Mahabharata (MBh.);
To recognize in (loc.) - Panchatantra (Pañcat.);
To look upon or regard or consider as (two acc.), Mn; MBh, etc.; Kāv, etc.
To explain, declare - BhP.
ఇక్కడ ఎక్కడా విజ్ఞానము అంటే science అని చెప్పలేదు. విజ్ఞత అన్నది తనకు వస్తువునకు కల అనుభవాన్ని అనుబంధాన్ని తెస్తుంది. ఇది తనకు తాను సహజీవనము చేసే సకల చరాచర వస్తు ప్రపంచానికి పరస్పర హితకరమైన మైత్రిని కలుగజేస్తుంది. ఇక ‘science’ అన్నది ఆధునిక విజ్ఞానమన్న పేరుతో ప్రపంచమున ప్రబలమై యున్నది. దీనికి, కొన్ని ఆధునిక ఆవిష్కరణలను తప్పించి, ప్రకృతిని తన బానిసగా చేసుకొని ప్రకృతికి ముప్పు తెప్పించడం తప్పించి లోక కళ్యాణము లోక హితమును గూర్చి తలచినదే లేదు.
ఐన్ స్టీన్ గారి ఈ సంభాషణ గమనించండి:
“Student: Dr. Einstein, Aren’t these the same questions as last year’s [physics] final exam?
Dr. Einstein: Yes; But this year the answers are different.”
― Albert Einstein
ఈ మాట చాలదా నేటి విజ్ఞాన శాస్త్రము ఎంత శీఘ్రముగా మార్పులకు గురియౌతూ వుంటుందో తెలుసుకొనుటకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము. బట్టలు ఉతుకుటకు గానీ పాత్రలు తోముటకుగానీ వివిధ నామావళితో ‘detergents’ వస్తున్నాయి . ‘Plastic scrubbers’ వస్తున్నాయి. వీటివల్ల చర్మ సంబంధమైన వ్యాధులు రావని ఏ శాస్త్రజ్ఞుడు అయినా చెప్పగలడా! మనము గతములో వాడుచుండిన మెత్తటి మన్ను బొగ్గుల బూడిద, చింతపండు పిప్పి, ఉప్పు , శ్రేయస్కరములుకావని చెప్పగలరా! ఇప్పుడు ప్రాచుర్యములో వుండే పిజ్జాలు బర్గర్ల వంటి తిను బండారములు, కోకాకోల పెప్సీ వంటి పానీయములు మంచి చేస్తాయని గానీ చెడుపు చేయవనిగానీ వారు చెప్ప గలరా! Trade secret పేరు తో వానిలో ఉపయోగించే మూలకములను మూసిపెట్టుటేగానీ ధైర్యముగా లోకమునకు చాటగలరా! లొగుట్టు ఇద్దరికే ఎరుక. 1.చేసేవానికి 2. వానిని చేసేవానికి అంటే ఆ భగవంతునికి.
మనిషిలో సంతృప్తి సమసిపోయింది. సంపాదనే సర్వస్వమైపోయింది. ఇటువంటి స్థితిలో తీరుబడి ఎక్కడిది. దేవుణ్ణి తలచుకొనుటకు కూడా సమయము లేదు. తిరుమల కొండకు flight లోపోయి దేవుని దర్శనానికి special ticket' తీసుకొని దానికి recommendation జోడించి 15 నిముషాలు దైవ సన్నిధిలో యుండి తిరిగి flight లో వూరు చేరి భగవంతుడే నేరుగా వచ్చి దర్శనమిచ్చినాడని గొప్పలు చెప్పుకొనే ఈ భాగవతోత్తముల భక్తిని ఏమని పొగడవలె. ఆడంబరాలే భక్తి అనుకునేటంత అమాయకుడా భగవంతుడు. మన ఆత్మను తనకు ఎంతవరకు అనుసంధానము చేసినాము అన్న విషయము తెలుసుకోలేడా ఆ పరమాత్ముడు. లేక ఈ భక్తాగ్రేసరులు భగవంతుని కూడా నమ్మించినామనే భ్రమలో ఉన్నారా! ఇదీ మన ప్రగతి. ఇది నమ్మితే కలిగేది అధోగతి. వదిలేదెప్పుడు మనలనీ దుర్గతి. దీనికి పరిష్కారము నివ్వగలిగినది యువత ధర్మ నిరతి.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయాl
సర్వే బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ll
కాసింత కూడా దుఃఖము లేని సౌఖ్యమును సకల జీవరాశికీ కోరిన వేదభూమి మనది.
వేద చోదితమైన మన యంత్ర, తంత్ర, మంత్ర నిర్మాణమంతా విశ్వ శ్రేయస్సుకే మన పూర్వీకులు వినియోగించినారు గానీ విశ్వ వినాశనమునకు గాదు. 5,౦౦౦ సంవత్సరముల క్రితము జరిగినదని నిర్ధారింపబడిన భారత యుద్ధము ముగిసిన వెంటనే వివిధ విధములుగా సంపాదించిన తమ అస్త్రములను అనగా మారణాయుధములనెల్లా పాండవులు సముద్రములో పడవేయుటే ఇందుకు తార్కాణము. పెద్ద దేశములకే పెద్దదయిన అమెరికా తన మారణాయుధాలను పారవేయ గలుగుతుందా! చేయలేదు. ఎందుకంటే దేశాలమీద యుద్ధాలు రుద్ది ఆయుధాలు అమ్ముకొనుటే వారి గుణము. ఆ దేశములో, వేరు పరిశ్రమలు ఏవైనా వున్నా దీని తరువాతనే.
ఏతావాతా నేను చెప్పదలచుకోన్నదేమిటంటే మన విజ్ఞానము కోరేది 'లోక హిత'మైతే వారి science కోరేది 'లోక హతము’. ఈ దృక్పథముతో భారత శాస్త్రీయ వినీలా కాశములో కనిపించే కొన్ని తారకలను చూస్తాము.
ప్రాచీన భారతము అంటేనే, ఇప్పుడు కుంచించుకు పోయిన మన ఎల్లలను, సుదూర తీరాలకు విస్తరించవలె. పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్,ఉజ్బెకిస్తాన్,తుర్క్మెనిస్తాన్ మరియు రష్యాలోని కొన్ని భాగాలు ఇరాన్, సౌదిఅరేబియా, టర్కీదేశాలు,సింగపూర్ ,మలేసియా, థాయిలాండ్,మయాన్మార్ మొదలగు దేశాలు ఈ భారత ఖండములోని భాగములుగా ఉండేవి.(Indian Kshatriyas Once Ruled from Bali to Baltic & Korea to Kaba (1966)-By P.N.Oak) నేటికీ మన సంస్కృతికి ప్రతీకలైన గుళ్ళు, గోపురాలు,విగ్రహాలు, శిలలు,శిల్పాలు ఈ దేశాలలోనే కాక జపాన్,చైనా లాంటి దేశాలలో కూడా చూడవచ్చు. మక్కా ఒకప్పుడు మఖేశ్వరాలయము. మఖము అంటే యజ్ఞము. అంటే ఇక్కడ విరివిగా యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉండుటవల్ల ఆపేరు వచ్చియుండవచ్చు. అరబ్బీ భాషలో ఈ పేరునకు మూలము దొరకదు. పైగా ఈ ఆలయమును మహమ్మదు ప్రవక్త మరియు వారి అనుచరులు విద్వంసము చేయక మునుపు 'సాయిర్-ఉల్-ఓకుల్' అన్న పద్య సముదాయము అరబ్బీ భాషలో బంగారు ఫలకముపై వ్రాసి ఆ ఆలయము లోపల కుడ్యమునకు వ్రేలాడదీయబడి యుండెడిదట. దానిని నేటికినీ 'మాక్క్తాబ్-ఎ-సుల్తానియా' అన్న, టర్కీ కి రాజధానియైన 'ఇస్తాంబుల్' నగరములోని ప్రభుత్వ గ్రంథాలయములో చూడవచ్చునని చదివినట్లు గుర్తు. ఇది 'అల్లాహ్ యొక్క దూత (ప్రవక్త అని ఖురాన్ లో ఎక్కడా చెప్పలేదని ఒక గొప్ప అరబ్బీ పండితుడు చెప్పగా విన్నాను.) గారి uncle అయినటువంటి 'ఉమర్-బిన్-అస్నాం' ఉర్ఫ్'అబల్-హికం' అనునతడు, మన 'భేతాళ కథలకు' పరిమితమైన, నిజముగానే మనదేశమునేలి తదనంతర హిందూదేశ పాలకులకు 'విక్రమార్క' విక్రమాదిత్య' అన్న తన స్వకీయ నామమును 'బిరుదుగా' ఏర్పరచిన ప్రభావశాలి, ప్రగతి శీలి, అత్యంత పరాక్రమవంతుడు. ఎవేయన పాలించిన కాలము ఇంచుమించు క్రీస్తుకు 50 సంవత్సరములు ముందు నుండి క్రీ.శ. 50 సంవత్సరములవరకు. ఈయన కాలములోని ఆయన సభలోనే ' నవరత్నములు' వెలసినది. అనేక కావ్య నాటకములు వ్రాసిన కాళీదాసు - 1, మరియు అత్యంత ప్రతిభాశాలియగు జ్యోతిష మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు.
ఈ 'అబల్-హికం' 'విక్రమార్కుని'గురించి, ఆయన దక్షతను గురించి అత్యున్నతముగా వ్రాసినాడు. ఆ కవి, ప్రవక్త గారి మతములో చేరలేదన్నకారణానికి ప్రవక్త గారి మతావలంబకులచే హతమార్చ బడినాడట. బ్రిటీషు చారిత్రికులు వారి హిందూదేశ అనుయాయులు వ్రాసిన చరిత్రలో మహాపురుషుడైన ఈ 'విక్రమార్కునికి' చరిత్రలో స్థానమే లేకుండాపోయింది. అసలు 'అర్వము' అంటే గుఱ్ఱము. 'వ బ యోరభేదః' అన్న సూత్రము ప్రకారము ఆ దేశము కాలానుక్రమణములో 'అరేబియా' అయినదని 'P.N.Oak' గారు నిర్ధారించినారు. అరేబియా గుఱ్ఱములకు ప్రసిద్ది యన్న విషయము మనకు తెలిసినదే కదా !
అసలు విషయానికొస్తే ప్రాచీన భారత దేశములో, భౌతిక ఉపయోగములకై, అనేక యంత్రాలను వాడినట్లు సప్రమాణముగా మన వాఙ్మయము ద్వారా తెలియ వచ్చు చున్నది. భోజరాజు చె వ్రాయబడిన 'యంత్రార్ణవము' 'సమరాంగణ సూత్రధార' ఇత్యాది గ్రంథ పరిశీలనము చేసిన మనకు వాస్తవాలు గోచరిస్తాయి. వీని మూలములను మనము అధర్వణ వేదములోనే చూడ వచ్చు. ఈ గ్రంథాలు గృహోపయోగములకు, వ్యవసాయానికి, యుద్ధ ఆయుధములకు,రోబో లకు సంబంధించిన ఎన్నో విషయములను గూర్చిన వివరాలనందిస్తాయని విజ్ఞులు చెప్పగా విన్నాను. కానీ ఈ ఆవిష్కరణలేవీ అటు ధ్యేయాన్ని ఇటు ప్రకృతి పై ధ్యాసను ఏమరలేదు. ఇవి నేటి కొన్ని యంత్రములవలె దారుణ మారణ హోమములను సృష్టించవు. 'jaguar naught' అన్న పేరుతో పిలువబడుతూ మారణ హోమమును సృష్టించే అతి పెద్ద 'tanker' కు ఆ పేరును 'జగనాథ' రథము నుండి తీసుకోన్నారంటే ఆ జగన్నాథుని పాదాశ్రితులమైన మన మనసెంత నొచ్చుకొంటుందో గమనించండి. ఆపేరు, చాలా పెద్దదైన ఆ రథము లాగుటలో చక్రముల కింద పడి మరణించు వారిని జూచి, ఆ రథము పేరు పెట్టినారు. మనమో, అలా జరిగితే ఆ భక్తుడు వైకుంఠ గతుడౌతాడని నమ్ముతాము.
8 వ శతాబ్దమునకు చెందిన ఒక వాస్తవమును మీకు తెలుప ప్రయత్నించుతాను. 8వ శతాబ్దమునకు చెందిన హరిభద్ర అనుజైన మతావలంబి రచయిత మరియు అతని మేనల్లుళ్ళు హంస పరమ హంస అను వారలు తమ ‘ప్రభావక చరిత్ర’ అన్న గ్రంథములో తాము బౌద్ధ మత సార సంగ్రహమును గ్రహింప ఒక బౌద్ధ విద్యాలయమున ప్రచ్చన్న బౌద్ధ విద్యార్థులై ఉండగా దానిని గ్రహించి వారి బౌద్ధాచార్యుడు తక్కిన బౌద్ధుల సహాయముతో భవనము యొక్క ఎత్తయిన రెండవ అంతస్తులో బంధించగా వారు గొడుగులవంటి రెండు సాధనాలతో క్రిందికి దిగినారట. మరి ఈ గొడుగులు గాలిగుమ్మటములను (parachutes) గుర్తు చేయుట లేదా! (Ibid Chapter IX, Verse 87-89). ఇటువంటి విషయములనెన్నింటినో మనము Indian Historical Quarterly, “Astronomical Instruments of the Hindus “Volume IV pp 256-269” లో చూడవచ్చు.
మిగిలినది మరొకమారు...........
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 2
క్రీస్తుకు 2000 సంవత్సరములకు పూర్వము బొత్తములను
అలంకారముకొరకు వాడిన సాక్ష్యాలు మొహెంజోదారో-హరప్పా నాగరికతలలో లభించినవి. చదరంగము
(chess) అన్న క్రీడ ఈ దేశములో కనుగొనబడినదే. గుప్తులకాలమని
అంటారుకానీ పాశ్చాత్యులు అసలు గుప్తుల కాలమునే తప్పుగా నిర్ణయించినారన్న విషయము
మహనీయులైన కోట వెంకటాచలము గారి "భారతీయ రాజవంశముల చరిత్రలు" చదివితే
వారు చరిత్రను ఎంత సాధికారంగా నిరూపించినారో మరియు పాశ్చాత్యులు వారి పాద దాసులు
చరిత్రను ఎంత చిత్రహింస జేసినారో తెలుస్తుంది. కాబత్తి ఈ క్రీడ అంతకు ముందే
ఎప్పటినుండియో వుండివుంటుంది. ప్రపంచములోనే అతిపురాతనమైన సింధునాగరీత్య నాగరికత
కళ్ళు తెరువక పొర్ర్వమెకత లో దశాంశస్థానములతో కూడిన కొలమాని (Scale) ని ఉపయోగించినట్లు త్రవ్వకాలలొ బయలు పడింది.ఇది కూడా
పాశ్చాత్య నాగరికత కళ్ళు తెరువక పూర్వమే అంటే వారి కీస్తు జననమునకు ముందే. కలకత్తా
నవాబుల దొరతనములో తలంటుకు వాడు చుండిన చంపా తైలమే 'షంపూ' ఐనది.క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దమునుండి
వాడబడుతున్న ఆనవాళ్ళు కనిపించే'పరమపద సోపాన పతం (snakes and ladders) ఆడుచున్న ఆనవాళ్ళున్నాయి.ఇది మనదేశమునుండి ఇంగ్లండుకు అక్కడినుండి అమెరికాకు
చెరినవి. నవ్య క్రీడా నిర్మాతగా పేరు గాంచిన 'Milton Bradley దీనిని విశ్వవ్యాప్తముగా పరిచయము చేసి మిలియన్ల
డాలర్లను సంపాదించినాడు.
పురాతన నాగరికత కలిగినవారని చెప్పబడే గ్రీకులు
చర్మములను మాత్రమె వస్త్రములుగా ధరించే కాలములో అలెగ్జాండరు దండయాత్రల పుణ్యమా యని
నూలు వస్త్రముల వాడకము నేర్చుకొన్నారు. ఇవి చలికాలము వెచ్చగానూ విసవిలో చల్లగానూ
వుంటాయని మనకు తెలిసినదే. ఈ వివరము India in Greece అన్న తన పుస్తకములో ప్రసిద్ధ చారిత్రికుడైన Edward
Pococke తన పరిశొధనా ఫలాన్ని
గ్రంధస్తము చేసినారు.ఈ నూలు వస్త్రముల వాడుక మన దేశములో క్రీస్తుకు పూర్వము 4,5 శతాబ్దములనుండినే వాడకములో వున్నట్లు
శాస్త్రాధారములున్నవన్నది శాస్త్రజ్ఞుల మాట.గణితమునందు Fibonacci
numbers అన్న
పేరుతోఆ పాశ్చాత్యుని ఆవిష్కరణగా
పేర్కొనబడుతున్న ఈ విషయమును విరహంక, గొపాల హేమచంద్రులు పింగళునిచేడా పత్రములన్న పేరుతో Playing
Cards మన దేశమునుండి చైనాకు
అక్కడినుండి వివిధములగు విదేశములకు ప్రాకింది. కంటి శుక్లములు తీయుట మొట్ట మొదటిగా
జగతికి తెలిపినది శుశ్రుతుడు. ఈవిద్య ముందు చైనాకు తరువాత ప్రపంచమునకు ప్రాకింది.
గ్రీకులు ఈ విద్య లోతుపాతులు తెలుసుకొన భారత దేశమునకు వచ్చేవారట. కృత్రిమావయవ
నిర్మాణము (Artificial Limbs) మరియు వాటిని అతికించుటను గూర్చి ఋగ్వేదములోనే చెప్పబడినది. వజ్రముల ఘనత ,విలువ తెలుసుకొనుటయే కాక క్రీస్తుకు పూర్వమే 5000
సంవత్సరముల క్రితము మధ్య భారతములో గనులు కలిగి యుండినవారు భారతీయులు. మన నైజాము నవాబులు
గుంటూరు. కడప అనంతపురము లలోని వజ్రపుగనులను మన్ను వచ్చేవరకు త్రవ్వి తీసుకొని తమ
వద్ద వుంచుకొన్నవి వుంచుకోగా మిగతవి తమ విధేయతను తెలియ జేయుచూ ఆంగ్లేయులకు
ధారాదత్తము జేసినారు.
జలవనరులనుపయోగించుట , flush Toilets అన్నపేరుతో నెడు మనము ఉపయోగించే ప్రసాధనలు (Toilets),ఆ మలినజలము పోవుటకు భూగర్భ జలమార్గములు
సింధూనాగరికతలో బయల్వెడలినవనిజిజ్ఞాసవున్న ప్రతి చదువరికీ తెలుసు. ఇప్పుడు కలన యంత్రము (Computer) భాషకు వుపకరించే (Binary Numbers) శతాబ్దాల క్రితము పింగళుడు కనుగొన్నవే! ఛందస్సు Binary
Numbers యొక్క పౌనఃపున్యములే(Permutations
and Combinations). ఈ సిరా(ink) తయారు చేసేప్రయత్నములో
అన్నిదేశాలకన్నా ముందంజవేసి మశి తో మంచి సిరా ను తయారు చేసినది మనవారే. నీరు పడుట
లేక వేరే విధములుగా వ్రాత చెరిగిపోకుండా వుండుటకు సిరాలో కరక్కాయపొడిని వాడిన
మొదటి దేశము మనదే. నేటికి కూడా Indian Ink లో కరక్కాయను వాడుతూనే వున్నారన్నది నేను విన్న మాట.అసలు ఆ సిరా పేరే Indian Ink!
ఇక అధునాతన ఆవిష్కరణలకొస్తే, 1909 లో మర్కోనీ Wireless కనుగొని భౌతిక శాస్త్రములో నొబెల్ పురస్కారమును పొందక
మునుపు 2 సంవత్సరముల క్రిందటే కనుగొన్నా పాశ్చాత్య పక్షపాత విధానముంకు గురియై ఆ
బహుమతినందుకోలేక పోయినాడు. ఆ గుర్తింపును ఆయన మరణించిన ఒక శతాబ్దము తరువాత
పొందినాడు. మొక్కలలో ప్రాణమున్నదని కనుగొన్న ఆయన ఆవిష్కరణకు అధర్వణ వేదము మూలమని
ఆయనే తెలియబరచుకొన్న వినయ శీలి.చంద్రగ్రహములో నీటిఉనికిని కనుగొన్నది చంద్రయాన్--1
ద్వారా మన ISRO సంస్థ.
Named as
one of the 7‘Unsung
Heroes’ by Fortune Magazine, Dr. Narinder Singh Kapany, is widely recognized
as the ‘Father of Fiber Optics’ for his pioneering work in Fiber Optics
technology. Watch him speak eloquently on his entrepreneurial
journey.
మిగిలినది మరోమారు.....
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- ౩
భారతీయ విజ్ఞానము --3
ధారా నగరమునేలిన భోజ మహారాజురచించిన యంత్రార్ణవము లో యంత్రాన్ని గూర్చిన ఈ
నిర్వచనము చూడండి :
దండచక్రైశ్చదంతైశ్చసరణిర్భ్రమణాధిభిః
శక్తిరుత్పాదనం కింవా చలనం యంత్రముచ్యతే
ఇప్పటి వాడుక భాషలో చెప్పవలసివస్తే 'rods' 'wheels' 'teeth' ల
అనుసంధాన భ్రమణముతో శక్తిని ఉత్పాదించే పరికరమే యంత్రము.
ఈ మూడు శ్లోకములు సమరాంగణ సూత్రధారలోని 31వ అధ్యాయములో
వున్నవి. వీని సారాంశమేమిటంటే
1. కొన్ని
కొన్ని యంత్రములు ఒకే పనిని పదేపదే చేయ పనికి వచ్చేవి.
2. కొన్ని
ప్రత్యెక సమయములలో పనికి వచ్చేవి .
3.కొన్ని
ఛాయా, రూప
స్పర్శ సంబంధములైనవి.
4.కొన్ని
క్రిందికి పైకి,ముందుకు
వెనక్కు ప్రక్కలకు కూడా కదల గలిగినవి.
ఇవియన్నియు గూడా ఎన్నో విధములైన కార్యములను నిర్వహించేవి.
'యావద్బీజ
సంయోగ........పునః సమ్యక్త్వ సంవృతిః' ఈ మూడు శ్లోకములు యంత్రముల యొక్క గుణగణములు
తెల్పుచున్నవి. పై శ్లోకముల అర్థము ఈ విధముగా వున్నది.'అవి చక్కని
ఉత్పాదకత గలిగి సరియైన సమన్వయముతో మృదువుగా సాగుతూ నిరంతర పర్యవేక్షణ లేకుండా
యుండునని తెలుపుచున్నవి.ఇవి ఘర్షణకు గురి కాకుండా పనిచేస్తాయి. తక్కువ శబ్దముతో
పని చేస్తూకూడా అవసరమైతే ఎక్కువ శబ్దము చేయగల శక్తి కలిగియుంటాయి.ఎదో అడ్డు పడటం
ఆగి పోవటం అన్న లోపాలు వుండవు. ఉపయోగించడానికి తేలికగా చిరకాలం మన్నేవిగా వుంటాయి.
ఇవన్నీ పరిశీలించితే మన యంత్ర నిర్మాణ సామర్థ్యమెంతదో మనకర్థమౌతుంది.
2 ఇక
ఘటముల(Cells) మరియు
విద్యుత్తును గూర్చి. 11 వ
తరగతి వరకు తెలుగు భాషలో పాఠ్యాంశాలు చదివినవారి ఘటము అంటే cell అని తెలిసే
వుంటుంది.
అసలు ఘటమును గూర్చి అగస్త్యులవారు వారి అగస్త్య సంహిత
లోఏమి చెప్పినారో చూస్తాము .
సంస్థాప్యే మృణ్మయేపాత్రేతామ్రపర్ణం సుసంస్కృతం
చ్చాదయే చ్చిఖిగ్రీవేన్
ఛార్ద్రార్భిః కాష్టపాంసుభిః l
దస్తాలొష్టో నిధాత్వాయః ఫారదాచ్ఛాది తస్తతః
సంయొగాజ్జాయతే తేజో మిత్రావరుణసంచితంll
ఒక శుభ్రపరచిన మట్టి కుండను గ్రహించి అందులో తళతళ లాడే
రాగిరేకును మరియు సిఖిగ్రీవము అంటే నెమలి మెడ అని అర్థము దీనినే మనము మైలు తుత్తము
అంటాము . అసలు మైలము అంటే నెమలి అని. తమిళూలు నెమలిని 'మయీళ్ అనే
అంటారు.దీనినిని ఆంగ్లములోcupric sulfate or copper sulphate,
is the chemical compound with the chemical formula CuSO4. ఆంగ్లములో
దీనికున్న పేరు ఇదే నని మాత్రమే నాకు తెలుసు.ఈ మైలుతుత్తమును ఆ కుండలోవేయాలి.
ఆతరువాత పాదరసపు పూత గలిగి రంపపు పొట్టునంటించబడిన యశదపు రేకును (Mercury amalgamated zinc sheet) అందులో
వుంచవలెను. ఆపై రాగి తీగలను అనుసంధిచుట ద్వారా విద్యుత్తు ఉద్భవించుతుంది.
మిత్రావరుణము అంటె విద్యుత్తు(మెరుపు తీగ)( మిత్రావరుణుడు అంటే ఇంద్రుడు ఆయన
ఆయుధమగు వజ్రము వంకరటింకరయగు మెరుపు తీగయే కదా!) దీనిని కొందరుIIT విద్యార్థులు
సాధికారముగా నిరూపించినారని చాలా చాలా కాలము క్రితము ఏదో దినపత్రికలో చదివిన
గుర్తు.
'శాతకుంభం' అన్న పదము
మనకు 'అగస్త్య
సంహిత'లో
కనిపిస్తుంది.
ఆనేన జలభంగొస్తి ప్రాణోదానేషు వాయుషు
ఏవం శతానాం కుంభానాం సమ్యోగః కర్యకృత్ స్మృతాఃll
ఇందులోవంద పైన చెప్పిన ఘటములను ఒకేసారిగా ఈ ప్రక్రియకు
ఉపయోగించితే ప్రాణవాయువు (Oxygen)
గానూ ఉదజని (Hydrogen)
గాను విడి పడుతుందని చెప్పినారు. నీరు అంటే H2O అనే కదా మనకు ఆంగ్లేయులు నేర్పించింది.
ఈ విధముగా 100
కుంభములను జత చేస్తే Direct
Current Open Circuit Voltage 1.138 Volts వుంటుందని మన యువ శాస్త్రజ్ఞులు
నిరూపించినారు అన్నది నేను తెలుసుకొన్నది.
ఈ విషయములో ఇంకొక మాట విందాము. 1870
సంవత్సరములోSamuel Matterఅనే ఒకBritish missionary తనకు అన్య మతస్తుడైనందువల్ల ఆలయ
ప్రవేశము అధికారులు కలిగించలేదని చెబుతూ ఈ విషయాన్ని చెప్పినాడు.“It is said that there is a deep well inside the temple,
into which immense riches are thrown year by year; and in another place, in a
hollow covered by a stone, a great golden lamp, which was lit over 120 years
ago and still continues burning.”శక్తిని ఒకటిగా చేసి విద్యుతుత్పాదన
చేయగలదు.విద్యుచ్ఛక్తి నాదే వినియోగములో ఉండేదంటే గొప్ప విషయము కాదా మరి. ఈ
పరికరము నేడు కూడా 'ఈజిప్టు
జాతీయ ప్రదర్శన శాల'లోగాంచవచ్చునని విన్నాను,చదివినాను, మరియు ఆ
చిత్రమును గూడా చూసినాను .ఘనులైన మన పూర్వులు విద్యుత్తును 6 విధాలుగా
విభజించినారు. అవి ఏవంటే:1.తాడితము
: by friction from
leather or silk2.సౌదామిని:by friction from gems or glass3.విద్యుత్: Production from clouds and water falls4.హ్రాదిని
: from a storage
cell5. శతకుంభి : from a battery (narrated earlier)6. అశని : The one emanating from a
magnetized rod.రామాయణ ఇతిహాసములోని సుందరాకాండ లో లంకా నగరాన్ని
గూర్చిచెబుతూ 'వాల్మీకి
మహర్షి' ఆ
మహానగరము అనేక శాతకుంభాలతో నిండియున్నాడని వర్ణిస్తారు. ఈ మాటకు అర్ధముగా ఎత్తయిని
కొండలు గుట్టలు అని కొందరు చెప్పినారు గానీ సునిశితముగా పరిశీలన చేస్తే , అందులో, రామ
లక్ష్మణులు కందకాలపై తమకు తామే తెరుచుకొని మూసుకొనే యాంత్రికమైన కవాటములు
తిలకించినారని ఉన్నది. మరి ఇవి పని చేయవలేనంటే శాతకుంభములు కవలసినదేకదా!
మిగిలినది మరోమారు .......
భారతీయ విజ్ఞానము -- 4
ఖగోళ శాస్త్రవిషయములలో మనవారి ముందంజ ఎంతన్నది తెలుసుకొనుటకు
పూర్వము పాశ్చాత్యులు 16వ శతాబ్దము వరకు ఏంతవెనుకబడియుండినారో చూద్దాము.
భూమి చుట్టూ సూర్యచంద్రులే కాక, ఇతర గ్రహాలు కూడా తిరుగుతున్నాయని, విశ్వానికి కేంద్రం మనిషికి జన్మనిచ్చిన ఈ భూమేనని ఒక
పక్క క్రైస్తవ మతం బోధిస్తుంటే, ఆ భావనని ఖండిస్తూ భూమి, తదితర గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించినవాడు
కొపర్నికస్. అయితే కోపర్నికస్ వాదనలో బలహీనత దానికి తగినంత సాక్ష్యాధారాలు
లేకపోవడం. తరువాత వచ్చిన కెప్లర్ కూడా ఈ విషయాన్ని బలపరచినాడు.ఇవి అనీ 16 వ
శతాబ్దము నాటి మాటలు ఇన్ని ఆధారాలు పోగవుతున్నా మతం మాత్రం తన బోధనలని, భావనలని మార్చుకోలేదు. దేవుడు మనిషిని అపురూపంగా
సృష్టించాడు. అలాంటి మనిషి జీవించే ఈ భూమికి విశ్వంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.
కనుక గ్రహాలు, సూర్యచంద్రులు, తారలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని
కాదన్న వాడు వట్టి అజ్ఞాని, లేదా దైవ ద్రోహి. ఇదీ
వరస!ప్రొటస్టెంట్ క్రైస్తవమునకు ఆద్యుడైన మార్టిన్ లూథర్ కింగ్ "ఖగోళ
శాస్త్రాన్నే తలక్రిందులుగా చేస్తున్న మూర్ఖుడు కోపర్నికస్" అనిదూషించినాడు కూడా. అంతిమ దశలో తాను సేకరించిన,తెలుసుకున్న వివరాలన్నింటిని గ్రంధంగా అచ్చు వేయించి
పోప్ గా ఉన్న మూడవ పాల్ కు అంకితం ఇచ్చినా చర్చి
సానుభూతిని పొందలేక పొయినాడు. కోపర్నికస్
సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా గెలీలియూ
ప్రయోగాలున్నాయన్న కారణానికి చర్చిగెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించినారు.
క్రీ.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు.శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి
8 తేదీన తన 78వ ఏట మరణించినాడు.
ప్రాచీనసూర్యసిధ్ధాంతం ఆధారంగా
ఆర్యసిధ్ధాంతమనే ఖగోళశాస్త్రగ్రంధాన్ని కూడా ఆర్యభట
రచించినట్లువరాహమిహిరుడి రచనలద్వారానూ, ఆతరువాతికాలంవారైన బ్రహ్మగుప్తుడు, మొదటి భాస్కరాచార్యులు మొదలౌనవారి ఉటంకింపుల ద్వారానూ తెలుస్తున్నది. కాని ఇప్పుడు
అది అలభ్యం.ఖగోళపరిశోధనకు ఉపయోగించే
శంఖుయంత్రం, ఛాయాయంత్రం, ధనుర్యంత్రం, చక్రయంత్రం , యష్టియంత్రంవగైరా పరికరాలగురించీ, కాలగణనానికి ఉపయోగించే నీటితో నడిచే గడియారాల గురించీ
యీ గ్రంధంలో ఆర్యభట వివరించినాడట. అల్-బిరూనీ అనే పర్షియాదేశపు విద్వాంసుడు ఈ ఆర్యభటీయమును
అరబిక్ భాషలోనికి అనువదించినాడు.
అండము పిండము బ్రహ్మండము అన్నవి మనకు తెలిసిన పేర్లు
.అండము భూమి మనము భూగోళము అనికూడా వేనకువేల సంవత్సరాలనుండి వింటూనేవున్నాము.
పిండము. అదే ఆకృతిలో అంతకన్నా పెద్దది. మన సౌర కుటుంబము. బ్రహ్మాండము అనగా ఈ
విశ్వము. ఎప్పటి మాటలివి. ఎంత గొప్ప నిజాన్ని ఎంత చిన్న మాటలలో చెప్పినారు చూడండి.
అసలు జగతి అన్న మాటను భూమి, ప్రపంచము విశ్వము అన్న
వివిధములైన అర్థములలో వాడుతాము. అసలు గతి అంటె ఆంగ్లములో That
which moves అని
అర్థము.
ఎంత సులభమైన మాటలో . జగతి నిరంతరమూ సాగుతూనే వుండేది.
ఈ విషయమొకసారి గమనించండి. ఆకాశములో AnTares అన్న Roman నామము తో ఒక నక్షత్రముంది. Ares అంటె మనము ఆంగ్లములో వాడే గ్రీకు పదము Mars కు సమానాంతరము. AnTares అంటే Mars వంటిది అని. ఇది అంగార వర్ణములోనే వుంటుంది. ఇది
విశ్వములోని అతిపెద్ద నక్షత్రములలో 15 వది అని నేటి శాస్త్రజ్ఞులు గుర్తించినారు.
ఈ నక్షత్రాన్నిమనము సంస్కృతములో జేష్ఠ
అని పిలుస్తాము . జేష్ఠ అంటే పెద్దది మరియు ముందు జన్మించినది అన్న అర్థములో
వాడుతాము. ఇది మనకు తెలిసిన సూర్య 'నక్ష్త్రమునకూ 40,000 వేల రెట్లు పెద్దదని నేటి శాస్త్రజ్ఞులు
తెలియబరచినారు. ఇది విశ్వములోని అతిపెద్దనక్షత్రములలో 15 వది అని నేటి శాస్త్రజ్ఞులు
గుర్తించినారు. ఈ నక్షత్రాన్ని మనము సంస్కృతములో జేష్ఠ అని పిలుస్తాము . జేష్ఠ
అంటే పెద్దది మరియు ముందు జన్మించినది అన్న అర్థములో వాడుతాము. ఇది మనకు తెలిసిన
సూర్య ''నక్షత్రము' నకు 40,000 వేల రెట్లు పెద్దదని నేటి శాస్త్రజ్ఞులు
తెలియబరచినారు. పెద్దదే కాకుండా అంతరిక్షములోఇది వయసులోనూ పెద్దదని చెబుతున్నారు..మరి కేవలము
చర్మచక్షువులతోనే మన ఋషులు కనుగొన్నారు కదా. ఇది సమాధి స్థి తిలోనే వారికి సాధ్యమై
వుంటుందన్నది మనలోని ప్రతియొక్కరికీ తెలిసిన విషయము.
భూమి గోళాకృతి లో యుండుట యే గాక ఏకాలంలోనైనా సగము
వెలుతులో లో నుండి సగము చీకటి లో యుంటుందని తెలుపుతుంది.అంతేకాదు సూర్యుని ఆకర్షణ
శక్తివల్ల భూమి అంతరిక్షములో నియమ బద్ధముగా తన కక్ష్యలో తిరుగుతుందని కూడా ఈ
క్రింది ఋగ్వేద మంత్రము తెలుపుతుంది.
17 వ శతాబ్దములో గెలీలియో కనిపెట్టే వరకు మనకు 'దూరదర్శని'(Telescope)ని గురించి తెలియదనుకోవడము పొరబాటు . 'శిల్ప సంహిత' అన్న ప్రాచీన గ్రంథములో దీనిని గూర్చి విశధముగా
వివరించబడినది . ఈ క్రింది శ్లోకముతో మొదలయ్యే వర్ణన ఈ విషయాన్ని సుస్పష్టం
చేస్తుంది.
మనోర్వాక్యం సమాధాయ తేన శిల్పీంద్ర శశ్వతః
యంత్రం చ కార సహసా దృష్టర్థ దూర దర్శనం
ఈ మొత్తము శ్లోకాల తాత్పర్యము 'దూరదర్శిని'ని తయారు చేయు విధానమును తెలుపుటయే గాక దీనికి 'తురీయంత్రము' అన్న నామకరణ కూడా చేసింది..
ఋగ్వేదము (1.50) లోని ఒక మంత్రము సూర్యకాతి అర
నిముసములో 2,202 యోజనములు
పయనించుతుందని చెప్పబడినది. దీనికి సాయణ (c.1315-1387 AD) భాష్యము ఈ విధంగా వుంది.
ఒకయోజనము = ఇంచుమించు 9 మైళ్ళు అర్థ శాస్త్రము
ప్రకారము.
మన పురాణముల ప్రకారము
15 నిమిషములు = 1 కాష్ట
30కాష్టలు= 1 కల
30 కలలు = 1 ముహుర్తము
30 ముహుర్తములు = 1 దివారాత్రము
కాబట్టి ఈ నిమిషము ఇప్పటి 16/75 సెకనులకు సమానము .
ఆవిధముగా గుణించితే కాంతి వేగము 185 793.75 అవుతుంది. నేటిశాస్త్రము 1,86,000 అని తెలుపుచున్నది.
క్రీస్తు పూర్వము 1000 సంవత్సరముల క్రింద
సంస్కరింపబడిన 3000 సంవత్సరములనాటి 'సూర్య సిద్ధాంత గ్రంధము
ప్రకారము భూమి వ్యాసము 7,840 మైళ్ళు. దీనికి ఆధునిక
శాస్త్రీయ నిర్ధారణ యగు 7,926.7 మైళ్ళు ఎంత చేరువలో
వుందో చూడండి.
ఇదే గ్రంథము భూమికి చంద్రునికి 2,53,000 మైళ్ళని చెప్పగా నేటి శాస్త్రము ఆ దూరమును 2,52,710 మైళ్ళు అని చెప్పి సూర్య సిద్ధంత గ్రంథమునే బలపరుచుచున్నది.
భూమ్యాది గ్రహములు సూర్యుని చుట్టూ నిర్ణీతమైన
కక్ష్యలో తిరుగుచున్నాయని కోపర్నికస్ కన్నా 1000 సంవత్సరములకు పూర్వమే ఆర్య భట
శెలవిచ్చినారు.
భాస్కరాచార్యులు -- 1 (5 వ శతాబ్దము ) సూర్యుని
కష్యలో భూమి తిరుగుటకు 365.258756484 రోజుల సమయము పడుతుందని తెలిపినారు.
భాస్కరాచార్య -- 2 తమ సిద్ధాంత శిరోమణిలో న్యూటన్
గారికి 400 సంవత్సరములకు పూర్వమే తమ సిద్ధాంత శిరోమణి (భువన కోశము --6) లో
భూమ్యాకర్షణ శక్తిని గూర్చి వివరించినారు.
బ్రహ్మ గుప్తుడు క్రీ||శ|| 630 లోనే భూమికి ఆకర్షణ శక్తి ఎంథ సహజమని వర్ణించినారంటే నీరు పల్లమునకు
పయనించినంత స్వాభావికమని చెప్పినారు. ఈవిషయమును 17 వ శతాబ్దము వాడయిన న్యూటన్
కనుగొన్నట్లు మనము పాఠ్యాంశాలలో చదువుకొంటూవున్నాము.
మన పూర్వీకుల ఆవిష్కరణలను గూర్చి చెప్పుకొంటూ పోతే
ఎంతైనా వుంది . అంతా చెప్పగలిగే శక్తి నాకు లేదు, అందు చేత ఈ ఒక్క విషయాని చెప్పి వేరొక విభాగమునకు
దారి తీయ ప్రయత్నించెదము.
పెళ్ళిళ్ళలో వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించే
ఆనవాయితీ ని గూర్చి అందరికీ తెలిసినదే. మరి యెందుకు చూపిస్తారు అంటే అది ఒక
ఆచారమని చెబుతారు. కానీ దీని వెనుక గూడా ఒక గమ్మత్తైనకారణముంది. మనకు గ్రహాలు ,ఉపగ్రహాలు, నక్షత్రాలను గూర్చి తెలుసు. భూమికి చంద్రుడు
ఉపగ్రహము. భూమిచుట్టూ తిరుగుతూ వుంటాదు. ఇది మనకు తెలిసినదే. ఇపుడు ఒక క్రొత్త
విషయము తెలుసుకొందాము.సప్తర్షి మండలములోని వశిష్ట నక్ష్తరమును ఆనుకొని అరుంధతి, అతి చిన్న నక్షత్రముగా మనకు రాత్రిపూట జాగ్రత్తగా
చూస్తే అగుపిస్తుంది. ఆ రెండు నక్షత్రములను భార్య భర్తలుగా కూడా మనము పరిగణించుతాము.
ఆ రెంటినీ రాత్రి పూట నిర్మలమినఆకాశము వున్నపుదు ఒక దూరదర్శిని (Telescope) సహాయముతో చూస్తే ఆరెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ
వుంటాయి.భూమిపైని ఈ క్రొత్తదంపతులు గూడా ఆవిధముగా వుండవలెనని గామోసు నూతన
వధూవరులకు అరుంధతీ దర్శనము చేయిస్తారు. కేవలము తమ తపశ్శక్తి తో ఇటువంటి వివరములు
తెలియజేయుట ఎంత ఆశ్చర్యమైన విషయమో చూడండి.
తిరిగీ కలుద్దాము......
భారతీయ శాస్త్ర విజ్ఞానము --
5
నాలుగు మాటలు
విమానముల గూర్చితలచుకొనుటకు ముందు భారత జాతికి గర్వ కారణమైన శివకర్ బాపూజి తల్పాడే
గారిని గురించి తెలుసుకొందాము.
భారతీయ విమాన
శాస్త్రమును గురించి వ్రాసేముందు నాటి మహనీయులగొప్పదనమునకు
తనవిమాన ఆవిష్కరణచే నివాళులు
అర్పించిన 'ప్రపంచ ప్రథమ
విమాన స్రష్ట శ్రీ శివకర్ బాపూజి తల్పాడే గారిని గూర్చి తెలుసుకొని మననివాళులనర్పించుకొందాము.
డిసెంబరు 17,1903 లో ఉత్తర
కరోలిన (USA) లో మొదటి
విమానమును రైట్ సోదరులు ఎగిరించినారని నాటి నుండినేటివరకుమనసాంఘీక శాస్త్ర (SOCIAL STUDIES) లో పాఠ్యాంశముగా చదువుతూనే వస్తున్నాము. కానీ అంతకు 8సంవత్సరముల పూర్వమే అంటే1895 లోనేశివకర్ బాపూజి తల్పాడే అన్న మహారాష్త్రసంస్కృతపండితుడు విమానాన్ని'మరుత్సఖ' అన్న పేరుతో మానవ రహితముగా 1500 అడుగులఎత్తునకు ఎగిరించగలిగినాడు.కొందరు దీని
పేరుమరుత్ శక్తి అనికూడా అన్నారు
గానీ మరుత్సఖి అనే ఆ ఫడితుడు పెట్టి వుంటాడని
నామనసుకుతోచుతుంది.న మరుత్ సఖి అంటేవాయు మిత్ర అని అర్థము . వాయుశక్తి అంటే అంత పొందికగావుండదేమో!
రైటుసోదరులుఎగిరించగలిగినది 120 అడుగులు మాత్రమే.ఆర్విల్ రైటు
మొదటి వైమానికుడై పోయినాడు.ఆర్విల్ మరియు విల్బర్ట్మొదటివిమాన వైజ్ఞానికులైనారు.Patent వారిదైనదికానీశివకర్బాపూజి గారి పేరే మనకు అపరిచితమై
పోయింది. ఈ మహత్కార్యానికిస్పూర్తి ఆయన
గురువైనచిరంజిలాల్ గారు ఒక కారణమైతే రెండవ కారణము వారు ఆదేశించిన స్వామీదయానంద సరస్వతి గారు.
స్వామీ దయానంద సరస్వతిగారి ఋగ్వేద భాష్య భూమిక లోని విమాన ప్రకరణము చదవటము అసలు కారణము.తిరిగీ అసలు విషయానికొస్తే తల్పాడే గారు ఈ ఆవిష్కరణ ముంబాయిలోని అరేబియా
సముద్రపుచౌపాటి సముద్రతీరములోతల్పాడే ఈ మహత్కార్యమును సాధించుటకు భరద్వాజుని బృహత్ విమాన శాస్త్రము,నారాయణముని గారివిమాన చంద్రిక,శౌనకుని విమాన యంత్రం, గర్గముని
యొక్క యంత్ర కల్పము,ఆచార్య
వాచస్పతి యొక్క విమానబిందు,మహర్షి డూండిరాజ్ గారి విమాన
జ్ఞానార్క ప్రకాశిక దోహదము చేసినాయని రత్నాకర్ మహాజన్ అన్న తల్పాడే గారికాలము నాటి
పండితుని లేఖనము ద్వారాతెలియవచ్చు
చున్నది. వీనినుండి గ్రహించిన జ్ఞానముతో అయస్కాంతశక్తిని వుపయోగించి తల్పాడే గారు నాటి హైకోర్టు జడ్జి మరియు దేశ స్వాతంత్ర్య సమరవాదియైనమహదేవ గోవింద
రానడేమరియు బరోడా మహరాజు శాయాజీ రావు గైక్వాడ్ గారిసమక్షములో 1500 అడుగుల
ఎత్తులోనడిపినారు.(cited in"Annals of the
Bhandarkar Oriental Research Institute") ఆతరువాత అది
ఏదోయాంత్రిక లోపమువల్ల
భూపతనమైనది. ఈ
మహా కార్యమును జీర్ణించుకోలేని బ్రిటీషు ప్రభుత్వము తమ విధేయుడైన రాజుగారికి ఈప్రయోగమునకు
ఆర్థిక సహాయము నిలిపివేయ ఉత్తరువులు జారీ చేసినారు. తల్పాడే గారు మతిస్థితము తప్పిజీవచ్చవమై మరణించగా, ఆపరిశోధనాంశములను
విమానముతోకూడా పాశ్చాత్యులుకొని పట్టుకుపోయినారట.ఈ విమాన యంత్రము పనిచేయుటకు తగిన అయస్కాంత అణుసముదాయమునుఉత్తేజమొనరించుటకుసౌరశక్తినిఉపయోగించినారుతల్పాడే
గారు.నేడు NASA ఈ ప్రక్రియనే
ఉపయోగించుచున్నదని చదివినాను.ఈ పరిశొధనకుఅధికముగా ఆర్థికసహాయమొనరిన
వాడు సాయాజిగయక్వాడ్మహారాజు. ఈ విమాన వాయుగమనమునుచరిత్రకారుడు ఈవాన్ కోష్ట్క
( Evan Koshtka), తల్పాడె ను (first creator of an aircraft) మొదటివిమాన సృష్టికర్తగా వర్ణించినాడు.పూణే నుండి
వెలువడే 'కేసరి'అన్న పత్రికలో
ఈ విషయాన్నిప్రచురించినారట గానీతేదీ అందులో లేదట.
శిథిల మనస్కుడైన తల్పాడే జీవచ్చవమై 1916 లో తనువు చాలించినాడు. నాడంటె ఆంగ్లేయుల దురాగతములతో ఈయన గరిమను గానము
చేయనీకున్నా నేడయినా ఈయన కీర్తికి కిరీటమును మనము ధరింపజేస్తే ఆయన వారసులుగా, ఆయనకు కృతజ్ఞులుగా,మనలను మనము గుర్తించుకొన్నట్లవుతుందని నా నమ్మకము.
'David Hatcher Childress' చరిత్రకందని పరిశొధనలయందు అమితమైన జిజ్ఞసువు. పురాతన
నాగరికతలను త్రవ్వితీయుటలోనే కాక ఈతడు పురాతన సాంకేతిక విజ్ఞాన పరిశీలన, శక్తి తత్వము, గురుత్వ వికర్షణ, అంతర్ గ్రహ వాహనములు మొదలగు ఎన్నోవిషయములపై అకుంఠిత
దీక్ష తో పరిశోధనలు సలిపి ఇటువంటి వివిధ అంశములపై ఇరువది పుస్తకములకు పైన, కొన్ని స్వతంత్రముగానూ ,కొన్ని వేరొక రచయితతో కలియుట వలనను వ్రాసినాడు. ఇంతటి
అంకిత భావముతో తన జీవితములోని సింహభాగమును ఇటువంటి పరిశొధనలకు అంకితముజేసిన ఈయనను సాధారణ వ్యక్తిగా వర్గీకరించలేము. ఆయన పరిశొధనానుభవములు
ఈ కనబరచిన పుస్తకములలో పొందుపరుపబడినవి. అవి The
Anti-Gravity Handbook; Anti-Gravity & the World Grid; Anti-Gravity and the
Unified Field; Extraterrestrial Archeology; A Hitchhikers Guide To Armageddon
The Free-Energy Device Handbook, Man-Made UFOs, The Time Travel Handbook,
Atlantis & the Power System of the Gods, Pirates and the Lost Templar
Fleet, The Mystery of the Olmecs, Ark of God and others.
వ్యోమయానమునకు సంబంధించిన కొన్ని విషయములకు మూలములు
ఆయన వ్రాసిన Technology of the Gods - The
Incredible Sciences of the Ancients p 147-209. నుండి సేకరించబడినవి.
మిగిలింది మరోమారు........
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 6
తక్షశిల
శ్రీరామచంద్రుని తమ్ముడగు
భరతుని కుమారుడు నిర్మించిన నగరమైనందువల్ల ఈ నగరమునకు తక్క్షశిల అన్న పేరు
వచ్చినదన్నది పురాణ ప్రసిద్ధము. తక్షుడు పునాదిరాయిని ఈ నగరానికి వేసినాడు
కాబట్టి ఈ నగరము ఆ పేరు కలిగి యుండవచ్చు. ఈ నగరపు ప్రస్తాపన మస్త్య పురాణములో కనబడుతుంది.
ధర్మజుని పురోహితుడు ధౌమ్యుడు ఇచ్చట ఆచార్యునిగా వుండినాడని వ్యాస భారతము
తెలుపుతుంది. నేటి శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము క్రీ.పూ. 2550-2288 నకే ఈ నగరము వున్నదని
నిర్ధారించినారు. శంఖున పడనిదే తీర్థము కాదుగదా!క్రీ.శ. 5 వ శతాబ్దము వరకు దేశీయ విదేశీయ
రాజుల చేతులు మారినా ఈ నగరము సజావుగానే వుండినది.
క్రీ.శ. 460–470 మధ్యకాలములో హూణుల దండయాత్రలచే
ఈ జగత్ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయ నగరము నేలమట్టమైపోయినది. చంద్రగుప్తమౌర్యుని
గురువైన విష్ణుగుప్తుడు (కౌటిల్యుడూ,చాణక్యుడు ) ఇక్కడ ఆచార్యునిగా పనిజేసినాడు.
ఇక ఇక్కడి గ్రంథములు బహుశ
లక్షలలో వుండియుండ వచ్చునేమో దహనమైపోయివుంటాయి.
అసలింకొక ముఖ్యమైన విషయమున్నది.
క్రీ.శ.1863–64 మరియు 1872–73 లో అలగ్జాండర్ కన్నింగ్ హాం( Alexander Cunningham ) అన్న చారిత్రిక పరిశోధకుడు తన
పశొధన ఫలితాన్నిబహిర్గతము చేయకుండియుంటే
భారతీయులమైన మనము తప్ప ప్రపంచము తక్షశిల వుండినది అన్నవిషయము పుక్కిటి పురాణము ఆని
తృణీకరించేవారు.ఎందువల్లనంటే అంతకు ముందువరకూ
తృణీకరించినారు కాబట్టీ!దోచుకొన్న వారిని నమ్మినంతగా
దాచియుంచిన మన పూర్వీకులను నమ్ముట లేదు. ఇది మన దౌర్భాగ్యము. మన పూర్వులు సత్య
వ్రతులు, ధర్మ నిష్ఠా గరిష్ఠులు.
నలందా
నలందా తక్షసిల తరువాత అత్యంత
ప్రాచీన విశ్వవిద్యాలయము. ఉన్నత విద్యార్జనకు దేశవాసులేకాక చైనా టిబెట్టూ,గ్రీసు, పర్షియా మొదలగు ఎన్నో
విదేశములనుండి కూడా విద్యార్థులు వచ్చిఏవారు.5వ శతాబ్దము మొదలు 12వ శతాబ్దము వరకు ఇది మత, సాంస్కృతిక, ఉన్నత విద్యార్జన కేంద్రము.
దీని విస్తారము 14 హెక్టేరులు ( One Hectare = 100 acres or
10,000^2 mtrs). దాదాపు 7 శతాబ్దముల కాలము ఇది
మెధోనిలయము. ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దిన్ ఐబాక్ యొక్క సైన్యాధిపతియైన భక్తియార్
ఖిల్జి నలందా మరియు విక్రమశిల విశ్వవిద్యాలయములను అగ్నికీలలకు ఆహుతి చేసిన దుర్మార్గుడు.
వేనకువేల్ట. అన్ని నెలలూ ప్రళయకాల మందు కళ్ళు పొడుచుకొన్నా కనిపించని కరి మబ్బులు
కమ్ముకొనంట్లు బీహారు ప్రాంతము వుండిపోయిందట. ఎన్ని లక్షల గ్రంథములు అగ్నికి
సమిధలైనాయో చెప్పుట కష్టము. ఇవి కట్టు కథలు కావు చారిత్రిక సత్యములు. బౌద్ధ
చైత్యములు,ఆరామములు ఎన్ని నాశనము చేసినాడో
చెప్పుట కష్టము. ఈ విషయములను మనము సాంఘీక శాస్త్రములో పాఠ్యాంశముగా విన్నామా !
ఇది చాలా క్లుప్తమైన వివరణ.
అసలీ విషయముల నెందుకు చెబుతున్నానా అన్న సందేహము జిజ్ఞాసువు శ్రద్ధాళువు
అయిన పాఠకునికి తప్పక కలుగుతుంది. నేను ఈ విషయాలను ఎందుకు చెప్పుకొచ్చినానతే
ఇటువంటి మహత్తర సంస్కృతి, సంస్కృత సంపద చరిత్రకందకుండా
వుండిపోయినది ఎంత పోగొట్టుకున్నామో!
ఈ విధంగా విద్యాలయాలనేకాక, గ్రంథములు గ్రంథాలయములను
కుప్పలు తెప్పలుగా కాల్చి పారవేసినారు.కొందరు మహనీయులు ప్రాణాలకు తెగించి కాపాడిన
గ్రంథములే ఇప్పుడు అందుబాటులోవుండేవి. అయినా ఈ సంస్కృత సాహిత్యము ఆంగ్ల
సాహిత్యముకన్నా నేటికీ ఎక్కువే!
"సమరాంగణ సూత్రధార నాటి
ఆవిష్కరణల యదార్థ దర్పణము.ఇందులో వాయుయాన విశేషములను అన్నికోణములలో పరిశీలించి
విశ్లేషింపబడినది. ఒకవేళ దీనిని కల్పితగాధగా భావించితే ఇంతవరకు ఇంతకుమించిన
కాల్పనిక గాధ ఎవరూ వ్రాయలేదు." అన్నాడు పాశ్చాత్య చరిత్ర కారుడు అండ్రూ
థామస్.
ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయపు
ప్రముఖ ఆచార్యుడు సంస్కృత పండితుడు అయిన V.R.రామచంద్రన్ దీక్షితర్ తన "“War in Ancient India in 1944
“, లో " ఈ
సాహిత్యమునంతయును అనాలోచితముగా ,పరిశీలనా
రహితముగా కట్టుకథయని తెలుపుట ఫాశ్చాత్య చారిత్రికులేకాకుండా వారి అంధ సమర్థకులైన
ప్రాచీ (తూర్పు అంటే మనము ఇంకా నేపాల్, టిబెట్టు,చైనా, మొదలగు దేశాలు) దేశ
చారిత్రికులు కూడా ఈ రచనలను కట్టుకథలుగా వాకృచ్చినారులేక వ్యాఖ్యానించినారు.అసలు
భారతీయ విమాన శాస్త్ర గ్రంథములను,వాయు యాన
యంత్రములను, కల్పనలుగా కొట్టిపారవేసినారు.
భోజరాజు వ్రాసిన "సమరాంగణ
సూత్రధార" ఇటీవలి కాలములో లభించుట చేత , అందులో 230 శ్లోకములతోనిండిన
ఒక అధ్యాయము పూర్తిగా వివిధ వ్యోమనౌకలను తత్సంబంధమైన వివిధ యంత్రములను
గూర్చి, వానిని సైనిక బలము వుపయోగించు
విధివిధానములను గూర్చిన వివరణ ఇవ్వబడినది.
ఈ విషయము తెలిపినది ఆంగ్లములో Bermuda Triangle వంటి బహు గ్రంథ రచయితయైన యైన Charles Berlitz ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Berlitz schools వ్యవస్థాపకుడు Berlitz మనవడు. ( సేకరణ : Doomsday 1999 - By Charles
Berlitz p. 123-124).
మన ప్రియతమ నాయకుడైన అబ్దుల్
కలాం గారే ఈవిధంగా అంటున్నారు" ఆధునిక ఆవిష్కరణలకొరకు మన భారతీయ
సాహిత్యము యువకులు తప్పనిసరిగా చదివి తీరవలెను."
ఈ విషయములన్నీ ఎందు వలన
చెప్పవలసి వచ్చిందంటే ఇంత పొగొట్టుకొన్నా తల్పాడే తపన ఎంత గొప్పవాడొ అర్థము
చేసుకొనండి. మన గ్రంథములు ఎంతటి సంపద కలిగి యుండినవో గమనించండి.
రామాయణ భారత భాగవతాది ఇతిహాస
పురాణములలో విమానముల ప్రసక్తి ఉన్నదంటె అంతా కల్పన అని కొట్టిపారయేయ వీలౌతుందా!
ఒకవేళ ఎవరైనా బైబిల్ వంటి మత గ్రంథములలో వున్నదంటె మరి అటువంటి యంత్రముల ఆవిష్కరణ
బైబిల్ కాలములో వున్నదని గ్రంధాధారములతో చూపించగలరా!
మతాతీతంగా మనమంతా భారతీయులమే !
మొదట ఆభావన మనలో ఏర్పడితే మన పూర్వీకులు ఎంత సత్యసంధులో, ఎంత నిష్ఠా గరిష్టులో మనకు
అర్థమౌతుంది.
ప్రాచీన కాలమందు 'బృహత్ విమాన సంహిత' అన్న పేరున వైమానిక
శాస్త్రాన్ని గూర్చి భరద్వాజులవారు వ్రాసినారు. అందు సుందర ,శకున, రుక్మము లను మూడు విధముల విమాన
చిత్ర పటములు కూడా కలవు. అసలు మన పురాణేతిహాస శాస్త్రాలలో వర్ణించిన విమానములను
రెండు రఖములుగా విభజింపవచ్చును.
1. మనుజ నిర్మితం 2. దివిజ నిర్మితం.రామాయణము లోని
పుష్పక విమానమును గూర్చి మనకందరకు తెలిసినదే .అది కుబేరుని దివ్య(దివిజ) విమానం.
రావణుడు కుబేరుని ఓడించి దానిని చేజిక్కించుకొన్న పిదప, రావణ సంహారానంతరం రాజైన
విభీషణుడు రాముని సపరివారంగా అయోధ్యకు పంపినాడన్నది అందరూ విన్నదే.
అదే గయోపాఖ్యానములో గయుడు
ప్రయాణము చేసినది కూడా దివ్య విమానమే. పోతన భాగవతములోని దసమస్కందము లో ఈ క్రింది
వృత్తాంతము వస్తుంది.శిశుపాలుని మిత్రుడు సాళ్వరాజు యదు వంశ నాశనము చేయ సమకట్టి
యక్ష,గంధర్వ,కిన్నెర,కింపురుష, మానవ , దానవాదులు ఏమీ చేయలేని
విమానముకొరకై శివుని గూర్చి తపస్సు చేస్తే ఆయన తథాస్తు అని ఆ పనిని మయునికి
ఒప్పజేప్పినాడట. సాళ్వరాజా విమానముతో ద్వారకను ధ్వంసము చేయగా కృష్ణుడు అతనిని
మట్టు పెట్టినాడట. ఈ విమానము పేరు 'సౌభక'మన్నారు.భారద్వాజులవారు పై
పుస్తకములో శత్రు విమానయానికుల మాటలు గూడా విశధముగా వినగలిగే ప్రక్రియను గూర్చి
వివరముగా తెలిపినారట.
'అగస్త్య సంహిత' లోని ఒక శ్లోకము 'హైడ్రోజేన్ బెలూను' ను బోలిన ఎగిరే వాహనాన్ని
వర్ణిస్తుంది. ఆ శ్లోకము ఇది .
వాయు బందర వస్త్రేణ సుబధ్యో యాన
మస్తికే
ఉదానస్య లఘుత్వేన
బిభర్త్యాకాశయానకం
'ఉదానము=ఉదజని=hydrogen' ని, లోపలి వాయువు బయటికీ బయటి
వాయువు లోపలికీ పోలేని వస్త్రముతో చేసిన గుమ్మటములో, నింపి ఆకాశ యానము చేయ వచ్చునని చెబుతుంది.
జూన్ 24, 2000 సంచిక 'The Week' లో ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని
గూర్చి వ్రాస్తూ ,1919 లో చిత్రించబడిన ఓకే ప్రాచీన
విమానపు బొమ్మను ప్రచరించి అది పైనుండి గాలిని పీల్చుచూ క్రిందినుండి గాలిని
వదులుచూ ప్రయాణము చేయునని వ్రాసినారు. అర్థమగుచున్నది కదా మన పూర్వుల ప్రతిభ.
మిగిలినది మరోమారు.........
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 7
గగన యానము
నిప్పు లేనిదే పొగరాదు కానీ
పొగలేకున్నా నిప్పు వుండవచ్చు.ఈ దృష్టాంతము ఎందుకు చెబుతున్నానంటే హిమాలయము అన్న
ఒక పెరును తీసుకొందాము. ఆ పేరు వింటూనే ఇంకా ఆ పర్వతమాలను చూడని శిశువు మనసులో
పెద్ద పెద్ద మంచురాళ్ళు కలిగిన అపరిమితమైన ఎత్తుగల ఒక పర్వతమును వూహించుకొంటాడు . ఇక్కడ హిమాలయము వాస్తవము కానీ ఆ
శిశువు వూహించిన విధముగా మంచురాళ్ళు వుండవు గానీ మంచు తో కప్పబడిన రాళ్ళు వుంటాయి.
అది తాను వెళ్ళి చూసినవెంటనే వాస్తవము గ్రహించగలుగుతాడు.కాబట్టి విమానముల గూర్చి
విననిదే విపరీతమైన ఊహలతో మన పూర్వులు భాగవత ,భారత, రామాయణాలలో విమానముల గూర్చిన
ప్రస్తాపన తెచ్చియుండరు. అందులోకూడా ఎన్నో విధములైన విమానములను గూర్చి విశధ
పరచియుండరు.ఇందులోని నిజానిజాలను పరికించి,పరిశీలించి, పరీక్షించి, పరిశోధించితే వాస్తవము మనకు
తెలుస్తుంది. భారతములో ధృతరాష్ట్రుని యొక్క సంతాన వ్యామోహాన్నిగూర్చి మనమెంతో
ఈసడించుకొంటాము. కానీ మహాభారతములో ధృతరాష్ట్రుడు తనది తప్పని తెలిసినా తన సుతులపై
వ్యామోహము చంపుకోలేక పోతున్నానంటాడు. అదేవిధంగా దుర్యోధనుడు తనకు దాయాది మాత్సర్యము
తప్పని తెలిసినా తానది మానుకోలేనని చెబుతాడు. ఈ మాట ఎందుకు చెప్పుకువచ్చినానంటేమన పూర్వులు తప్పో ఒప్పో
నిజానికే ప్రాధాన్యమునిచ్చేవారు అని తెలియ బరచుటకు.ఇంకొక విషయము గమనించండి.
ప్రసిద్ధ ఆధునిక గణిత
శాస్త్రవేత్త తనచే తెలియబరుపబడిన ఎన్నో గణిత సూత్రములు, నామక్క నరశింహస్వామి దేవేరి
నామగిరి తాయరు (లక్ష్మీ దేవి) తనకు నిద్రావస్థలో తెలిపినవే యని స్వయముగా
తెలియబరచినారు.ఆ విషయమును వారి మాటలలోనే చదవండి "While asleep, I had an unusual
experience. There was a red screen formed by flowing blood, as it were. I was
observing it. Suddenly a hand began to write on the screen. I became all
attention. That hand wrote a number of elliptic integrals. They stuck to my
mind. As soon as I woke up, I committed them to writing."
అనేకల్ అన్న ఊరికి చెందిన
సుబ్బరాయ శాస్త్రి అన్న ఒక మహా పండితుడు భరద్వాజుని 'విమాన శాస్త్రాన్ని శ్రీ G.వెకటాచల శర్మ అను
పండితునిద్వారా, తాను చెబుతూవుంటే, వ్రాయించినాడు కానీ ఆయన చెబుతూ
పొయిన ఆ శాస్త్రము ఏకాలమూకు చెందినదన్న ఆధారము లేదని కొందరు పాశ్చాత్య అనుయాయులు
పనికట్టుకొని ప్రచారము చేసినారు. రామానుజన్ గారు చెప్పినది నమ్మక తప్పలేదు
ఎందుకంటె అవి గణిత పరముగా సాధింపబడినవి. వైమానిక శాస్త్రములోని ఇబ్బంది ఏమిటంటే ఈ
పాశ్చాత్య వ్యామొహకులకు సంస్కృతము క్షుణ్ణముగా తెలియదు.శాస్త్రములలో తెలిపిన
సాంకేతిక పదముల తమ అనువాదమును యదార్థమునకు అనుసంధించుకోలెరు.ఈ సందేహాలన్నీ అందుకే!
అసలు విమానముల ప్రస్తాపన
వేదములలోనే వస్తుంది.ఈ విషయము పరిశీలించండి.
యజుర్వేదము, 10:19
ఓ నిపుణవంతుడైన అభియంతా (Engineer)! శ్రేష్ఠులగు నిపుణులు నడపగల
నావలను నిర్మించు. మేఘములు దాటి గగన తలము పై విహరించు విమానముల నిర్మించు.అటు
నీటిలోనూ ఇటు గాలిలోను పయనించగల సాధనములను నిర్మించు. అవి మెరుపుల నడుమ కూడా
పయనించగల శక్తిని ప్రసాదించు.ఏఏ భగవత్సృష్టిలో మమ్ము కీర్తివర్ధనుల గావించు.
వేదములలో
1. విమాన నిర్మాణ యానముల గూర్చిన
ప్రస్తాపన వున్నది.
2. ఆధునికసాంకెతిక విజ్ఞాన సంబంధిత
విషయములెన్నో మనకు వానిలో కనిపించుతాయి.
3. భూమ్యాకాశ యుద్ధముల గూర్చిన
వివరణ విశ్లేషణలెన్నో వానిలో అగుపించుతాయి.
4. నేడు మన శాస్త్రజ్ఞులు
ప్రయత్నించేఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మానసిక మరియు తాపసిక శక్తుల
గూర్చిన వివరణలందులో ఎన్నో వున్నాయి.
వ్యాస భాగవతము 3.23.11 నుండి 3.23.41 ఒకసారి పరికించితే తన అర్ధాంగి
కోరిక మేరకు ఆకాశ హర్మ్యమును తన తపో బలముతో నిర్మించి మేరు
పర్వతమునందేకాక, వైశ్రంభక,సురాసన,నందన,పుష్పభద్రక,చైత్రరథ్య,మానస సరోవర ప్రాంతములన్నియును
విహరించి ఆమెకు తృప్తిని కలిగించి అత్యుత్తమ సంతతిని పొందుతాడు.ఆమెతో గ్రహాంతర, లోకాంతర యానము గావించినాడు. ఆ
విమానము యొక్క గుణములేవి యని పరిశీలించుదాము.
భ్రాజిష్ణున విమానేన
కామజ్ఞేన మహీయస
వైమానికాన్ అత్యాసెత్
చరన్ లోకాన్ యధానిలః
తాను కోరిన దిక్కునకు తన
నియంత్రణలోని విమానమును పలు దిశల వీచు గాలివలె ఎన్నో లోకములు అంటే గ్రహములు, భార్యా సమేతుడై తిరిగినాడు.
ఇటువంటి విషయాన్నే
త్రిపురాసురుల యందు కూడా గమనించుతాము. ఇక రామాయణమునందలి పుష్పక విమానమును గూర్చి
మనకు తెలిసినదే. లంకకు సీతాన్వేషణమునకు వెడలినహనుమంతుడు నవరత్న ఖచితమయమైన, ఇది భవనమా అన్నట్లున్న, పుష్పకమును చూసినట్లు వివరింపబడినది.
వైమానిక
శాస్త్రములోని మొదటి ప్రకరణములో తన రచనకు ముందు వున్న, తాను
పరిశీలించిన గ్రంధముల పాట్టిక ఇచ్చినారు. అందులోని ముఖ్యమైన కొన్ని ఈ క్రింద
ఉటంకించడమైనది. 1. అగస్త్య కృతాశక్తి సూత్రములూ ఈశ్వర(ఎవరన్నది నాకు తెలియదు)'సౌదామిని
కలా,భరద్వాజుడే రచించిన అంశుబోధిని,శాక్తాయన్
కృతమగు 'వాయుతత్వ ప్రకరణమూ,నారదకృతమైన వైస్వానర తంత్రము మొదలైనవి.విమాన శాస్త్రమునకు తీక టిప్పణి వ్రాసిన
బొధానంద్ గారు ఈ విధముగా తెలిపినారు:
నిర్మాత్య తద్వేదాంబుధిం భరద్వాజో మహామునిః|
నవనీతం సముధ్గృత్య యంత్ర సర్వస్వ రూపకం||
నానా విమాన వైచిత్ర్య రచనాక్రమ బోధకం||
అష్టాధ్యాయౌర్విభజితం శతాధికరణౌర్యుతం||
సూత్రిః పంచశతైర్యుక్తం వ్యోమయాన ప్రధానకం
వైమానికాధికరణాత్సర్వం ముక్తంభగవతాత్స్వయం
'వేద సముద్ర మంథనము చేసి సామాన్య మానవునికి సులభముగా
ఉపయుక్తమౌ రీతిన, యంత్రసర్వస్వమన్న వెన్నను అందునుండితీసి అందించినారుభరద్వాజులవారు. ఆ గ్రంథమునదలి 40 అధికరణమందున విమాన సంబంధిత విషయ ప్రస్తాపన జరిగినది.
ఇది 8 అధ్యాయములుగా విభజింపబడినది.అందులో 100 అధికరణములు,500 శ్లోకములు
విమానవిషయ ప్రధానమైనవే!
భారతీయ వైమానుక శాస్త్రమును
గూర్చి ప్రాక్పశ్చిమ శాస్త్రజ్ఞులేమన్నారో చూడండి.
Johannes Adrianus Bernardus
van Buitenen (21
May 1928 – 21 September
of Sanskrit in the
Department of South Asian Languages and Civilizations. తన mahaa
bhaarata Volume--3 లో The Razing of Soubha మరియు
The War of
The Yakshas ఈ క్రింది
విధముగా రచయిత చేతనే వివరించ బడినది : "The areal city is nothing but
an armed camp
of flame throwers and
thundering canon, no doubt a space ship అందులొనే
నివత
కవచములు అన్నపదమునకు space suits తప్ప
అన్యము కాదని ఆయనే చెప్పినారు.
It is in the study of creativity that Indian science
continues to be relevant .If students had access to authoritative
narratives of Indian Science in the University, they would not pay
attention to outlandish claims of ancient flying machines.
-- Subhash Kak, Regents
Professor of Electrical and Computer Engineering
at Oklahoma State
University and a Vedic Scholar
మనస్పూర్తిగా మనపూర్వులను, వారి సత్య నిష్ఠను, వారి శక్తి సామర్థ్యాలను
నమ్ముతున్నాను కాబట్టి నా శక్తికి మించిన ప్రయాసపడి ఈ పూర్వీక వైమానిక జ్ఞానాన్ని
గూర్చి మరియు పూర్వుల గొప్పదనమునుగూర్చి నేటి తరానికి తెలియజేయవలెనన్న తపనతో
వ్రాస్తున్నాను.సమయము వెచ్చించి చదివేది.విషయము 10 మందికి పంచితే ఏ ఒక్క విశేషజ్ఞుడైనా ఒక అడుగు ముందుకు వేసి
పరిశోధించితే మన పూర్వుల జ్ఞాన సంపదనుగూర్చి లొకానికి చాటిన వారవుతారు.
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 8 లో విమాన శాస్త్రాన్ని గూర్చి మరోమారు ఇంకాస్త తెలుసుకొందాము......
భారతీయ శాస్త్ర విజ్ఞానము ...8
వైమానిక శాస్త్రము
బొధానంద వృత్తి,శౌనక సూత్రములు. మణిభద్ర కారిక
ఇత్యాది గ్రంథములలో 25 విధాల విమానాలున్నయని
తెలిపినారు.ఇవి 'రాజ లోహ'మన్న లోహవిశేషము తో తయారు
చేస్తారట.సౌమ సుందల మార్ధిక మన్న లొహములను 3:8:2 నిష్పత్తిలో కలిపి ప్రత్యేకమన శ్రద్ధతో అగ్ని కుండములో (Furnace) 272 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కాచి ఈ
లోహమును తయారు చేస్తారట.ఈవిషయాలలో దేశవిదేశాలలో ఎన్నో ప్రయోగములు గుప్తముగా
జరుగుచున్నవని తెలియవచ్చుచున్నది.
విమానపీఠమును రాజ లోహముతో
తయారుచేయవలెన్నది పై శాస్త్రములందు చెప్పిన మాట. ఈ పీఠము యొక్క బరువు మొత్తము
విమానపు బరువులో 1/100 వుండవలెనట. వెడల్పు విమానపు
ఎత్తులో సగము వుండవలెని యున్నది. ఈ విమాన స్తంభమును హటకాస్య లోహముతో చేయవలెనని
లల్లడు తన యంత్ర కల్పతరువులో వ్రాసినట్లు చెప్పబడివుంది. లోహతంత్రమను గ్రంథములో
ఎలోహ మూలకములనేవేవి మిశ్రణము చేయవలెనో ఇందుకు వాడవలసిన ప్రత్యేకమైన కొలిమి (Special Furnace) మరియు ఎంత ఉష్ణోగ్రత అవసరము
అన్న విషయమును గూర్చి తెలుపబడినదట. ఇవికాక విమాన నిర్మాణమునకు వలయు విషయములెన్నో
వివిధ గ్రంథములలో వివరించబడినది. కాబట్టి విమాన నిర్మాణము మన పూర్వులకు విశధముగా
తెలియునని తెలియవచ్చుచున్నది.
ఇక విమానములలోని వివిధ రఖములను
పరిశీలించుదాము. విమానాలను పూర్వులు రెండు విధములుగా విభజించినారు.1. మాంతికము :ఇందులో 25 విధములగు విమానములున్నాయి అని
సౌనక సూత్రములు చెబుతూవుంటే మణిభద్ర కారికలో 32 అని తెలుప బడింది. ఇక తాంత్రిక విమానములు భైరవాది 57 విధములు గలవని భరద్వాజులవారు
చెప్పడము జరిగింది.నేను ఎక్కువ వ్రాసేకొద్దీ చదువరులకు శ్రద్ధ తగ్గుతుందని వ్రాయుట
లేదు. ఒక మూడు నాలుగు తాంత్రిక విమానముల గూర్చి అతి క్లుప్తముగా వివరించుతాను.
1. శకునము : ఈ విమానమునకు 28 భాగములు గలవని విమాన శాస్త్రము
చెప్పుచున్నది. అవి ఏవన
పీఠము(Floor Board) ; బోలు కంభము (Shallo Mast) ; మూడు చక్రములు కలిగి రంధ్రాలతో
కూడుకొన్న కీలకములు ( hree wheeled keelakas,may be joints, with holes) ; 4 తాపకములు (Heaters) , వాయు చూషక నాళములు (air-suction
pipes), జలావరణము (Water
Jacket) , తైల భాండము
(Oil Tank), వాయు తాపకము (Air Heater) , దాహకము (chhullee or Heater) , ఆవిరి భట్టీ(Steam Boiler), విద్యుదుత్పాదక యంత్రము( electric generator) , వాయు ప్రేరక యంత్రము (air propelling machine)
, వాతపా
యంత్రము లేదా వాయు చూషక నాళము (Air Succsion Pipe) , దిక్ప్రదర్శక ధ్వజము ( direction indicating banner), శకున యంత్రము (Sakuna Yantra, May be the
maine engine) , రెండు
రెక్కలు( two wings )
, విమానము
ఎగురుటకు వలయు తోక భాగము( tail
portion for helping vimaana to rise), ఔష్మ్యక యంత్రము ( Thermodynamic mechanism ) సూర్య కిరణాకర్షణ యంత్రము ( sun-ray attracting bead) వ్ ఈ 28 శకున విమానము యొక్క భాగములు.
2. సుందర విమానము : ఇది 8 భాగములను కలిగియుంటుంది. అవి
పీఠము (ground plate), ధూమ్ర నాళము లేక ధూమోద్గత
యంత్రము (smoke
chimney),5 వాయు
యంత్రములు( 5
gas-engines), భుజ్య లోహ (ప్రత్యేక పద్ధతిలో వివిధ మూల లోహ మిశ్రణముతో తయారు
చేయబడుతుంది)నాళము (bhujya
metal pipe), వాయు
ఉత్పాదకము లేక కొలిమితిత్తి (wind blower), విద్యుతుద్పాదక యంత్రము (Electricity Generator) చతుర్ముఖ తాపోత్పాదన యంత్రము (four-faced heater) మరియు విమాన నిర్ణయము (outer cover). వీని పొడవెడల్పులనే కాక
ఎత్తూ ఎంత వుండవలసినది తెలుపుతూ ఏదేది ఎక్క్డెక్కడ ఏవిధముగా వుంచవలెనన్నది
కూడా ముందుతెలిపిన గ్రంథములలో వివరించినారు.
3. రుక్మ విమానము
పీఠ రుక్మ విమానస్య కూర్మాకారం
ప్రకల్పయేత్
వితస్తిహసాయామం గాత్రమె
కవితస్తికం
రుక్మము అనగా బంగారు. బంగారు ప్ధానముగ
ఇంకా మరికొన్ని లోహ మిశ్రణములతో ఒక లోహమును తయారుచేసి దానిని రుక్మము యొక్క
తయారీకి వుపయోగించుతారు. ఈ లోహమును రాజ లోహమన్నారు. రుక్మము అంతరీక్ష నౌక.ఇది
స్తూపాకారము కలిగియుంటూ అండమును బోలియుంటుంది. మానవ చోదితము. తారాజువ్వ వలె
ఆకాశమునకెగుస్థుంది. రష్యనులు మనిషి లేకుండా మన శాస్త్ర గ్రంథ సహాయముతో తయారు చేసి
విజయము సాధించినారట.అతిపెద్ద అంతరీక్ష నౌకగా దీనిని తయారుచేస్తే ప్రయాణీకులను
గ్రహాంతరసీమలకు తీసుకుపోగలుగుతుంది.మనుష్య రహితముగా చిన్నదిగా తయారుచేస్తే అస్త్ర
వాహకముగా వుపయోగ పడుతుంది. ఆర్థిక సహాయము ప్రభుత్వ ప్రోత్సాహము లేక మన
దేశమున మన పూర్వుల విజ్ఞానము అడవిగాచిన వెన్నెలయిపోయినది.
త్రిపుర విమానము
మస్త్య పురాణము లో త్రిపుర
విమానమును గూర్చి కూడా వర్ణించినారు. అంటే త్రిపురాసురులు ఆకాశములో హర్మ్యములు
నిర్మించినారు శివుదు వారి పురములను యుద్ధములో కూల్చినాడు అని చదివియుంటాము.
ఈశ్వరుడు ప్రయోగించిన అస్త్రములను నేడు మనము missiles అన్న పేరుతో పిలుస్తాము.ఇది ఒక అతిపెద్ద అంతరిక్ష నౌక. గగనములో చలనము లేకుండా
నిలబదగలదు.ఏదిశలో పయనించవలెనంటే ఆ దిశలో ప్రయాణము చేయగలదు.
సౌభకము:
ఈ సౌభక విమానము యొక్క ప్రస్తాపన
సంస్కృత వ్యాస భారతములొవస్తుంది.భక్తి
వేదాంత ప్రభురిల స్వామి వారు భాగవత పురాణమును ఉటంకించుతూ సౌభకమును గూర్చి ఈ
విధముగా చెప్పినారు .
" సాళ్వుని యొక్క సౌభక విమానము , తపస్సు చే శంకరుని మెప్పించి, మయుని చే తయారు చేయబడి
సాళ్వునిచే పొందబడినది. ఇది కొన్నిసార్లు అనేక విమానాలు గానూ కొన్ని
సమయములసలేమీ లేనత్లుగానూ ఆకాశంలో కనిపిస్తుంది. కాబట్టి ఇది అత్యంత అసాధారణ
మైనది. కొన్నిసార్లుభూమిపై, కొన్నిసార్లు
నీటి మీద తేలుతూ కొన్నిసార్లు ఆకాశంలోఎగురుతూ,కొన్నిసార్లు ఒక కొండ శిఖరం మీద విడిది చేసినట్లు యాదవులు చూసి
భయభ్రాంతులైనారట. అద్భుతమైన ఈ విమానం ఆకాశము నుండి ఉల్కా పాతములను సృష్టించగలదట.
అత్యంత చంచలమైన ఈ విమానము యాదవులలో అలజడి సృష్టించినదట." ( భక్తివేదాంత , 1986)
పుష్పక విమానము:
దీనిని గూర్చి మనము రామాయణములో
వింటాము. ఇది సుదూర ప్రయాణములు చేయగలిగినది. పుష్పకము అంటే పూలవలె బహు తేలికైనది
అని అర్థము.అంటే దీనిని బహు తేలికైన లోహమును, వివిధ నిష్పత్తులలో మూల లోహముల కలిపి,తో తయారు చేసినారెమో! బహుశ
దీనికి విస్తరించే స్వభావము వుడేదేమో!అంటే ఇది స్థితిస్థాపకత (Elasticity) కలిగియుంతుందన్నమ్మాట. అందుకే ఈ
విమానమునెందరు అదిరోహించినా ఇంకా ఒక్కరికి స్థలము వుంటుందని రామాయణమున
చెప్పబడినది.
నాకు తెలిసిన, తెలుసుకొన్న మేరకు
తెలియబరచినాను. మన పూర్వుల గొప్పదనము గుర్తించండి. మీరు తెలుసుకొంటే మీ పిల్లలకు
చెప్పగలరు. వారిలోనుండి ఏ శాస్త్రజ్ఞుడో బయల్వెడల వచ్చు.దీనిని వ్రాయుటకు నాకు
దాదాపు 10 రోజులు పట్టింది. పది నిముసములు
వెచ్చించి మన పూర్వ చరిత్రను తెలుసుకొండి. మన అపూర్వ సంపదను గుర్తించండి.
ముక్తాయింపుగా ఎ
వాక్యములను చదవండి. ప్రతి దేవాలయములోనూ దేవతా విగ్రహము వుంటుబ్ది.
ఆప్రదేశమును గర్భగుడి అంటారు. ఆ గభ గుడి గోపురమును విమాన గోపురము అంటారు. మీరు
గమనించితే తిరుమల విమానగోపురముపఈ ఎందరో దేవతల విగ్రహములను చూడవచ్చు. ముఖ్యముగా
విమాన వెంకటేశ్వర స్వామిని గుర్తించుటకు వీలుగా బాణపు గుర్తును గూడా వేసియుంటారు.
పైన తెలియ బరచిన విమానములలో ముఖ్యముగా 'రుక్మమూ ఈ గోపురాకృతిలోనె వుంటుంది. దీనివల్ల మనకు దేవతా విమానములుండేవని మనకు
ఒక ఊహ కలుగుట లేదా!
లేవండి- మేలుకోండి- అపూర్వ
ఘంతగల మన పూర్వులను గుర్తించి దేశానికి పునర్వైభవము గొనిరండి.
కొన్నిరోజుల తరువాత మనపూర్వుల
యొక్క వేరొక ఆవిష్కరణను గూర్చి తెలుసుకొందాము.
వేద
సమాజం సిరిసంపదలతో తులతూగుచుండినారు. వేద కాలపు మహిళలు బంగారు మరియు వెండి
ఆభరణాలు ధరించేవారు. రత్నమయ ఆభరణములు విరివిగా ఉపయోగించేవారు.
సహజంగానే మహిళలు ప్రతి ప్రత్యేక సందర్భములో నూ బంగారు ఆభరణాలు ఇప్పటికీ
ధరించుతూనే వున్నారు కదా!. స్వర్ణాభరణముల ఉనికి వేదకాలమునుండి విండినా
ఆభరణాలు వివిధ రకాల ఆధారాలు క్రీ.పూ. మూడో శతాబ్ది నుండి అందుబాటులో ఉన్నాయి.ఎంతో
ప్రాచీన దేయాలయ కుడ్యములపై గల భారతీయ శిల్పాల యొక్కఅంగాగమూ ఆభరణ భరితమైయున్నట్లు
మనము చూస్తూనేవున్నాము.మనం
నాటి గ్రీకు దేవతా విగ్రహములను చూస్తే వారి శరీరములపై ఆభరణములసలు కనిపించవు.
సుమేరియన్ మరియు బాబిలోనియన్ విగ్రహాలు చూస్తే ఆభరణాలు వారి మేనిపై ఆభరణాలతి
తక్కువగా కనిపిస్తాయి. కేవలం ఈజిప్టు మహిళలు హిందువులు వంటి కొన్ని ఆభరణాలు
ధరించేవారు. బహుశా వారు ఆభరణాలను బహుశ భారతదేశం నుండి దిగుమతి చేసుకొని
యుంటారు. అదియును గాక భారత చరిత్ర భాస్కరుడు మహావిమర్శకాగ్రేసర బిరుదాంకితులుఅయిన కోట వెంకటాచలముగారు
తమ గ్రంథములలోమనదేశము
నుండి ఎందరో ఈజిప్టు కు వలస వెళ్ళినట్లుబహుళముగా తెలిపియున్నారు.
కాబట్టి ఈ స్వర్ణా భరణ కళ మనదేశమునుండి దేశాంతరములు వెళ్ళినట్లు నిశ్చయముగా చెప్పవచ్చును.
ఒకసారి వేద
మూలాలు ఏమంటున్నాయో తెలుసుకొందాము.
ఋగ్వేదము లోని శ్రీసూక్తము బ్రాహ్మణులలో
చాలామందికుటుంది. It is one
of the oldest extant texts in any Indo-European language. అని వికీ పీడియా లో వుంటుంది.అంటే దానిలో చెప్పినవి
వేదము బహిర్గతమయ్యే కాలమునకు అందులో ఉటంకించినవి వున్నట్లేకదా! వేదము అపౌరుషేయము
మరియు మౌఖిక విధానముననుసరించి వచ్చినది. కాబట్టి అందులో తెలిపిన హిరణ్య,సువర్ణ,చంద్రా, ఇవన్నీ బంగారునకు మారుపేర్లుగా వేదమున ఉటంకించ
బడినదని మనకు సులభముగా అర్థమౌతుంది.ఋగ్వేదములో ఇదిజాతరూపముగా గూడా వర్ణింపబడింది.
భూమి నుండి
బంగారు ను వెలికితీయుటను గూర్చి ౠగెవదములో విరించ బడినది (ఋవ్ 1-117-5; ఆవ్ 12-1-6; 12-1-26; 12-1-44). బంగారం శుభ్రపచడమును గురించి తైత్తిరీయ సంహిత
(ట్శ్ 6-1-71-) మరియు శతపథ బ్రాహ్మణములో (శ్భ్ 2-1-1-5) లో పొందుపరచబడి వున్నాయి. బంగారు నది
ఒడ్డులవద్ద వద్ద పారంపరిక విధానముతో బంగారును గట్టును ఒరుసుకు పారే నది నుండి
గ్రహించేవారు. అందుకే Indus ను
హిరణ్మయమని RV(10-75-8)
సరస్వతిని
హిరణ్యవర్తిని అని కూడా పిలిచేవారు (ఆవ్ 6-61-7).ఈ విషయమై స్వానుభవమొకటి చెప్పదలచుకొన్నాను.******
ఆభరణ స్వర్ణమును హిరణ్యము
అంటారు(RV 1-122-2;
VS 15-50))
కటక సంహిత (KV 11.2) మరియు తైత్తిరీయ సంహితలో లో
బంగారు తూనిక రాళ్ళను అష్టప్రదలు అని అంటారని తెలిపినారు.
ఖనిజమును బంగారు చేయబడుతుందని
శతపథ బ్రాహ్మణములో (SB
6-1-3-5,12-4-3-1) బంగారును ఖనిజము నుండి తగిన ఉష్చెప్పబడినది . దానము గా 10 పెద్ద బంగారు గుండ్లను (హిరణ్య
పిండములు) బ్రాహ్మణునకు దివోదాసుడు ఇచ్చినట్లు ఋగ్వేదములో(ఋవ్6-47-23)చెప్పబడినది. ఒక్కొక్క ఆవు
కొమ్ములకు 1000 బంగారు నాణెములు కట్టి అత్యంత
ప్రతిభాశాలియైన వేదగ్నునకు ఇవ్వబడినదని ఇచ్చేవారని బృహదారణ్యకోపనిషత్తులో
చెప్పబడినది.ఆభరణ స్వర్ణమును హిరణ్యము అంటారు(RV (1-122-2; VS 15-50))
కటక సమ్హిత (KV 11.2) మరియు తైత్తిరీయ సంహితలో లో
బంగారు తూనిక రాళ్ళను అష్టప్రదలు అని అంటారని తెలిపినారు.
ఖనిజమును బంగారు నుండి
తీయబడుతుందని నుండి శతపథ బ్రాహ్మణములో (SB 6-1-3-5,12-4-3-1) చెప్పబడినది . దానము గా 10 పెద్ద బంగారు గుండ్లను (హిరణ్య
పిండములు) బ్రాహ్మణునకు దివోదాసుడు ఇచ్చినట్లు ఋగ్వేదములో(ఋవ్6-47-23)చెప్పబడినది. ఆవు కొమ్ములకు 1000 బంగారు నాణెములు కట్టి అత్యంత
ప్రతిభాశాలియైన వేదజ్ఞ/వేదాంతికి ఇవ్వబడేదని బృహదారణ్యకోపనిషత్తులో
చెప్పబడినది.దానిని జనకుని నుండి యాజ్ఞవల్క్యుడు గ్రహించినట్లు కూడా చెప్పబడినది.
రామాయణము ఆది కావ్యమన్నది
జగమెరిగిన సత్యము. మనము వినే రామాయణము ఈ మన్వంతరములోని 24 వ మహా యుగమునందలి త్రేతాయుగమున
రావణుని తపః ఫలమి క్షీణదశకు వచ్చినపుడు దశరథాత్మజుడైన రాముని చ్వ్తిలో
చం[అనడినత్లు చెప్పబడినది. జరిగినట్లు వాయుపురాణము చెప్పుచున్నది.
త్రేతాయుగే చతుర్వింశే
రావణాస్తపసః క్షయాత్
రామం దాశరథిం ప్రాప్యా సగణాః
క్షయమీయవాన్
అది కాదు ఈద్వాపరమునకు
ముదటి త్రేతాయుగమని మాటవరుసకు అనుకొన్నననూ 8,64,000 సంవత్సరములు (ద్వాపర యుగ పరిమితి) జరిగి
పోయినట్లే.మరి సీతమ్మ వదిలిన ఆభరణములు స్వర్ణసీత అంతా బంగారు మయమే కదా.
ద్వాపరములో జరిగిన భారత ఇతిహాసములోని సభాపర్వములో ధర్మజుని రాజసూయమునకు వచ్చిన
ఆహూతుల్లలో దక్షిణాది నుండి వచ్చిన చోళ పాడ్యులు మణిరత్న ఖచిత స్వర్ణాభరణములు
కానుకలుగా ఇచ్చినట్లు చెప్పబడియుంది. ఖడ్గపు వరలు బంగారుతోచేయబడి వజ్రముల
తాపడము కలిగియుండెవి కానుకలుగా ధర్మజునికి సమర్పించినారట వివిధ దేశాధీశులు.
ఇంతే
కాకుండారసాయన
శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా
ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ
దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా
యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో
మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన
‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన
'ఆర్య
నాగార్జునుడు'అనిపించుకొన్నాడు
.గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివసించినాడు.అందుకే ఈపర్వతానికే ’నాగార్జున
కొండ’అనే పేరొచ్చినది .ఇక్కడే ఒక విశ్వ
విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో
విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు . కాని
నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది
.ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన
దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే
.దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో
బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని
తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని
పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ
నాడే ఈ రహస్యాం నాగార్జునికి ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .
ఒక
శ్లోకం లో రస రత్నాకరం లో ఈవిధముగా వర్ణించుట జరిగినది.
‘’క్రమేణాకృత్వామ్బుధరేణ
రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’ కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంతు బట్ట
లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడైనాడు ఆచార్య నాగార్జునుడు.వేమన కూడా రసవిద్యనెరిగినవాడని అంటారు. కానీ
నాగార్జునుడు ఆయనకు చాలా పూర్వీకుడు.
ఫై
విషయముల వల్ల మనకేమి తెలుస్తూవున్నదంటే మనవారికి వేదకాలములోనే బంగారు ఖనిజము
వెలికితీయుట గానీ, వెలికి
తీసిన ముడి బంగారునుండి ఆభరణములు చేయుటగానీ , దానమునందు
బనాగారునొసగుటగానీ, ద్రవ్యముగా
బంగారు కాసులను ఉపయోగించుటగానీ లలక్షలఏంద్ల క్రితమే తెలియునని
తెలియవచ్చుచున్నది. కానీ Google పరిశోధనను ఆశ్రయించితే మనకు ఈ
విధముగా అర్థముతుంది:
In ancient Egypt, around
the time of Seti I (1320 B.C.), we find the creation of the first gold treasure
map now known to us. Today, in the Turin Museum is a papyrus and fragments
known as the "Carte des mines d'or." It pictures gold mines, miners'
quarters, road leading to the mines and gold-bearing mountains, and so on. The first use of gold as
money occurred around 700 B.C., when Lydian merchants produced the first
coins.(http://onlygold.com/Info/History-Of-Gold.asp)
కేవలము ఆ కాలమునాటి బంగారు
నాణెములు వస్తురూపములో కనిపించని నేరానికి మనదేశమును వెనుకకు నెట్టుటలొ ఎంత ఈర్ష్య
దాగుందో గమనించండి.
భారతీయ శాస్త్ర విజ్ఞానము ..10 లో మళ్ళీ కలుస్తాము. .....
భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 10
( లోహశాస్త్రము )
వెండి
ప్రాచీన
కాలపు నాణెములు వెండితో తయారుచేయబడుచుండినవని చారిత్రిక పరిశోధకులు కనుగొన్న
తరువాత మన దేశమున వెండి ఎంత పురాతన కాలమునుండి అంటే క్రీ.పూ.1 వ శతాబ్దము నుండి, ఉపయోగింప
బడుచుండినదన్న విషయము మనకు
అర్థమౌచున్నది. ఖగోళము జోతిషము ఒకటే అన్ని పాశ్చాత్యులు అనుకొనే కాలమునకు ఎన్నో
వేల సంవత్సరములకు పూర్వమే అవి వేరన్న శాస్త్ర సంపద మనది.గ్రహములను తెలియబరచినది
మనవారు. ఆ గ్రహములకు ఏ ఏ లోహములు ప్రీతికరములు అని తెలిపినది మనవారు. ఆ విధముగా వెండి చంద్రునకు ప్రీతికరమని
తెలిపినారు. ఆయన వెంనేలరాజు. వెన్నెల వెలుగు వెండివలేనే ఎంతో తెల్లగా ప్రకాశవంతముగా
వుంటుంది కదా! పైగా వెండికి రజతము అని పేరు. బంగారునకు మహారజతమని పేరు. అంటే అసలు వెండి, బంగారుకన్నా ముందు పుట్టినదనే కదా!
నిగూఢమైన నాటి ఈజిప్టు రాజ కళేబరముపై కనిపించే వెండి బంగారు నగలు హిందూ లోయ
నాగరికతకు చెందినవని చరిత్రకారులు తమ పరిశోధనల మూలముగా తెలియబరచుచున్నారు. ఇంతకూ
మించిన సాక్ష్యాధారాలు వేరేమి కావలె.చాణక్యుని అర్థ శాస్త్రమును పరిశీలించితే మిగత
లోహములతో బాటూ వెండివాడకమును గురించికూడా మనము తెలుసుకొనగలము.
రాగి
(తామ్రము)
కౌటిల్యుని
అర్థ శాస్త్రం లోనే రాగి గనులు, రాగి పరిశ్రమల గురించిన ప్రస్తావన ఉంది. ఇది రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్ లలో అధికంగా లభిస్తుంది.
అసలు రాగిని గూర్చిన ప్రస్తాపన ఋగ్వేదము లోనే వస్తుంది. మరి రుగ్వేదకాలమును ఎవరు
నిర్నయించవలె.కీస్తుకు పూర్వము 6500 నుండి 5500 సంవత్సరములకు మధ్య కాలము లో ఆధార పూర్వకముగా రాగి వాడకమును గూర్చి మనకు
తెలియవస్తుంది. బోలన్ కనుమలకు దగ్గరగా దక్షిణ సింధునదీ ప్రాంతములో క్వెట్ట,
కళాత్, సిబి ప్రాంతములకు మ్న్డుమన వున్న
మేహ్ర్రాఘర్ అన్న వూరిలో 1974 లో 6 దిబ్బలు
బయల్పడినాయి. వానినుండి 32000 కళాఖండాలు బయల్వేడలినాయి.
అందులో మరీ చిన్నది కానట్టి వ్యాసము కలిగిన స్థూపాకారములో వున్న రాగి కోవు దొరికింది.
మరి దానికి ముందే రాగి వాడకమున్నట్లు మనకు ఆయుర్వేదము ద్వారానూ పురాణముల ద్వారానూ
తెలియవచ్చినా పాశ్చాత్యులకు చూపుటకు ఆధారములు లేవు. అది మన విధి. అసలు ఈ వస్తువు
దొరకకుంటే మనకు అసలు రాగిణి గురించి తెలియనట్లే! అసలు ఇత్తడి,కంచు
మనదేశములోనే
మొదట తయారయినది. కంచు గంటలు పురాతన దేవాలయములలోనివి ఎప్పటివి అన్నది, విదేశములలో ఎప్పటినుండి వున్నాయి
ఆనదీ తెలిపితే మన ఆలయాలు అంతకు ముందువైతే , కొన్నయినా ఆ
కాలమునకు చెందినవి ఉంటాయికదా . ' ఇతి ఘంటానాదం కృత్వా'
అన్న దేవతార్చన మంత్రమే ఉన్నదికదా!
సీసము
అసలు మన ఋషులు బంగారు,వెండి. రాగి, సీసము,యసదము, పాదరసము ఆయుర్వేదమునండు ఉపయోగించుట మనకు
తెలిసినదే. అవి నేటికీ వాడబడుచున్నవి.మరి ఈ ఆయుర్వేదము ఎన్ని వేల, లక్షల సంవత్సరముల నాటిదని నేటి చరిత్ర పరిశోధకులు తేల్చి చెప్పగలరా! సీసపు
నిక్షేపములు గుంటూరు లోని దూమెట్ట, బండ్లమేట్టులలోనూ, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె,
మామండూరులలో కలవు. సీసము turky లో మొదట, క్రీస్తు
పూర్వము 6000 లో దొరికినదని చెబుతారు. కానీ ఇది చదవండి.
Historians generally
agree that the first Turkic people lived in a region extending fromCentral AsiatoSiberia. Historically they were established after the 6th
century BCE. ( wikipedia )
మరి
దీనిని వాస్తవముగా తీసుకొంటే ఈ దేశమును నివాసముగా ఏర్పరచుకోన్నవారు తమతో బాటు
సీసము తెచ్చుకోన్నారనుకోవలేనా! అసలు ఈ విషయము ఎందరికి తెలుసునో నాకుతెలియదు. సీసపు
పాత్రల ఖరీదు చాలా ఎక్కువ. ఖాళీ పాత్రను వెలిగించిన పొయ్యి పైన పెడితే పాత్ర
కరిగిపోతుంది. ఈ పాత్రలో చారు ( ఆధునికులురసము అంటారేమో!) పెడితే అమితమైన
రుచి వస్తుంది. అనుభవము అధికముగా వుంటేనేగాని ఇటువంటి విషయములు తెలిసిరావు.
యశదము
The metal
using cultures appeared in the Indian sub-continent around 6th millennium BCE.
Subsequently, copper metallurgy is well attested to at various sites by the 4th
millennium. Besides copper-bronze, these ancient societies were also aware of
various other metals like gold, silver, tin. Even deliberate production of iron
goes beyond the 1st millennium BCE. Compared to the great antiquity of these
metals, in a historical perspective, regular production of zinc and brass and
distillation of zinc is very late. ( by J.S. Kharakwal, PhD)
దీనిని
బట్టి యశదమును వేరుపరచు విదానము మనకు ఎంత పూర్వమునుండి తెలుసునన్నదితెలియుచున్నది. యశదమును ముడిపదార్థమునుండి వేరుపరచుట మనకు తప్ప అసలు ప్రపంచ
దేశములలో ఎవరికీ తెలియని కాలములోనే మనకు తెలుసు.యశదము(zinc)ను ఖనిజము నుండి వేరు పరచు విధానము మన
వారికి మాత్రమె 4000 సంవత్సరముల క్రితమే తెలుసు.ఆ విధానము
ఒకసారి గమనించండి.యశదము 997 డిగ్రీల సెల్షియస్ లో
ద్రవీభవించుతుంది.అది 1000 సెల్షియస్ లో ఆవిరి ఔతుంది. అంటే ముడేమూడు డిగ్రీల వ్యత్యాసములో ఈ
పరివర్తన జరుగుతుంది. సాధారణంగా క్రింద వేడిచేసి పైనుండి ఆవిరిని వేరొక పరికరములోనికి
పట్టి లోహమును వేరుచేస్తారు. కానీ మన పూర్వులు మంట పైనపెట్టి క్రిందినుండి తగిన పాత్రలలో, సరియైన ఉష్ణోగ్రత వద్ద పట్టి దానిని
శీతలీకరణ విధానముతో దానిని యశదముగా మార్చుతారు. ఈ లోహమును
శుభ్రపరచు విధానము మన వారలకు తప్ప ప్రపంచములో వేరెవరికీ తెలియదు. మననుండి ఒక చైనీయుడు
సంగ్రహిస్తే వానినుండి విలియం ఛాంపియన్ అన్న ఒక ఆంగ్లేయుడు గ్రహించి మొదటి సారిగా 1543 సంవత్సరములో యశద సంబంధ కార్మాగారమును తమ
దేశములో నెలకొల్పినాడు.కంచు తయారికి అత్యంత మూల పదార్థముయశదమే. ఇది రాజస్తాన్ లోని
జవార్,రాజపుర-దరిబ(375
BC) మరియు రాంపుర-అగుచ (370BCE)ప్రాంతాలలో అధికముగా ఈ
నిక్షేపములున్నట్లు చరిత్రకారులు తెలుపుచున్నారు. యశదమును ఉపయోగించకుండా కంచు (కాంశ్యము) ఇత్తడి (ఋతిక) లను
తయారుచేయలేరు. మరి వీనిని మొదట ఎవరు తయారు చేసియుంటారు?
పాదరసము
పాదరసము
కూడా లోహము.ఇది చంచల స్వభావము కలది, మనుషుల మనసుల మాదిరి. ఈ ధాతువును ఆయుర్వేదములో ఎంత కాలము
నుండి మనము ఉప్యోగించుచున్నామో ఎవరూ లెక్క కట్టలేదు. పాదరసమును గూర్చి మన ఋషులు
పరిపూర్ణముగా దాని ఉపయోగాములను గూర్చి కూడా తెలుసుకొని దానిని ఆయుర్వేదములో కూడా
ఉపయోగించుతూవుంటే , 17 వ శతాబ్దము వరకు అదేమిటో తెలియదు
పాశ్చాత్యులకు. తెలిసిన తరువాత వారు పెట్టుకొన్న పేరు Quick Silver . అంటే వెండి రంగులో భూతలము పై బడితే పారాడుతూవుంటుంది కాబట్టి. ఫ్రాన్సు
ప్రభుత్వము భారత దేశము నుండి వచ్చు రస ఔషధములు (Medicins made of Mercury) విరివిగా అవసరమైన వ్యాధులకు వాడమని ఆ కాలములో చట్టమే అమలుచేసి యుండినారు.
మన
పూర్వులు అనేక వేల సంవత్సరములనుడి రస విజ్ఞానము కలిగి యున్నారు. దీనిని విమాన
నిర్మాణములో కూడా వాడేవారని ముందే చెప్పుకొన్నాము. భోజరాజు కాలములో దీనిని విమాన
చోదనమునకు వాడేవారని చెప్పుకొంటారు. ఇక ఆచార్య నాగార్జనుని గూర్చి స్వర్ణమును
గూర్చి తెలుపునపుడే తెలియబరచినాను. జటిలమైన Psoriyasis లాంటి వ్యాధులకు రాసౌషధ చికిత్స అత్యంత ఉపయోగకరము.
గొప్ప
పండితుడు, బహుభాషా
కోవిదుడు అయిన అల్బరూని పర్షియన్ దేశస్తుడు, కానీ ఘజ్నవీ
సంస్థానము (ఆఫ్ఘనిస్తానములో ) నిలిచిపోయినాడు, ఈయన భౌతిక ,
గణిత, ప్రకృతి శాస్త్రములందు దిట్ట. ఈయన 11వ శతాబ్దములో వ్రాసిన 'తారిక్-అల్- హింద్ (History of India
) లో ఈ విధముగా పేర్కొన్నాడు " పాదరసము ఉత్పత్తి, ఉపయోగము లను గూర్చి వీరికి తెలియనిది లేదు" అని మనదేశపు ప్రతిభను
ప్రపంచమునకు పరిచయము చేసినాడు.
భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 11
ఇనుము-ఉక్కు
కుతుబ్ మీనారు ప్రక్కలో యుండే గుడి యొక్క ఉక్కు ధ్వజస్థంబము ఎప్పటిదో తెలియని
(కొందరు 1600సంవత్సరములంటారు
గానీ ఋజువులు నేను చదవ లేదు.) కాలము నుండి నేటివరకు త్రుప్పుపట్టలేదు.నేడు కూడాఢిల్లీ కాలుష్యము ఎంత
ప్రయత్నించినను ఆ స్థంబమును ఏమీ చేసుకొనలేకయున్నది. ఇది ఎక్కువ మందికి తెలిసినదే , కానీ కర్ణాటకలోని కొల్లూరు లో2400 సంవత్సరముల క్రితము ఆది శంకరాచార్యుల
ఆగమన జ్ఞాపికగా,ఆవూరి శాస్త్రజ్ఞులో మేధావులో కాదు, మస్త్యకారులు నిలబెట్టిన స్థంబము , 750 c.m. వర్షము ఒకసంవత్సరములో 6-8 నెలలు పడుతూ వున్నా చిలుము (త్రుప్పు)
పట్టక మనపూర్వీకుల ప్రతిభకు ప్రతీకగా తలఎత్తుకొని నిటారుగా నిలిచియుంది.
కాశీ
ఖండమయః పిండం అన్నారు మన పూర్వులు. మరి అయస్ అంటే ఇనుము లేక అందునుండి వచ్చిన
ఉక్కే గదా! అయః+కాంతము = అయస్కాంతము అంటే ఇనుమును ఆకర్షించునది అనియే కదా అర్థము.
మరి ఈ శబబ్దముల పుట్టుక భారతదేశమున , సంస్కృతమున ఎప్పుడు పుట్టినవో తెలుసుకొంటే ఇనుము ఈ దేశమున ఎంత
పురాతనమైనది అన్నది తెలుసుకొనవచ్చును. ఋగ్వేదమున, ఆయుర్వేదమునకు
ఆది పురుషులగు అశ్వని దేవతలు కృత్రిమముగా మోకాలును, యుద్ధములో
పోగొట్టుకొన్న విస్ఫల అన్న రాజుకు, అమర్చినట్లు మనకు తెలియుచున్నది.
మరి ఋగ్వేదము ఎప్పటిది అన్నది ఎవరూ ఇంతవరకు తేల్చలేని విషయము.
RV 1.117.11
Hymned with the reverence of a son, O Asvins ye Swift Ones giving booty to
the singer,
Glorified by Agastya with devotion, established Vispala again, Nasatyas.
As legend has it, the Asvin twins appear and help restore Vispala’s leg
with an artificial limb perhaps made from iron or copper/bronze.The “operation”, if one can call it that was
performed in time that Vispala could move BEFORE the conflict opened
(presumably the next morning).
ఖగోళ, భూగోళ,ప్రాకృతిక,
భౌతిక, శాసన, వ్రాతమూలక
పరిశోధస్నాల ద్వారా భారతయుద్ధము క్రీస్తు పూర్వము 3139 లోనూ కలియుగము క్రీస్తు పూర్వము 3012 లోను ప్రారంభమైనదని ఘంటా పథముగా
నిర్ణయించ బడినది. మరి ఆ యుద్ధములో వాడిన ఆయుధములు అనగా బాణములు బల్లెములు,
గదలు మరి ఇనుము ఉక్కు తో కాక దేనితో తయారు చేయబడినట్లు. మరి ఇంతటి
పూర్వ చరిత్ర మరి యే ఇతర దేశములకైనా మతములకైనా ఉన్నదా! మరి లేనపుడు వారెందుకు
మన చరిత్ర నంగీకరించారు. శుశ్రుతుడు మొదటి శాస్త్ర చికిత్స నిపునుదని పాశ్చాత్యులు
కూడా ఒప్పుకొన్నారు. మరి ఆయన శాస్త్ర సహాయము లేకనే శాస్త్ర చికిత్స నిర్వహించెనా! మరి
శాస్త్రములు వాడియుంటే అవి త్రుప్పు పట్టని సాధనములే కావలెను కదా ! మరి ఆయన కాలమునకు
ఇనుము ఉక్కు ఉన్నట్లే కదా! ఇన్ని విధములైన అవకాశాములుండియు
మనము మన చరిత్ర, మనపూర్వుల గొప్పదనము తెలుసుకోలేకుండా యున్నాము. నిజానికిది సిగ్గుచేటు
కాదా! ఈ క్రింది మాట చదవండి మన ప్రభుత్వ శాఖనే ఏమి చెప్పుచున్నదో?
Indians were familiar with iron
and steel during the Vedic age more than 4,000 years ago.ASHOK BASU (PRESS INFORMATION BUREAU -- GOVERNMENT OF INDIA )
Delhi's
Iron Pillar This is again a fine example of India's great heritage in iron
making. Recent work on the same has shown the presence of a layer of the
hydrated iron hydrogen phosphate (FePO4rH3PO4,4H2O) layer & then an
amorphos S-FeOOH layer over the base metal that greatly resisted corrosion /
oxidation of the pillar.
Prof. Lalit
Pandey (16 November 2009) Excavation at Iswal (Rajasthan), under Prof. Lalit
Pandey’s supervision during 2001- 2007, has provided the earliest date of iron
working in southeast Rajasthan. The C14 date of the iron working is 1053 BC. The word "wootz" appears to have originated as a mistranscription ofwook, an anglicised version ofukku,
ప్రతిది , పాశ్చాత్యుల తప్పుడు వాదనను పోద్రోసి మన
వాస్తవములను మనమే నిరూపించుకోనవలసి వచ్చుచున్నది. ఇది మన దౌర్భాగ్యము.
భారతీయ
శాస్త్ర విజ్ఞానము ..11( లోహశాస్త్రము ) తో మళ్ళీ కలుస్తాము.
మన
దేశమును గూర్చి పేరెన్నికగన్న విదేశ విద్యావంతుల మాటలు వారి నోటితోనే India is
the cradle of the human race, the birthplace of human speech, the mother of
history, the grandmother of legend and the great grand mother of tradition. -
Mark Twain.
If there is
one place on the face of earth where all dreams of living men have found a home
from the very earliest days when man began the dream of existence, it is India.
--French scholar Romain Rolland.
India
conquered and dominated China culturally for 20 centuries without ever having
to send a single soldier across her border. --Hu Shih, (former Chinese
ambassador to USA).
యువత ఇకనైనా మేల్కొంటే దేశానికి , మన
పూర్వీకుల గౌరవానికి ఎంతో మేలుచేసినవారవుతారు.
ఈవ్యాసమువ్రాసేటపుడు కృష్ణునితో ఈ
విధముగా మొరపెట్టుకొన్న ద్రౌపదే గురుతుకు వచ్చింది. ఇది తిక్కనభారతములోనిఉద్యొగపర్వంలో రాయబారానికైవెడుతున్న కృష్ణుడితో ద్రౌపది
అన్న మాటలు.
ఇత గోప్పదానినై కూడా ఇన్ని ఇక్కట్లు పడుతున్నానని అర్థము.
New Delhi, July 18:Experts at the Indian Institute of Technology have resolved the mystery
behind the 1,600-year-old iron pillar in Delhi, which has never corroded
despite the capital's harsh weather.
Metallurgists
at Kanpur IIT have discovered that a thin layer of "misawite", a
compound of iron, oxygen and hydrogen, has protected the cast iron pillar from
rust.
The
protective film took form within three years after erection of the pillar and
has been growing ever so slowly since then. After 1,600 years, the film has
grown just one-twentieth of a millimeter thick, according to R. Balasubramaniam
of the IIT.
In a report
published in the journalCurrent
ScienceBalasubramanian
says, the protective film was formed catalytically by the presence of high
amounts of phosphorous in the iron—as much as one per cent against less than
0.05 per cent in today's iron.
The high
phosphorous content is a result of the unique iron-making process practiced by
ancient Indians, who reduced iron ore into steel in one step by mixing it with
charcoal.
Modern
blast furnaces, on the other hand, use limestone in place of charcoal yielding
molten slag and pig iron that is later converted into steel. In the modern
process most phosphorous is carried away by the slag.
The
pillar—over seven metres high and weighing more than six tonnes—was erected by
Kumara Gupta of Gupta dynasty that ruled northern India in AD 320-540.
Stating
that the pillar is "a living testimony to the skill of metallurgists of
ancient India", Balasubramaniam said the "kinetic scheme" that
his group developed for predicting growth of the protective film may be useful
for modeling long-term corrosion behaviour of containers for nuclear storage
applications.
భారతీయ శాస్త్ర విజ్ఞానము ..11
భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 10 లో అనేక ఖనిజములు లోహములను గూర్చి చర్చించినాము. వజ్రాదులు
కూడా ఖనిజములే! (గనులనుండి పుట్టినవే!) కావున ఇపుడు వానిని గూర్చి తెలుసుకొందాము.వజ్ర వైఢూర్య, మరకత మాణిక్యాదులను గూర్చిమనము
మనరామాయణ,మహాభారతాది ఇతిహాసములందును, మస్త్య వామన భాగవత కాశీ
స్కందాది పురాణములందును, అనేక శాస్త్రములందునువింటూనే ఉంటాము. అసలు
మహేన్ద్రుని ఆయుధమే వజ్రము. ఒకసారి దేవీ భాగవతము చదివితే అమ్మవారి ఉనికి ఎన్ని లోహ
ప్రాకారాలు దాటినా తరువా వస్తుంది. ఒక్కొక్క ప్రాకారము ఏవిధమైన శోభలతో
అలరారారుతూవుంది మనము తిలకించ వచ్చు. ఈ పురాణముల ప్రాచీనతే మన పాశ్చాత్య ,వారి అనుయాయులైన మనవారికి
అందనపుడు, అందుగల వర్ణనలు కల్పనలనలేము
కదా! నిప్పులేనిదే పొగ రాదన్న నానుడిని గూర్చి యింతకు క్రితమే చెప్పియున్నాను.
కాబట్టి వజ్రాలుఉండినాయి అంటే వజ్రాల గనులు
వుండినాయనే కదా! పాశ్చ్యాత్య చరితకారుల కందనంత కాలము నుండిఇవి ఉండినవి కావుననే వీనిని గూర్చి
చెప్పుకొన్నాము. అసలింత చరిత్ర మరిఎదేశానికి కూడా లేదు. ఒక వేళ పూర్వులు వ్రాసినపుస్తకములలో వీని దాఖలాలు
వున్నవా అంటే తప్పకుండా వున్నవి.కౌటిల్యుని అర్థ శాస్త్రము (క్రీ.పూ.4వ శతాబ్దము ), ప్లీని (క్రీ శ 1వశతాబ్దము),
టాలమీ (క్రీ.శ. 2 శతాబ్దము ), బుద్ధ భట్ట (6 వ శతాబ్దికి ముందు), వరాహ మిహిరుడు(6 వ శతాబ్ది లో),వ్రాసిన వ్రాతలను బట్టి మనదేశము
లో వజ్రాల గనులుండేవని , మన దేశమే సంపదల గని యని తెలియ
వచ్చుచున్నది.
క్రీస్తు పూర్వము 6000 లో మహాజనపద
సామ్రాజ్యమున వజ్రముల యొక్క వాడకము అమితముగా ఉండినదని మనకు తెలియవచ్చుచున్నది.
ఆకాలమునకే తండులములు (బియ్యము) ఎంతో ప్రాధాన్యత సంతరించుకోన్నట్లు మనకు
తెలియవచ్చుచున్నది. వారి ద్రవ్య మారకమును 'రూపకము' అనేవారు. ఆకాలము 20 తండులముల బరువు తూగిన వజ్రము
విలువ 2,00,000 రూపకములుండేదట.' 'రత్నపరీక్ష' నియమావళిని ఆ రోజులలో
గ్రంథస్థము చేసి యున్చినారట. ఈ విషయములను చాణక్యుని అర్థ శాస్త్రములో మనము
గమనించగలము.
మౌక్తికం = ముత్యము = pearl
·మాణిక్యం = కెంపు = ruby
·వైఢూర్యం = రత్నం = lapis-lazuli
·గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
·వజ్రం = diamond
·విద్రుమం =ప్రవాళము=పగడం = coral
·పుష్యరాగం = తెల్లటి మణి = topaz
·మరకతం = పచ్చ = emerald
·నీలమణి = sapphire
వీనిని నవరత్నాలు అంటారు. విలువైన రాళ్ళను ఒక్క మన దేశమందు తప్ప ఎ దేశములోనూ
ఇంత తీక్ష్ణమయిన పరిశీలన , పరిశోధనలతో
వర్గీకరించ లేదు. ఎంతో పురాతన కాలము నుండి మనకు ఇవి అందుబాటున ఉన్నందువలననే
కదా మనము వీటి ఔన్నత్యమునులోకానికి
తెలుప గలిగినాము.ఇటువంటి వర్గీకరణ మనవారు తప్ప
మనకన్నా ముందు వేరెవరూ చెసిన దాఖలాలు లెవుకదా!
అలక్ష్యేంద్రుని (Alexander
) తరువాతనే
వజ్రములు మనదేశము నుండి పడమరకు సాగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతకు మునుపు
అవి విదేశములకు పంపుట బహుశ నిషిద్ధింపబడి యుండవచ్చునని నిపుణుల భావన. కొందరు
చరిత్ర పరిశోధకులు ధన వంతులు
రాజవంశీకుల తప్పులకు వజ్రములను చెల్లించట పరిహారముగా ఏర్పాటు చేసినట్లు కూడా
చెప్పుచున్నారు. దీనిని బట్టి ఎ విధముగా యోచించినా కూడా మన నాగరికత యౌవ్వనములో
వున్నకాలములో ఈజిప్టు నాగరికత పుట్టినట్లు స్పష్టముగా తెలుస్తూవుంది. ఈ
గద్దవజ్రముల గనులకు ఆలవాలమని నిష్పాక్షిక చరిత్రకారుల రచనలు చదివితే ఎవరికైనా
అర్థమౌతుంది. ఒక వ్యక్తి గురువుల మూలముగా గొప్ప తెలివిమంతుడైతే వాడు సాన పట్టిన
వజ్రము అంటాము.
వాస్తవమును గమనించితే క్రీస్తుకు పూర్వమే ఎన్నో వేల సంవత్సరములనుండి మన దేశమునకాశ్మీరులో నీలాలు (sapphires) మయాన్మార్ (బర్మా) లో (బర్మా
ఒకప్పుడు మనదేశాములోని భాగమే ) కెంపులు, అత్యంత ప్రసిద్ధి గాంచినవి. కానీ వజ్రమునకు వీటికన్నా విలువ
ఎక్కువ.అసలు వజ్రం వజ్రేనా భిద్యతే అన్నారు పెద్దలు . వజ్రాన్ని వజ్రమే
భేదిన్చాగాలదట. అంటే వాజరమెంత గట్టిదో గమనించండి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే
వజ్రాలకు పెన్నా తీరము ప్రసిద్ధికెక్కినది . కడప జిల్లాలోని కోడూరు రాజంపేట
ప్రాంతాలలో విరివిగావజ్రాల
గనులుండేవట. కృష్ణ గోదావరి పరీవాహక ప్రాంతములందు కూడా వజ్రాల
గనులుండేవట.గుంటూరు జిల్లాలోని కల్లూరు లో అత్యంత పెద్దదియైన వజ్రాలగని ఉండేదట.
అత్త సొత్తు అల్లుడు దానము చేసినట్లు ఆసంపదను నిజాము నవాబు ఆంగ్లేయులకు ధారా
దత్తము చేసిన, లేక వేరు విధములుగా కూడా పరాయి
దేశముల పాలైన , ప్రపంచములోని అత్యంత విలువైన
వజ్రములలోని అధికాంశము, మన దేశపు వజ్రములుఏఏ దేశాలలో వున్నాయో
తిలకించండి. (గూగుల్ సౌజన్యముతో )
·Koh-i
Nūr (186ct) - in the British Crown Jewels, London
·The Great
Mogul Diamond (787ct) - Lost after Nādir Shāh sacked Delhi
·The Pitt
or Regent Diamond (410ct) - in the Apollo Gallery, Louvre
Museum, Paris
·The Orloff
Diamond (300 ct) - in the Diamond Treasury, Kremlin, Moscow
·Nizām
Diamond (340ct) - in the Nizām's Treasury, Hyderabad
·Daryā-ye
Nūr (182 ct) - in the Iranian Crown Jewels, on display:Central Bank
of Iran,Tehran
·The Hope
Diamond (67ct) - in the American Museum of Natural History, theSmithsonian
Institution, Washington
·The
Golconda (135ct) - belonging to Dunklings Jewellers, Melbourne, Australia.
·The Kolluru
Diamond (63ct) - Purchased by Tavernier and present location unknown.
·Dresden
Green Diamond (41 ct) - "The New Green Vault" in
the Staatliche Kunstsammlungen Dresden.
పశ్చిమాఫ్రికా లోని కిమ్బర్లి లో ఉల్కా పాతముల కారణముగా వజ్రములు అగుపించే
వరకు అత్యధిక వజ్రసంపద మన దేశామునదే. నేడు అత్యంత వజ్రసంపద గలిగిన 10 దేశములలో కనీసము ఒకటిగా నైనా
మనదేశము లేదు.
దాదాపు 1000 సంవత్సరముల మహమ్మదీయ, క్రైస్తవ పరిపాలన తరువాత రత్న
గర్భయైన మనదేశము అగర్భ దరిద్ర దేశముగా క్రైస్తవ చరిత్రకారులు మనకు పట్టము
కట్టినారు. అసలు వాస్కోడగామా హిందూ మహాసముద్రములో తానూ తెచ్చుకోన్ననావలలో చావు
బ్రతుకుల నడుమ ఆ మార్గమున పోవుచున్న తన నావకన్నా 10 రెట్లు పెద్దదయిన నావలో పోవుచున్న గుజరాతీయ వ్యాపారిని దేహీ
యంటే అతనికి ప్రాణ భిక్ష యొసగి మనదేశాములోనికి తెచ్చినాడన్నది పాశ్చాత్య
చరిత్రకారులు మరుగు పరచినవాస్తవము. ఆతరువాత మనదేశామునకు 4 మార్లు వచ్చి మన సంపద
కొల్లగోట్టుకొని పోతూ చివరిసారిగా సముద్రములోనే మరణించినాడట. 13 వ శతాబ్దములో మార్కోపోలో మొదలు
౧౭ వ శతాబ్దములో హెన్రీ హోవార్డ్ వరకు మన దేశమును సందర్శించి (వారి స్వలాభామునకే
సుమా!) దేశములోని వివిధ ప్రాంతములలో వజ్రాల గానులున్నట్లు తెలిపినారు. సంయుక్త
ఆంధ్ర దేశములో కృష్ణ,గుంటూరు, కడప, అనంతపురము, కర్నూలు,మహబూబ్ నగరులలోను, మధ్య ప్రదేశ్ లోని పన్న
ప్రాంతములోను వజ్రఖనులు ఉండినవని mapsindia.com తెలియబరచుచున్నది. గోలుకొండ కాకతీయుల రాజధానిగా 'మంగళ వారము ' అన్న పేరుతో ఒకప్పుడు శోభిల్లు
చున్నపుడు ఈ రాష్ట్రము యొక్క రత్నకోశముగా కొనియాడబడినది. అటుపిమ్మట నిజాము నవాబుల
హస్తగతమై రత్నములకు బదులుగా మనకు రాళ్ళు మిగిల్చినది నిజాములు మన కనులముందుంచిన
నిజము. Diamonds In
The Deccan an overview by S.V.Satyanarayana అన్న పుస్తకము మీరు చదవగలిగితే
ఇంకా వాస్తవాలు తెలుసుకొన వచ్చు.
Published on Oct 2, 2013
Diamonds are thought to have been first recognized and mined in India,
where significant alluvial deposits of the stone could be found many centuries
ago along the rivers Penner, Krishna and Godavari. Diamonds have been known in
India for at least 3,000 years but most likely 6,000 years.
ఈ సందర్భములో మన సంపద ఎంత
విదేశీయుల చేతులలోకి పోయింది,
అన్న
విషయమును తెలుసుకొని కోహినూరు చేతులు మారిన
విషయమును ఆకళింపు జేసుకొందాము.
కోహినూరు
వజ్రం... మయూర సింహాసనం, శివాజీ ఖడ్గం, హౌప్ వజ్రం,
తైమూరు
చక్రవర్తి కెంపుల హారం (మన దేశ సంపదను కొల్లగొట్టి గ్రహించినదే)
బర్డ్ ఆఫ్
ప్యారడైజ్,ఇలా అనేక మన వారసత్వ సంపదలు దేశం వీడి ఏళ్లు
గడిచినాయి. చాలా వరకూ విదేశాల్లో, మ్యూజియాల్లో దర్శనమిస్తుంటే
మరి
కొన్ని మహారాణుల వగలకు బలియై నగలలో పొదగబడి అంటే బంధింపబడి
మూలుగుతూ మన
కనుమరుగైపోయినాయి. ఇవన్నీ మనవే అని యావత్
ప్రపంచానికి తెలిసినా, ఎప్పటిెకైనా
అవి మన దేశానికి రాకుండా పోతాయా
అంటూ ఆశావాదుల్లా,కళ్ళలో వత్తులేసుకుని అసహాయులమై
నిరీక్షించడం
మినహా తిరిగి తెచ్చుకోలేని దౌర్భాగ్యము కలుగజేసిన మనమెన్నుకొన్న మన
ఘనమైన
నాయకులు మనకు చిరస్మరణీయులు.
కోహినూర్
వజ్రంభారతదేశ
చరిత్రలో కోహినూర్ వజ్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మన
కృష్ణా పరీవాహక
ప్రాంతంలో వజ్రం దొరికిన ఈ వజ్రం 14వ
శతాబ్దంలో మొఘల్చక్రవర్తి
బాబరు చెంతకు చేరింది. ఆపై షాజహాన్ తన
నెమలి సింహాసనంలో ఈ వజ్రం పొదిగించాడని...
మొఘలాయిల వారసత్వ సంపదగా
వచ్చిన ఈ వజ్రంపై కన్నేసిన నాదిర్షా 1739లో ఢిల్లీపై
దండెత్తి నాటి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాను ఓడించి... కోహి నూర్
వివరాలు
కనుక్కుని కోహినూర్ అని అప్రయత్నంగా అన్నా డని...దీంతో ఆ
పేరే దానికి స్థిరపడి
పోయిందని చరిత్రకారులు చెబుతారు. నాదార్షా
ఎత్తుకుపోయిన ఆ వజ్రం 1747లో కుర్దిష్
తెగలపై ఆయన దాడులని
ప్రతిఘటించిన సొంత అనుచరగణం చేతిలో కన్ను మూయగా, వారి
ద్వారానే
18వ దశకంలో మన దేశంలోని షాజా అనే రాజుని చేరింది.
అయితే
షాజాని బందించిన కాశ్మీర్ రాజును ఓడించినందుకు ప్రతిగా, షాజా
భార్య
లాహౌర్ మహారాజు రంజిత్సింగ్కు అందచేయగా, ఆయన తన
చనిపోవుట జరిగింది. అయితే అప్పటికే ఈ
దేశంలో బ్రిటీష్ పాలకుల
దాష్టీకాలు ప్రారంభమై అపార సంపదని తమ దేశానికి
తీసుకుపోవటం
ప్రారంభించైనా దరిమిలా వారి కళ్ళబడ్డ కోహినూర్ను ఏప్రిల్ 6 1850న
హెచ్ఎంఎస్
మీడియా నౌక ద్వారా బొంబాయి తీరం నుండి ఇంగ్లాడుకు ఎన్నో
ఒడిదుడుకుల నడుమ
తరలించుకుపోయిన వీరాధివీరులు. అత్యంత
విలువైన ఆ వజ్రం బ్రిటీష్ మహారాణి కిరీటంలో
చోటు దక్కించుకుని నేడు
అత్యంత భద్రతతో సందర్శకులకు కనువిందు కలిగిస్తూ...
సేదతీరుతోంది.
ఈ విధంగా మన
దేశమునుండి కొల్లగొట్టబడిన వజ్ర సంపదప్రపంచములోని నలు మూలలా 20కి పైగా
దేశాల్లో ఉన్నాయని తెలియవస్తూవుంది. ఇవి కాకుండా లాహోర్
మహారాజు షేర్సింగ్
నిత్యం ధరించే పచ్చలబెల్ట్, రీగల్కిరీటం, తైమూరు
కెంపుల
హారం, గోల్డెన్ మహారాజా డైమండ్గ ఇలా ఎన్నో బ్రిటన్లోని
విండ్గసర్ క్యాజిల్లో
కనిపిస్తాయి.ఇన్నిపోయినా చీమ కుట్టినట్లయినా లేని మహనీయులు
మనదేశ ప్రథమ
ప్రదానిగారు. వారి వారసులకు ఎన్నో దశాబ్దాలు పట్టముగట్టి వారి ఋణము
తీర్చుకోన్నాము.
ఇక ఇంతటితో ఈ ఈ పూర్వ
వైభవమునకు నమస్కరించి, మన
నెహ్రు గారు అప్పటి
అమెరిక రాయభారి గాల్ బ్రేత్ గారితో అన్న ' I am the
last British Ruler of India' అన్న
వారి అమూల్యమైన మనసులోని మాటకు నమస్కరించి మన పూర్వుల వైభవమును
చాటే వేరొక
శాస్త్రమును చూద్దాము.
Comments
Kiran Mvaఅద్భుతమైనవివరణ. మన వైభవమును గూర్చి పూర్తిగా తెలియని
నేటి తరం యువతకు మీ series ఒక eyeopener. Thanks for sparing so much time and sharing the greatest
knowledge sir. We should save this great treasure of information. Please think
of getting all this information published sir. We will all join in this great
yajna.,
Viswakarma’s son, Nala built the Rama Sethu, the
bridge from Rameswaram in Tamil Nadu to Mannar, Sri Lanka, at Sri Rama’s
request. Rama and Vyasa called
this the Nala Sethu. Nala was a second cousin of Hanuman, through his father
Kesari.
(An
Ancient Hanuman temple
from the Pandava Age survives till today. It is situated near Baba Kharak Singh
Marg, New Delhi, near Janthar Mandir. The reason it was not destroyed by the
Muslim invaders, is because there is the symbol of the crescent moon on the
Vimana.)
మిగిలినది భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 12 లో.....
భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 12
శరీర శాస్త్రము (human physiology) -- ఆయుర్వేదము
For thousands of years, physicians relied heavily on a single treatment for hysteria, heart disease and just about every other malady: bloodletting. The theory behind the practice changed often over time, but the practice itself remained much the same -- with doctors often bleeding patients until they were weak, pale and, sometimes, unconscious. -- Elena Conis -- June 26, 2006
Practitioners throughout Europe routinely bled patients who could afford it in efforts to prevent sickness brought on by excess food, weather changes and wounds.
By the late 1700's, bloodletting was the treatment of choice in America too -- thanks to the efforts of Declaration of Independence signer and physician Benjamin Rush.
Rush, who believed that tension in blood vessels was at the root of disease, turned to bloodletting to treat victims of Philadelphia's devastating yellow fever outbreak in 1793. He favored a quart at a time, repeated several times over several days, and claimed the treatment sped his recovery when he contracted the disease.
Later that same decade, George Washington fell ill with laryngitis, and his physicians bled him heavily, one after the other. The president gave up more than two liters of blood during the procedures and died a day later. Washington died on December 14, 1799 .
ఆయుర్వేదమును గూర్చి ఆలోచంచే ముందు అమెరికా ప్రథమాధ్యక్షుడు ఏవిధముగా మరణించినాడో గమనించండి. సులభమైన ఆంగ్లములో ఉన్నందువల్ల నేను తిరిగి తెలుగులోకి తర్జుమా చేయలేదు. నరములు కోసి రక్తము తీస్తే రోగమునయమౌతుందన్నది, దాదాపు 18 వ శతాబ్దపు అంతము వరకు వారి వైద్యశాస్త్రము చెప్పిన మాట. అంతగోప్పవాడే ఆగతి పడితే సామాన్యులు ఎన్ని వేలమంది ఈ చికిత్స తో మరణించి యుంటారో అంచనా వేసుకోండి.
ఇప్పుడు మనము శరీర శాస్త్రము (human physiology) ను గూర్చి ఒక్కమాట చెప్పుకొని వైద్య శాస్త్రమునకు పోదాము. ఋగ్వేదములో గల మంత్రపుష్పములో 'పద్మ కోశః ప్రదీకాశం హృదయంచాప్యధోముఖం 'అధౌ నిష్ట్యా వితశాంతి నాభ్యాం ఉపరితిష్టతి .....నీవారశూక మత్తన్వి పీతాభా స్వత్యణూపమా ...' నాభికి జానెడు ఎత్తులో ఎడమప్రక్క పద్మపు మొగ్గ ఆకారములో తలక్రిందులుగా గుండె యున్నది. దానికి సమీపముగా నీవార ధాన్యపు ముల్లు,దానిని మనము చూడలేదు కాబట్టి వడ్లగింజ పై ముల్లు అంత చిన్నదిగా నీలపు జ్యోతిగా వెలుగుతూ వుంటుంది అని ఉహించుకొందాము. ఆ నీలపు జ్యోతి మధ్యలో ఒక అణువు రూపములో పరమాత్ముడు నివశిస్తున్నాడు. ఆ విధంగా వెలిగే జ్యోతిని sinus node అని అంటారని ఒక doctor గారు చెబితే తెలుసుకొన్నాను. ఇంత సునిశిత పరిశీలన కలిగినవి మన వేదములు.అంతటి విజ్ఞానవంతులు మన ద్రష్టలు. దీనికి గానూ మన పూర్వులు శవములను కోసి చూసి తెలుసుకోలేదు. గూర్చి ఒక్క మాట. జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రములను గూర్చి అధర్వణ వేదము ఎన్నో విషయాలు తెలుపుతుంది.కౌటిల్యునిలాంటివారు మహా వైదికులు గనుకనే ఆ వేద సారమునకు తన మేధను జోడించి 'అర్థ శాస్త్రమును' వ్రాసినారు. ఇది నాకు తెలిసినవిషయము. వేద మదన సాధనతో వేదవిదులైనవారు ఎన్నెన్నో విషయములు లోకానికి తమ ప్రజ్ఞచే చాటవచ్చును. కాస్త ఆయుర్వేద లోకములో అడుగుపెడదాము.
ఆయుర్వేదమునకు ఆద్యుడు ధన్వంతరి.ఈయన వైష్ణవాంశ అని, క్షీరసాగర మథనములో ఈయన జన్మించినాడని మన పురాణాలు చెబుతాయి. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతన కాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.
ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.
1.భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
2.బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
3.కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దివోదాసు. కాశీ ఖండములో ఈయనను గూర్చి వివరముగా తెలుసుకోన వచ్చును. భాగవతములోని నవమ స్కందములో కూడా ")- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పినట్లు తెలియవచ్చుచున్నది.
4.విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించినాడని ఒక అభిప్రాయం.
Early in The Mahabharata, there is a story about how the hundred Kaurava brothers came into being. Gandhari became pregnant naturally from her husband Dhrutarashtra. However she did not deliver a child even after two years passed. Therefore, burning with anger, Gandhari aborted her foetus. In fact it was not a foetus, not a developed child; but a mole, a mass of living cells having no shape like a human child. As soon as the sage Vyasa heard about her abortion, he came immediately, took the aborted cell mass in possession and divided that mole. Sage Vyasa dissected the mole carefully and found out normal living cells, which he kept separately in Ghruta Kumbha. Ghruta Kumbha does not mean an ordinary pot of clay, filled with Ghee. ‘Ghruta’ means a nutrient medium supplying life energy, which was kept in a special Kumbha, a highly sophisticated urn. There were 101 cells and those cells were grown separately in Ghruta Kumbhas or nutrient urns. In due course children were born, 100 Kaurawas and their sister Dusshala. (Mahabharata, Adi, 115) Sage Vyasa relied on the principle of ‘Chamasa division’ (Division of Living cells), laid down by Rubhus brothers in the Rigveda and worked further to give birth to 100 Kaurawas. Following Vyasa the modern scientists must work on the principles stored in the Rigveda and other ancient literature, so as to produce new miracles. Many experiments on Test-Tube babies can be found in Mahatbharata’s Adi Parva. Draupadi and Dhrushtadyumna got birth from an utensil only from the semen of king Drupada. They had no mother. Drona was born from the semen of Bharadvaja, without any help of any mother. Further observations were also done in the Mahabharata period that one test tube baby Drona was married to another test tube baby Krupi and they lead normal married life producing one son Ashvatthama. Another test-tube baby Krupa was married to normal girl. This couple too behaved normally. Such an experiment has not yet been done in the modern science.
(A mole of any substance is 6.02×1023 molecules of that substance.) మిగిలినది భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 13 లో.......
భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 13
ఇక ఖగోళమును గూర్చి కొద్దిగా
తెలుసు కొందాము. మనము 'ఖగోళము' 'భూగోళము' 'అండపిండ బ్రహ్మాండము' అని ఈ విశ్వమును తలచుచున్నాము,పిలుచుచున్నాము.ఈ మాతలనుఎన్నొ
మహాయుగాలుగా వాడు చున్నాము.అసలు ఒక మహా యుగమంటేనే 43,20,000 సంవత్సరములు. 3000 సంవత్సరముల క్రితము వరకు నాగరికత అన్నదితెలియని పాశ్చ్యాత్య
ప్రముఖులు మొదట భూమి బల్లపరుపుగా వున్నదని నమ్మి నమ్మించినారు. నమ్మని వాళ్ళ తలలు
నరికినారు.ప్రాణ రక్షణ లేని దశలో భూమి గుండ్రముగా వున్నదని 16 శతాబ్దములో చెప్పిన కోపర్నికసు , తనను తాను కాపాడుకోనుచు 1543 లో, తన 70 వా ఏట మరణించినాడు. ఆదేనాడు
అతను వ్రాసిన"Six Books Concerning the
Revolutions of the Heavenly Orbs," కూడా
విడుదలైనది. ముందు ప్రచురించితే చంపుతారన్న భయముతో అతను మిన్నకుండినాడు.
భాస్కరాచార్యులు ఇదే విషయాన్ని క్రీస్తు పూర్వమే ఎన్నో వందల సంవత్సరాల ముందు
భూమ్యాది గ్రహములు తమ తమ కక్ష్యలలో రెండు అతి పెద్ద అయస్కాంత దిమ్మెలమధ్య నిలచిన
పెద్ద లోహపు గోళముగా అభివర్ణించినాడు. మన ఖగోళ శాస్త్రజ్ఞుల గొప్పదనము ఒకసారి
గమనించండి.సూర్యుడు తిరుగుట లేదు ఆయన స్థిరుడు అని తెలిసియే మన పూర్వులు ఆయనను 'సూర్యనారాయణుడు' అన్నారు.ఆయన ఒక్కడే ఒకచోటే
ఉంటాడు కానీ ఆ ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుతూ ఉంటాడు. ఆయన లేని
చోటు లేదు. ఆయన చుట్టూ గ్రహాలూ పరిభ్రమించుతూ వుంటాయి అన్నది తెలిసి కూడా గణిత
సౌలభ్యము కొరకు భూమిని కేంద్రముగా తీసుకొని సూర్యుని తో సహా మిగత గ్రహ స్థానములను
నిర్ణయించినారు. దీనిని 'విలోమ గణన'అని అనవచ్చు. ఈ క్రింది శ్లోకము
గమనించండి. గ్రహ స్థానములు, గ్రహములపేర్లు
ఎంత ఎంత గొప్పగా చెప్పినారో మీరే అర్థము చేసుకోవచ్చు.
'మందామరేఢ్య భూపుత్ర
అర్క శుక్ర బుధేంధవః'
మంద =అతి
మెల్లగా నడిచేవాడు, శని = అతి మెల్లగా నడచేవాడు.(ఇందులో చెడ్డ అర్థమేమీ లేదు.)
పాశ్చాత్యుల Saturn కు వ్యుత్పత్తి వారికే తెలియవలె.
అమరేఢ్య= దేవ గురువు అంటే ఎవరు? బృహస్పతి.
బృహస్పతి అంటే అర్థమేమి? బృహత్+పతి= బృహత్ అంటేనే అతిపెద్ద అని అర్థము ఆ అతి పెద్దకు
పతి అంటే నాయకుడు లేక రాజు అని అర్థము. అతి పెద్ద గ్రహము బృహస్పతి (Jupiter is the biggest planet) అనే కదా చదువుతాము. మరి 'Jupiter' వారి భాషలో వ్యుత్పత్తి
చెప్పగలరా. సంస్క్రుతమును ఆశ్రయించితే మనము చెప్పగలము.ద్యోహ్ పితరః = ఆకాశమునకు
తండ్రి అంటే పెద్ద అని అర్థము.
వ్యాసము మరీ విస్తృతమౌతుందని
మిగతా గ్రహముల గూర్చి చెప్పుటలేదు. నేను మునుపు వ్రాసిన కాలగణన అన్న వ్యాసములో
అన్నీ విశధీకరించినాను. సూర్యునికి భూమికి గల దూరమును లెక్క కట్టినారు మన
పూర్వులు. ఇట్లు చెప్పుకొంటూ పొతే ఎన్నోవిషయాలున్నాయి. అవి జిజ్ఞాసువుల ఉత్సాహానికి
వదలిపెడుతున్నాను.
ఇక గణితమును
గూర్చి తెలుసుకొందాము.
"India was the motherland of our race and Sanskrit the mother of
Europe's
languages. India was the mother of our philosophy, of much of our
mathematics, of the ideals embodied in Christianity...of self-government
and
democracy. In many ways, Mother India is the mother of us all."
Will Durant, American Historian (1885-1981)
ఆంగ్లేయులే కదా మన పాలిటి శంఖము. అందువల్లWill Durant గారి మాటను
ఉటంకించినాను.
అంటే
ఆ శంఖము లోని తీర్థమును మనకు వినియోగించు చున్నాను.ఈప్రపంచము లోని గణితమునకు మూలము వేదములు, భారత దేశము. 1911- 1919 నాటి తాళ పత్ర గణిత గ్రంథములను
వెలికితీసి పరీక్షించి పరిశీలించి పరిశోధించి న మేటి పూరి శంకరాచార్య పీఠము
నలంకరించిన భారతీ కృష్ణ తీర్థులవారు.(1884-1960). బహుభాషా కోవిదులు .సంస్కృత అభిమానులు.వేదం వెంకటరాయ
శాస్త్రి గారిప్రియ శిష్యులు. నేషనల్
కాలేజి-రాజమహేంద్రి లో ప్రొఫెసరు గా పనిచేసినారు. వీరి స్వస్థలము తిరునెల్ వేలి.
వీరి ప్రస్తాపన గణితములో ఎందుకు తెచ్చినానంటే 'Vedic mathematics' అన్న పుస్తకాన్ని వారు ఎంతో
కృషిచేసి వ్రాసినారు.అది ఉత్సాహమున్నవాళ్ళుచదవవచ్చు.
అందులో ఎన్నియో గణితసూత్రములు
వున్నాయి. వారి జీవిత చరిత్ర వలయువారు google లో వికీపీడియా లో చూడ వచ్చును. ఒక బాధాకరమైన విషయమేమిటంటే 'వేదాలలో ఆ గణిత సూత్రముల
ప్రస్తాపనే లేదు . ఆ గ్రంథమునకు 'వేద' అన్న పదము secular కాదఉ పైగా స్వాములవారు
తానేదోచేసి మతప్రచారానికి వేదాల పేరు వాడుకోన్నార'నికూడా ఒక ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నమే జరిగింది. యువకులు ఇది గ్రహించ
గలిగితే ఈ వైదిక ధర్మానికి ,భారత
దేశానికీ ఎంతో మంచిది.
ఒక విషయము తెలుపుటకు దానికి
సంబంధించినదేదైనా దొరికితే మన జ్ఞానమును తర్కమును జోడించి మనము మనమాటగా
తెలుపవచ్చును. అసలు మూలమే లేకుండా ఏపని చేయ వీలు పడదు కదా.మరి ఈ కుహనా లౌకిక
వాదులకు మన సంస్కృతి పై దాడి చేయుట తప్ప వేరే పని లేదా!
అల-క్వరిజ్మి అన్న అరబ్బు
పండితుడు మనదేశ పండితులతో సంపర్కమునేర్పరచుకొని వారినుండి విధ్వత్తును గ్రహించగా
తరువాతి కాలములో ఆ విజ్ఞానము పాశ్ఛాత్యులు గ్రహించినారు. కొంతమంది మన పండితులు
వెళ్లి గ్రీసు దేశానికి జ్ఞానభిక్ష పెట్టినారు.(india in Greece by pococke). ప్రపంచములోని మొదటి
విశ్వవిద్యాలయమైన తక్షశిలలో చైనా జపాను గ్రీకు రోము ఈజిప్టు,సిరియామొదలగు ఎన్నో దేశవాసులు
వచ్చి చదివేవారు.అన్నీ పోగొట్టుకొన్నాము విదేశీ దండయాత్రలవల్ల. ఎంతో కౄరముగా
కొన్ని లక్షలమంది మన పూర్వీక స్త్రీలను చెరపట్టి
బలవంతముగా బెదిరించి
పుట్టించుకొన్న పిల్లల పిల్లలు ఇప్పుడు తమతమ మతగ్రంధాలను వల్లె వేస్తూ భారతీయులకు
జ్ఞానబోధ చేస్తున్నారు.దయ్యాలు వేదాలను వల్లించటమంటే ఇదేనేమో!ఇవన్నీ ఎందుకు
చెబుతున్నానంటే ఇప్పటికైనా మన దేశమును, మన ధర్మమును, మన
పూర్వులను వారి ప్రతిభలను తెలుసుకొని నడుచుకొంటే ఎంతో ఉన్నతి సాధించవచ్చు.
విషయము నుండి చాలా దూరము వచ్చి
వేసినాము.ఇక విషయము లోనికి వస్తాము.
నేను గణితము లోని ఒక చిన్న
ఉదాహరణ మీ కు తెలియబరచుచున్నాను. బహుశా మీలో చాలా మందికి తెలిసి కూడా ఉండవచ్చు.55^2= 3025. మామూలుగా చేయాలంటే 55x55 వేసి మనకు బాల్యములో నేర్పించిన
పద్ధతి లోమోదట 5 తో హెచ్చించితే 275 వస్తుంది . మరుల హేచ్చించితే 275 వస్తే దీనిని మొదటి దాని పదుల
స్థానము క్రింద వేసుకొని అంటే 275+2750 అని ఉహించుకొని కూడితే 3025 వస్తుంది. అదే వేదగణిత విధానములో 5x5=25. తరువాత పదులస్తానములో వుండే ఒక 5 కు ఒకటి కలిపి మిగిలిన 5 తో హేచ్చించండి. అంటే 5x6=30. కావున జవాబేమిటంటే 3025. ఎంత సులభమో చూడండి.మీరు ఆ
పుస్తకమును శ్రద్ధ తో చదివితే గణితమును ఎంత అభిమానించుతారో!
అసలు pi యొక్క విలువ తెలుపుటకు ఈ చిన్న
శ్లోకమును ఎట్లు ఉపయోగించినారో మన పూర్వులు చూడండి. గమనించండి.
గోపీ భాగ్య మధువ్రాతా శృంగిసో
దధి సంధిగా
ఖల జీవిత ఖాతావా గళ హాలరసంధరా
ఈ శ్లోకమునకు బాహ్యమైనఅర్థమును ఒకసారి గమనించండి.
మీరు గమనించే ముందు నా
అనుభవమును చదవండి. ఈ శ్లోకముGoogle లో ఎన్నో చోట్ల లభించుతుంది. కానీ ఒక చోట కూడా దీని సరియైన బాహ్య భావార్థమును
మనము పొందలేము. అసలు దీని బాహ్యార్థము ఏమిటంటే
1. గొపీ భాగ్య
మధువ్రాతా: గోపికల సౌభాగ్యమను మధువును గ్రోలే తుమ్మెదా!మధువ్రతము అంటే తుమ్మెద. మధువ్రాతా అంటే తుమ్మెద వంటివాడా! అని అర్థము మరియు
అన్వయము.
2. శృంగిసోదధిసంధిగా:
ఇది శివుని గూర్చిన స్తుతి. శృంగి అన్న మాటకు కొమ్ము అన్నది అర్థము. ఇక్కడ
పరమేశ్వరుని జటలు ఒక కొండె రూపములో చుట్టబడి అది కొమ్మును తలపింప జేస్తుంది. ఆ
శృంగిలో'ఉద ధి' అంటే
సముద్రము కాదు ఇక్కడ. ఉదకము అనగా నీటిని కల్గినది అంటే గంగా దేవిని, ఆమాటకొస్తే అన్ని సముద్రముల నీరు కలిసినా అదియంతా గంగమ్మ తల్లే కదా! సంధిగా
అంటే బంధించిన వాడా! అంటే పరమేశ్వరా! అని అర్థము.
౩. ఖల జీవిత ఖాతావా : ఖాతము
అన్న సంస్కృత పదజన్యమే'ఖతం' అన్న ఉర్దూ
పదము. అంటే ముగించే వాడా! ఎంతో మంది దుష్టులను దానవులను దునుమాడినవాడగు శ్రీ
కృష్ణుడా!.
4. గళ హాల
రసంధరా: గొంతునందు హాలాహాల రసము ధరించిన వాడా! అంటే శంకరా! కాపాడుము అన్నది
అన్వయము.
ఈ భావమును నేను తెలుసుకొనుటకు
సహకరించి నా సందేహములు తీర్చినశ్రీయుతులు గొట్టిముక్కల
సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కృతజ్ఞతలు.
రెండు పంక్తులలో ఒక అర్థవంతమైన
శ్లోకమును వ్రాయుటయే ఎంతో కష్టము. ఆ గొప్పదనము దేవ భాషయైన సంస్కృతమునకే చెందవలెను.
ఇక దానిలో గణిత పరమైన అర్థమును కూడా వ్యక్తీకరించుట ఎంత కష్టమైనదో మాటలకు అందని
విషయము.
ఈ విధంగా శ్లోకములో ఒక
విషయాన్ని నిగూఢముగా చెప్ప వలసి వస్తే ఆ శ్లోకము బయటికి సంపూర్ణ భావ భరితమై
యుండదు. ఇందు నిగూఢార్థమునకే ప్రాధాన్యత .
హల్లు
సంఖ్య
క, ట, ప, య
1
ఖ, ఠ, ఫ, ర
2
గ, డ,బ, ల
3
ఘ, ఢ,భ, వ
4
జ్ఞ,ణ,మ,శ
5
చ,త,ష
6
ఛ, థ,స
7
జ,ద,హ
8
ఝ,ధ
9
ఞ్,న
0
ఈ విలువలను పై శ్లోకములో
సంధించితే మనకు pi/10 =3.1415926535897932384626433832792.
వస్తుంది .
నేను భారతీయ విజ్ఞానము అన్న
అంశము పై తోచింది వ్రాసినాను. నేటి యువతలో, ఎంతమంది చదువుటకు ఇష్ట పడుతారో,ఎంతమంది అసలిష్టపడరో, చూచీ చూడకనే like కొడతారో, అసలే చూడరో నాకు నిమిత్తము
లేకుండా వ్రాస్తూవున్నాను. నా ఆశ, అత్యాశకాదనే,అనుకొంటున్నాను. యువత తెలుగు
భాష నేర్చుకోవటం, మన సనాతన ధర్మము లోని మర్మమును
తెలుసుకోవడం, మన ఋషులను గూర్చి తెలుసుకొని
గౌరవించటం, మన భారతీయతకు పునర్వైభవము
కలిగించటం ఇది నా ధ్యేయం. నా ధ్యేయం మంచిదనిపిస్తే , చదివి మన సంస్కృతి గొప్పదనము తెలుసుకొండి. లేదు అంటే
మిమ్ములను కాదనేవారు ఎవరూ లేరు.
కాస్త మన 'నేత'ను గూర్చి తెలుసుకొందాము. నేత
అంటే మనకు నాయకులై దేశ ప్రగతికి వినాయకులై , ధన మదములకు విధాయకులై, స్వార్తపరత్వమే కలుగు మాయకులై (మోసగాళ్ళయి), పరదేశ విభవ గాయకులై, దేశాన్నిదోచుకోనేవారిని గురించి
కాదు, 'నేత పరిశ్రమను' గూర్చి చెప్పదలచుకొన్నాను.
సనాతనమని పాశాత్యులచే పదే పదే
చెప్పబడే నాగరికత లోని నాగరీకులు చర్మములచే శరీరము కప్పుకోను కాలమునాకు ఎన్నో వేల
సంవత్సరములకు పూర్వమే నేత వలువలను ధరించిన సంస్కృతీ జగజ్జేతలు భారతీయులు. 'అగ్గి పెట్టెన ఆరుమూడు(6+3=9) గజాల చీరను అమరజేసిన అద్భుతంబగు
నిపుణతలనిల అందజేసిన నేర్పరులు మన ఆర్యభారత(ప్రశస్త భారత) భారతీయులు.' ఈ నేత పనితనమును నేలమట్టము జేసి
ఈ 'నేత పనికి' నేతలమని చెప్పుకొనే బ్రిటీషు
క్రూరుల గురించి Dan
Nadudere గారి
పుస్తకము చదివితే తెలుస్తుంది. అందులో ఒక వాక్యము ఈ విధంగా వుంది.
"It was by
destroying the Indian textile industry that the British textile industry ever
came up at all."
వీలుంటే బ్రిటీషు
చరిత్రకారుడైన Michail wood అందజేసిన 'The Story of India' అన్న పేరుతో మన దేశములో BBC ప్రసారము చేసిన దానిని
ఇప్పుడు PBS అమెరికా లో ప్రసారము చేస్తున్నారని విన్నాను.నేను చూడలేదు చూడలేను. అవకాసము
వున్నవాళ్ళు చూసి సాటి సభ్యులతో పంచుకోగలరు.మన వేదములకు తనదైన శైలిలో
వక్రభాశ్యములు చెప్పిన /వ్రాసిన మాక్సుముల్లరు గారి ఈ మాట వారి భాషలోనే
చిత్తగించండి.
"If I
were asked under what sky the human mind has most fully developed some of its
choicest gifts, has most deeply pondered on the greatest problems of life, and
has found solutions, I should point to India." Max Mueller