పులగము (పొంగలి)
From Janardhana Sarma’s blog Vibhaataveechikalu
ముద్గాన్న నైవేద్యము ఈ ధనుర్మాసములో మహా విష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [ పెసర పప్పుతో
చేసిన పులగము ] దీని గురించి ’ ఆగ్నేయ పురాణము ’ లో ఇలాగుంది , || కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |
సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి || " ధనూరాశిలో సూర్యుడుండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన
మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు " అని వివరిస్తుంది ఈ నైవేద్యమును
పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము , " బియ్యమునకు సమానముగా పెసర పప్పును
చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు
ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే , బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు
చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను.
ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము , బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. " అంతే
కాదు , ’ పెసర పప్పు , పెరుగు , అల్లము , బెల్లము , కందమూలములు , ఫలములతో కూడిన పులగమును భగవంతునికి
సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహా విష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా
ప్రసాదిస్తాడు ’ అని పురాణము తెలుపుతుంది. అందుకే , ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [ పొంగల్ ]
తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై , ఆయన
కృపకు పాత్రులు కాగలరు.
From Janardhana Sarma’s blog Vibhaataveechikalu
ముద్గాన్న నైవేద్యము ఈ ధనుర్మాసములో మహా విష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [ పెసర పప్పుతో
చేసిన పులగము ] దీని గురించి ’ ఆగ్నేయ పురాణము ’ లో ఇలాగుంది , || కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |
సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి || " ధనూరాశిలో సూర్యుడుండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన
మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు " అని వివరిస్తుంది ఈ నైవేద్యమును
పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము , " బియ్యమునకు సమానముగా పెసర పప్పును
చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు
ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే , బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు
చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను.
ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము , బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. " అంతే
కాదు , ’ పెసర పప్పు , పెరుగు , అల్లము , బెల్లము , కందమూలములు , ఫలములతో కూడిన పులగమును భగవంతునికి
సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహా విష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా
ప్రసాదిస్తాడు ’ అని పురాణము తెలుపుతుంది. అందుకే , ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [ పొంగల్ ]
తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై , ఆయన
కృపకు పాత్రులు కాగలరు.
No comments:
Post a Comment