Wednesday, 23 September 2015

गुरु ब्रह्म गुरु विष्णु गुरु देवो महेश्वरः 
गुरु साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः 
अखंड मंडला कारम व्याप्तं येन चराचरम 
तत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः


బేంకంటే బేంకు స్టేటు బేంకురా .....

https://cherukuramamohanrao.blogspot.com/2015/09/blog-post_23.html

ఇంచుమించు 40 సంవత్సరాలు నాకు నా కుటుంబానికీ అన్నం పెట్టి పోషించిన తల్లి 

కాని తల్లి SBI ని గురించిన నా కృతజ్ఞత మీతో పంచుకోవాలని అనిపించింది. అందులొ 

భాగమే ఈ ప్రయత్నము.

అవి నేను తిరుపతి ప్రాంతీయ కార్యాలయములో అధికారులలో (Officers) ఒకనిగా పని 

చేయుచున్న రోజులు. అప్పుడు శ్రీ శంకర్ నారాయణన్  గారు మా ఉప మహా 

నిర్వహణాధికారిగా(Dy. General Manager) ఉండేవారు. ఆయన తమిళుడై యుండి 

కూడా తెలుగుపై అమిత అభిమానమును చూపేవాడు. ఒకసారి తిరుపతికి కరుణశ్రీ 

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావటం తటస్థించింది. మాడుగుల నాగ ఫణి శర్మ గారు 

గురుతుల్యులైన వారిని అనుసరించి యుండినారు. అప్పుడప్పుడే శర్మగారు 

అవధానములు మొదలుపెట్టి కూడా యుండినారు.  మా DGM గారు నా మిత్రులైన బాల 

కృష్ణా రెడ్డి గారిని, నన్ను పిలిచి వారితో ఉపన్యాసము ఇప్పించితే బాగుంటుందన్నారు. 

రెడ్డిగారు స్థానికులు తెలుగు హిందీ లో స్నాతకోత్తర పట్టా  పుచ్చుకొన్నవారు. వెంటనే 

ఇరువురము వారిరువురి వద్దకు వెళ్లి నొప్పించక మెప్పించి ఒప్పించి మా 

కార్యాలయమునకు ఆహ్వానించినాము. శర్మ గారు  కరుణశ్రీ గారిని గూర్చి ఎంతో 

హృద్యంగమముగా మాటలాడినారు. తరువాత శాస్త్రిగారు యువకుడైన శర్మ గారి 

ప్రతిభను గూర్చి తెలుపుతూ ఆయనను ఆశీర్వదించి తనకిష్టమైన పోతన్నను గూర్చి చెప్ప 

మొదలుపెట్టినారు.  ఆనందాతిరేకముతో నిండిన కరతాళ ధ్వనుల మధ్య తన 

ఉపన్యాసమును చాలించిన వెంటనే ఇరువురిని గూర్చి మాట్లాడిన వక్తలలో నేనూ 

ఒకడిని .  మనలో మన మాట నాది వందన సమర్పణమే లెండి .వారిని గూర్చి చెరియొక 

పద్యము వంతున ఈ విధముగా చెప్పినాను. మీ కోసం ఈ దిగువన :

సుందరమైన శైలి బహు సుందరమైనటువంటి భావముల్

విందును గూర్చె వీనులకు విస్మృతినొందగ మేను చిత్తమున్

వందన మొండు దక్క మరి వారికి నేమియు నివ్వలేక, మే

మందర మొక్కటై నిలిచి యర్చి భజించితిమాత్మసాక్షిగా

శ్రీధర మూర్తులౌ కరుణ శ్రీయుత పాపయ శాస్త్రి వర్యులున్

నాద వినోద పుష్ఠి పద నాధుడు నాగ ఫణీంద్ర శర్మయున్

మాదగు తిక్త చిత్తముల మాధురి నింపిరి పెంపు మీరగన్

చేదగు కాఫి పౌడరుకు చేర్చిన చక్కర వేడి పాలుగన్

వ్యక్తిగతంగా శాస్త్రి గారి ఆశంసనములు శర్మ గారి అభినందనలు సభ ముగిసిన పిదప 

నాకు దక్కిన బహుమతులు.

రెండు రోజులతరువాత మా DGM గారు రెడ్డి గారిని, నన్ను పిలిచి మీరు  ఒక భాషా 

సమాఖ్యను మన Bank తరఫున ఏర్పాటు చేయకూడదా అన్నారు. రాజు తలచితే దూషణ 

కైనా భూషణ కైనా కొదవ లేదు కదా! రెండు రోజులలోనే 'భావన' అన్న పేరుతో  తెలుగు 

భాషా సమితిని ఏర్పాటుచేసి , రెడ్డిగారు బదిలీ అయిన పిదప TG రామకృష్ణ గారు నేను 

కలిసి , రామ కృష్ణ గారు కూడా బదిలీ అయినతరువాత నేనొక్కడనే అవిశ్రాంతముగా 

నడిపినాము. తరువాత భావన భాస్వరము పాలైపోయినది.

ఆ మద్య కాలములో ఒకసారి నేను DGM గారి వద్దకు పోవుట జరిగినది. ఆయన ఎంతో 

అభిమానముతో ఏమైనా వ్రాసినారా అన్నారు. సర్, నేను మన Bank ని గూర్చి ఒక పాట 

వ్రాసినాను అన్నాను. ఆయన అది వినకుండానే ఒక కాగితము పై వ్రాసి నాకు ఇవ్వండి

నేను మధ్యాహ్నము వాయుయానమున హైదరాబాదు పోవుచున్నాను మీ పాట మన 

'Circle News Bulletin' లో ప్రచురింప జేయించుతాను అన్నారు. అంతవరకూ నా రాత 

(తలరాత ) నే రాతల పత్రిక లంట నివ్వలేదు. వారడిగినదే తడవుగా నేను చేతులు పిసుకు 

కొంటూ వుంటే ఆయనే తెల్ల కాగితమిచ్చి వ్రాయమన్నారు. వ్రాసిన పిదప 

చదువమన్నారు. చదివిన వెంటనే bank ని గురించి కూడా ఇంత బాగా పాట 

వ్రాయవచ్చునా అన్నారు. సర్, ఆధునిక కవిత్వానికి ఆద్యులలో ఒకరైన శ్రీ శ్రీ గారే 'కాదేదీ 

కవిత కనర్హం' అన్నారు అని అన్నాను. నవ్వి ఆ కాగితము భద్రముగా తన BRIEFCASE 

లో వుంచుకొని ఇక పోయి రమ్మన్నారు.

రెండు రోజుల తరువాత వారు హైదరాబాదునుండి వచ్చి తిరిగి ఆసనమునందాసీనులై 

నాకొరకు పిలువనంపినారు. నేను వారి వద్దకు వెళ్ళిన వెంటనే MAGAZINE నా చేతిలో 

ఉంచినారు.  హైదరాబాదులో కూడా చాలామంది బాగున్నదన్నారండి.  MAGAZINE 

editor ఇప్పుడే latest magazine ప్రింట్ కు పోయి వస్తూవుంది మీకు copy కూడా 

ఇచ్చిపంపుతాను అని అంటూ ఉండగానే Messenger అందించిన రెంటిలో ఒకటి  నా 

చేతికి ఇచ్చి పంపినారని  పత్రిక నాచేతికి ఇచ్చినారు. నా ఆనందమునకు అవధి లేదు. 

ఆయను కృతజ్ఞత సమర్పించుకొని ఆనందాతిరేకము తో నా కుర్చీని చేరుకొన్నాను. 

వారు ఆనతి కాలములో transfer అయి తరువాత వచ్చిన వారు కూడా transfer అయిన 

తరువాత కొంత కాలము శ్రీ భండారు రామ చంద్ర రావు గారు DGM గా officiate 

చేయవలసి వచ్చినది. వారికి సాంస్కృతిక విషయముల పై మక్కువ ఎక్కువ. 

అనుకోకుండా అప్పటి HYDERABAD CIRCLE Chief General Manager శ్రీ K.S. 

పురోహిత్ తిరుపతికి వస్తున్నారన్న కబురు వారికి అందింది. వారు నన్ను అప్పటి 

Official Languages Officer హీరాలాల్ కర్నావట్ గారిని పిలిపించి తెలుగులో bank ని 

గూర్చి మీరు వ్రాసిన పాట పాడండి హిందీలో కర్నావట్ గారు ఒక పాట వ్రాస్తారు అదికూడా పాడుతురుగానీ అన్నారు . కర్నావట్ గారు నేను వచనమైతే వ్రాయ గలను గానీ పాట వ్రాయలేనన్నారు . ఆశపోతును కాబట్టి అవకాశము జారవిడువలేదు. అదికూడా నేనే వ్రాస్తానన్నాను. రామ చంద్ర రావు గారు సరేనన్నారు.

ఆరోజు రానే వచ్చింది. రెండు పాటలూ నేను chorus తో కూడా పాడటము జరిగినది. 

పురోహిత గారు హైదరాబాద్ వెళ్లి అభిమాన పూర్వకముగా నా పేరున ఉత్తరము 

వ్రాయుట గూడా జరిగినది. మా DGM రామచంద్ర రావు గారు ఎంతోసంతోషించినారు

ఆజ్ఞాపకాల దొంతరనుండి హిందీ పాటది పల్లవి మాత్రమే వ్రాస్తూ తెలుగు పాట పూర్తి 

పాఠమును పొందుపరచు చున్నాను. ఇవి మనసును హత్తుకొన్న విషయములు కాబట్టి 

మరచి పోలేదు, మరచిపోలేను. అందుకే ఆప్తులుగా భావించి మీ ముందుంచుతున్నాను.

హిందీ పాటల పల్లవులు :

आप है हम सब के नेता

बात आप की कृष्ण गीता

माननीय महामहोदय

स्वागतम शुभ स्वागतम .........

हम भारतीय स्टेट बैंक वाले हैं

हम तेरे तेरे दौलत के रखवाले हैं......

అని వ్రాసినాను. రెండవ పాట మాత్రము 'హం కాలే హై తో క్యాహువా దిల్వాలే హైఁ ...... 

అన్న 'గుమ్నాం' అన్న హిందీ సినిమాలోని పాట యొక్క బాణీకి అనుకరణ. ఎక్కువ 

మంది హిందీ చదువరని తలచి పూర్తి పాఠము వ్రాయలేదు.

ఇక తెలుగు పాట :

బేంకంటే...

బేంకంటే బేంకు స్టేటు బేంకిరా

అది నీదీ నాదీ అందరిదిరా

ధనమే దాచాలన్నా ఋణమే చేయాలన్నా

మనకోసం పాటుబడే మనసుండే మనుషులున్న     ||బేంకంటే ||

చేతనున్న చిల్లిగవ్వ బేంకున జమ చేయరా

కూడబెట్టుకొన్న రూక రూపాయవుతుందిరా

ముందు జీవితాన నీవు విందు భోజనాలు చేయు

కళలు నిజాము చేసేసే కాతాలను తెరచు బ్యాంకి       ||బేంకంటే ||

కాడిగట్టి సాగుచేసి కష్టపడే రైతన్నా

కండలరగ శ్రమ జేసే ఓ రిక్ షా రంగన్నా

నీకూ నీకూ నాకు అందరికీ మేలుజేయు

పథకాలను సూచించి  ఋణ సహాయమిచ్చు బేంకి  ||బేంకంటే ||

సూటు బూటు వేసినా టక్కు టయ్యి కట్టినా

చెవికి పోగులుంచినా తలకు గుడ్డ చుట్టినా

అందరినొకటిగ జూచి  ఆదరాన చేరబిలచి

అడిగిన సదుపాయమిచ్చు అస్సలు సిసలైన బేంకి  ||బేంకంటే ||

అదండీ కథ ఇదండీ పాట.

(ఇది చదివి సంతోషించుటకే విమర్శలకు తావు లేదు.)

స్వస్తి.

Tuesday, 22 September 2015

శ్రీ శ్రీ  శ్రీ అభినవ విద్యాతీర్థుల జవాబు క్రైస్తవులకు


శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.

గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు , జగద్గురువులు :" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? " "
క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "
గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?"
క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "
గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?"
క్రై. మ. ప్ర.:" "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "
గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ? "
క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను "
గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?"
క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973 సంవత్సరాలయినాయి "
గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?"
క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "
గురువులు : మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"
క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది " గురువులు :" సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "
క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "
గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"
క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి " గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ? అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"
క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.
గురువులు :" సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?"
క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు "
గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?"
క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము. "
గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?"
క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "
గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? "
క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు "
గురువులు : " అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?"
క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు "
గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"
క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను "
గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?"
క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు "
గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?"
క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "
గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి"
క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ , చెప్పండి "
గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ? "
క్రై. మ. ప్ర.:" ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది"
గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?" జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , " మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి , || సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ || " మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.. తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు.
[ శ్రీ శృంగేరీ శారదా పీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన " శృంగేరీ పుణ్యక్షేత్రము " పుస్తకమునుండీ అనువాదము }

Monday, 21 September 2015

చేమకూర వెంకట కవి  ( చొప్పకట్ల సత్యనారాయణ గారు వ్యాఖ్యానించిన పద్యము.)

చమత్కారానికి అనేకమార్గాలు.కొందరు అర్ధంతో,మరికొందరు, శబ్దంతో,వేరొకరు అలంకారంతో, యిలాయెన్నోరీతులచమత్కారాలనుప్రదర్శించారు. నాయకరాజులయుగంలో"చేమకూరవెంకటకవి" ఉండేవాడు.ఆయనమాటకూడా చమత్కారమే! అంతగడుసుపిండం! ఆకవి,సారంగధర చరిత్ర మనే3ఆశ్వాసాలగ్రంధంవ్రాశాడు.అందులోఒకపద్యంమీకోసం,
సారంగధరుడుపావురంకోసంచిత్రాంగి యింటికివచ్చాడు.అతనిరాకకోసమేయెదురుచూసేచిత్రాంగి,అతనిమాటవినిపించుకోకుండాగబగబాపడకగదిలోకిలాక్కుపోయింది. అక్కడచాలాశృంగారచిత్రాలున్నాయి.వాటిలోఒకదాన్నిచూపిస్తూ,
ఉ: అల్లన గాధిరాజసుతు డర్మిలిమేనకముద్దొనర్ప,రా
గిల్లి కుచంబులాన గమకించుట గంటివెరాకుమార?యౌ
నల్ల నగాధిరాజసుతు డర్మలి మేనక ముద్దొనర్ప, రా
గిల్లి, కుచంబులాన గమకించుట బాల్యము గాదె భామినీ!
ఇందులో రెండుభాగాలున్నాయి.మొదటిరెండుపాదాలూ చిత్రాంగిప్రశ్న.చివరిరెండుపాదాలూసారంగ ధరునిసమాధానం.చూడవయ్యా!చూడు, గాధిరాజసుతుడు(విశ్వామిత్రుడు) మేనకయందాన్నిచూచి రాగంతోపరవసించియామెస్తనములను గ్రహింపప్రత్నించుటను చూచితివా?యన, సారంగధరుడామెయందనురక్తిలేనివాడగుట(పినతల్లియనిపవిత్ర భావము) ఔనమ్మా! నీవన్నదినిజమే! అల్ల నగాధి రాజ సుతుడు( ఆహిమవంతునికుమారుడు మైనాకుడు) అర్మిలిన్=ప్రేమతో;ముద్దొనర్ప= ముద్దుచేయగా ; రాగిల్లి= ఏడ్చుచు; కుచంబులాన= స్తనపానముచేయుటకు ప్రయత్నించుట, బాల్యముగాదె =బాల్యవశముననేకదా! యనిసమాధానం!
ఇక్కడ,మేనకావిశ్వామిత్రులశృంగారఘట్టాన్ని సారంగధరునకుజూపి,యతనినిరెచ్చగొట్టాలనిచిత్రాంగిప్రయత్నం.
ఆమాటలనేమార్చి,హిమవంతునిరాణిమేనకముద్దుసేయగా,పాలుగుడుచుటకుజూచుటనుజెప్పి,తప్పించుకొనుటసారంగధరునిప్రయత్నం.అభంగ,సభంగశ్లేష,వక్రోక్తి,ఈరెండూకలిసియీచమత్కారాన్ని ప్రతిపాదిస్తున్నాయి.

చేమకూరదే మరోపద్యం పరిశీలిద్దాం. ఇదికూడాచిత్రాంగీ, సారంగధరుల మాటలసందర్భంలోనిదే.
ఉ: నిక్కగ జూడు చిత్రమిది నెమ్మది వేడుక నోలలాడు, న
మ్మక్కల గుట్టు బట్టబయలై కనుపింపగ శౌరి కొమ్మపై
కెక్కి, రమించుచున్కి, యౌలే, మగువా! యిది చిత్రమౌట దా
నిక్కము; కృష్ణలీలగద నీ విపుడెన్నిన మార్గమంతయున్;
ఇందులో చిత్రము కొమ్మ రమించు, అనేపదాల నానార్ధల గణింపులోనేఉందిచమత్కారమంతా.చిత్రాంగిఅంటోంది" ఇదిగిదిగో యీచిత్రంచూడవయ్యా! కృష్ణుడు గోపికతో యెలారమిస్తున్నాడో?" అంటోంది.( యిక్కడ, కొమ్మ- అనేపదం ఆడదానికిపర్యాయపదం. రమించు =క్రీడించు;చిత్రం!= ఆశ్చర్యం!) దానికిసారంగధరునిసమాధానం" ఔనులే అదిచిత్రమే(చిత్రపటమే) (అతడావంకకైనాతిరిగిచూడలేదు) నీవుచేప్పినదికృష్ణలీలను గురించిగదా" అంటున్నాడు.శ్రీకృష్ణుడుగోపికలుజలకమాడువేళవారిచీరలనుగొనిపోయి,పొన్నచెట్టుకొమ్మపైగూర్చుండి పైకి రమ్మనిసరసమాడెనుగదా ఆవిషయమునుప్రస్థావించినాడు.ఈరెండవపక్షమున కొమ్మ=వృక్షశాఖ; చిత్రము=ఫొటో; రమించు= ఆటలాడు; చూచితిరాచేమకూరచమత్కారము.చిత్రాంగిగడుసుదనానికి,సారంగధరునిమాటకారి తనంతో సమాధానమిప్పించినాడు.

ఈరోజు మనమొక ప్రహేళికను పరిచయంచేసికొందాం.మనతెలుగులోపొడుపుల వంటివన్నమాట!
శ్లో: "కాచిత్ బాలా! రమణ వసతిం ప్రేషయంతీ కరండం
దాశీహస్తాత్ , సభయ మలిఖత్ వ్యాళమస్యోపరిష్టాత్
గౌరీకాంతం పవనతనయం చంపకం, చాత్రభావం
పృఛ్ఛత్యార్యో నిపుణతిలకో, మల్లినాధహ కవీంద్రహ";
అర్ధం: కాచిత్=ఒకానొక;బాలా=యువతి;కరండం=చిన్నపెట్టెను;దాశీహస్తాత్=దాశీచేతికియిచ్చి; రమణవసతిం=ప్రియునియింటికి; ప్రేషయంతి=పంపుచున్నది;అస్య=దానియొక్క; ఉపరిష్టాత్=పైభాగమందు; సభయం=భయమందుచున్న;వ్యాళం=పామును;గౌరీకాంతం=శివుని;పవనతనయం=హనుమంతుని; చంపకం=సంపెంగపూవును; అలిఖత్=లిఖించినది; ఆర్యహ=పెద్దలు;నిపుణతిలకహ=తెలివైనవారు;కవీంద్రహ=కవీశ్వరులను; మల్లినాధ=మల్లినాధుడు;అత్రభావం=ఇందలిఅర్ధమును;పృఛ్ఛతి= అడుగుచున్నాడు;
భోజునిఆస్థానానికి మల్లినాధసూరిపంపినప్రశ్నాపత్రమిది.మీలోనెవరైనదీనియర్థమును వివరంపగలరా? ఆలోచించండి! మీకుతోచకపోతే రేపుభాషాభారతిలోచూడండి!
(జవాబు రేపు వేచి చూడగలరు )

కవులకు యెప్పుడేవూహ కలుగుతుందో యెవరుచెప్పగలరు.ఒకకవికి ఒకఅందాలసుందరిని నిర్మించాలనేబుధ్ధిపుట్టింది.యెలా? ఛందోవృత్తాలతో,ఆవృత్తాతంవిందాంరండి!
మ: గతి మత్తేభము, నాసచంపక,మొగిన్ కైశ్యంబు 'కందంబు', సం
గత వాక్యంబులు' మత్త కోకిలలు' ;దృగ్వాపారమ'యుత్పల'
ద్యుతి, మో'మంబురుహంబు' దేహరుచి'విద్యున్మాల' యీమానినీ
తత వృత్తస్థితు లెన్నగాదరమె, తద్వాగ్జానికైనన్ ధరన్ ?;
మత్తేభము,చంపకము,కందము,మత్తకోకిల,ఉత్పలమాల, అంబురుహము, విద్యున్మాల, ఇవన్నీవృత్తాలు(పద్యాలు) యిందులో జాతికిచెందినకందంఒక్కటీకలిసింది.కలపకతప్పలేదుమరి.యీసువృత్తాలతోమానినీమణినిసృష్టించాడుకవి.
ఆమెగమనం మత్తేభంలాగ,ముక్కుచంపకం(సంపెంగ) లాగ, సన్నగాననున్న మేనుకందంలాగ,(ఉన్నవాటిలో కందమేచిన్నది)ఆమెమాటలుమత్తకోకిలలాగ(కోకిలకూతలవలె) కన్నులు ఉత్పలమాలలలాగ,(కలువలవలె)మోము అంబురుహంలాగ(అంబురుహం వృత్తం) పద్మంలాగ,అనిభావం.శరీరకాంతి విద్యున్మాల(మెరపుతీగె) లాగ,ఉన్నది.ఈమెయందాన్ని బ్రహ్మకూడావర్ణింపలేడేమో? నంటాడుకవిగారు.
ఇదేదో వినటానికికొంచెంయిబ్బందిగాఉన్నా,కవియూహనుమెచ్చుకోకుండాఉండగలమా? మీరేచెప్పాలిమరి!


సాహిత్య క్షేత్రంలో విహరిస్తూ ఉంటే యెన్ని వింతలు, విడ్డూరాలో! అవి మనం ఊహించలేం.అది అంతే ! కవుల ప్రతిభ! దక్షిణాంధ్ర యుగంలో మేటి చమత్కార ప్రయోగంలో ఘనాపాటి, చేమకూర వేంకట కవి యెంత చమత్కారాన్ని రంగరించాడో యీపద్యంలో చిత్తగించండి!
ఉ: చిత్తజుఁ డల్గి తూపు మొనఁ జేసిన జేయగనిమ్ము ; పైధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము ; వచియించెద కల్గిన మాట గట్టిగా ,
నత్తరళాయతేక్షణ ,కటాక్ష ,విలాస, రస ప్రవాహముల్
కుత్తుకబంటి తామరలకున్ ;ఁదలముల్కలు గండుమీలకున్;
సుభద్ర సోయగాన్నిఃవర్ణించే సందర్భం . ఆమెజగదేక సుందరి , ఆమెకళ్ళు విరసిన కమలాలు, సొరచేపల వటివి, అనిచెప్ప వలసినదానికి పెద్ద నేపధ్యాన్ని కల్పిస్తున్నాడు వెంకన్నగారు.
" ఈమాట చెపితే మన్మధుడు అలుక బూని నాపై బాణంయెక్కు పెడతాడేమో? నామీద యుధ్ధాన్నిప్రకటిస్తూ, తనరధంమీదనున్నజండా నెగరేస్తాడేమో? యేమైనా గానీ ఉన్నమాట యేదో అది అనేస్తా! ఆచంచల నేత్ర చూపులు ఆచూపులలోని రసప్రవాహములు, తామరలకు కుత్తుక బంటియౌతున్నాయి. సొరచేపలకు తలముల్క లౌతున్నాయి" అంటాడు.
తామరపూ లెప్పుడూ పీక వరకూ నీీళ్ళలోనేఉంటాయి. అవిఅలాఉండటానికి కారణం కోపమట! యెవరిమీద?సుభద్ర కన్నిలపై, ( తామరలకన్నా అందంగాఉన్నాయనిచెప్పటం) యిక సొరచేపలకు తలముల్క లౌతున్నాయట! చేపలు నీటిలో మునిగే ఉంటాయి. దానినేకవి, సుభద్ర కనులను పోలలేక, సిగ్గుతో నీళ్ళలో తలదాచుకుంటున్నాయట!
మరి యీవిధంగా తన పరివారాన్ని గురించి చెపితే యెవరికైనా కోపంవస్తుందిగదా! కోపంవస్తే పరిణామం దాడిచేస్తారు. అంటే యుధ్ధానికి రావడం. వచ్చేవారు రధంమీద జండాయెగరేస్తారు. యీయనృమీనాంకుడేగదా! యికనేం నాపరివారంగొప్పదనిచెప్పటమేగదా! యికపోతే యుధ్ధంలో బాణప్రయోగం ఉంటుంది. ఉన్నదిగదాఅరవిదం అదేనండీ పద్మం.దాన్నే వింటికి తొడగవలసి యుంటుంది. ఆవి ధంగా రెటిపగ తీర్చినట్లేగదా!( ఆమెచూపులు మన్మధబాణాలే - ఆనెక్రీగంటి చూపులు మన్మధ ధవజారోహణమే! యనిభావం)
యిక మీనాలు ప్రవాహంలోనే ఉంటాయి, పద్మాలేమో రసం- జలం లోనేకదా ఉండేది. మొత్తానికి ఆమెవాలుచూపులు శృంగార రసప్రవాహాలు, మన్మధబాణాలు. అనికవిగారి యభిప్రాయం!

********************************************************************************************************************

వృత్త సుందరి సోయగం!
శా: గతి మత్తేభము, నాస చంపక, మొగిం గైశ్యంబు కందంబు , సం
గత వాక్యంబులు మత్తకోకిలలు , దృక్పాండిత్య మయ్యుత్పల
ద్యుతి , మో మంబురుహంబు , దేహరుచి విద్యున్మాలిగా, మానినీ 
తత వృత్తస్థితు లెన్నఁగాఁ దరమె, తద్వాగ్జాని కైనన్ దగన్;
కాణాదం పెదసోమయాజి; ముకుంద విలాసం ;
కవిసమయాలతో నాయికను వర్ణించటం శ్రీనాధాదుల నుండీ మనమెరిగినదే. కాణాదంవారి వర్ణనలో భావుకత గమనింపఁదగిన విషయం. మత్తేభం . చంపకం . కందం, మత్తకోకిల ,అంబురుహం ,విద్యున్మాలి , మానినీ, అనే ఛందస్సుల పేర్లతో వర్ణించటం కాణాదం పెద్దన గారి భావుకతకు నిదర్శనం.
నాయిక మందగమన అందువల్ల మత్తేభం; ముక్కు సంపెంగ , అందువల్ల చంపకం; కందం- అంటే నలుపు. కురులు నల్లగాఉన్నాయి .అందువలన కందం; మాటలు మత్తకోకిలలట; యిక చూపులు కలువలకాంతిని తలపిస్తున్నాయి, అందువలన కన్నులు ఉత్పలాలు.(ఉత్పలమాలికలు) ముఖమేమో పద్మం - అందుకే అంబురుహం; దేహకాంతి మెఱపుతీగె- అందువలన విద్యన్మాలిక; మానినీ తత వృత్త స్థితులను ఆబ్రహ్మకుగూడా వర్ణింప నలవిగాదు. అని కవిగారు ఘంటాపథంగా చెపుతున్నారు. మరి మీరేమంటారు?

Tuesday, 15 September 2015

హేరంబా --- వందే వందే గజాననా

హేరంబా
హేరంబా యని ఆలపించెదను
అంబా సుత ఆరంభామునే
అక్షరమౌ నీ భిక్ష కొరకు
సంరక్షక చక్షుర్వీక్షణమ్మునకు
మనసేమో మరి మరిగే నీరది
నిలకడ లేకయే నీల్గుచున్నది
చిత్రమైన నీ చేతి చలువతో
చిత్తము నీపై చిత్తగించుమా            ||హేరంబా||
ఆగమ యోగామవేమో ఎరుగను
రాగభోగ సంరక్తుడను
నీపై రాగము నీ భోగమె, నా
కిహపర సాధనమిక ఇభవక్త్రా         ||హేరంబా||

వందే వందే గజాననా

వందే వందే గజాననా
గౌరీ ప్రియసుత గజాననా
హారతిగొని మాకలుషమెల్లను
హరియించుమయా హరుతనయా       || వందే వందే గజాననా ||

సకల కార్యముల కాద్యుడవీవే
సర్వ శుభములను కూర్తువు నీవే
నీదు పాదములు మదిలో నిలిపి
నిన్నే నిన్నే వినుతిన్తుమయా             || వందే వందే గజాననా ||                                    

మాతా పితరుల పాద సేవలో
మహిమమను నాదే చూపిటివి
జగతినేల్ల కాదు శీఘ్రగమనమున
చుట్టి కొమరుని ఓడగొట్టితివి                || వందే వందే గజాననా ||

కార్య నిరతి కర్తవ్య దీక్షలో
కలకాలము మము నిలుపుమయా
గరికే పోచల గంపెడు ఆకుల
పూజలందుకొని భువిని బ్రోవుమా        || వందే వందే గజాననా ||

ఆగ్రహ నిగ్రహ శక్తి యుతుడవు
అనుగ్రహించుము మాపైన
కరములు కలిపి వేడుకొందుము
కనికరించుమా కరుణాహృదయా           || వందే వందే గజాననా ||


Sunday, 13 September 2015

చాటువు - అణోరణీయాన్ మహతోమహీయాన్

 అణోరణీయాన్ మహతోమహీయాన్
“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,
హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” 
హాస్యానికి
ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార
భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి
ఆనందించండి.

“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”
పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారట.
ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.
మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి వదిలి వేసారు. వారి భావానికి తగిన విధంగా నేను పూరిస్తాను చిత్తగించండి.” అని పలికి, సరస్వతీ మాతను మనసులో ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం - - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. చూసారా! కాళిదాస కవితావైభావం. మరొక్కసారి పైశ్లోకం చదివి ఆనందించండి.

Wednesday, 9 September 2015

Health Benefits of Ragi or Finger Millet

Finger millet  also known as Ragi in India is one of the important cereals which occupies the highest area under cultivation among the small millets. The state of Karnataka is the largest producer of ragi in India. Ragi is a crop which can withstand severe drought conditions and can be easily grown throughout the year.

Nutritionally, when ragi is used as a whole grain, it is higher in protein and minerals in comparison to all other cereals and millets. It is a remarkable source of protein, making it perfect for vegetarian diets.

Finger millet contains important amino acids viz., isoleucine, leucine, methionine and phenyl alanine which are not present in other starchy meals. It has the highest amount of calcium (344 mg %) and potassium (408 mg %). Ragi is a great source of iron making it beneficial for individuals with low hemoglobin levels.

Millets also contains B vitamins, especially niacin, B6 and folic acid. Some of the health benefits of ragi are attributed to its polyphenol and dietary fiber contents. Due to its high content of polyphenols and dietary fiber ragi exhibits anti-diabetic and antioxidant and antimicrobial properties; it protects against tumors and atherosclerosis (narrowing and hardening of blood vessels). Being low in fat and gluten free, ragi is easy to digest. It is therefore, given as first foods to babies in the form of ragi porridge

Ragi for Weight Loss

Ragi contains an amino acid, Tryptophan which reduces appetite. It has a much higher amount of dietary fiber compared to white rice and other grains. It is also a low fat cereal and most of the fats are in the unsaturated form. This makes it the best choice in grains for people trying to lose weight. The bulkiness of the fibers and the slower digestion rate makes one feel fuller on fewer calories and therefore helps prevent excess caloric consumption.

Ragi for Bones

Ragi is the richest source of calcium among plant foods. Calcium along with vitamin D helps to strengthen bones. It is an excellent source of natural calcium for children and aging people. It helps in development of bones in growing children and in maintenance of bone health in adults. Thus Ragi helps to keep bone problems at bay and could reduce risk of fractures too.

Ragi for Diabetics

Regular consumption of finger millet is known to reduce the risk of diabetes mellitus and gastrointestinal tract disorders and these properties are attributed to its high polyphenol and dietary fiber content. According to research Finger Millet based diets help diabetics as they contain higher amounts of fiber over other cereals and millets. Diets based on whole finger millet have a lower glycemic response i.e. lower ability to increase blood sugar level. This has been attributed to presence of certain factors in ragi flour which lower digestibility and absorption of starch.

Ragi for lowering high cholesterol levels: Ragi contains amino acids Lecithin and Methionine which help in bringing down cholesterol levels by eliminating excess fat from Liver. Finger Millet also contains the amino acid threonine which hinders fat formation in the liver, and helps to bring down the cholesterol levels. The high fiber content of ragi also helps to manage cholesterol problems.

Ragi for Anemia

Ragi is an excellent plant source of natural Iron. Its consumption helps in Anemia. Vitamin C increases iron absorption. Sprouted ragi develops vitamin C in the process of sprouting, therefore the iron in ragi becomes more bioavailable when consumed as sprouted ragi flour or ragi malt.

Ragi for Relaxation

One amazing benefit of Ragi is that it helps in relaxing the body naturally. It is found to be beneficial in conditions of anxiety, depression, migraine and insomnia.

Ragi as a Source of Essential Amino Acids

Ragi is rich in Amino Acids vital for the body. Finger Millet contains amino acids namely Tryptophan, Threonine, Valine, Isoleucine and Methionoine. Isoleucine helps in muscle repair, blood formation, bone formation and improves skin health. Valine is an essential amino acid which facilitates metabolism and repair of body tissues. Another essential amino acid, not found in most cereals, is Methionine. It is found in Ragi and therefore makes it a complete protein food unlike other cereals and millets. The amino acid Methionine is useful in various body processes, helps in eliminating fat from the body, and is main provider of sulfur in body. Sulfur is essential for production of Glutathione which is the body’s natural and most important antioxidant.

Ragi Food Preparations

Finger millet is normally consumed in the form of flour-based foods such as roti (unleavened pancake), mudde (stiff porridge/dumpling) and ambli (thin porridge). Ragi can be used to make porridge, upma, cakes, and biscuits. Ragi flour is used to make various Indian preparations like dosas, idlis and ladoos.

‘Puttu’ is a traditional breakfast of Kerala, usually made with rice powder together with coconut and steamed in a cylindrical steamer. The same preparation is also made with ragi powder, which makes it more nutritious

Multigrain flour preparation by combining wheat and finger millet in the ratio of 7:3 (wheat: finger millet) is one of the simplest ways of incorporating ragi in the daily diet as no Indian meal is complete without the Indian style bread or roti. In the proposed blend, though the gluten content is reduced significantly, the making of chapatti is not much affected. However, the color turns a little dark. Fortification of finger millet in chapattis is very helpful in controlling glucose levels in diabetic patients efficiently.

Malted ragi grains are ground and consumed, mixed with milk, boiled water or yogurt. In southern parts of India, it is a recommended food, by doctors, for infants of six months and above because of its high nutritional content. Homemade ragi malt is one of the most popular infant foods till date.

Malting characteristics of finger millet are superior to other millets. On malting the vitamin-C is elaborated, phosphorus availability is increased, digestion is easier and amino acids are synthesized. In south India, the malted ragi flour is extensively used in preparation of weaning foods, instant mixes and beverages.

Despite finger millet’s rich nutrient profile, low cost and easy availability recent studies indicate its lower consumption in general by urban Indians. Obesity has become a matter of health concern in India. Unhealthy foods have increasingly become a part of the food choices made by youth. Large populations of children in the country are malnourished and are deficient in calcium and protein. The millet ragi then could be the answer to all the above problems relating to nutrient deficiencies. Ragi is truly a wonder cereal grain and should be consciously incorporated in the diets in one way or the other.