చేమకూర వెంకట కవి ( చొప్పకట్ల సత్యనారాయణ గారు వ్యాఖ్యానించిన పద్యము.)
చమత్కారానికి అనేకమార్గాలు.కొందరు అర్ధంతో,మరికొందరు, శబ్దంతో,వేరొకరు అలంకారంతో, యిలాయెన్నోరీతులచమత్కారాలనుప్రదర్శించారు. నాయకరాజులయుగంలో"చేమకూరవెంకటకవి" ఉండేవాడు.ఆయనమాటకూడా చమత్కారమే! అంతగడుసుపిండం! ఆకవి,సారంగధర చరిత్ర మనే3ఆశ్వాసాలగ్రంధంవ్రాశాడు.అందులోఒకపద్యంమీకోసం,
సారంగధరుడుపావురంకోసంచిత్రాంగి యింటికివచ్చాడు.అతనిరాకకోసమేయెదురుచూసేచిత్రాంగి,అతనిమాటవినిపించుకోకుండాగబగబాపడకగదిలోకిలాక్కుపోయింది. అక్కడచాలాశృంగారచిత్రాలున్నాయి.వాటిలోఒకదాన్నిచూపిస్తూ,
ఉ: అల్లన గాధిరాజసుతు డర్మిలిమేనకముద్దొనర్ప,రా
గిల్లి కుచంబులాన గమకించుట గంటివెరాకుమార?యౌ
నల్ల నగాధిరాజసుతు డర్మలి మేనక ముద్దొనర్ప, రా
గిల్లి, కుచంబులాన గమకించుట బాల్యము గాదె భామినీ!
గిల్లి కుచంబులాన గమకించుట గంటివెరాకుమార?యౌ
నల్ల నగాధిరాజసుతు డర్మలి మేనక ముద్దొనర్ప, రా
గిల్లి, కుచంబులాన గమకించుట బాల్యము గాదె భామినీ!
ఇందులో రెండుభాగాలున్నాయి.మొదటిరెండుపాదాలూ చిత్రాంగిప్రశ్న.చివరిరెండుపాదాలూసారంగ ధరునిసమాధానం.చూడవయ్యా!చూడు, గాధిరాజసుతుడు(విశ్వామిత్రుడు) మేనకయందాన్నిచూచి రాగంతోపరవసించియామెస్తనములను గ్రహింపప్రత్నించుటను చూచితివా?యన, సారంగధరుడామెయందనురక్తిలేనివాడగుట(పినతల్లియనిపవిత్ర భావము) ఔనమ్మా! నీవన్నదినిజమే! అల్ల నగాధి రాజ సుతుడు( ఆహిమవంతునికుమారుడు మైనాకుడు) అర్మిలిన్=ప్రేమతో;ముద్దొనర్ప= ముద్దుచేయగా ; రాగిల్లి= ఏడ్చుచు; కుచంబులాన= స్తనపానముచేయుటకు ప్రయత్నించుట, బాల్యముగాదె =బాల్యవశముననేకదా! యనిసమాధానం!
ఇక్కడ,మేనకావిశ్వామిత్రులశృంగారఘట్టాన్ని సారంగధరునకుజూపి,యతనినిరెచ్చగొట్టాలనిచిత్రాంగిప్రయత్నం.
ఆమాటలనేమార్చి,హిమవంతునిరాణిమేనకముద్దుసేయగా,పాలుగుడుచుటకుజూచుటనుజెప్పి,తప్పించుకొనుటసారంగధరునిప్రయత్నం.అభంగ,సభంగశ్లేష,వక్రోక్తి,ఈరెండూకలిసియీచమత్కారాన్ని ప్రతిపాదిస్తున్నాయి.
చేమకూరదే మరోపద్యం పరిశీలిద్దాం. ఇదికూడాచిత్రాంగీ, సారంగధరుల మాటలసందర్భంలోనిదే.
ఉ: నిక్కగ జూడు చిత్రమిది నెమ్మది వేడుక నోలలాడు, న
మ్మక్కల గుట్టు బట్టబయలై కనుపింపగ శౌరి కొమ్మపై
కెక్కి, రమించుచున్కి, యౌలే, మగువా! యిది చిత్రమౌట దా
నిక్కము; కృష్ణలీలగద నీ విపుడెన్నిన మార్గమంతయున్;
మ్మక్కల గుట్టు బట్టబయలై కనుపింపగ శౌరి కొమ్మపై
కెక్కి, రమించుచున్కి, యౌలే, మగువా! యిది చిత్రమౌట దా
నిక్కము; కృష్ణలీలగద నీ విపుడెన్నిన మార్గమంతయున్;
ఇందులో చిత్రము కొమ్మ రమించు, అనేపదాల నానార్ధల గణింపులోనేఉందిచమత్కారమంతా.చిత్రాంగిఅంటోంది" ఇదిగిదిగో యీచిత్రంచూడవయ్యా! కృష్ణుడు గోపికతో యెలారమిస్తున్నాడో?" అంటోంది.( యిక్కడ, కొమ్మ- అనేపదం ఆడదానికిపర్యాయపదం. రమించు =క్రీడించు;చిత్రం!= ఆశ్చర్యం!) దానికిసారంగధరునిసమాధానం" ఔనులే అదిచిత్రమే(చిత్రపటమే) (అతడావంకకైనాతిరిగిచూడలేదు) నీవుచేప్పినదికృష్ణలీలను గురించిగదా" అంటున్నాడు.శ్రీకృష్ణుడుగోపికలుజలకమాడువేళవారిచీరలనుగొనిపోయి,పొన్నచెట్టుకొమ్మపైగూర్చుండి పైకి రమ్మనిసరసమాడెనుగదా ఆవిషయమునుప్రస్థావించినాడు.ఈరెండవపక్షమున కొమ్మ=వృక్షశాఖ; చిత్రము=ఫొటో; రమించు= ఆటలాడు; చూచితిరాచేమకూరచమత్కారము.చిత్రాంగిగడుసుదనానికి,సారంగధరునిమాటకారి తనంతో సమాధానమిప్పించినాడు.
ఈరోజు మనమొక ప్రహేళికను పరిచయంచేసికొందాం.మనతెలుగులోపొడుపుల వంటివన్నమాట!
శ్లో: "కాచిత్ బాలా! రమణ వసతిం ప్రేషయంతీ కరండం
దాశీహస్తాత్ , సభయ మలిఖత్ వ్యాళమస్యోపరిష్టాత్
గౌరీకాంతం పవనతనయం చంపకం, చాత్రభావం
పృఛ్ఛత్యార్యో నిపుణతిలకో, మల్లినాధహ కవీంద్రహ";
దాశీహస్తాత్ , సభయ మలిఖత్ వ్యాళమస్యోపరిష్టాత్
గౌరీకాంతం పవనతనయం చంపకం, చాత్రభావం
పృఛ్ఛత్యార్యో నిపుణతిలకో, మల్లినాధహ కవీంద్రహ";
అర్ధం: కాచిత్=ఒకానొక;బాలా=యువతి;కరండం=చిన్నపెట్టెను;దాశీహస్తాత్=దాశీచేతికియిచ్చి; రమణవసతిం=ప్రియునియింటికి; ప్రేషయంతి=పంపుచున్నది;అస్య=దానియొక్క; ఉపరిష్టాత్=పైభాగమందు; సభయం=భయమందుచున్న;వ్యాళం=పామును;గౌరీకాంతం=శివుని;పవనతనయం=హనుమంతుని; చంపకం=సంపెంగపూవును; అలిఖత్=లిఖించినది; ఆర్యహ=పెద్దలు;నిపుణతిలకహ=తెలివైనవారు;కవీంద్రహ=కవీశ్వరులను; మల్లినాధ=మల్లినాధుడు;అత్రభావం=ఇందలిఅర్ధమును;పృఛ్ఛతి= అడుగుచున్నాడు;
భోజునిఆస్థానానికి మల్లినాధసూరిపంపినప్రశ్నాపత్రమిది.మీలోనెవరైనదీనియర్థమును వివరంపగలరా? ఆలోచించండి! మీకుతోచకపోతే రేపుభాషాభారతిలోచూడండి!
(జవాబు రేపు వేచి చూడగలరు )
కవులకు యెప్పుడేవూహ కలుగుతుందో యెవరుచెప్పగలరు.ఒకకవికి ఒకఅందాలసుందరిని నిర్మించాలనేబుధ్ధిపుట్టింది.యెలా? ఛందోవృత్తాలతో,ఆవృత్తాతంవిందాంరండి!
మ: గతి మత్తేభము, నాసచంపక,మొగిన్ కైశ్యంబు 'కందంబు', సం
గత వాక్యంబులు' మత్త కోకిలలు' ;దృగ్వాపారమ'యుత్పల'
ద్యుతి, మో'మంబురుహంబు' దేహరుచి'విద్యున్మాల' యీమానినీ
తత వృత్తస్థితు లెన్నగాదరమె, తద్వాగ్జానికైనన్ ధరన్ ?;
గత వాక్యంబులు' మత్త కోకిలలు' ;దృగ్వాపారమ'యుత్పల'
ద్యుతి, మో'మంబురుహంబు' దేహరుచి'విద్యున్మాల' యీమానినీ
తత వృత్తస్థితు లెన్నగాదరమె, తద్వాగ్జానికైనన్ ధరన్ ?;
మత్తేభము,చంపకము,కందము,మత్తకోకిల,ఉత్పలమాల, అంబురుహము, విద్యున్మాల, ఇవన్నీవృత్తాలు(పద్యాలు) యిందులో జాతికిచెందినకందంఒక్కటీకలిసింది.కలపకతప్పలేదుమరి.యీసువృత్తాలతోమానినీమణినిసృష్టించాడుకవి.
ఆమెగమనం మత్తేభంలాగ,ముక్కుచంపకం(సంపెంగ) లాగ, సన్నగాననున్న మేనుకందంలాగ,(ఉన్నవాటిలో కందమేచిన్నది)ఆమెమాటలుమత్తకోకిలలాగ(కోకిలకూతలవలె) కన్నులు ఉత్పలమాలలలాగ,(కలువలవలె)మోము అంబురుహంలాగ(అంబురుహం వృత్తం) పద్మంలాగ,అనిభావం.శరీరకాంతి విద్యున్మాల(మెరపుతీగె) లాగ,ఉన్నది.ఈమెయందాన్ని బ్రహ్మకూడావర్ణింపలేడేమో? నంటాడుకవిగారు.
ఇదేదో వినటానికికొంచెంయిబ్బందిగాఉన్నా,కవియూహనుమెచ్చుకోకుండాఉండగలమా? మీరేచెప్పాలిమరి!
సాహిత్య క్షేత్రంలో విహరిస్తూ ఉంటే యెన్ని వింతలు, విడ్డూరాలో! అవి మనం ఊహించలేం.అది అంతే ! కవుల ప్రతిభ! దక్షిణాంధ్ర యుగంలో మేటి చమత్కార ప్రయోగంలో ఘనాపాటి, చేమకూర వేంకట కవి యెంత చమత్కారాన్ని రంగరించాడో యీపద్యంలో చిత్తగించండి!
ఉ: చిత్తజుఁ డల్గి తూపు మొనఁ జేసిన జేయగనిమ్ము ; పైధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము ; వచియించెద కల్గిన మాట గట్టిగా ,
నత్తరళాయతేక్షణ ,కటాక్ష ,విలాస, రస ప్రవాహముల్
కుత్తుకబంటి తామరలకున్ ;ఁదలముల్కలు గండుమీలకున్;
బెత్తిన నెత్తనిమ్ము ; వచియించెద కల్గిన మాట గట్టిగా ,
నత్తరళాయతేక్షణ ,కటాక్ష ,విలాస, రస ప్రవాహముల్
కుత్తుకబంటి తామరలకున్ ;ఁదలముల్కలు గండుమీలకున్;
సుభద్ర సోయగాన్నిఃవర్ణించే సందర్భం . ఆమెజగదేక సుందరి , ఆమెకళ్ళు విరసిన కమలాలు, సొరచేపల వటివి, అనిచెప్ప వలసినదానికి పెద్ద నేపధ్యాన్ని కల్పిస్తున్నాడు వెంకన్నగారు.
" ఈమాట చెపితే మన్మధుడు అలుక బూని నాపై బాణంయెక్కు పెడతాడేమో? నామీద యుధ్ధాన్నిప్రకటిస్తూ, తనరధంమీదనున్నజండా నెగరేస్తాడేమో? యేమైనా గానీ ఉన్నమాట యేదో అది అనేస్తా! ఆచంచల నేత్ర చూపులు ఆచూపులలోని రసప్రవాహములు, తామరలకు కుత్తుక బంటియౌతున్నాయి. సొరచేపలకు తలముల్క లౌతున్నాయి" అంటాడు.
తామరపూ లెప్పుడూ పీక వరకూ నీీళ్ళలోనేఉంటాయి. అవిఅలాఉండటానికి కారణం కోపమట! యెవరిమీద?సుభద్ర కన్నిలపై, ( తామరలకన్నా అందంగాఉన్నాయనిచెప్పటం) యిక సొరచేపలకు తలముల్క లౌతున్నాయట! చేపలు నీటిలో మునిగే ఉంటాయి. దానినేకవి, సుభద్ర కనులను పోలలేక, సిగ్గుతో నీళ్ళలో తలదాచుకుంటున్నాయట!
మరి యీవిధంగా తన పరివారాన్ని గురించి చెపితే యెవరికైనా కోపంవస్తుందిగదా! కోపంవస్తే పరిణామం దాడిచేస్తారు. అంటే యుధ్ధానికి రావడం. వచ్చేవారు రధంమీద జండాయెగరేస్తారు. యీయనృమీనాంకుడేగదా! యికనేం నాపరివారంగొప్పదనిచెప్పటమేగదా! యికపోతే యుధ్ధంలో బాణప్రయోగం ఉంటుంది. ఉన్నదిగదాఅరవిదం అదేనండీ పద్మం.దాన్నే వింటికి తొడగవలసి యుంటుంది. ఆవి ధంగా రెటిపగ తీర్చినట్లేగదా!( ఆమెచూపులు మన్మధబాణాలే - ఆనెక్రీగంటి చూపులు మన్మధ ధవజారోహణమే! యనిభావం)
యిక మీనాలు ప్రవాహంలోనే ఉంటాయి, పద్మాలేమో రసం- జలం లోనేకదా ఉండేది. మొత్తానికి ఆమెవాలుచూపులు శృంగార రసప్రవాహాలు, మన్మధబాణాలు. అనికవిగారి యభిప్రాయం!
********************************************************************************************************************
********************************************************************************************************************
వృత్త సుందరి సోయగం!
శా: గతి మత్తేభము, నాస చంపక, మొగిం గైశ్యంబు కందంబు , సం
గత వాక్యంబులు మత్తకోకిలలు , దృక్పాండిత్య మయ్యుత్పల
ద్యుతి , మో మంబురుహంబు , దేహరుచి విద్యున్మాలిగా, మానినీ
తత వృత్తస్థితు లెన్నఁగాఁ దరమె, తద్వాగ్జాని కైనన్ దగన్;
గత వాక్యంబులు మత్తకోకిలలు , దృక్పాండిత్య మయ్యుత్పల
ద్యుతి , మో మంబురుహంబు , దేహరుచి విద్యున్మాలిగా, మానినీ
తత వృత్తస్థితు లెన్నఁగాఁ దరమె, తద్వాగ్జాని కైనన్ దగన్;
కాణాదం పెదసోమయాజి; ముకుంద విలాసం ;
కవిసమయాలతో నాయికను వర్ణించటం శ్రీనాధాదుల నుండీ మనమెరిగినదే. కాణాదంవారి వర్ణనలో భావుకత గమనింపఁదగిన విషయం. మత్తేభం . చంపకం . కందం, మత్తకోకిల ,అంబురుహం ,విద్యున్మాలి , మానినీ, అనే ఛందస్సుల పేర్లతో వర్ణించటం కాణాదం పెద్దన గారి భావుకతకు నిదర్శనం.
నాయిక మందగమన అందువల్ల మత్తేభం; ముక్కు సంపెంగ , అందువల్ల చంపకం; కందం- అంటే నలుపు. కురులు నల్లగాఉన్నాయి .అందువలన కందం; మాటలు మత్తకోకిలలట; యిక చూపులు కలువలకాంతిని తలపిస్తున్నాయి, అందువలన కన్నులు ఉత్పలాలు.(ఉత్పలమాలికలు) ముఖమేమో పద్మం - అందుకే అంబురుహం; దేహకాంతి మెఱపుతీగె- అందువలన విద్యన్మాలిక; మానినీ తత వృత్త స్థితులను ఆబ్రహ్మకుగూడా వర్ణింప నలవిగాదు. అని కవిగారు ఘంటాపథంగా చెపుతున్నారు. మరి మీరేమంటారు?
No comments:
Post a Comment