Saturday, 23 November 2019

వేద గణితము ఒక సంఖ్య వర్గమును వర్గ మూలమును కనుగొనుట (Finding out Square of a number)


వేద గణితము
ఒక సంఖ్య వర్గమును, వర్గమూలమును కనుగొనుట
(Finding out Square of a number)
(కాలక్షేపం కబురులు నేను వ్రాయటము లెదు. అవి సమయమును సంహరించుతాయి.
మనసునకు కలుగవలసిన వికాసమును హరించుతాయి. మనలో నిత్రాణమైయున్న అసురీ శక్తులను ప్రేరేపించూతాయి. అందువల్ల ఉబుసుపోకకు కబుర్లాడుకొన్నా అదే జీవిత పరమావధి కాకూడదు. ఈ దిగువ నా మనసు మీ ముందుంచుచున్నాను.
అక్కరకు రానిమాటలు
ఎక్కడనూ పనికి రావు ఎందులకనగా
మక్కువ దంటును నమిలిన
చిక్కనిదౌ చెరుకు రసము చిక్కునె రామా!
ఒక మంచి విషయమును కొంత ఓపిక వెచ్చించి తెలుసుకొన గలిగితే మీరు దానిని పదిమందికి పంచగలుగుతారు. ఉమ్మెత్త పూవులు ఎంత మెత్తగా ఉన్నా చందన గంధము పంచలేవు కదా!
అసలు విషయానికి వద్దాము. ఈ శ్లోకమును గమనించండి.
స్థాప్యోంత్యవర్గో ద్విగుణాంత్య నిఘ్నాఃl
స్వస్వోపరిష్టాచతథా-పరేంకాః
త్యక్త్వాంత్యముత్సార్య పునశ్చ రాశింll
ఈ శ్లోకము భాస్కరాచార్యుడు-2 తన 'లీలావతీ గణితము'లో చెప్పిన విషయము. ఇది శ్లోకరూపములో చెప్పిన 'వర్గమును కనుగొను అత్యద్భుత విధానము. ఈ విధానమును ఒకపరి ఆకళింపు చేసుకొన్నారంటే ఒక సంఖ్య యొక్క వర్గము కనుగొనుట ఎంత సులభము అన్నది మనకు అర్థమౌతుంది.పాశ్చాత్య విధానములో అంటే మనము పాఠశాలలో నేర్చుకొన్న గణిత విద్యలో ఒక సంఖ్య వర్గమును కనుగొనవలెనంటే ఆసంఖ్యను అదే సంఖ్యతో హెచ్చవేసి ఫలితము తెలుసుకోవలసియుంటుంది. ఉదాహరణకు 352 యొక్క వర్గము కనుగొనవలెనంటే
352x352 చేస్తే 1,23,904 వస్తుంది. వేరొక మార్గము లేదు. అదే 5 అంకెల సంఖ్య అయితే పని ఇంకా కష్టమౌతుంది. కానీ భాస్కరాచార్యులవారు చెప్పిన ఈ విధానమును ఆకళింపు చేసుకొని అనుసరించితే ఆపని అత్యంత సులభమౌతుంది. వ్యావహారికముగా ఈ పని అవసరమా అంటే చాలా అవసరము. అభియంతలకు (Engineers) స్థపతులకు (Archeticts) ఎంతో అవసరమౌతుంది. అట్టివారిని తయారు చేసే ఉపాధ్యాయులకు, ఆచార్యవర్యులకు కూడా మిక్కిలి అవసరము.
ఈ శ్లోకమును అర్థము చేసుకొనుటకు ముందు అవగాహన కొరకు ఈ క్రింది వివరణ అత్యవసరము.
ఒక ఇచ్చిన అంకెను రెండు విధములుగా చదువవచ్చును. ఎడమ నుండి కుడికి చదువుట ఒక విధమైతే కుడి నుండి ఎడమకు చదువుట ఒక విధము. వేదగణితము నందు ‘అంకానాం వామతో గతిః’ అన్న ఒక సూత్రము వుంది. అంటే ఒక సంఖ్య లోని అంకెలను మన కుడిచేతి వైపునుండి ఎడమ చేతివైపుకు చదువుట అని అర్థము. ఈ విషయాన్ని గతములో కూడా పలుమార్లు తెలియజేసినాను. రెండవది పాశ్చాత్య విధానము. ఎడమ నుండి కుడికి చదువుట. ఈ శ్లోకము గొప్పదనమేమిటంటే ఇచ్చిన అంకె యొక్క ఫలితమును అటునుంచియైనా ఇటునుంచి అయినా మొదలు పెట్టి ఫలితమును సాధించ వచ్చు.
పై శ్లోకమునకు అర్థము ఉదాహరణ రూపములో తీసుకొందాము. ఆ ఉదాహరణ కూడా పైన చెప్పిన 352 నే తీసుకొందాము. వర్గ మూలము కనుగొను విధానమును ఇటు 3 నుండి కానీ అటు 2 నుండి కానీ మొదలు పెట్టవచ్చును.
ముందు ఒకట్ల స్థానములో ఉన్న 2 వైపునుండి ఫలితము పొందు ప్రయాణము చేద్దాము.
1.    మొదట 2 యొక్క వర్గమును గ్రహించాలి అంటే 22= 4
ముందు 352 క్రింద ఒక గీత గీచుకొందాము. గీచుకొని 4 ను ప్రక్కన చూపిన విధముగా వేసుకొందాము. ఇప్పుడు 2ను ద్విగుణీకృతము చేద్దాము.(We are doubling the last digit. Incidentally in this case it is 2, which when squared or multiplied by 2 yield the same result). వచ్చిన ఫలితమును ఈ విధముగా వేసుకొందాము. తరువాత 10ల స్థానములో ఉన్న 5 కు వర్గమును ఇప్పుడు 100 ళ స్థానములో 140 కి దిగువ పంక్తిలో వ్రాసుకొందాము. తరువాత 5ను 2తో  హెచ్చించి ఆ లబ్ధమును 25 లోని రెండు క్రింద వేసుకోవాలి. తరువాత 352 లోని 3కు వర్గము కనిపెట్టి 1 క్రింద వేసుకోవాలి. ఇపుడు మొత్తం కూడాలి.
                      3   5   2
                               4
                1   4    0
                2   5
            3  0
            9
123904  ఇదే జవాబు.
ఈ విధముగా, ముందు, మీకు తోచిన మూడు అంకెల సంఖ్యల యొక్క వర్గమును సాధించేది. ఉత్సాహవంతులు తప్పక ప్రయత్నించుతారని ఆశ. రెండు మూడు రోజుల తరువాత 4 లేక 5 అంకెల సంఖ్య యొక్క వర్గము కనుగొందాము.
ఇపుడు ఇదే 352 ను తీసుకొని ఎడమ వైపు నుండి అంటే 3 నుండి మొదలుపెట్టి సాధిద్దాం.
ముందు (1) 32 = 9 (2) 3x2=6  (3) 6x5 = 30 (4) 52  = 25 (5) 35x2x2(This 2 is the last digit of the given number, 35 is 3 and 5 of the given number) = 140 (It is just doubling 5) (6) 10x2 =20 (2 in 352)  (7) = 22 = 4
                 3  5  2    
       9
       3  0
          2     5
           1    4   0
                        4

    1 2 3 9 0 4 ఇదే జవాబు.

ఇపుడు ఒక పెద్ద సంఖ్యను తీసుకొని దాని వర్గము కనిపెడుదాము.
450232 = 2027070529
వరుస క్రమములో పైన తెలిపిన విధానముతో స-క్రమముగా వ్రాసుకొంటూ పోతాము.
పంక్తి
  1.  = 32 = 9    
 2.  = 2x3x4502 = 27012
 3.  = 22 = 4
4.  = 2x2x450 = 1800
5.  = 02 = 0
6.  = 2x0x45 = 0
7. = 52 = 25
8. = 2x5x4 = 40
9. = 42 = 16
పై విలువలను గతములో చెప్పిన విధమగు వరుసక్రమములో వ్రాయగా:
                                          9
                            2 7 0  1  2
                                     4
                           1 8 0 0
                                0
                             0
                       2 5
                    4 0
                 1 6
­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­2 0 2 7 0 7 0 5 2 9: ఇది జవాబు – పైన ఇచ్చిన కలన యంత్రపు జవాబుతో పోల్చుకొనేది.
ఇపుడు మీరు ఎడమవైపు నుండి మొదలు పెట్టి ఇదే సంఖ్యకు వర్గము కనుగొనగలరు.

 ఈ దిగువ వర్గమూలము వేదగణిత విధానములో కనుగొనుట తెలుప బడినది. ఇది భాస్కరాచార్య-2 గారి లీవతి గణితము లోనూ పావులూరి మల్లన గణితములోనూ తెలుపబడినది.


స్వస్తి.



Monday, 4 November 2019

భీష్మ జాతకము - భీష్మార్జున యుద్ధము

                     భీష్మార్జున యుద్ధము

https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_18.html

శీర్షిక పేరు చూస్తూనే ఇది మాకు తెలిసిందేలే! ఏముంది దీనిలో చదివేది అని పాఠకులు తలచుట ఎంతో సహజము. తెలిసినది కాకుండా వేరేమయినా యున్నదా అన్న జిజ్ఞాసతో నైనా చదువండి. భారతము ఇతిహాసము (History) అని మన పూర్వులు ముద్ర వేసి చెప్పినామనము విశ్వసించే పాశ్చాత్యులు ఆ విషయమును తేటతెల్లము చేసేవరకూ మనము ససేమిరా నమ్మలేదు. మనవారు రామాయణ భారతములను 'ఇతిహాసములు అనే కదా మన తండ్రి తాత ముత్తాతలు అన్నారు. మన సంస్కారము, మన గ్రంధములు, మన సంస్కృతము, మన సంస్కృతి, మన ఐకమత్యము అన్న విషయములను ఇకనైనా పరిగణన లోకి తీసుకోకుంటే ఈ దేశము పరమతములకు ప్పజెప్పినట్లే!

భారతేతిహాసములో ధర్మజ , భీష్మ, కృష్ణ దుర్యోధన, విదుర వంటి విభిన్న పాత్రల నియమ నిష్ఠలను మనమెంతో ఆకళింపు చేసుకొనవలసినది ఉంది. నేను పై శీర్షిక కల్గిన ఈ వ్యాసములో బ్ర.శ్రీ. రేమేళ్ల అవధానులవారి సహకారముతో, భీష్ముని జన్మ కుండలిని తీసుకొని కొంత విశ్లేషణ చేయుట జరిగినది. నా వ్యాసములో నేను వాడిన రెండు బింబములు (Images) నా తమ్ముడు మండెం కృష్ణ మూర్తి తన ఉద్యోగము నుండి అలసివచ్చి కూడా రాత్రి 11.30, 12గం. లకు నేను చేతి వ్రాతగా పంపిన కుండలిని చక్కగా తయారుచేసి పంపినాడు. తాను నా ధన్యవాదములు కోరడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నేను వ్రాసే ఒక వ్యాసానికి, ఫలాపేక్ష లేకుండా, నాపై గౌరవముతో ఉన్న వారిని కూడా ఉపయోగించుకొని కొన్ని వ్యాసములు తయారు చేయవలసివస్తుంది. మ్నారి ఇంతటి సహృదయుల సహాయ సహకారముతో ప్రచురించే అపురూపమయిన వ్యాసములు పాఠకులుగా మీరు చదువక పోతే నా శ్రమ 'బూడిదలో పోసిన పన్నీరే!

అసలు ఇటువంటివి చదివి మన పూర్వుల ప్రతిభ, మన చరిత్ర గుర్తించుటకుగానూ,చదువుట అన్నది మన ప్రాథమిక కర్తవ్యము. కొంతమంది మిడి మిడి జ్ఞానముతో మన వేద శాస్త్ర పురాణేతిహాసాలను దుయ్యబడుతూ ఏవేవో వ్రాస్తూవుంటారు. ఆ వ్రాతలకు ప్రాధాన్యతనిచ్చేవారు కొందరైతే పట్టించుకోని వారు కొందరు.  కానీ మన దేశములోని పరమతస్తులు తమ తమ మతగ్రంధములను తాము దుయ్యబట్టక పోగా, అట్లు ఎవరయినా మాట్లాడితే తలలు తెంచుతారు.  

అంత దాష్టికమునకు మనము పాలుబదనవసరము లేదు. అసలు మన పురాణేతిహాస శాస్త్ర గ్రంధములు ఏమిచేబ్యుతున్నాయో కాస్త శ్రద్ధబూని చదువుదాము.

మన సనాతన ధర్మము పగలు రాత్రి లేకుండా ప్రకాశించే దివ్యమణి. దానిని కాపాడుకొనుట మన పని.

భీష్మ జాతకము - భీష్మార్జున యుద్ధము
నేటి చరిత్రకారుల అంచనాలకు అందని కాలములోనే అనంత సృష్టి పై దృష్టి సారించి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యజనకమైన విషయములను సాదికారికముగా గుర్తించి మనకు అందించిన ఆ ఋషి ముని వరేణ్యులకు మనసా పాదములంటి సాష్టాంగ దండప్రణామములాచారించి నాకు తోచిన నాలుగు మాటలు చెబుతాను. అనంతమైన మన పూర్వుల సకలశాస్త్ర విజ్ఞాన సంపద ఇంత అని మన కొలమానమునకు అందనిది.
ఖగోళ శాస్త్రము అన్న సంస్కృత పదమునకు Astronomy సమాంతర నిర్వచనము కాదు. మొత్తము విశ్వాంతరాళమును ఖగోళముగా నిర్వచించినారు మన పూర్వులు. పాశ్చాత్యుల Astronomy ఆకాశములో అగుపించే తారాతోరణాల వరకే పరిమితము. వారి ఈ మాటే మన భూమి ఆకాశము అన్నీ చద్ఫరముగా ఉన్నట్లే సూచిన్చుచున్నాయి తప్పించి గోళాకృతిని నిర్వచించవు. ఇక Astrology అన్న మాటకు అర్థము ఆంగ్ల నిఘంటువులో ఈ విధముగా వుంటుంది.
Astrology is the study of the movements of the planets, sun, moon, and stars in the belief that they can influence people's lives.
అదే మన జ్యోతిషము అన్న పదమునకు వివిధ, నక్షత్ర, గ్రహ, వివిధ గ్రహకూటముల వెలుగు యొక్క ప్రభావము మానవులపైనే గాక సకల చరాచర సృష్టిపై ఏర్పడు ప్రభావమును తెలుపుతాయి. ఈరోజు గ్రహస్థితిని ఒక ప్రమాణముగా తీసుకొని కొన్ని వేల సంవత్సరముల గ్రహ గమనమును గూర్చి, గ్రహణముల గూర్చి నిర్దుష్టముగా చెప్పగలిగిన శాస్త్రములను మనకు అందించిన ప్రజ్ఞాశాలురు మన పూర్వులు. ఇట్లు మనము వారి ఘనతను గూర్చి ఎంతయో చెప్పుకొంటూ పోవచ్చును.
ఇక అసలు విషయమునకు వద్దాము. బహిరంగాముగానూ, మన పిల్లలకు ఆంగ్లము అనర్గళముగా వస్తుందన్న ఆశతో చేర్పించిన మిషనరీ స్కూల్స్ లోనూ మన రామాయణ భారతములు మైత్\మిత్ అని పదేపదే చెప్పి, ఇటు మన బుర్రల్లోనూ, అటు అమాయకులైన పసిపిల్లల బుర్రల్లోనూ ఈ ఇతిహాసములు జరిగినవికాడు. అన్నీ కట్టుకతలే! అని నమ్మించినారు. నిజము నిప్పు అన్న వాస్తవమును విస్మరించినారు. వారిలోనే నిష్పక్షపాతులగు చరిత్రకారులు అవి చరిత్రయే అని రుజువులతో సహా నిరూపించినారు. వారు చెప్పినదగుతచే దానికి ఇప్పుడు వంత పాడుట మొదలు పెట్టినాము.
ఈ వ్యాసములో భీష్మార్జున యుద్దమును తీసుకొని ఇటు చరిత్రను అటు జ్యోతిషమును అనుసంధించి నాకగుపించినది, నాకనిపించినది వ్రాయుచున్నాను.
నక్షత్రములు 27 అన్నది మధ్యవయస్కులకు తెలిసిన విషయమే! యువతలో ఎక్కువ మందికి తెలిసే అవకాశము తక్కువ. ఒకప్రక్క చెప్పేవారి సంఖ్య తరిగిపోతూ వుండగా మరొక ప్రక్క వినే ఉత్సాహము యువతలో కూడా రాను రానూ కుంచించుకొని పోతూ వుంది. అసలు విషయానికొస్తే అప్పుడపుడు జ్యోతిశ్శాత్ర వేత్తలు 28 వ నక్షత్రమును గూర్చి చెబుతూ వుంటారు. దానిపేరు అభిజిత్తు. ఇది ఆ 27 నక్షత్రములవలె పూర్ణ మండలము కలిగిన నక్షత్రము కాదు. అశ్వని భరణి ఆదిగా గల పేర్ల నక్షత్రములు చర్మ చక్షువునకు ఒకటిగా కనిపించినా అవి కొన్ని తారకల గుంపును తమలో కలిగి ఉంటాయి. అభిజిత్తు ఉత్తరాషాఢ లోని నాలుగవ వంతు శ్రవణములోని మొదటి 15వ వంతు కలిగి ఉంటుంది. పై విషయములు అసంగతములు అని అనుకొంటుంటారు. పనిలో పనిగా ఇప్పుడు చెప్పకపోతే వానిని గూర్చి తెలియని పాఠకులు తెలుసుకొనే అవకాశము ఎగిరిపోతుంది.
అసలు విషయమునకు వద్దాము. భీష్ముని నక్షత్రము ‘ధనిష్ఠ’. ధనిష్ఠ 8 నక్షత్రములు కలిగిన మండలమని ఖగోళ శాస్త్రము చెబుతూ వుంది. 8 అష్టవసువులకు సంకేతము. అంటే వీరు ధనిష్ఠకు అధిష్టాన దేవతలన్నమాట. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు అను వీరలను అష్ట వసువులు.
ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే నందిని  అనబడు కామధేనువు యొక్క బిడ్డ. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు వారు. అందులో ఆవును పట్టుకొని తోలుకుపోయినవాడు 8 వ వాడు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.
వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. తరువాతి కథ మీకు తెలిసినదే! దేవవ్రతుడన్న నామధేయము గలిగి భీషణ ప్రతిజ్ఞ చేయుటచే మహాభారత సంగ్రామము ముగిసి తానూ ప్రాణత్యాగము చేసేవరకూ భీష్మునిగానే నిలిచిపోయినాడు. తన ప్రతిజ్ఞ మేరకు పెళ్లి చేసుకోనూ లేదు రాజ్యాధికారమును పొందనూ లేదు. మరి ఆయన జన్మపత్రిక ఏమి తెలుపుచున్నదో చూద్దాము.



జాతక చక్రమున మీనము తరువాత నుండి వచ్చే ఖాళీ గదులలో వరుసగా, మేషం, వృషభం,కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ఊహించుకోనేది. 12 గళ్ళలో 12 రాసులు ఉన్నాయి. మనకు అవసరమైనవి ఆయా గదులలో వ్రాసుకొన్నాము.
ప్రతి నక్షత్రమూ నాలుగు పాదాలు కలిగియుంటుంది. ప్రతి రాశీ ప్రతి మూడు వరుస నక్షత్రములనుండి, వరుసగా, 9 పాదములు కలిగియుంటుంది. పైన కనపరచిన కుండలిలోని ధనుస్సు, మకరం, కుంభం, మీనం అన్న రాశులను తీసుకొందాము. ధనుస్సు: మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము కలిగియుంటుంది. దానితరువాత వచ్చే మకరం: ఉత్తరాశాధలోని మిగిలిన 3 పాదాలు,శ్రవణం లోని 4 పాదాలు, ధనిష్టలోని 1,2 పాదాలు కలిగి వుంటుంది. అదేవిధముగా మిగిలిన రాసులు కూడా! ధనిష్ఠ యొక్క మొదటి రెండు పాదాలూ మకరం లోనూ మిగతా రెండు పాదాలూ కుంభం లోనూ ఉన్నాయి.



నాలుగు పాదాలూ కలిపి చూసుకొన్నా ధనిష్టకు ఇటు కన్య గానీ అటు మిధునము కానీ చాలా దూరములో ఉన్నట్లు పై చిత్రము చూస్తే మనకు తెలుస్తుంది. అందుకే భీష్ముడు బ్రహ్మచారియై అవివాహితునిగా ఉండిపొయినాడు. ఇది ప్రసిద్ధ జ్యోతిష్కులైన దువ్వూరి అవధానిగారు చెప్పిన మాట. ఇక ఎదే జాతక రీత్యా ఇంకొక విషయమును చూద్దాము. ప్రతియొక్క యోధుని స్వంత రథమునకూ ఒక జెండా కలిగి యుంటుంది. అంటే దానివల్ల ఆ రథము ఎవ్వరిది అన్నది చూపరులకు అర్థమౌతుంది. మనకందరకూ తెలిసినది పార్థుని రథము యొక్క జండా పై కపిరాజు. మరి భీష్మునికో?
భీష్ముని ధ్వజకేతము తాటి చెట్టు. మరి జాతకలో దీనికి కూడా అన్వయము లభ్యమౌతుందేమో చూద్దాము.
ధనిష్ఠ 1,2 పాదాలు మకరం లో వుంటే 3,4 పాదాలు కుంభములో వున్నాయి. అంటే ధనిష్ఠ కుంభములోనికి విస్తరించి ఉన్నది అన్నమాట. ఆ లంకె ఏమిటి అన్నది చూద్దాము. కుంభమునకు అధిష్టాన దేవత వరుణుడు. వారుణి అన్న శబ్దము ‘వరుణ’ శబ్దము నుండి పుట్టినదే! ‘వారుణి’ అన్న మాటకు అర్థము ‘కల్లు’ అని. ‘కల్లు’ లో మొదటిస్తానము తాటి కల్లుది. దానిని తాతిచేట్టునుండి తీస్తారు.
మనము ఇపుడు ధనిష్ఠ 1,2 పాదములు రథము పై ఉన్నాయంటే 3,4 ధ్వజము జండాలను గుర్తు చేస్తాయి. కాబట్టి జెండా పై తాటిచెట్టు వెలసింది. ఇటువంటి విషయములు తెలుసుకొనుటకు సహేతుకమగు తర్కము ఎంతయో అవసరము.
ఇక భీష్మార్జున యుద్దమును గూర్చి తెలుసుకొందాము. మహా భారతమును చదివితే, భీష్మునికి అర్జనునికి యుద్ధము, రెండు పర్యాయములు జరిగినట్లు తెలియవస్తూ వుంది. 1. ఉత్తర గోగ్రహణ సందర్భము. ఇక్కడ జరిగిన యుద్ధము ప్రానాన్తకము కాదు. ఎందువల్లనంటే ఇక్కడ అర్జనుని ధ్యేయము గోవులను మరలించుటయే! తిక్కన భారతము ప్రకారము దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ద్రోణ, అశ్వత్థామాది కురువీరులను మూర్చిలజేసిన తరువాత భీష్ముడొకడూ మిగులుతాడు. తాతకు తన ప్రతాపమును చూపనెంచి, శివుని నుండి పొందిన పాశుపతాస్త్రము మరియు దేవదానవ యుద్ధములో దేవతలకు సహాయమోనర్చి తానూ బహుమతిగా పొందిన వివిధ అస్త్ర శస్త్ర పటుత్వమును చూపనెంచి
ఆయనపై అలుగులనొదులుతాడు.  హోరాహోరీగా జరుగుచున్న ఆ యుద్ధములో భీష్ముడు వేసిన ఒక బాణము అర్జనుని భుజమున నాటినది. చలించని అర్జనుడు తాను రెండు బాణములను సంధించి భీష్ముని గుండెను తాకునట్లు వదలినాడట.  ఆయన తూలి పడబోతూ రథము యొక్క స్థంభమును పట్టుకొని నిలువగాలిగినాదట. భీష్ముడు యోధానుయోధుడు. అర్జనుడూ సమాన శౌర్య సంపన్నుడు.
ఇక్కడ మనము గమనించవలసినది ఏమంటే భీష్ముని అంతగా నిలువరించగల యోధుడు కురుపాండవ బలగములలో వేరెవరూ లేరు. దేవతలను మెప్పించి అస్త్రశస్త్రములను భీష్ముడు సాధించితే, దేవతలు మేచ్చుటచే అస్త్రశస్త్రములను సాధించినవాడు అర్జనుడు. అర్జనుని విలువిద్యా కౌశాలును గూర్చి ఒక్క మాట ఇక్కడ చెబుతాను.
వీక నెదిర్చి ఇట్లు కురువీరులకున్ ప్రమదంబొనర్చుచున్
తాకిన క్రోధవేగ సముదగ్రత నెర్రని చూడ్కి జూచి పే
రాకలి తోడనున్న జమునాకృతి భీషణ రేఖ యొప్పగా 
వ్రేకని నారసంబు దొడి క్రీడి కరిన్ దృఢ ముష్టి వేసినన్
ఫాల కుంభ సంధి బడి వాలమున వెస
నుచ్చి పోవుటయును నుర్వి యద్రువ
గూనె నగ్గజంబు కువిశచండాహతి
పడు మహా నగంబు భంగి దోప
మహాభారత యుద్ధము తీవ్రముగా జరుగుతూ వుంది. అర్జనుని ముందు కౌరవసేన నిలువలేక వెన్నుజూపి పారిపోతూ వుంది. వారికి ధైర్యము చెబుతూ మదించిన సుశిక్షితమైన మరియు కౌరవ గజబలములో శ్రేష్ఠమైన ఏనుగునెక్కి అర్జనుని ఢీకొన, వికర్ణుడు బయలుదేరినాడు. కౌరవ సేన ధైర్యము పుంజుకొని వికర్ణుని వెంట నడిచింది. ఇదిగామనించి, వికర్నుడా నన్నేదిరించేవాడని, అర్జనుడు ఆగ్రహోదగ్రుడై విడిచిన బాణము, ఏనుగు కుభస్థనుండి లము నడుమనుండి దూసుకొని పోయి తోకవైపు నుండి బయల్వెడలినదట. అంతబలము బాణము వదిలే ఆయన ముష్టి అంటే పిడికిలికి ఉండినదంటే ఆయన ఎంత బలవంతుడో అర్థము చేసుకొండి.
అంతటి మహా బలశాలి బాణము వేసినాడు కాబట్టే భీష్ముడు తూలినాడు. మరి అంతటి బలశాలి వేసిన బాణమునకు ఎదురొడ్డి నిలువగలిగినాడంటే భీష్ముడెంత బలశాలియో గ్రహించండి.
ఇక మహాభారత యుద్ధానికి వస్తాము. కురుక్షేత్ర సంగ్రామములో ప్రథమ సైన్యాధ్యక్షుడు భీష్ముడు అన్నది మనకు తెలిసినదే! ఆయనకు సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టినంతనే తాను 10,000 రథికులను మట్టుబెట్టిన తరువాతనే నేల వాలుతాను అని దుర్యోధనుని ముందు శపథము చేస్తాడు. యుద్ధము ప్రారంభమయిన 9 రోజులలోనే మాట నిలబెట్టుకొంటాడు. కృష్ణుడు ధర్మరాజు సమేతంగా ఆ రోజు రాత్రి భీష్మునివద్దకు వెళ్లి ఆయన మరణ రహస్యము అడుగుతాడు. తనది ఇచ్చా మరణమే అయినా నేలకు ఒరగాలంటే అర్జనుని, శిఖండిని ముందుంచుకొని, యుద్ధము చేయమంటాడు. వారు ఆయనకు తమ కృతజ్ఞత చాటుకొని తమ శిబిరమునకు వెళ్ళిపోతారు. తెల్లవారి యుద్ధములో శిఖండి అర్జనుని ముందు నిలబడతాడు. సమారా శంఖములు పూరించిన వెంటనే యుద్ధము ప్రారంభమవుతుంది.
ఒకసారి మనము పైన ఉన్న కుండలిని పరిశీలించినట్లయితే కన్య గదికి పైన ఒక చుక్క గుర్తు కనిపిస్తుంది. అది ఉత్తర ఫల్గుణీ నక్షత్రము. ఆ గదికి ఎదురుగా మకరం, దానిపై కుంభం రాసులలో ధనిష్ఠ ఉన్న 1,2 మరియు 3,4 పాదాలుగా ఉన్నదికదా!  అయినాకూడా అవి 180 డిగ్రీల కోణములో లేవు. మరి ఇద్దరు పోరుతున్నపుడు వారి మధ్య కోణము 180 డిగ్రీలు ఉంటుంది కదా!  ఇప్పుడు కుండలిని భీష్మార్జున యుద్ధముతో సమన్వయపరిస్తే ఆయుద్ధములో భీష్మార్జనులు ఎదురెదురుగా కాక కొంచెము ఏటవాలుగా వున్నారు. అంటే ధనిష్ఠ ఉత్తరఫల్గుణీ నక్షత్రములు ఒకదానికొకటి 180 డిగ్రీలలో లేవు. మరి ధనిష్టతో ఆ కుండలిలో మరొక నక్షత్రము ఎదురుగా వున్నదన్నమాట. ఆ నక్షత్రమే శిఖండిది. అదే శిఖండిని ముందుంచుకొని భీష్మునితో యుద్ధము చేయుటకు సంకేతము. ఆయుద్ధములో భీష్ముడు అర్జనునితో తనపై బాణ వర్షము ఇంకా ఇంకా కురిపించమని చెబుతూవుంటాడు. ఆయన తన సారధితో ఈవిధంగా అంటాడు. నాశరీరానికి కొన్ని బాణములు పూవులు తాకినట్లుగా ఉన్నాయి. కొన్ని అలుగులు  గుంతను త్రవ్వే పలుగులవలె  క్రుచ్చుకొంటున్నాయి.  పూలతాకిడి కల్గినవి శిఖండి బాణాలయితే  పలుగుల బోలినవి అర్జనుని బాణాలు అని భీష్ములవారు చెబుతున్నారు.
అర్జునస్య ఇమే బాణాః నేమే బాణాః శిఖండినః l
కృదంతి మమ గాత్రాణి మాఘమాసే గవామివll   
పై శ్లోకము వ్యాస భారతమునందు ఎంతో ప్రముఖమైనది. ఆ ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. భీష్ముడు సారధితో చెబుతున్నాడు. “ ఈ బాణాలన్నీ అర్జనునివే. ఇవి శిఖండివి కావు. ఈ బాణముల తాకిడితో నా శరీరములోని భాగాలు తునాతునియలైపోతూవున్నాయి. ఏ విధముగా అంటే ‘మాఘమాసే గవాం ఇవ’ అని పోల్చినాడు. ఇక్కడ విషయమునకు కాస్త దూరము జరిగి వ్యాస గణేశ సంవాదమును గూర్చి చెప్పవలసియున్నది. భారతము చెప్పు నా వాగ్వేగమునకు నిలిచి,  వ్రాయుటకు నీవే తగిన వ్రాయసకానివని గణేశునికి చెప్పి తనకు సహకరించమన్నాడు. అప్పుడు గణేశుడు కూడా నా వ్రాత వేగమునకు దీటుగా నీవు చెప్పలేకపోతే వ్రాయుట చాలించి వెళ్లిపోతానన్నాడు. సరే అట్లయితే నా శ్లోకార్థమును తెలుసుకొని నీవు వ్రాయవలెనన్నాడు వ్యాసుడు. గణేశుడూ వల్లె యన్నాడు. ఈవిధముగా అక్కడక్కడ సంస్కృత భారతములో కొన్ని శ్లోక పాదములలో చూస్తాము. వీనిని వ్యాస ఘట్టములు అని అంటారు. అటువంటి ఒక వ్యాస ఘట్టమే ‘మాఘమాసే గవాం ఇవ’. మరి ఇందలి సామాన్యార్థము గూడార్థము చూద్దాము. ‘మాఘమాసే గవాం’ అంటే మాఘమాసపు వాతావరణము గోవులకు పట్టదు కాబట్టి ఆ మాసములో వాటి సంఖ్య బహుళముగా క్షీణించుతుంది. ఆవిధంగా ఆయన శరీరావయవాలు క్షీణించిపోతున్నాయి అని సామాన్యమగు అర్థములో చెప్పుకోనవలసి ఉంటుంది. ఇక గూఢార్థమేమిటో చూద్దాము. ఇప్పుడు ఆ సమాసములోని పదవిభజన మారుద్దాము. ‘మాఘమా+సేగవాం ఇవ’  
‘మాఘమ’ అంటే ఎండ్రకాయ అని అర్థము. సేగవాం అంటే సంతానము ఇవ అంటే వలె. ఈ విశేషార్థాన్ని విపులీకరించితే ప్రసవ కాలములో నరకములోని యాతనలన్నీ ఒక్కచోట చేరి ఒక్కరే అనుభవించవలసి వస్తే ఎంత దుర్భరముగా వుంటుందో కర్కాటకము పిల్లలను కనే సమయమున కూడా అట్లే ఉంటుంది. ఆ ఎండ్రి కడుపు చీలడము, పిల్లలు బయల్పడడము ఒకేసారి జరుగుతాయి. అంతటి హృదయవిదారకముగా ఉన్నదట అర్జనుని అలుగుల వల్ల భీష్మునికి కలిగే బాధ.  ఇంతటి చారిత్రిక వాస్తవాన్ని తెలుపుతుంది భీష్సముని జాతకము. సక్రమమగు కుండలికి తపోతత్పరుని వాక్కు కలిస్తే తప్పకుండా జాతకము చక్కటి ఫలితాలను తెలియజేస్తుంది. ఇపుడు జాతకములు చెప్పుట వ్యాపారమైపోయినది.
స్వస్తి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              









ఈ నక్షత్రాలను చుక్కలుగా (Points) గా అనుకొంటే అవి ఈ ధనిష్ట మండలములో ఏ ఆకారములో వున్నాయి అంటే అవి ‘మద్దెల’ ఆకారములో ఉన్నవట.


మహాభారత యుద్ధం నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా


మహాభారత యుద్ధం
నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా!
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_4.html
మహాభారతములో మనలో ఎక్కువమందికి తెలిసినది కౌరవులు పాండవులు యుద్ధము శ్రీకృష్ణుడు ద్రౌపది, భీష్ముడు ద్రోణుడు కుంతి, కర్ణుడు ఇట్లు కొంతమంది మాత్రమే! ఉపాఖ్యానములు కాకుండా ప్రధాన కథను పంచుకొన్న పాత్రలు 70 కనిపించుతున్నాయి నాకు. నా అంచనా తప్పు కూడా ఉండవచ్చు. ఇందులో 98 మంది దుర్యోధన సహోదరులపేర్లు చేర్చలేదు. ఖాండవమునకు సంబంధించిన పాత్రలను చేర్చలేదు. ఇంకాకూడా ఎన్నో మరచి ఉండవచ్చు. అసలు ఇన్ని పాత్రలను కలుపుకొని చిక్కుపడకుండా ఊలుదారమును అందమైన బంతిగా చుట్టినట్లు చుట్టి వ్యాసులవారు మన చేతికి ఇచ్చినారు.
అసలు భారతములో 1,20, 000 శ్లోకాలూ వ్యాసుడే వ్రాసినాడా! ఈ వ్యాసుడు వేదాలను విభజించిన వ్యక్తియేనా! పురాణేతిహాసములు ఈయన వ్రాసినవేనా! ఒక్కడు ఇన్ని రచనలు చేయ సాధ్యమా! అంటూ అనేక దేశ విదేశ చరిత్రకారులు సందేహమును వేలిబుచ్చినారు. Maxmullar  కడుపు కక్కుర్తి కొరకు క్రైస్తవ మత వ్యాప్తికి కంకణము కట్టుకొని తన సంస్కృత మిడిమిడి జ్ఞానముతో వేదములను ఆంగ్లము లోనికి తర్జుమా చేసినాడు. రాను రాను ఈ దేశము యొక్క గొప్పదనము తెలియవచ్చి యుండవచ్చు, అందుచే అతడు ఏమన్నాడంటే:
"Whatever sphere of the human mind you may select for your special study, whether it be language, or religion, or mythology, or philosophy, whether it be law or customs, primitive art or science, you have to go to India. Some of the most valuable and instructive material of the history of man are treasured up in India and India only." -- Max Mueller
 ఈ ప్రశంస చాలు మనము మన పూర్వుల గొప్పదనము గుర్తించుటకు.
మానవుని జీవన కాలము యుగయుగమునకూ మారుతుంది. దశరథుడు 13 వేల సంవత్సరములు, శ్రీరాముడు 11 వేల సంవత్సరములు జీవించినట్లు మనము వాల్మీకి రామాయణము ద్వారా తెలుసుకొంటాము. ప్రాణము అంటే ఉఛ్వాస నిశ్వాస. దానిని నియంత్రించే శక్తినిబట్టి మనిషి యొక్క ఆయుర్ధాయము ఆధారపడి ఉంటుంది. ఋషులు అట్టి మహానుభావులు. మరి వ్యాసుడు విష్ణ్వంశ సంభూతుడు. పైగా మహా ఋషి. అసలు ఆయనను చిరంజీవిగా పురాణములు ఘోషించుచున్నాయి. అసలు ద్వాపరమునకు సంబంధించిన ఆ మహానుభావుడు కలియుగములో శంకరులవారికి ప్రత్యక్షమై 16 సంవత్సరముల అదనపు ఆయుర్దాయమును తన తపఃశక్తి నుండి ధారపోయలేదా! ఇటువంటి అనేకానేక దృష్టాంతరములు చూచిన తరువాత  నాకు మహనీయులకు సాధ్యము కానిది లేదు అనిపిస్తుంది. వ్యాసుని వంటి దైవాంశతో జన్మించినవారు, అఖండ తస్సంపంనులు, ఇట్టిపనులు చేయుటలో ఆశ్చర్యము కానరాదు.
ఈ ఉపోద్ఘాతముతో మనము యుద్ధభూమిని ప్రవేశించుదాము.
మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య
18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత అన్నది ఒకసారి తెలుసుకొందాము.
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంటులు (పదాతి దళం) కలిసితే సైన్యములో దానిని ‘పత్తి' అని అంటారు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.  వాహినికి మూడు రెట్లు ‘పృతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పృతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.
ఇప్పుడు మనము చర్చించ బోయే విషయములో ముఖ్యముగా గుర్తుంచుకొనవలసినది యుద్ధము జరిగినది 18 రోజులే. హతులుకాగా మిగిలినది 15, 16 మంది మాత్రమే! వారెవరు అన్నది చివరన తెలుపుకొంటాను. 18 రోజులలో 18 అక్షౌహిణులను మట్టుబెట్టవలెనంటే బాణములతో బల్లెములతో సాధ్యమా! చూద్దాము.
మహాభారత యుద్ధము  మహాభీకరమయిన  యుద్ధము.దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధము ద్వాపరయుగ అంతమునకు ఏర్పడిన ప్రళయముగా మనము భావించవచ్చు.
దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో పాశవిక రసాయన మారణాస్త్రాలను ఉపయోగించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఆకాలములో కౌరవ పాండవులకు ఏవిధముగా లభించి వుండవచ్చు అన్నది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. సమాధానమును సాధించే ప్రయత్నమూ చేద్దాము.
వ్యాసుని హరివంశములో కొన్ని చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. తరువాతి కాలములో కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించిన నిర్దుష్ట చరిత్ర దొరుకుతుంది. ఈ రచనలకు ఆలంబనమే శ్రీకృష్ణ ద్వైపాయనుడు వ్రాసిన హరివంశము. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశ, చంద్రవంశ రాజుల చరిత్రలు వున్నాయి.
క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. వ్యాసుని వ్రాతలను నేటి కాలమానమునకు మార్చితే,  క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు మనకు తెలియవస్తూవుంది. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చినారు అని చదివినాను కానీ అందుకు తగిన ఆధారమును పొందుట నాకు అసాధ్యమైన విషయము. అయినా ఈ శీర్షికపై మన వివరణకు వచ్చిన ఇబ్బందిలేదు.
మహాభారత యుద్ధ కాలం
భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించియుండినట్లు మనకు తెలియవస్తూవున్నది. భీష్ముడు సైన్యాధిపతిగా యుద్ధము చేసినది పదిరోజులు. పదవ రోజు సాయంత్రము శిఖండిని ముందుంచుకొన్న  అర్జనునితో  యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో ఆయన అస్త్ర సన్యాసం చేయుట జరిగినది. ఇందుకు సంబంధించిన వివరములు భీష్మార్జున యుద్ధము  లో వ్రాసినాను. అంటే భీష్ముడు గతించిన 68 రోజులకు పూర్వము మహాభారత యుద్ధము ప్రారంభమైనట్లే కదా! అంటే మహాభారత సంగ్రామము సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైనదని చెప్పుకొనవచ్చును. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే ,89 లక్షలుగా  నమోదు చేసినారు.
బ్ర.శ్రీ. కోట వేంకటా చలం గారు వ్రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించినారు.
రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు లేనిదే ఇంత మారణ హోమము అంత తక్కువసమయములో జరుగ వీలులేదు అని కొందరు ప్రఖ్యాత చరిత్రకారులు ఖండితముగా చెప్పినారు.
భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతము ద్వారా మనకు తెలియవస్తూ వున్నది. ఈ నారదుడు 372 కాంతిసంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం  ఆనాడు వుండేదని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలినట్లు కొందరు ఈవిషయమీ కృషి చేసినవారు చెప్పగా విన్నాను.
వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానము శ్రీకృష్ణుని ద్వారానూ, మరెన్నో విధములుగానూ పాండవులకు, ముఖ్యముగా అర్జనునికి లభించినట్లుగా భారతము లోతుగా చదివితే మనకవగాతమౌతుంది. ఖాండవ దహన సందర్భములో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి ఇచ్చిన సుదర్శనచక్రము ఒక rotating sharp edged distence control weapon గానూ,  గాండీవమును launcher గానూ  అక్షయ బాణ తూణీరాలను missils గానూ పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ మారణాస్త్రాల వినియోగం వల్ల బుగ్గియైపోయినది.
ఈ అస్త్రాలను వినియోగించేందుకు అతి నిగూఢమైన Passwordలాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరూ, Control Button లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇంకా సమగ్రముగా పరిశోధించవలసిన అంశము.
Remote Control ద్వారా అస్త్రాల ప్రయోగం
అణ్వాస్త్రాల సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి GPS Advanced Technology తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు.
ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్న అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!
అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటున్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ అన్న Scientist, 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి PHd. పట్టా పొందుట జరిగినది. కొంత లోతుగా ఆలోచించితే ఈ అస్త్రాలన్నీ ప్రస్తుతము ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా ఉండినట్లు ఒక అంచనా.
మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల నుండి గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడినట్లు పరిశోధకులకు తెలియవస్తూ వుంది. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువులు ప్రయోగించిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేసినట్లు వ్యాసులవారు భాత్రతమునండు తెలియజేసినారు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే ప్రతిభావంతమగు ప్రతిఘటన శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి దానిని నిర్వీర్యము చేస్తుంది. కావున మహాభారత యుద్ధములో దాదాపు కోటి యోధులు మరణించినారంటే ఈ యుద్ధం Missils లేకుండా జరిగిఉన్దదనె చెప్పవలసి వస్తుంది.
ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.
క్రీస్తుకు పూర్వం భూమిపైన ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన 'అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో Epi-center (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై వారికి కనపడటం జరిగింది. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. అంటే పైన చెప్పిన కాలమునకు ఇది సరిపోతూ ఉంది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించినారు.
అస్త్రాల వివరాలు
మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబుల వంటి ఆయుధాలు ఉన్నట్లు తెలిపినారు. పది సూర్యులనుండి  ప్రసరించగల వేడిమి పుట్టించే అస్త్రాలు వున్నట్లు తెలుపటం జరిగింది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను కూడా ప్రయోగించినారని పేర్కొన్నారు. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయినాయణి అందు వ్రాయబడి ఉంది. రణభూమిలోని గుడారాల్లో భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారితే అసంఖ్యాకులగు సైనికులు పారిపోయి నదులలో మునిగి ఆ నీరు త్రాగి ప్రాణాలు కాపాడుకొన్నారు అని తెలియవస్తూ వుంది.
మహాభారతంలో ఒక్క బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. దుర్యోధనుడు మరణించిన పిదప అశ్వత్థామ ఆపని చేయబోయినాడు కానీ శ్రీకృష్ణుదు దానిని వారించి అతని నొసట ఉన్న మణిని తీసుకొని ఆతనిని, చిరంజీవి కాబట్టి, అడవులలో సంచరించుతూ ఉండమని చెప్పినాడు. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా ఆయన వ్యూహరచన అమోఘము, అనన్యసాధ్యము. తానూ పరమాత్మే యని చెప్పుకొన్న వేదవేద్యుడు.
అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం’ అన్న గీతా వాక్యమును సార్థకము చేసి, యుద్ధమున ఉపయోగించిన సమస్త అస్త్రశాస్త్రములనూ సముద్రమున ముంచనాదేశించి పునః ‘ధర్మస్థాపన’ చేసిన ఆ త్రిజగాన్వంద్యునికి సాష్టాంగ ప్రణామము మనసారా చేస్తూ శెలవు తీసుకొంటున్నాను. .
స్వస్తి

విద్య-ఆచార్యుడు-ఆచారము.

విద్య-ఆచార్యుడు-ఆచారము.
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post.html

   ‘విద్‌’ అన్న ధాతువునకు స్థూలముగా అర్థము జ్ఞానము అని అన్వయించుకోవచ్చు. విద్య అంటే విజ్ఞానము. విద్య నేర్చుకోవటమంటే, ఈనాటి అర్థములో, విజ్ఞానాన్ని(పూర్వులు విజ్ఞానమును బ్రహ్మత్వముగా నిర్వచించినారు)  సంపాదించుట. ఒకసారి ఈ శ్లోకమును చూడండి.

విద్యాదదాతి వినయమ్‌ వినయాద్యాతి పాత్రతామ్‌l

పాత్రత్వాత్‌ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్‌ll

అని విద్యాప్రయోజనాలను ఏనాడో వివరించినారు భర్తృహరి తన సుభాషిత గ్రంథములోని నీతి శతకములో. పై విషయాన్నే ఏనుగు లక్ష్మణ కవి తానాంధ్రీకారించిన భర్తృహరి సుభాషితములలో

విద్య యొసగును వినయంబు వినయమునను

బడయు పాత్రత; పాత్రత వలని ధనము

ధనము వలనను ధర్మంబు; దానివలన

నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

అని అన్నాడు.

అనగా విద్య వలన వినయము, ఆ వినయము వలన పాత్రత (యోగ్యత), దానివలన ధనము, ధనము ధర్మాచరణమునకు మాత్రమే ఉపయోగించవలెను. ఆ ధర్మమే ఇహపర సుఖసాధానము.

వినయానికి ప్రథమ శత్రువు అహంకారమనిఅంటారు శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన తన కథామృతంలో అహంకారం యొక్క స్వరూపమేమిటోఈ విధముగా తెలుపుతాడు. మిణుగురు పురుగు సూర్యుడు అస్తమించిన వెంటనే ప్రపంచం అంతా చీకటి ఆవరించినప్పుడు, ప్రపంచానికంతటికీ తానే వెలుగునిస్తున్నానని భావిస్తుంది. ఇంతలో నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అవి ప్రకాశిస్తూ, ప్రపంచం అంతా తామే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. అంతలో చంద్రుడు వచ్చి, తన కాంతి వల్లే భూమి వెలుగుతోంది అనుకుంటాడు. సూర్యోదయం కాగానే ఇవ్వన్నీ కనుమరుగవుతాయి. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయని తెలియక, మిడి మిడి జ్ఞానంతో తామే గొప్పవాళ్ళమని అహంకారులు మిడిసిపడుతుంటారు. కానీ నిరంతరమూ ఏదో ఒకటి నేర్చుకుంటూ, తాను తెలుసుకోవలసినది జీవితాంతమూ ఉంటుందని, అసలు జీవితము చాలదని  భావించేవాడు అహంకారానికి లోనుకాడు.

వినయసంపన్నమైన విద్యే మనిషికి అలంకారం అని తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రుల పట్లా, గురువులు, పెద్దల పట్లా వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ, వారి అనుభవాల సారం తాను గ్రహిస్తూ, తన వివేకాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు.

విద్య గొప్పతనాన్ని తెలిపే ఈ శాస్త్ర వాక్యమును చూడండి.

నచోర హార్యం నచ రాజ హార్యం

న భ్రాతృ భాజ్యం నచ భార కారీ

వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం

విద్యా ధనం సర్వ ధన ప్రధానం

 చోరులచే దొంగిలింప బడలేనిది, రాజులచే ఆక్రమింపబడలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది, ఎంత సంపాదించినా భారము కానిది, దానిని పదుగురికీ పంచేకొద్దీ ఇంకా పెంచేదీ అయినటువంటి విద్యాదానము అన్నివిధములగు సంపదలకూ ప్రధానము. అంతేగాక భర్తృహరి సంస్కృత భాషలో వివరించిన విద్యాప్రయోజనాలను తెలుగు భాషలో ఏనుగులక్ష్మణకవి

విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్

విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్

విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,

విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే?

విద్య పరులకు కనిపించని పెన్నిధి, విద్య ఎనలేని గౌరవమును ఆర్జించి పెట్టేది, ఇహపర భోగములకు ఆలంబనమైనది, విదేశములలో గుర్తింపు తెచ్చేది, విద్య అన్నది మన బాగును వెంట వుండి చూస్య్కొనే విశిష్టమగు దైవసమానము, ఈ భువిలో విద్యకు సాటి ధనము లేదు, పైపెచ్చు  విద్య రాజ సన్మానములను లభింప జేస్తుంది.  అట్టి విద్య లేని వానిని మనిషిగా జమ కట్టగలమా! అసలు ఈ భర్తృహరి సుభాషితములను తెనుంగు జేసిన ఎలకూచి బాలసరస్వతి అన్న కవి 'విద్య లేనివాడు వింత పశువు' అన్నాడు.

అటువంటి విద్యనేర్చుకోవటానికి ప్రాచీన కాలంలో గురుకులాలుండేవి. ఊరికి దూరంగా జనావాసంలేని చోట వనాల లో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన గురుకు లాలలో విద్యార్థులు చేరి, గురుశుశ్రూష గావించి విద్య నేర్చుకునే వారు. తరతమ బేధాలు లేకుండా అంతా గురుపుత్రుల వలె మెలగి సేవచేస్తూ విద్యాసముపార్జన గావించేవారు. అందుకే ఆనాడు విద్య నేర్పు వ్యక్తిని గురువనేవారు. నేర్చుకునే వ్యక్తిని శిష్యుడు అనేవారు. గురుశిష్యులకు పితా పుత్ర సంబంధం ఉండేది. గురువుకు శిష్యుల పట్ల పుత్రవాత్సల్యం ఉండేది. శిష్యులకు గురువు పట్ల పితృభావన ఉండేది. ఈ విద్య విద్యార్థికి బ్రతుకును ఫలవంతంగా సాగించటానికి ఉపయోగపడేది. విద్య నేర్చుకొనేవారికి జ్ఞానసముపార్జనే పరమావధి. ఆ జ్ఞానాన్ని అవసరమైన మేరకు జీవనాన్ని గడుపుకోవటానికే వినియోగించేవారు. ఈ విద్యను నేర్చుకునే విధానంలో నాలుగు భాగాలుగా వినియోగించుకునేవారు.

ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।

పాదం సబ్రహ్మచారిభ్యః, పాదం కాలక్రమేణ చ ॥

ఇది శాస్త్ర వచనము. ఆచార్యుడు లేదా గురువు వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది  నాలుగవ వంతు మాత్రమే. మరియొక  నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు. మరి యొక, నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారుల అనగా తన సహా పాఠకుల' నుండి చర్చలద్వారా నేర్చుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలోని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల, పరిశోధనల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు. అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు. అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అన్న వాస్తవాన్ని ఈ శ్లోకము తెలియజేస్తూవుంది. దీనికి 1. తొలగింపులు(Deletions),2. మార్పులు(Modifications), 3. సవరణలు (Corrections) అవసరము. ఈ విధానమును చిత్తశుద్ధితో ఆచరించితే మనము చైతన్య వంతులమగుతయే గాక దేశమునే చైతన్యవంతము చేయవచ్చును.

నిజానికి ఇపుడు పాఠశాలలు, కళాశాలలలో నేర్పించే విద్య విద్యయే కాదు. దానివల్ల కలిగే ఉపయోగమూ లేదు. స్థానిక కళాశాలలో లక్షలు కట్టి చదివి B.Tech పట్టా తెచ్చుకొంటారు,Bank లోనో గుమస్తాగా చేరిపోతారు. అదే IIT లో పుచ్చుకొన్న B.Tech పట్టా ఎంతో విలువైనది. దానిని పుచ్చుకొన్నవాళ్ళు ధనార్జన కొరకు తమ మేధస్సును విదేశాలకమ్ముకొంటారు. రెండూ దేశ ప్రగతికి నష్టమే. ప్రభుత్వము వేల కోట్ల డబ్బును చదువుకు వెచ్చించుతూవుంది. ఎక్కువ భాగము బూడిదలో పోసిన పన్నీరే! దీనికి ఒక ముఖ్యమైన కారణము మనము మన సాంప్రదాయము నుండి ఎంతో దూరము పయనించి ఈరోజు మనమలవరచుకొన్న ఎంగిలి సంప్రదాయమే మనదిగా భావించుచున్నాము.

కాస్త ఓపికతో మన సంస్కృతి అంటే ఏమిటో స్తాళీ పులాకముగా పరిశీలించుదాము. మనకు నిజానికి సంస్కృతి 4 విధములుగా లభ్యమౌతూవుంది. 1. మన దేశీయ ఆచార వ్యవహారాలూ, 2. మన దైవచింతనా విధానములు, 3. మన సారస్వతము, 4. మన వివిధ శాస్త్రవిజ్ఞానము (Scientific and technological Knowledge).

మన ఆచార వ్యవహారములను తిరిగీ మూడు భాగములుగా విభజించవచ్చును. 1. సదాచారము, 2. దురాచారము, 3. అనాచారము.

1.     సదాచారము: ఇది సర్వదా పాటించదగినది. మరి మనము, మన అవసరములకొరకు అనేకమయిన ఊళ్లు, పట్టణాలు తిరుగుతూ ఉంటాము కదా! అప్పుడెట్లు? అంటే దానికి కూడా పెద్దలు ఒక వెసలుబాటును తెలియబరచినారు.

స్వగ్రామే పూర్ణమాచారం అన్యగ్రామే తదర్థకంl

పట్టణేషుచ తత్పాదం యాత్రే బాల సమాచరేత్ll

తనవయిన నిత్య దినచర్య కలిగిన వ్యక్తి తన స్వంత ఊరిలోనున్నా, లేదు మాటవరుసకు తన అత్త గారి యింటికి వెళ్ళినా, లేక అంతే ముఖ్యమైన బంధువుల ఇంటికి వెళ్ళినా తన ఆచారమును పూర్తిగా పాటించే అవకాశముంటుంది. అదే పరాయి ఊరికి పోయినపుడు తన ఆచారములలోని అర్ధ భాగము పాటించితే చాలును. అదే నగరాలకు, పట్టణాలకు పోతే మనదయిన రీతిలో నడచుకొను అవకాశము బాగా తగ్గిపోతుంది. అప్పుడు 1\4 వంతు ఆచారము పాటించితే చాలు. ఇక యాత్రలు అంటే ఏవిదేశాలకో పోతే పిల్లలవలె కట్టుబాట్లు లేకుండా ఉండవచ్చును. కానీ, స్వదేశస్థుల వలె కాకుండా, విదేశమునే స్వదేశముగా భావించిన వారు తమ ఆచారముల కాపాడుకొనుటకు ప్రయత్నము చేయుచున్నారు. ఇది సంతోషించదగ్గ విషయము. అసలు ఏ పరిస్థితులలో కూడా ఆచారము పాటించవలసిందే అన్న నైష్ఠికులు కొందరు ఉంటారు. దానికి కూడా శాస్త్రము సమాధ్జానము చెప్పినది.

తాతస్య కూపోయం ఇతి బ్రువాణ కాపురుషః క్షారజాలం పిబతి.

తండ్రి త్రవ్వించిన బావియని తనయులు అందలి ఉప్పునీరు త్రాగ గలరా! అంటే ఇక్కడ పరిశీలన అవసరము. కావున మన ఆచారమునకు పరిశీలన, చిత్తశుద్ధి కూడా అవసరమే!

ఈ పరిశీలనకు సహకరించేవాడే ఆచార్యుడు.

ఆచినోతిచ శాస్త్రార్థాన్ శిష్యాన్ సాధయతే సుధీ

స్వయం ఆచరతీచైవ సహా ఆచార్య ఇతిస్మృతాం

ఎంతటి గోప్పమాటో చూడండి. తండ్రి త్రవ్వించిన బావియని రోజూ అందలి ఉప్పునీరు త్రాగాలేము కదా! కాబట్టి సమంజసతకు చిత్తశుద్ధిని చేర్చి, విశ్లేషించి, వితర్కించి ఒక ఆచారమును మనము అవలంబించవలసియుంటుంది. పాతదని త్రోసివేయనూ అక్కర లేదు, క్రొత్తదని అక్కున చేర్చుకోనూ అక్కరలేదు. నా అనుభవమే చెబుతున్నాను. ఒక 50 సంవత్సరాల క్రితము నా మిత్రుడగు ఒక ఆధునిక Doctor తో మాట్లాడు సమయములో ఆరోగ్యమును గూర్చిణ చర్చ వస్తే సూర్య నమస్కారములు ఆరోగ్యమునకు చాలామంచిది అన్నాను. అప్పుడు ఆయన ఒక చిరునవ్వుతో ఆమాటను కొట్టివేసినాడు. నేను కూడా అటుపిమ్మట ఆ ప్రస్తాపన తేలేదు.

కానీ ఈనాడు  Indian Institute of Medical sciences అత్యుత్తమ ఆరోగ్య సాధనగా, అంటే ఈ సాధనాలకు రారాజుగా ‘సూర్య నమస్కారము’ను నిర్ణయించినారు.

ఒక మంత్రమును వేద సదస్సులో వింటున్నామనుకొండి. అది మరీ మంద్రస్థాయి లోనో మరీ తారాస్తాయిలోనో ఉచ్చరించక మధ్యమ స్థాయిలో ఉచ్చరించుతుంటారు. మనకు అర్థము కాకపోయినా ఆ ఉచ్చారణలోని లయకు తన్మయులమౌతూ ఉంటాము. నిజానికి ఈ వినికిడికి భక్తి భావము మాత్రమే కారణము కాకపోవచ్చును. మన మెదడులో ఊరుచున్న 24 విధములగు వినాళ రసములు (Harmones) స్రవించి మెదడునందలి తరంగములు 13.8 cycles\second గా ఉండునట్లు నియంత్రింప బడుతుంది. అది మన గుండె కొట్టుకొను వేగమును 68+or- గా నియంత్రించుతుంది. దీనిని Neuro linguistic effect అంటారు. ఆవేదమంత్రము వినునపుడు శరీరములో జీవరసాయన క్రియలు (Biochemical) సంభవించుతాయి. యోగమును అనుసరించేవారు దీనిని βLevel Meditation కు చెందుతుంది అంటారు. ఈ తరంగములు 8.3 కు వస్తే దానిని α Level Meditation అంటారు. అదే 4 కు వస్తే దానిని Θ Level Meditation అంటారు. 10 నిముసముల Θ Level Meditation 10 గంటల నిదురకు సమానము.  ఈ వేదమంత్ర శ్రవణము రక్తపు వత్తిడి (Blood Pressure)ని నియంత్రించుటయే కాక మెదడు తరంగములను 3 వద్దకు తెస్తాయి. ఈ విషయమును నేటి సైంటిస్టులు కూడా బలపరచినారు. అందుకే వేదమంత్రపఠనము జరుగునపుడు మౌనము పాటించవలయునన్నది మన పెద్దలు ఏర్పరచిన ఆచారము.

తల ఉత్తరమువైపు పెట్టుకోకూడదన్నది మన పెద్దలు చెప్పిన ఆచారము. శరీరమునకు తల ఉత్తరధృవము. మరి తల ఉత్తరమువైపు ఉంచితే ‘అభిన్న ధృవములు వికర్షణ చెందుతాయని నేటి Science చేబుతూవుందికదా! కావున తూర్పునకు గానీ పడమరకు గానీ తలయుంచి పడుకొనుట

శ్రేష్ఠము. అధమము దక్షిణము వైపు తల ఉంచడము. ఉత్తరమున మాత్రము ఉంచరాదన్నది మన పూర్వాచారము.

భూమిపై ఏదయినా చాప, పట్టా, పీట లాంటివి వేసుకొని కూర్చొనుట ఆచారము. నేటి సైన్సు దానిని కూడా బలపరుచుతూ వుంది. కూర్చునుటకు అవి వాడుట చేత శరీరములోని Bio-Static Electricity నేరుగా భూమిని అంటదు. అవి Non-Conductors కాబట్టి.

23% పరుపు పై నుండి తటాలున లేచుటవల్ల హృద్రోగములు వస్తూ వున్నాయి అన్నది 1993 లో WHO ద్రువపరచిన మాట.

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

రాత్రి నిదురించిన వ్యక్తి ఉదయము పడకపైనుండి లేచినవెంటనే దిగ్గున లేయకూడదు. అట్లు లేయుట అనేక హృద్రోగములకు కారణము కావచ్చును. అందుకే మనము ప్రక్కలకు తిరిగి నెమ్మదిగా నిదురలేచి పరుపుపైనే కూర్చుని, ఈ క్రింది శ్లోకమును చెప్పుకొని క్రిందికి దిగమన్నారు.

కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతిl

కరమూలె స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనంll

ఇక మన ఆచారమగు మొదట చెప్పిన సముద్ర వసనే దేవీ శ్లోకాన్ని తాను వినియుండకపోయినా Fritj of Capra అన్న Scientist పై శ్లోకమును ఎంత బలపరచుచున్నాడో చూడండి.

The Bio-Static electricity in your body that you gained by rolling on the bed should not get defused by keeping your legs on the carpet or some such thing other than the floor. This may lead to arthritis over a period of 25 years or so.

Fritj of Capra:

Berkley University Theoretical Physics Head of the Department and

A sitting scientist of 17 US Universities in US. He is the author of several books, including The Tao of Physics (1975), The Turning Point (1982), Uncommon Wisdom (1988), ‘The Web of Life (1996)’, The Hidden Connections (2002) and The Systems View of Life (2014).

 

Where the ultramodern physics has come to an abrupt end then starts the ancient Indian Upanishadic philosophy. -Einstein

మరి పాశ్చాత్యులు ఇంతగా మెచ్చుకొంటూ వున్నా మన గొంగడి మాత్రము వేసిన చోటే వుంది.

ఈ సందర్భములో ఈశావాస్యోపనిషత్ లోని ఈ శ్లోక సారమును తెలుసుకొందాము.

.

ఈశావాస్యోపనిషత్ లోని ఈ మొదటి శ్లోకమును చూడండి.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్

తేనత్యక్తేన భుంజీథాః మాగృథః కస్యస్విద్ధనం

ఏవేవయితే మన ఇంద్రియానుభూతులద్వారా కలవు అని తలచుతూ ఉన్నామో వానియందంతా ఆపరమేశుడు వసించుచున్నాడు.

జగత్యాం జగత్: భూమి ఒక ఇరుసుపై తన కక్ష్యలో తిరుగుతూ వున్నదని మనకు తెలుసు.;

జగత్ అన్న పదమునకు అర్థమేమిటంటే ‘పునః పునః గచ్చతి ఇతి జగత్’ ‘ప్రకర్షేణ  గచ్ఛతి ఇతి జగత్’. పరివర్తన అంటే పరిభ్రమించుతూ వుంటుంది కావున ఇది జగత్

ఈ పరిభ్రమించే జగత్తులో పరివేష్టితమైయున్న పదార్థమే జగత్తు. అంటే ఏదయితే తన అక్షముచుట్టూ పరిభ్రమించుతూ వుందో  అందులోవుందేదే జగత్తు. ఆజగత్తునిండా వ్యాపితమైయున్నవాడు భగవంతుడు.

అసలు గణిత శాస్త్ర పరముగా ఈ శ్లోకమును విశ్లేషించుట అత్యంత సలభము, సుకరము. పూర్ణము అన్న మాటకు Zero అన్న అర్థమును Infinity అన్న అర్థమును చెప్పుకోవచ్చు. ఈ శ్లోకము ఏమి చెప్పుచున్నదంటే సున్నా నుండి సున్నా తీసివేసినా, కూడినా సున్నాయే వస్తుంది. సున్నాను సున్నాతో హెచ్చవేసినా, భాగించినా సున్నాయే వస్తుంది. అదేవిధముగా అనంతము (Infinity) నుండి అనంతము తీసివేసినా, కూడినా అనంతమే వస్తుంది. అనంతమును అనంతముతో హెచ్చవేసినా, భాగించినా అనంతమే వస్తుంది ఇది చాలు పరమాత్మ తత్వము తెలుసుకొనుటకు.

ఇంకొక ఆచారము చూద్దాము.

అరుణ ప్రశ్న లో ఈ విధముగా వున్నది.

'నాప్సో మూత్ర పురీషం కుర్యాత్ న నిష్ఠిరేత్ తద్ వ్రతం

జీవనమునకు ప్రవహించు జలము ఉన్నచోట మూత్రపురీషములు చేయకూడదు. అలాగే ఉమ్ముట చీదుట చేయరాదు. మరి నేడు నెత్తిన నోరుపెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నది ఇదేకదా!

ఈ శ్లోకమును చూడండి.

భూమిరాపోనలోవాయుః ఖమ్మనో బుద్ధిరేవచ

అహంకారమితీయమ్మే భిన్నాః ప్రకృతిరష్టద

పంచాభూతములకు తోడూ, మనసు, బుద్ధి, అహంకారము అన్న ఈ 8 ప్రకృతి గుణములు. ఏది అతిశయించినా మానవునికి అది ప్రళయమే!

అత్యుత్తమమైన అతి సాధారణ ఆచారాలు మరచినాము. 1. బియ్యపు పిండితో ముగ్గు పెట్టుట- భూత తర్పణము అంటే చీమల వంటి జీవులకు ఆహారమును అనునిత్యము ఒసంగుట. ఆవు ప్దెఅ కలిపినా నీటితో కళ్ళాపి చల్లడము-అనారోగ్య హేతువులైన క్రిమికీటకములను ఇంటిలోనికి చేరనీయకుండుట

పంచ(ధోవతి) కట్టుకొనుట- నడుము క్రిందినుండి పాదములవరకు గాలి ప్రసరించి ఆయా అంగములను ఆరోగ్యముగా నుంచుట. ఇటువంటివన్నీ సదాచారములు. దోగాడే పిల్లల శరీరమును శీతోష్ణ స్థితి అనుకూలముగా బట్టలు వేయుటకు బదులు బిగుతు బట్టలు వేసి, అది చాలదని diapers బంధించి యుంచుట మొదలయినవి అనాచారములు. బొట్టు, మెట్టెలు, గాజులు, తాళి, పాపిట, జడ ఇవన్నీ వదిలి పెళ్ళయిన స్త్రీలేర్పరచుకొన్న కొత్త దురాచారము. ఆచారములను ఇట్లు 3 తెగలుగా విభజింపవచ్చును.

చివరిగా ఒక్కమాట చెప్పి ఈ వ్యాసమును ముగించుతాను. ఒక ఆధునిక పండితుడు వేదములకు తెలుగులో భాష్యము వ్రాసినాడు. అది సాయన భాష్యమంత సమగ్రమా కాదా అన్నది ప్రక్కనుంచితే నేడది హిందువులకన్నా హైదవేతరులు మన ధర్మమును తప్పు పట్టుటకు బహుళముగా ఉపయోగపడుచున్నది. వ్రాయుసమయమును ఆయన ఈ పరిణామమును ఊహించియున్డక పోవచ్చు. పాండిత్యము చూపించుట గొప్పదనము కాదు అది సంఘమునకు ఎంతవరకూ శ్రేయోదాయకము అన్నది గుర్తుంచుకొనవలసిన విషయము. వేదార్థమును గ్రహించుట అంత సులభము కాదు అన్న విషయము సులభముగా అర్థమగుటకు ఈ విషయము తెలుపుచున్నాను.  .

అధర్వణ వేదము 12వ కాండలో

మాతా భూమిః పుత్రోహం పృథివ్యా అని చెప్పబడినది.

ఈ భూమి మనకు తల్లి. మనమంతా ఆమె సంతానమే! ఈ మాట మనము భూమిని ఎంతగా అరాధించవలెనో తెలియ జేస్తూ వున్నది. ఆమె వసువువులను ధరించి వసుంధర అయినది. మరి వానిని స్వార్థబుద్ధితో అతిగా త్రవ్వి వెలికి దీసి అమ్ముకొని వేలకోట్లు సంపాదిన్చుచున్నామే మరి చివరిరోజు ఈ సంపదను వెంట తీసుకొని పోగలమా! అటువంటప్పుడు ఎందుకు ఈ తపన.

సువర్ణము అన్న మాటకు బంగారము అన్న లౌకికమైన అర్థము ఉన్నాకూడా నిజానికి అది  వేదము లో సు+వర్ణము అన్న మాట వస్తుంది. సువర్ణము అనగా అత్యంత శ్రేష్ఠమైన వర్ణము అనగా అక్షరము. అదే ‘ఓంకారము’. ఓంకారమే  సువర్ణము. అది తెలుసుకోలేక బంగారము వెంట పరుగు పెడుతూ ఉన్నాము. ఈ మాట ఎందుకు చెప్పినానంటే ఒక్కొక్కసారి వేదములో ఉపయోగించిన ఒక్కొక్క పదము ఎన్నో అర్థములు కలిగియుంటుంది. సాధారణ మానవులము. మనము వేదభావమును ఆకళింపు చేసుకోలేము. మామిడి కాయ అతిపులుపుగా వుంటుంది. దానితో చేసిన పప్పు, పచ్చడి లొట్టలు వేసుకొంటూ తింటాము. అంతగా మామిడి కాయను తినలేము కదా! అందుకే మనకు పురాణ శాస్త్ర ఇతిహాసములను మన పెద్దలు మనకు అందజేసినది. అర్థము చేసుకొంటే మనకూ, మన భావితరాలకూ మంచిది.

అదే విధముగా ఇంకొక మాట చూద్దాము. వరాహము అంటే కేవలము సూకరము, పంది అన్నది మాత్రమే అర్థము కాదు. దానిని వర+ అహముగా విడదీయవచ్చు. వర అంటే వరించదగినది. అహము అంటే ‘నాది’ అని అర్థము అన్న విషయము మనకు తెలిసినదే! అంటే నాదిగా తీసుకొనవలసినది. 'నాది' అని స్వంతము చేసుకోవలసిన క్షేత్రములో నాటవలసిన ఓంకారము అన్న బీజము అని అర్థము చేసుకొంటే జగమంతా సౌభాగ్యమే!     

స్వస్తి.