యజ్ఞము – జంతుబలి
https://cherukuramamohanrao.blogspot.com/2018/12/blog-post.html
తస్మాత్ శాస్త్రం
ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా
శాస్త్రవిధానోక్తం కర్మ కర్తృ నిహాతసి
ఒక పనిని చేయవచ్చునా
చేయకూడదా అన్న సందేహము మనలో కలిగినపుడు
ఆ
సందేహ నివృత్తి చేయగలిగినది శాస్త్రం మాత్రమే
అన్నది
భగవంతుడు భగవద్గీత 3వ అధ్యాయములో చెప్పిన మాట.లో చెప్పిన మాట.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా
పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 10 ।।
3.10: సృష్టి
ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని
వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు, "ఈ
యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త కోరికలను
తీరుస్తాయి."
దేవాన్ భావయతానేన తే దేవా
భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః
పరమవాప్స్యథ ।। 11
।।
3.11: మీ
యజ్ఞముల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల
పరస్పర సహకారం వలన అందరికీ శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.
1957లో
పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం
చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ
సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరైనారు. కారణమేదైనప్పటికి
జంతువులను చంపడం పాపం అని తీర్మానించినారు. కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ
శాఖాహారులుగా మారాలి అని చెప్పినారు. అహింస, శాఖాహార
ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించుట
జరిగినది.
ఆ సదస్సు ముగిసిన తరువాత
థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులను పరమాచార్యులవారి
అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చుట జరిగినది. స్వాములవారిని కలియుటకు ఆ
ప్రతినిధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
శంకర మీనన్ అందరిని పేరు
ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసినారు. వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి
గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి
చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు.
కొంతమంది ప్రతినిధులు
స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే
మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”
అందుకు మహాస్వామి వారు “పాపము
కాదు. అది చేయతగినదే’ అన్నారు. ఇది వినగానే వారందరూ నవ్వినారు. వారు గురుదేవుని
అవమానపరచినారని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు
తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు
అని తెలిసుంటే నేను ఈ పనికి ఒప్పుకొనేవాడను కాదు” అని గట్టిగా కేకలు వేసినారు.
స్వామివారు మీనన్ ను
శాంతపరిచి “వారిపై కోపపడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చి ఈ ప్రశ్నను
అడిగినారు. జీవహింస ఏ కారణముగా చేసినా పాపమని,
అది ఎటులయినా అమోదయోగ్యము కాదు అను నిర్ధారణ కలిగియుండుటచే వారు నా సమాధానము వారి
ఊహకు వ్యతిరేకముగా ఉండుటచే నవ్వినారు. నన్ను అవమాన పరచుఉద్దేశ్యము వారిలో లేదు. ఇపుడు
వారికి అర్థమయ్యే రీతి లో సమాధానము చెప్పుట
మన బాధ్యత”” అని శాంతగంభీరముగా పలికినారు.
స్వామివారు ఆ విదేసహీయులను
చూస్తూ, ఇలా చెప్పదొడగినారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ
విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతిని
మరచి, ఆవేశపూరితుడై ఒకవ్యక్తిని చంపినాడు. మరియాతని కోర్టు ఉరితీయుట జీవహింసయేకదా? న్యాయమూర్తి చెసినది పాపము
కాదా?”
స్వామి వారి మాటలు వారిని
అలోచనలో పడవేసినాయి. వారు చాలా విద్యావంతులు. స్వామి వారు చెబుతున్నది ఎంతో
తార్కికముగా ఉన్నట్లు వారు అర్థము
చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూప దొడగినారు.
మరులా మహాస్వామివారు చెప్పనారంభించినారు
“నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, మిగత Traffic ను ఆపి ప్రాణమునునిలబెట్టుటకు
దోహదము చేసే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే Traffic లో ఉన్న అంతమంది ప్రయాణము
కంటే ఆపదలో ఉన్న ఆ ప్రాణము గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనము ఒకే పర్యాయము వచ్చినవి అనుకొంటే అప్పుడు ముందు
అగ్నిమాకప వాహనమును పంపించుతారు. అంటే అక్కడ ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు
గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనము, అత్యవసర స్థితిలో
లో వెళుతున్న ఒక మిలటరి వాహనము వస్తే ముందు మిలటరి వాహనమును పంపుతాము. అక్కడ, కొంతమంది
ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది కాబట్టి. ఆ సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది
ప్రాణాలను లెక్కచెయ్యము.
రాజ్యాన్ని
రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు.
ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి?
కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం
జీవహింసను అమోదిస్తాము. ఇలాంటి నియమాలన్నీ మనము ఏర్పరుచుకున్నవే! అలాగే యజ్ఞాలలో
ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం
కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.
వేదం అపౌరుషేయం. అది
పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలు అభేదమయినవి. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ
సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు శుభదము సుఖదము అగు విషయములను
మాత్రమే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పుచున్నాడు.
దేవాన్ భావయతానేన తే దేవా
భావయంతు వఃl
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథll
మనం యజ్ఞ యాగాదులను చేసి
దేవతలను సంతృప్తి పరిస్తే,
దేవతలు మనకు సకాల వర్షమును కురిపించి భూమిని సుభిక్షము చేసి మంచి
జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల
పాపము లేదు.
వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి
సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి కర్మకాండ
యందు విపరీతమైన అభిమానము. లోకక్షేమము కొరకు తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత
అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోవుత జరిగింది. అటువంటి
స్థితి పొందిన వానికి యజ్ఞయాగాదులు వర్జితము. అది వేదవాక్కు. కాని అతనికి వాటిపై మక్కువ
ఎక్కువగా ఉన్నందువల్ల అవి చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి అతనికి జ్ఞానోదయం
కలిగించిన పిదప అవి మానివేసినాడు.
కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే! నువ్వు నేను కాదు. మనకు
వేదమే ప్రమాణం. చెట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి
మొలకెత్తి చెట్టుగా మారి తిరిగీ ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు
తినడం కూడా హింసే. కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా.
అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు
చెప్తున్నాయి.
కాబట్టి వీటన్నిటి వల్ల
మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస
అనేది వారి వారి ఆశ్రమధర్మమును బట్టి పాటించాలి. కావున యజ్ఞయాగాదుల యందు జరిగే బలి
పాపరహితము. అది వేదవిహితము. కాబట్టి ఈ వేద
ప్రమాణములను మనము ఉల్లంఘించరాదు.
కాలము ఈ రోజు కాదు 1955 న వచ్చిన 'మిస్సమ్మ' చలనచిత్రము కాలమునాటికే సంఘములోని ఈ రుగ్మతలను ఎందగాట్టినారు పిగళి నాగేంద్ర రావు గారు ఈ క్రింది పాటలో.
సీతారాం.. సీతారాం.. సీతారాం జై సీతారాం.. ||సీతా||
పైన పటారం లోన లోటారం.. యీ జగమంతా డంబాచారం. ||సీ||
చరణం: నీతులు పలుకుచు ధర్మ విచారం.. గోతులు తీసే కూటాచారం||సీ||
చందాలంటూ భలే ప్రచారం.. వందలు వేలూ తమ ఫలహారం ||సీ||
గుళ్ళో హాజరు ప్రతి శనివారం.. గూడుపుఠాణీ ప్రతాదివారం||సీ||
డాబులు కొడుతూ లోకవిహారం.. జేబులు కొట్టే ఘనవ్యాపారం ||సీ||
టాకుటీకుల టక్కుటమారం. కలికాలం మన గ్రహచారం.. ||సీ||
మిస్సమ్మ చలనచిత్రములోని ఈ పాట యొక్క "ప్రతి చరణములోనూ వ్యంగ్యమే". సమాజంలో జరుగుతున్న విషయాల్నే పాటలోకి తెచ్చి ఎండగట్టినారు పింగళిగారు.."
"అవును.. నీతులు పలుకుచూ గోతులు తియ్యడం, చందాలు వసూలు చేసి తామే మెక్కడం, పైకి భక్తి చూపుతూ లోపల రక్తికి పీట వెయ్యడం, మోసాలు చెయ్యడం అన్నింటినీ వాడిగా వేడిగా అంటించినారు. అదేతంతు ఈ రోజులలో ఇంకా విశృంఖలముగా జరుగుచున్నది.
జగద్గురువులు చెప్వపిన ఉపదేశమును యువత ఆకళింపు చేసుకొంటే భవితకు బంగారుబాట వేయగలుగుతారు.
స్వస్తి.