Saturday, 10 September 2022

ద్రోణాచార్యుడు – ఏకలవ్యుడు – అపప్రథ

 

ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు అపప్రథ

https://cherukuramamohanrao.blogspot.com/2022/09/blog-post_10.html

నన్నయ రాసిన 'మహాభారతం ,ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని 231 వ వచనం నుండి 245 వ పద్యం దాకా ఏకలవ్యుడి కధ సాగింది.

ద్రోణాచార్యులవారు, తన శిష్యగణముతో వేటకుక్కను తీసుకొని వెళుతున్నపుడు,  హద్దుమీరి మొరుగుచున్న కుక్క నోటిని మూయించిన ఏకలవ్యునితో నీవు ఎవరు అని అడిగినపుడు “మగధనరేశ్వరుడగు జరాసంధుని ప్రధాన సేనాపతియగు హిరణ్యధన్వుని కుమారుడను’ అని జవాబు చెబుతాడు.

ఇక్కడ తర్కబద్ధమైన ఒక ఆలోచన మీ ముందు ఉంచుతాను. 1. నేటి కుహనా మేధావులు తలచుచున్నట్లు దళితుడైన హిరణ్యధన్వుని జరాసంధుడు, తన మహాసేనాధిపతిగా చేసేనా! లేక 2. హిరణ్యధన్వుడు ఉచ్ఛవర్ణుడని ఒప్పుకొంటారా!

భారత్ అంటే Spiritual pursuit of the light of knowledge.

ఏతద్దేశే ప్రసూతస్య సకాశా తత్రజన్మన l

స్వ స్వ చరిత్రం శిక్షేణం పృథివ్యాం సర్వ మానవాఃll

దేశ విదేశములనుండి విధ్యార్థులు తమ తమ చరిత్ర తెలుసుకొనుటకు మన దేశపు నాటి విద్యాలయములకు వచ్చేవారు.

‘స విద్యాయా విముక్తయే’ విద్య ఒక్కటే విముక్తి ప్రసాదించుతుంది అన్నది మన పూర్వుల నిశ్చితాభిప్రాయము. నేటి విద్యాధనుల అభిప్రాయమది కాదు. ధనార్జన జనార్దనుడు. ధనసాధనకే నేటి విద్య పరిమితము. సంస్కృతి, మానవ సంబంధాలు, మానవతా విలువలు పూర్వుల గొప్పదనాలు ఏవీ అవసరము లేదు. ధనము సంపాదించుటకు చరిత్రను, ముఖ్యముగా రామాయణ భారతములను, వక్రీకరించి ఎందఱో సినీ ప్రముఖులు ఆకాశమే అంచుగా ధనార్జన చేసినారు. మరి వారు భూమి వదిలే కాలానికి డబ్బును వెంట తీసుకుపోయే వసతి కలుగుతుందేమో నా ఊహకు అందని విషయము. అటువంటి చలన చిత్రములలో ‘ఏకలవ్య’ ఒకటి. అందు ఏకలవ్యుడు ఆటవికుడు. ఆయనకు ఒక ప్రేమిక ఆమెతో సరసాలు ఒక ఎత్తు. అశేష ధనుర్విద్యాపారంగాతుడు, నియమ నిష్ఠాగరిష్ఠుడు, నీతి వర్తనుడు, ప్రభు విధేయుడు, మరియు వేదమూర్తి యగు బ్రాహ్మణుడు నగు ద్రోణాచార్యుడు ఎకలవ్యునితో ధర్మపన్నాలు వల్లే వేయిన్చుకొంటాడు. అక్కడ నిజానికి కారణము ఏకలవ్యుడు కాదు. ఆ పాత్రధారి యగు ప్రఖ్యాత నటుడు. ధర్మ సూక్ష్మము ఇక్కడ పనిచేయదు.  ఈ చలన చిత్రమునకు మరి భారతము ఆధారమే కదా! మరి ఏకలవ్యుని పాత్రధారి పోరాబాతుననైనా తన తండ్రి ని గూర్చి అనగా, మగధనరేశ్వరుడగు జరాసంధుని ప్రధాన సేనాపతియగు హిరణ్యధన్వుని కుమారుని నేను అని చెప్పుకొంటాడా! అట్లు చెబితే ఆ చిత్రము మొదటి రోజుకు మించి తెరపై కనిపించదు. నేటి విద్యాదికునికి అట్టి చలన చిత్ర కథలే తమ భారత ఇతిహాస పరిజ్ఞానమునకు ఆలంబనము. అప్పుడు అంతటి ద్రోణాచార్యుడయినా వారి దృష్టిలో కళంకితుడే!

ఇంకొకమాట ‘ధర్మ సంస్థాపన కొరకు జరిగినది మహా భారత యుద్ధము. తానెప్పుడూ ధర్మమూ యొక్క పక్షమని చెప్పినాడు శ్రీ కృష్ణభగవానుడు. జరాసంధుడు కృష్ణుని శత్రువు మరియు భీముని చేత వధింపబడినవాడు. కావున అతని సంతానము వారి సైనాధ్యక్షుడు ఆయన కుమారుడు ఏకలవ్యుడు పాండవులకు విరోధులే! అంటే వారు అధర్మమునకు బాసటగా నిలచినారు. ముందుచూపు కలిగినవాదగుటచే ఏకలవ్యుని బొటనవ్రేలు గురుదక్షిణగా తీసుకొన్నాడు. అందులో అతని దోసమూ లేదు స్వార్థమూ లేదు. కేవలము మృచ్ఛ ప్రతిమను గురువుగా భావించినా గురుదక్షిణ నొసగిన ఏకలవ్యుడు కూడా మనకు గౌరవ పాత్రుడు. నాటి కాలమున శస్త్ర విద్య అందరికీ నేర్చుకొన దగినదే కానీ అస్త్రవిద్య మంత్రయుక్తము కావున అది బ్రాహ్మలకు రాజులకు మాత్రమే విహితము. అందుకే కదా కర్ణుడు తానూ బ్రాహ్మణుడనని మోసగించి పరశురామునివడ్డ అస్త్రవిద్య నేర్చుకొని భంగపడినాడు.   

కావున ధర్మాధర్మ విచక్షణ లేకుడా వితండ వితర్క కుతర్కములు చేయరాదన్నది నా మదిలోని మాట.

 

స్వస్తి.

1 comment:

  1. చాలా చక్కగా ముఖ్యమైన విషయం చెప్పారు. నమస్కృతులు.

    ReplyDelete