గాయత్రీ మంత్రము
https://cherukuramamohanrao.blogspot.com/2023/02/blog-post_15.html
'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదేవతా'
గాయత్రీ మంత్రమును గూర్చి తెలుసుకొనుటకు ముందు మంత్రము అంటే ఏమిటో తెలుసుకొందాము.
త్రికాలజ్ఞులై
నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు
ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి.
మకారం
మననం ప్రాహుః త కారః త్రాణ ఉచ్యతేI
మననః
త్రాణసంయుక్తో మంత్రః ఇత్యభి ధీయతే II
అనగా
మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును అని నుడివినారు. మంత్ర సాధన రెండు విధములు. 1. వయమాచారము 2. శిష్ఠాచారము. వయమాచారము మనకు వర్జితము. శిష్ఠాచారము మనకు శిరౌధార్యము. ఇందు కొన్ని
విధివిధానాలు కొన్ని కట్టుబాట్లు వుంటాయి. మంత్రమును గురు ముఖతః గ్రహించవలసి
వుంటుంది. కొన్ని మంత్రములకు యజ్ఞోపవీత ధారణము తప్పనిసరి. మంత్రముల ఉచ్చారణ నిర్డుష్ఠతను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. మంత్రమననమునకు నిషిద్ధ ప్రదేశములు నిషిద్ధ సమయములు వుంటాయి. అనుష్ఠాత అది
మరువగూడదు. వెంటనే మరి అది ఒక వర్గానికే చెల్లుతుందా లేక చెందుతుందా అంటే కాదు అన్నదే జవాబు. యజ్ఞోపవీత ధారణ బ్రహ్మక్షత్రియ
వైశ్యులకు వుంటుంది. రెడ్లు, కాపులు, కమ్మలు కూడా రాజ్యాలేలినవారే! ఒకానొక కాలములో
యజ్ఞోపవీత ధారణ చేసి మంత్ర సాధనతో అభీష్ట సిద్ధి పొందినవారే! మిగిలిన వారిలో
కూడా యజ్ఞోపవీతధారులు వున్నారు కానీ నేడు అందరి దారులూ మారిపొయినాయి. అందుకే దేహము
సందేహములతోనిండి సతమతమౌతూ ఉన్నాము. ఎవరైతే శూద్రులుగా వర్గీకరిమ్పబడి సమాజ శ్రేయో స్సుకు తొలిసంధ్య నుండినే సమాయత్తమౌతూ ఉంటారో వారి అభ్యున్నతి చూసుకోనవలసిన బాధ్యత
బ్రాహ్మణ వర్గమునకు చెందుతుంది కానీ ఆ బ్రాహ్మణులలో అత్యధిక శాతము వేదచోదిత
బాధ్యతా విముక్తులయి హీనస్థితికి చేరుకొన్నారు. అందుకే నేటికీ కొందరు మహనీయులు
లలితా సహస్రము, విష్ణు సహస్రనామము, కృష్ణాష్టకము, నామ రామాయణము,ఆపదుద్ధారక
స్తోత్రము కనకధారాస్తవము మున్నగు ఎన్నో స్తోత్రములను సకలజన సమాజమునకు సానురాగముతో
సమర్పించినారు. ఇవి తాకరు కానీ అవే కావాలంటారు. ఒక బ్రాహ్మణుడు, మాటవరుసకు
గాయత్రిని అనుష్టించుచున్నాడంటే, అది కేవలము తనకొరకు మాత్రమే కాదు సమస్త జనుల
శ్రేయస్సు కోరుతూ చేస్తున్నాడు. తన అనుష్టానము మను ‘సర్వే జనాః సుఖినోభవంతు’ అనే
ముగిస్తున్నాడు. అదీ ఈ వైదిక ధర్మము యొక్క గొప్పదనము.
ఇక
గాయత్రీ మంత్రమును గూర్చి తెలుసుకొందాము. మంత్రమును ప్రత్యేకముగా వ్రాయుట లేదు.
వివరణలో అంతా తెలుస్తుంది కాబట్టి.
న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అనునది
సుప్రసిద్ధమైన వచనము – అనగా తల్లిని
మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.
గాయత్రి అనే పదము ‘గయ’ మరియు ‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉన్నది. “గయాన్
త్రాయతే ఇతి గాయత్రీ” అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించినారు. ‘గయలు’ అనగా
ప్రాణములు అని అర్థము. ‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం
గాయత్రీ మంత్రం.
'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది అని విబూదహాజనుల మాట.
'గయాన్ త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో
- అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి.
“గాయంతం త్రాయతే యస్మత్ గాయత్రీ
త్యభిధీయతే" (నిరుక్తము) గానం చేసేవారిని కాపాడేది గాయత్రి. ఇక్కడ గాయంతం అనే
మాట పాట పాడుట అనే అర్థంలో వాడలేదు. భక్తిశ్రద్ధలతో సుస్వరంగా ఉచ్చరించడం అన్న
అర్థంలో వాడబడింది. గాయత్రిని ఈవిధంగా జపించినవారు రక్షించబడతారు. వీరేకాదు
వినేవారుకూడా ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ
ఈ మంత్రాన్ని గురించి వేదములు "గాయత్రీం ఛందసాం మాతా!” అంటూ స్తుతించినాయి. ఈ మంత్రమును జపించుటకు పూర్వము అపరమూ
కూడా, ఆచరించే వ్యక్తి అనుష్ఠించే, విధులు కొన్ని వుంటాయి. అన్నీ కలిపితే అది
సంధ్యావందనమౌతుంది. ఇది ప్రొద్దున మధ్యాహ్నము సాయంకాలము మూడు పూటల ఆచరించవలసియుంటుంది.
ఎందుకు అన్నది తరువాత విశ్లేషించుకొందాము.
వరదాభయహస్తాలతో...
సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆది శంకరులు అనంతశక్తి స్వరూపముగా అభివర్ణించినారు.
ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగానూ, సాయంసంధ్యలో సరస్వతి గానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది.
గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతమవుతుంది. పాలు నేయిగా పరివర్తన చెందినట్లు,
పుష్పముల మధువు, మకరందముగా మారినట్లు, ప్రభాకరుడు ప్రజావాహినికి ప్రకాశమైనట్లు, గాయత్రీ
మంత్రము సర్వవేద సారమై శోభిల్లుతూ వుంది.
ఈ
మంత్రమును ఋగ్ యజుస్ సామ వేదములనుండి ఒక్కొక్క పాదము గైకోనబదినట్లు పెద్దలు
చెబుతారు. మరి మూడు పాదములే అయినాయి కదా అంటే నాలుగవ పాదము అధర్వణ వేదములో వుంది.
దీనికి మరొకసారి యజ్ఞోపవీత ధారణా చేయవలసి వుంటుందని శాస్త్రవచనము.
ప్రతి దినము త్రి సంధ్యలలో ఉపాసింపబడే దేవత గాయత్రీమాత. సకల
వేదసార సర్వస్వమే గాయత్రీ మంత్రం. త్రిమూర్త్యాత్మక స్వరూపం గాయత్రీ తత్వం.
గాయత్రి, సావిత్రి, సరస్వతి
త్రిముర్త్యాత్మక స్వరూపం. అంటే ఉదయము గాయత్రిగానూ, మధ్యాహ్నము సావిత్రిగానూ, సాయంత్రము
సరస్వతిగానూ ఆదివ్యశక్తి భాసిల్లుతుంది. దేహేంద్రియములను కాపాడునది గాయత్రి.
ప్రాణశక్తిని పోషించునది సావిత్రి. ప్రజ్ఞాశక్తిని ప్రకటింపజేయునది సరస్వతి.
ప్రజ్ఞాశక్తి ప్రాణశక్తిని, ప్రాణశక్తి
జడమైన దేహమును చైతన్యవంతం చేస్తుంది. గాయత్రీ మంత్రోపాసన దేహ, ప్రాణ, ఆత్మ శక్తులను ప్రచోదనము
చేస్తుంది. అసలు ఈ ‘నీవు’ లో మూడు మూడు
రూపాలు వున్నాయి అని పుట్టపర్తి సాయిబాబా వారు చెప్పేవారు. అవి (వారి మాటలలోనే)
********1.
The one who think you are
2.
The one others think you are
3.
The one really you are
ఇందులోని మూడవది తెలుసుకోవలేనంటే మొదటి రెండూ తెలుసుకొంటే
మూడవది సాధించ వీలుపడుతుంది. దీనికి సులబహమగు మార్గమును కూడా వేదవ్యాసులవారు మనకు
తెలియజేసినారు.
అష్టాదశ
పురాణేషు వ్యాసస్య వచనద్వయం
పరోపకార
పుణ్యాయ పాపాయ పరపీడనం
ఈ
గాయత్రి చేయుటకు వలసిన విధివిధానములు పాతిన్చుటకు కష్టమయినవారు ఉపకారము చేయడము,
అపకారము చేయకపోవడము చేస్తూ పోతే గాయత్రీ మంత్రఫలితము నిన్ను ఆవర్న్చియే
వుంటుంది.నీకోసం చేసే వాళ్ళు నీకు తెలియకుండానే ఎంతోమందివున్నారు. ఇక మంత్రమును
గూర్చి తెలుసుకొందాము.
ఈ మంత్రములో "ఓం" అనేది
"ప్రణవము", భూః భువః సువః అనునవి ప్రణవమంత్రపు విపులమైన వ్యాహృతులు. ఇవి
దివ్యశక్తిని కలిగిన పదములు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. ప్రతి దినము త్రి
సంధ్యలలో ఉపాసింపబడే దేవత గాయత్రీమాత. సకల వేదసార సర్వస్వమే గాయత్రీ మంత్రం.
త్రిమూర్త్యాత్మక స్వరూపం గాయత్రీ తత్వం. గాయత్రి, సావిత్రి, సరస్వతి అన్నది ఈ త్రిముర్త్యాత్మక స్వరూపం. అంటే
ఉదయము గాయత్రిగానూ, మధ్యాహ్నము సావిత్రిగానూ, సాయంత్రము సరస్వతిగానూ
ఆదివ్యశక్తి బాసిల్లుతుంది. దేహేంద్రియములను కాపాడునది గాయత్రి. ప్రాణశక్తిని
పోషించునది సావిత్రి. ప్రజ్ఞాశక్తిని ప్రకటింపజేయునది సరస్వతి. ప్రజ్ఞాశక్తి ప్రాణశక్తిని, ప్రాణశక్తి జడమైన
దేహమును చైతన్యవంతం చేస్తుంది. గాయత్రీ మంత్రోపాసన దేహ, ప్రాణ, ఆత్మ శక్తులను
ప్రచోదనము చేస్తుంది. సూక్ష్మస్థితిలో మన చేతన యొక్క మూడు
స్థితులను, అంటే శరీరం, మనస్సు, ప్రాణం
అనే మూడు స్థితులలోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
"తత్" నుండి మిగిలిన మంత్రాన్ని
"సావిత్రి" అని అంటారు. సవిత అన్న పదమునుండి సావిత్రి వచ్చింది. సవిత అంటే ‘సూయతే అనే
నేతిసవితా’ - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత. 'సవితా అనగా స్రవించుట అనే అర్థము కూడా కలదు. కనుక గాయత్రిని స్త్రీ స్వరూపముగానే ధ్యానిస్తాము.
మనుస్మృతి
'త్రిభ్య ఏవతు వేదేభ్యః పాదమ్
పదమదూదుహమ్” అని చెబుతుంది. అంటే
గాయత్రి ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం నుండి గ్రహించబడినదన్నమాట. సంధ్యావందనం విధిగా సకాలంలో చేయాలి.
మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చినారని
చెప్పబడి ఉంది. వాల్మీకి మహర్షి
ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్రామాయణమును రచించినారు. ఇక మంత్రము ఏమి చేబుతూవుందో
చూస్తాము:
ఓం - శబ్ద బ్రహ్మము,ప్రధాన బీజాక్షరం
సృష్టికి ఆధారమైన బ్రహ్మ. పరబ్రహ్మకు ప్రతీక.
భూ - స్థూల జగత్తు, భూలోకము, ఉత్పత్తికి
ఆధారభూతమైనది.
భువ - సూక్స్మజగత్తు, భూ స్వర్గముల మధ్య లోకము
- అనంత సూర్య చంద్ర తారలలో నిండియున్న ఆకాశము అనగా విశ్వము.
సువ - స్వర్గలోకము, కారణ జగత్తు.
తత్ - బ్రహ్మపదార్థము, శాశ్వ్తమైన సత్ (అంటే యావత్ సృష్టికీ మూలమైన ఆ)
సవితుర్ - సూర్యునిలో నిండియున్న తేజోపుంజముల ప్రకాశము
వరేణ్యం - శ్రేష్టమైనది
భర్గ - జ్ఞానతేజస్సు (అట్టి శ్రేష్టమైన ఆ జ్ఞాన తేజస్సును)
దేవస్య ధీమహి - దైవముగా నెంచి మేము
ధ్యానించెదము,
య: - ఆ తేజస్సు
న: - మా యొక్క
ధియో - బుద్ధులను,
ప్రచోదయాత్ – (సర్వదా) ప్రేరేపింపజేయుగాక!
గాయత్రీ
మాతకు 5 ముఖములు అవి గాయత్రీ మాత ధ్యాన శ్లోకములో ఈ విధముగా తెలుపబడింది.
ముక్తా
విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తా
మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం
వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం
చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే
సకల
వేద స్వరూపం గాయత్రి దేవి ! అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త,(ముత్యము) విద్రుమ(పగడము), హేమ(బంగారు), నీల(నీలము), ధవళ(తెలుపు రంగు) వర్ణాలు కలిగిన ఐదు
ముఖములతో , శంఖం ,చక్రం, కపాలము, గద, అంకుశం ధరించి వరదాభయ హస్తముతో
దర్శనమిస్తుంది. ఈ శ్లోకముతో అందరూ ఈమెను ధ్యానిస్తే సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ
ఙ్ఞానము కలుగుతుంది. ప్రతి రోజూ ఈ ద్జ్యాన శ్లోకము చాలు యజ్ఞోపవీతము వేసుకోనవసరము
లేదని వేదము చెప్పిన వారికి. అదే వేసుకొమ్మని వేదమునందు చెప్పబడీ వీసుకొని వారికి
రౌరవాది నరక ప్రాప్తి అనికూడా ధర్మశాస్త్రము చెప్పింది.
అసలు
ఈ ఐదు ముఖములు వేరేమో కాదు పంచభూతములే! సూర్యుని యొక్క 5 ప్రదానాంగములే! ‘సర్వత్ర గాత్రస్య శిరం ప్రధానం’ అన్నది శాస్త్ర వచనము. అంటే ఈ 5
భూతములు అంటే పృథివీ, నీరు, వెలుగు(సూర్య చంద్రాగ్నులు కలిపి, అసలు అవే అమ్మవారి
మూడు కన్నులు), వాయువు, ఆకాశము. ఇక అమ్మవారు సహస్ర కమలములో కూర్చుని ఉంటుంది. ఆ
సంకేతమును గూర్చి ఒక్కమాట చెప్పుకొందాము. సంస్కృతములో సహస్రము అన్మ్న పదమునకు
అనంతము అన్న అర్థము కూడా వుంది. పురుష సూక్తములో ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష
సహస్ర పాద్’ అని చెప్పుకొంటాము కదా! అక్కడ ఈ ‘సహస్ర’ అన్న పదమునకు అనంతము అని
అర్థము. ఇక ఉదయార్కుని రంగు కమలముతో పోలిక కిరణములు రెక్కలు. ఒక కమలములో రెక్కలు
పద్మము యొక్క మధ్యలో వున్నా పీఠమునకు కట్టుబడి ఉంటాయి. దీనిని సామాన్య భాషలో
దుద్దు అనుట కూడా కద్దు. కావున అమ్మవారు ఈ అనంతదల పద్మ పీఠమును అధీష్టించి
యుంటారు. సూర్యుని వెలుగు అణువులతో నిండియున్నది అన్నది, సూర్య కిరణములు వక్రగతిన
పయనించుతాయి అన్నది నాడు వేదము నేడు Science చెప్పిన మాట. అంటే ఇవి మనలను చుట్టుముట్టి యుండుటచేతనే మన బుద్ధిని సవిత్రుడు ప్రచోదనము
అంటే పురోగమింప జేస్తూ వున్నాడు.
ఈ క్రింది
మాటతో ఈ వ్యాసమునకు భరత వాక్యము పలుకుచున్నాను.
ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త Dr. Howard Steingeril, ప్రపంచవ్యాప్తంగా సేకరించిన
మంత్రాల అర్ధమును, వాని
శక్తులను
పరీక్షించిన పిదప గాయత్రీ మంత్రమును గూర్చి “గాయత్రి
మంత్రము సెకనుకు 1,10,000 ధ్వని
తరంగాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రము. ఇది ఒక
ప్రత్యేకమైన ధ్వని లేదా ధ్వని తరంగాల కలిగి, నిర్దుష్ఠమగు
ఆధ్యాత్మిక సామర్ధ్యములను అభివృద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నది. ”అని ఈ విధముగా
తెలియజేసినారు, అని కొందరు వ్రాసినారు కానీ నాకు సాధక పూర్వకమైన సాక్ష్యము లభించలేదు. అదే విధంగా 1/2 MV2ను గూర్చి:
“They also
noticed that the infinite mass of galaxies moving with a velocity of 20,000
miles/second was generating a kinetic energy = 1/2 MV2 and this was balancing
the total energy consumption of the cosmos. Hence they named it Pranavah, which
means the body (vapu) or store house of energy (prana).” “The total kinetic
energy generated by the movement of galaxies acts as umbrella and balances the
total energy consumption of the cosmos. Hence it was named as the Pranavah
(body of energy). This is equal to 1/2 MV2 (Mass of galaxies x velocity2).
పై రెండు విషయములకు ఆధారపూర్వకమగు
అనుబంధములు లేనందున అంతగా నమ్మవలసిన అవసరము లేదని నా మనోగత అభిప్రాయము.
భవిష్యత్తులో దీనిని ఎవరైనా నిరూపించవచ్చునేమో? అంతవరకు మనము ఇటువంటి విషయములపై
అవగాహన లేకుండా వ్రాయుట సబబా అన్నది నా అనుమానము. ఏది ఏమైయినా మన పూర్వుల గొప్పదనమును
తెలుపుటకు ఈ ప్రయోగముల అవసరము కలుగదు. నాటి మహనీయులకు తమ యోగ శక్తితో తాము
ఎరిగినది తెలుపుట తప్ప వేరేటువంటి హీనమగు ప్రయత్నమూ చేసినవారు కాదన్నదానికి వారి
ఋజుప్రవర్తనే సాక్ష్యము. నేటి Scientists బహుశ భవిష్యత్తులో నిరూపించుతారేమో!
‘శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే’ ఓం శాంతి శాంతి శాంతిః.
స్వస్తి.
గాయత్రి మంత్రాన్ని గురించి మీరు రాసిన వివరణాత్మక వ్యాసం ,ఆ మంత్ర ప్రాశస్త్యం పూర్తిగా తెలవక పోయినా , ఉదయం పూజలో పఠించే మాలాంటి వారు తప్పక చదవవలసిన వ్యాసం .
ఋగ్వేదం లో ,శంకరాచార్యుల వారి భాష్యం లో కూడా ఉదాహరించిన ఈ పవిత్ర గాయత్రి మంత్రం యొక్క శాస్త్రీయ దృక్పధం ను గురించి Dr Howard గారి వివరణను మీరు చక్కగా వివరించారు .
గాయత్రి మంత్రం లోని ప్రతి అక్షర ప్రాముఖ్యం చాలా బాగా వివరించారు .ధన్యవాదములు .
పై అభిప్రాయమును తెలియజేసినవారు భారతీయ రాష్ట్ర వార్డుషి (SBI) సర్వవిషయాధీశ (Chief General Manager ) పదవినలంకరించి ప్రస్తుతము విశ్రాంత జీవితమును గడుపుచున్నారు.
Highly informative and interesting facts about Gayathri mantras has been provided by you sir. What an analysis boss. Thanks for posting this article. Thus had been kne among my long pending item to know about gayathri mantras. Thanks for the efforts taken sir.
ReplyDelete