గురుబ్రహ్మా గురుర్ విష్ణుః గురుదేవో
మహేశ్వరః l
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ
గురవేనమఃll
గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి
శ్లోకం "గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర
బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః".. అయితే ఈ శ్లోకము ఏవిధముగా ఉత్పత్తి అయినది
అన్నది ఈ కథ ద్వారా తెలుసుకొందాము.
గురుకుల ఆశ్రమాలు ఉన్న కాలములో ఒక
గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట.ఆయన ఎందఱో పిల్లలను చేరదీసి, తన వద్దనే
ఉంచుకుని,
భోజన వసతులను
కల్పించి తను నేర్చిన విద్యలన్నీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. కౌత్సుడు
కూడా ఆశిష్యులలో ఒకడు. అతను ఎంతో గురుభక్తితో ఉంటూ, సకల విద్యలతోబాటు జ్యోతిష్య
శాస్త్రంలో ప్రత్యెక శ్రద్ధ చూపించి పట్టు సాధించినాడు. ఒక సారి గురువుగారు ఏదో
పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళ్ళినారు. ఆయన
తిరిగివచ్చేవరకు ఆయన లేని లోటు చోటు చేసుకోకుండా యధావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందించినారు
గురువుగారు.
ఇదిలా ఉండగా, స్నాతక సభ(onvocation)జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో వెళిపోయినారు. కౌత్సుడు మాత్రము తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి సుముఖత చూపలేదు. చేసేది లేక అతని తల్లిదండ్రులు తిరోన్ముఖులైనారు. వారు వెడలిన తరువాత గురువుగారు ఇతనిని పిలిచి తాను వెళ్లకపోవడానికి కారణమడిగినాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకము చూచినాను, ఈ కార్తీక మాసం అతిత్వరలో తమకు అతిదుర్భరమగు కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది.మీ బాగోగులు చూచుకొను సంతానము లేరు. ఆ బాధ్యతను మీశిష్యునిగా నేను వహించదలచుకొన్నాను. ఇది నా భాగ్యముగా భావించుతాను. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టకాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను" అని అన్నాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యము,ఆనందము,దుఃఖము,కలగలిపిన అ నుభూతితో ఆనంద భాష్పాలు రాల్చి అతని అభిమతమును కాదనలేకఒప్పుకొన్నాడు.
కౌత్సుడు గురువుగారితో ఆలోచించి కర్మ ఫలము అనుభవించి తీరవలసినదే అయినా ఆ తాపము తగ్గుటకు తగిన జపాలు, పూజలు, యాగాలుచేసి ఆ ఉధృతి తగ్గుటకు చేయవలసిన ఏప్రయత్నము విడువకుండా చేయు ధృడ సంకలపము కలిగినవాదౌతాడు."ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్న ఆర్యవచనము ప్రకారము ప్రారబ్ధము అన్నది అనుభవించాల్సిందే కావున దాని తీవ్రత ఈవిధముగా తగ్గించే ప్రయత్నము చేయబూనుతాడు.కాశీ మరియు గంగ తన గురువుగారి దోషనివారణకు దోహదము చేస్తాయని, అక్కడికి ఇరువురు బయలుదేరుతారు.
కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు కౌత్సుడిని ఒక పరీక్ష పెట్టదలచినారు.ఆపని
గురువుగారి వద్దనుండి కౌత్సుని విడదీయుట.
అనుకున్నట్టుగా ముందు బ్రహ్మ మారు వేషంలో వచ్చి
"నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని
చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని
వెళ్ళిపో" అన్నాడు.దానిహా ఇవ్వకుండా దయతో చ్చూసుకోండి. నేను నా గురుసేవ
నిరంతరాయముగా చేసుకొంటానని ప్రార్థించినాడు.ఐ. మీ ముగ్గురూ ఒకటిగా చేరి ఇంకెవరూ
నాకు ఈ కి కౌత్సుడు "గురువుని,ఇటువంటి
పరిస్థితుల్లో వదిలమని చెబుతున్న మీరు
పెద్దవారెలా అవుతారు? ?" అనేసరికి బ్రహ్మ నోట మాట
రాక వెళ్ళిపోయినాడుడు.అలాగే హరిహరులు కూడా అతని చలింపజేయలేక పోయినారు. చివరిగా వచ్చిన
పరమశివుని 'అయ్యా మీకన్నా ముందు ఇంకా ఇరువురు వచ్చి
ఇదే సలహా చెప్పినారు. నా ఊహ సరియైనదే అయితే మీరు ముగ్గురూ కూడబలుక్కొని వచ్చినట్లు
తెలియవస్తున్నది. దయతో ఆ ఇరువురిని కూడా కూడా మీరు రమ్మని, మీరు మువ్వురూ కలిసి ఇంకెవరూ నా వద్దకు వచ్చి ఇటువంటి సలహాలివ్వకుండా దయతో
అట్టివారిని తిరోన్ముఖులను చేయండి. నేను జీవితములో కృతఘ్నుడను కాలేను' అని ప్రార్థిం చినాడుఅప్పుడుముగ్గురూ నిజ రూపముఅలో ప్రత్యక్షమై,అతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి
మెచ్చితిమి.మేము పెట్టిన పరీక్షలో నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు.
నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అన్నారు.దానికి ఆనందించిన కౌత్సుడు "మీ
దర్శన భాగ్యం నా అదృష్టము. మీ అసాధుజన సాధుజన వ్యాజము అపారమయిన సాధుజన సంరక్షణను
గూర్చి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ
గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, అంతేకాక మిమ్ము సృష్టించిన ఆ న ఆ
పరబ్రహ్మ కూడాఆయన కూడా నాకు నా గురురూపమే! అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది
అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు
గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అని ఎంతో వినమ్రతతో
అర్థించినాడు.తధాస్తు అన్నారు త్రిమూర్తులు. గురువగు వేదధర్ముని ఆరోగ్యము
సరియగుటయే గాశ సామ్రాజ్యము లభించినది. వేదం ధర్ముడు, కకుత్సుడు గురుశిష్య సంబంధమునకు నిలువెత్తు నిదర్శనాలు.
స్వస్తి.
Very interesting information given by you sir.
ReplyDelete