Showing posts with label ఋగ్వేదంలో అగ్ని రూపము. Show all posts
Showing posts with label ఋగ్వేదంలో అగ్ని రూపము. Show all posts

Wednesday, 4 March 2020

అగ్నివృష

పటేశ్వరము-అగ్నివృష.
చత్వారి శృంగా త్రయో అస్య పాద ద్వే శీర్షే అస్ప్తహస్తసో అస్యl
త్రిధా బద్ధోవృషభో రోరతి మహో దేవో మర్త్యాన్ అవివేషll
(ఋగ్వేదము 4.58.3)
పటేశ్వరము మహారాష్ట్రములో ఉన్నది. అందలి
అర్చావిగ్రహమే ‘అగ్నివృష’. నాలుగు కొమ్ములు, మూడు పాదములు, రెండు తలలు, ఏదు చేతులు, మూడువిధములుగా బంధింపబడి యున్న వృషభ రూపుడగు అగ్నివృషుడు, లేక అగ్ని వృషభుడు అనబడు దేవతా మూర్తి మానవకళ్యానమునకై భూమిపై అవతరించినాడు. అగ్నికి 'సప్తజిహ్వుడు' సర్వభక్షకుడు' హుతవాహుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. సందర్భానుసారముగా వేదములలో ఆయన వర్ణనలు జరుగుతాయి అంతే కానీ కలకాలమూ అదే రూపములో ఉంటాడని కాదు. ఏ దేవత అయినాకూడా, వారికీ పైమాటలు అన్వయించుతాయి. వేద వర్ణనలు అక్షర సత్యములు.
కానీ సంస్కృతములోని ఆవర్ణనలనవగాహన చేసుకొని శిలకు విగ్రహరూపమును సంతరింపజేయుటకు ఇటు పరమేశ్వరానుగ్రహమో, అటు పరమేశ్వర అవతరణమో జరిగితేగాని సాధ్యము కాదు. అంతటి మహాత్తరశిల్పము ఇది.
వృషము నాన్నా వృషభము అన్నా నందిరూపమే!
‘యథా యథాహి ధర్మస్య .....’ అన్న గీతావాక్యమును అనుసరించి, గోటితో పోయేదానికి గోద్దలేన్డుకన్నట్లు ఆయా పనులు నెరవేర్చుటకు ఆయా దేవతలను భూమిపై, పరమాత్మ, అవతరింప జేస్తాడు.
స్వస్తి.