Showing posts with label శ్రీరాముని తదనంతర వంశావళి. Show all posts
Showing posts with label శ్రీరాముని తదనంతర వంశావళి. Show all posts

Saturday, 24 August 2019

శ్రీరాముని తదనంతర వంశావళి


శ్రీరాముని తదనంతర వంశావళి
శ్రీరాముని తదనంతరం పెద్ద కుమారుడైన కుశుని మొదలు,నాకు తెలిసి 'రఘువంశం'(కాళీదాసు విరచిత ) ప్రకారము ఈ వరుసలో వుంది.
కుశ ,అతిధి, నిషధ,నల,నభస,పుండరీక,క్షేమధన్వ,దేవానీక,ఆహీనస,పారియాత్ర, దళ,ఉన్నాభ(ఉక్త),వజ్రనాభ,శంఖణ,వ్యుషితాశ్వ,విశ్వసహ, హిరణ్యనాభ,పుష్య, బ్రాహ్మిష్ఠ,ధృవసంధి,సుదర్శన,అగ్నివర్ణ,శీఘ్ర, మరు,ప్రసుశ్రుత, సుసంది,అమరశ,విసృతవంత, బృహద్బల .
రామాయణము 'మైత్' కాదు ,రాముని తరువాత కూడా ఎందరో వారి సంతతి వారు ఏలినారని తెలియ బరచుటకు వ్రాసినాను. రాముని పిదప గుర్తు పెట్టుకొనుటకు అంతటివారేరీ . రాజైయుండి ఏకపత్నీ వ్రతము ను పాటించిన మహానుభావుడాయన. ఆయన పిమ్మట వచ్చిన కుశునకు ఇద్దరు భార్యలు అని చదివినట్లు గుర్తు . చివరి వాడయిన బృహద్బలుడు ద్వాపరమున కౌరవుల పక్షమున యుద్ధము చేసి విగతుడైనాడు.