కణాదుడు
Atomism, or
Atomic Theory, was a belief created in Greece explaining that the world and
everything in it is made up of tiny, invisible units. It was first introduced
by Leucippus, a Greek philosopher. One of his students, Democritus, helped to develop
this assumption.
The Earliest
Atomic Model -
The Findings of Democritus
Democritus was the one to actually coin the term
atom and believed them to be small particles all made of the substance only
with different shapes and sizes. He thought that their outside appearance is
what made, for example, water different from iron. Democritus also believed in
the Void, or an infinite space, where all of these atoms were located in
different forms.
The Beginnings of Atomism
Dalton's Findings
In 1803, John Dalton, a British chemist, created
a new theory that crushed the earlier one created by Democritus. In the 1700's,
chemists figured out that compounds of different elements could be created
based on their mass and also that there were most likely smaller particles that
made up the atom. He stated that in a mixture of gases, like and unlike atms
behaved differently proving that not all atoms were the same.
“అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష” గురజాడ వారి ప్రఖ్యాత నాటకం కన్యాశుల్కం లో
అగ్ని హోత్రావధానులు చెప్పేమాట ఇది. మను ధర్మశాస్త్రం లోనే తూనికలూ కొలతల
వివరాలుండగా ఇప్పటికీ త్రాసుని కనిపెట్టిన మహానుభావుడిగా ఆర్కిమెడిస్ పేరు మాత్రమే
చరిత్ర పుటలకెక్కింది. పరమాణు సిద్దాంతానికి మూలమైన “అణు సిద్దాంతం” ప్రతిపాదించిన శాస్త్రవేత్తగా కణసిద్దాంత లేక
అణు సిద్ధాంత పితామహుడిగా జాన్ డాల్టన్ పేరును మన పాఠ్యాంశాలలో ఇన్నాళ్ళూ చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇదే అణు
సిద్దాంతాన్ని దాదాపు 2500 సంవత్సరాల క్రితమే భారతీయుడైన కణాదుడు
ప్రతిపాదించినాడు. ఈయన క్రీస్తుపూర్వం 6శతాబ్దానికి చెందిన అణు శాస్త్రవేత్త. జాన్
డాల్టన్ 1766-1844 మధ్య కాలపు శాస్త్రవేత్త..
నిజానికి
రసవాదం పేరుతో తన ప్రయోగాలని మొదలు పెట్టిన కణాద మహర్షి మొట్టమొదటి అణు
శాస్త్రవేత్త గా పిలువబడాలి. రసవాదం ఉపయోగించి పాదరసం వంటి లోహాలని బంగారంగా
మార్చే ప్రక్రియ అప్పట్లో ఉపయోగం లో ఉన్నట్టు కొన్ని ఆధారాలు కూడా లభించినాయి.
మెర్క్యురీ(పాదరసం) అటామిక్ నంబర్ -80 ఆరం గా పిలవబడే బంగారం అటామిక్ నంబర్ -79. క్రీస్తు పుట్టుకకు ముందే ఈ విషయాన్ని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు
రసవాదం పై విస్తృత పరిశోధనలను చేసినారు.
పాదరసాన్ని బంగారం గా మార్చే ప్రక్రియ కోసం అప్పట్లోనే పరమాణు రహస్యాల పరిశోధన
మొదలయింది. ఈ విధమైన పరిశోధనను కణాదుడు
ఇప్పటి గుజరాత్
రాష్ట్రం లోని ద్వారక దగ్గరలో ఉన్న ప్రభాస క్షేత్రం లో కొనసాగించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
సృష్టి లోని ప్రాణులన్నీ ముఖ్యంగా గాలి, నీరు, మన్ను (మృత్తిక) ల ఆధారం గానే నిర్మాణమౌతాయనీ, మానవ దేహము అన్నింటికన్న సంక్లిష్ట మూలకాల నిర్మితమనీ అందుకే ఈ జీవరాశి యంతా
ఖనిజ పథార్థ నిర్మాణమైన భూమి ఆకర్షణ లో ఉంటాయనీ “గురుత్వ సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తూనే, భౌతిక రసాయన శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసినారు.
కనిపించే సృష్టి అంతా సూక్ష్మాతిసూక్ష్మమైన అణువుల కలయికతో ఏర్పడినదే అని
యిప్పటి ఆధునిక శాస్త్రవేత్తల నుంచి సామాన్య మానవుడి వరకు అందరికీ తెలిసినదే.
అయితే ఈ పరమాణు రహస్యాన్ని మొట్టమొదటగా క్రీస్తు పూర్వ కాలంలోనే ప్రపంచానికి చాటి
చెప్పిన ప్రాచీన భారతీయ అణు సిద్ధాంత కర్త కణాదుడు. పాశ్చాత్యుడైన
దెమోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం ఈ
పరమాణువునే "ఆటమ్" గా పేర్కొన్నాడు. "ఆటోమస్"(విభజింప
వీలుకానిది) అనే గ్రీకు పదం నుండి ఈ ఆటం పుట్టినది. అయితే డెమోక్రటీస్ కు నాలుగు శతాబ్దాలకు ముందే ప్రకృతి లోని ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయం అని
ప్రతిపాదించాడు కణాదుడు.
పరమాణువుల గురించి పాశ్చాత్యులకన్నా ముందే
కనుగొన్నవారు కణాదుడు.
వీరి తల్లిదండ్రుల గురించి,జన్మించిన
స్థలం గురించి,మరణ వృత్తాంతం తెలియ రావడం లేదు.
వీరు క్రీ.పూ.6 వ శతాబ్దంలో
జన్మించినారు. వీరి అసలు పేరు కశ్యపుడు. బాల్యము నుండియే వీరు సునిశిత జ్ఞానం
కలవారు. చిన్నచిన్న విషయాలను కూడా వీరు ఆసక్తిగా గమనించేవారు.
ఒకసారి వీరు ప్రయాగకు వారి
నాన్న తో పాటు వెళ్ళటము జరిగింది. అక్కడి దారులపైన భక్తులు చల్లిన పూలు,బియ్యం
గమనించి భక్తులు పూజల్లో నిమగ్నులై ఉండగా ఈయన మాత్రం ఆ గింజల్ని లెక్కించడం మొదలు పెట్టినాడట.
అది చూసి సోమశర్మ అను గురువు ఎందుకలా లెక్కిస్తున్నావని అడిగితే కణాదుడు ఆ గింజలు
ఎంత చిన్నవైనప్పటికీ ఈ విశ్వంలో భాగమే కదా అన్నాడు.
కణాద మహర్షికి ఔలూక్య
, కాశ్యప అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈయన క్రీ.పూ 6 వ శతాబ్దంలో జీవించాడు. కశ్యప ప్రజాపతి వంశంలో
ఉలూక మహర్షికి పుత్రునిగా జన్మించాడు కణాదుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ప్రయాగ (అలహాబాద్) జిల్లాలో ఉన్న ప్రభాస గ్రామం స్వస్థలం.
వీధుల్లో పడి వున్న బియ్యం గింజలను ఏరుకుని, అవి తింటూ బాల్య జీవితం గడిపాడు. చిన్న చిన్న రేణువుల(కణాల) మీద ఆధారపడి
జీవించాడు కాబట్టి ఇతనికి "కణాదుడు" అన్న పేరు స్థిరపడిపోయింది. ఈయనకు
"కణ" (కణ భుక్త, కణభక్ష) పేర్లు కూడా వచ్చాయని కొంతమంది
పండితులు పేర్కొన్నారు.
ఈయన సోమశర్మ
శిష్యులు, ప్రపంచ దేశాలలో "అణువు" భావనను
ప్రతిపాదించిన శాస్త్రవేత్తలలో తొలి శాస్త్రవేత్త. అంతే కాదు. "కార్య కారణ
సంబంధం" (కారణం/హేతువుకు పరిణామం/ప్రభావమునకు నడుమనున్న సంబంధాన్ని
తెలుసుకోవడమనేది మానవుని ఆలోచనలలో అతి గొప్ప ఆవిష్కరణ) అనే సిద్ధాంతాన్ని
తొలిసారిగా ఆవిష్కరించినది ఈయనే. రచయితగా "వైశ్లేషిక సూత్రాలు" ను
వెలువరించినారు. ఇది పది గ్రంథముల సంపుటం. ప్రతి గ్రంథంలో రెండేసి అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలోనూ
సగటున 370 సూత్రాలను పొందుపరిచినాడు ఈయన.
విశ్వంలో అణువు అనేది ఒకటి ఉంటుందన్న భావనను ప్రతిపాదించింది, ఆలోచనలు రేకెత్తించిన తొలి శాస్త్రవేత్త
కణాదుడు. "కారణం - ప్రభావం " అంటే కార్యకారణ సంబంధం వల్లనే సర్వమూ
సంభవమవుతుందని సిద్ధాంతీకరించినాడు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంత {\displaystyle {E=mc^{2}}} ప్రతిపాదనకు మూలము కణాదుడి సిద్ధాంతమే.
ఈ ప్రపంచం అంతా
పరమాణువులతో నిర్మితమైంది. వివిధ శైలీ విన్యాసాలతో పరమాణువులు సమ్మిళితమై
సృష్టిలోని సమస్త ఆకారాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో కనబడుతున్నా సూర్యుడు . చంద్రుడు , నక్షత్రాలు , సముద్రాలు , పర్వతాలు , అరణ్యాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, నుండి మానవుని వరకూ, పిపీలికాది బ్రహ్మ పర్యంతము వరకు అన్నీ...అన్నీ అణువుల కలయిక వలనే ఏర్పడుచున్నవి.
ఇవన్నీ ఒకదానితో నొకటి పోలిక లేనివి. విభిన్న ఆకృతులు కలిగినవి. వాటి, వాటి వ్యవహార సరళి కూడ ఒకదానితో ఒకదానికి పోలిక
లేని వైవిధ్యం కలిగి యున్నాయి. అన్నీ అణువుల సముదాయమే అయినప్పుడు ఈ వైవిధ్యము ఎలా సాధ్యపడింది? అన్న ప్రశ్న కు కణాదుడు ఏమంటాడో చూస్తాము.
కణాదుడు సిద్ధాంతం
ప్రకారం "పదార్థమంతా అణువుల సంయోగం చేత సృష్టించబడుతూ ఉంటుంది. ఆయా అణువుల
గుణాలు, ధర్మాలు, సంయోగాన్ని అనుసరించి పదార్థం యొక్క భౌతిక రూపం, స్వభావాలు మారుతూ ఉంటాయి. పదార్థాన్ని ఇంకా విభజించడానికి వీల్లేని భాగమే అణువు. అణువులే ప్రపంచానికి మూలాధారం. మూలకారణం. కారణము లేకుండా కార్యము జరగదు. అణువునకు నాశనం లేదు. అణువులు నాలుగు
గుణాలతో నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకే గుణం, ఒకేరకంగా ఉండే ఏక గుణ అణువుల సంయోగం వలననే ఆయా వస్తువుల నిర్మాణం జరుగుతుంది.
ఈ కలయిక మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది. 1) అణువుల్లో అంతర్గతంగా ఉండే సహజ భౌతిక శక్తి 2) అణువులకు బహిర్గతంగా ఉండే మానవాతీత శక్తి.
మరింత వివరంగా
చెప్పుకోవాలంటే వివిధ వస్తువుల స్వభావ ధర్మాన్ని బట్టి, ఆయా వస్తువులు తమలోనున్న కణ సంయోగాన్ని బట్టి
రూపం ఏర్పరచుకుంటాయి. ఏక స్వభావం కలిగిన కణాలు అనేకం ఒకదానితో ఒకటి కలిసి
వస్తురూపం పొందుతాయి. కణంలో ఉండే స్వభావం వస్తువులలోనూ కనిపిస్తుంది.
ఉదా : అగ్నితత్వం
గలిగిన అనేక అగ్నికణాలు(అణువులు) సంయోగం చెంది, సూర్య గోళం యేర్పడింది. అగ్నికణాలలో ఉండే అగ్ని తత్వమే భౌతిక వస్తురూపం
దాల్చిన సూర్య గోళం నుండి వేడిమిని వెదజల్లుతుంది.
ప్రాచీన భారతీయ
తత్వశాస్త్రం 'అంతా శూన్యం - ఏదీ స్థిరం కాదు" అనే శూన్య
వాదం ఆధారంగానే భౌతిక శాస్త్ర అభివృద్ధి జరిగింది. కణాదుడు, కపిలుడు మొదలైన శాస్త్రవేత్తలు పదార్థం అణు
సంఘటనం వల్ల ఏర్పడిందని శాతాబ్దాల క్రితమే గ్రహించారు. భారతీయ షడ్దర్శనాలలో
"వైశేషికము" ఒకటి దీని భావం "అణ్విక విశిష్టత" దీని ఆధారంగానే
"అణువైశేషిక సిద్ధాంతము"ను కణాదుడు ప్రతిపాదించినాడు.
కణాదుడు తన
"అణువైశేషిక సిద్ధాంతం" లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించినాడు.
1. అయస్కాంతం సూదులను ఆకర్షించడం
2. మొక్కలలో జల ప్రసరణ
3. జడ పదార్థం అయిన అయస్కాంతం సూక్ష్మ శక్తుల్ని
ప్రసారం చెయ్యడానికి అధారం కావడం.
4. అన్ని రకాల వేడిమికీ సూర్యగోళంలో ఉండే అగ్ని
మాత్రమే కారణం.
5. అణువు పరిమాణానికి కూడా ఈ సూర్యగోళము యొక్క వేడిమే
కారణం.
6. భూమి అణువుల్లో ఉండే ఆకర్షించే గుణమే భూమి
చూపించే గురుత్వాకర్షణ శక్తికి కారణం.
7. వస్తువుల చలన స్వభావనికి మూలకారణము
"శక్తివ్యయము" లేదా "పునఃచలన ప్రసారము"
8. అణు విఘటన/అణు విచ్ఛేదన జరిగితే విశ్వ ప్రళయము.
9. కాంతి కిరణములు , ఉష్ణ కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసారం చెందడం వల్ల ఆ కిరణాలు అన్ని
వైపులకూ అత్యంత వేగంతో దూసుకు పోగలుగుతాయి.
10. దేశ కాలాల సాపేక్షత
కణాదుడు సిద్ధాంతం
ప్రకారం విశ్వం మొత్తం ఆరు స్థితులలో ఏర్పడి యుంది. అవి
1. ద్రవ్య పదార్థం
2. గుణస్వభావం లేదా గుణధర్మం
3. కర్మ
4. సామాన్య ధర్మం
5. విశేషధర్మం
6. సమ్యవ పదార్థాలు
ఈ సమ్యవ
పదార్థాలను తిరిగి 9 సహజ లక్షణాలుగా విభజించాడు.
1. భూమి
2. జలం
3. అగ్ని
4. వాయువు
5. ఆకాశం
6. కాలం
7. అంతరిక్షం
8. మనస్సు
9. ఆత్మ
ప్రపంచ భౌతిక
శాస్త్ర దృక్పథాన్ని సమూలంగా మార్చి వేయ గలిగిన ప్రభావవంతమైన అణు సిద్ధాంతాన్ని
క్రీస్తు శతాబ్దాలకు పూర్వమే ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిని కణాదుని
సిద్ధాంతము ప్రకారము మనస్సు, ఆత్మ రెండు ద్రవ్యాలే. జీవిత చరమాంకము వరకూ భౌతిక అణు పదార్థాల శైలీ విన్యాసాల మీద
అనేక పరిశోధనలు చేసిన కణాదుడు సకల ప్రపంచమునకు అరాధ్యుడు.
ఈతని తర్వాతే డెమోక్రటీస్ అనే గ్రీకు శాస్త్ర
వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కణ సముదాయం అని అంతకంటే చిన్న కణాలుగా విభజించటం
కుదరదని చెప్పినాడు .వీటినే అణువులు అన్నాడు గ్రీకు లో ఆటోమాస్ అంటే విభజించుటకు
వీలు కానిది అని అర్ధం .అణువులున్నాయని నిరూపించ లేక పోయినాడు.
కఠోపనిషత్తు లో ప్రపంచ పరిణామానికి జడ పదార్దమే
కారణం అని ఉంది దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారం గా తీసుకొని కొందఱు ఒక
మార్గం లో పయనించితే కపిల ,కణాద మొదలగువారు తమదైన దారిలో పయనించినారు. వీరి
సిద్ధాంతము తర్వాత జైన బౌద్ధ మతములు ఈ సిద్ధాంతమును ఆధారముగా గొని హేతు వాదం తో వృద్ధి చెందింది . డెమోక్రాటిస్ కు
ముందే కణాదుడు జన్మించాడు వైశేషిక దర్శనం లో ”అణ్విక విశిష్టత ”ఉంది .వైశేషికము లో ఆధునిక శాస్త్ర వేత్త ”ఔలూక్యుడు ”. ఆయనే కణాదుడు .డేమోక్రాటిస్ కు నాలుగు వందల
ఏళ్ళ క్రితమే కణాదుడు పుట్టినాడు .
”ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం”నూతన అధ్యాయానికి దారి తీసింది.”అణు భక్షకుడు ”అని కణాదుడు పేరు పొందాడు .కణాదుడు అంటే కణాలు
తినే వాడని అర్ధం .”అణు ”అనే సంస్కృతపదమే ATOM అయింది ఇంగ్లీషులో. సూదులను అయస్కాంతం
ఆకర్షించటం ,మొక్కలలో జల ప్రసరణ జడం అనేది ఈధర్ లేక
అయస్కాంతం లో ప్రసారం చేయటానికి ఆధారమవటం ,అన్నిరకాల వేడికి సూర్యుడు,అగ్నియే కారణము. భూమి అణువులలో ఉండే ఆకర్షణ
శక్తియే గురుత్వాకర్షణకు కారణము. అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం
శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనం కోన సాగటం అణు విచ్ఛేదనము ద్వారా విశ్వ ప్రళయము సంభవించుతుంది, ఉష్ణ ,కాంతి కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించటం
వల్లనే కణాలు అనూహ్య వేగం తో అన్ని వైపులకు దూసుకు పోతాయి (విశ్వ కిరణ సిద్ధాంతం ),దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటిని కణాదుడు ఎంతో
విస్పష్టముగా చెప్పినాడని మనవి ముందే చేసుకొన్నాను.
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు
ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది .అణువుల అంతర్గర్భములో
ఉన్న సహజ భౌతిక శక్తి ,బహిర్గతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు
.ప్రపంచ సృష్టికి అణువులే కారణం .అణువులు గుండ్రముగా ఉంటాయి .అణువులు ఒకదాని నుండి
ఒకటి వేరైనపుడు కాని ,కదలిక లేనప్పుడు కాని ఏ పనీ జరుగదు అన్నాడు
.అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణ మౌతాయి .కణాలు
ఏర్పడటానికి అందులోని అణువులే కారణం .అణువులు ఎప్పుడూ చేతనా స్తితి లో ఉంటాయని
కణాదుడు ఊహించ లేక పోయాడు .డిమొక్రటిస్ సిద్ధాంతాల కంటే కణాద సిద్ధాంతాలు భౌతిక
వాదాన్ని బాగా బల పరుస్తాయి .
”పరిమితి గల పదార్ధం అనంత కోటి వస్తువులకు
పదార్ధం కాజాలదు”అన్న వైషేశికం మాదిరిగానే సాంఖ్యం అన్ని
వస్తువులకు మూల పదార్ధమవుతుంది అని నిర్ధారించింది.
కణాదునికి
ఔలూక్య ,కాశ్యప అనే పేర్లున్నాయి అనీ, ఆయన క్రీ పూ ఆరవ శతాబ్ది వాడని ఆధునికులు కూడా అంగీకరించినారు.
ఉత్తర ప్రదేశ్ లో ప్రయాగ (అలహాబాదు) జిల్లా పభోస ప్రాంతం ఆయనది. లో ప్రభాస లో కణాదుడు జీవించాడు ఆయనది ”పావురపు జీవితం ”అన్నారు కొందరు .నిజానిజాలు మనకు తెలియదు. ఈయన
సోమ శర్మకు శిష్యుడు .”కార్య కారణ సంబంధం ”అనే సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన
వాడు కణాదుడే .”వైశేషిక సూత్ర ”రచయితా .ఇది పది గ్రంధాల సంపుటి .ప్రతి గ్రంధం
లో రెండేసి అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం లో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రతి
గ్రంధంలో కనీసం 370సూత్రాలుంటాయి .పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని
వాటిని మళ్ళీ విభజించినా ఆ తర్వాత విభజించటం సాధ్యం కాదు అని చెప్పాడు
కణాద
సిద్ధాతం ప్రకారం ఈ విశ్వం ఆరు స్థితులలో ఉంది ద్రవ్య ,గుణ ,కర్మ ,సామాన్య ,విశేష ,సమవాయ స్థితులు .పదార్ధాలు తొమ్మిది అస్తిత్వాలను కలిగి
ఉంటాయి అవి భూమి జలం ,అగ్ని ,తేజ ,వాయు ఈథర్, కాలం ,అంతరిక్షం, మనస్సు ,ఆత్మ. కణాదుడు నిరీశ్వర వాదిగా చని పోయే ముందైన దేవుడిని
ప్రార్ధించమని శిష్యులు కోరితే ”పీలవః ”అని అన్నాడట .అంటే ”పరమాణువు ,పరమాణువు ”అని అర్ధం. ఈయన భావనలో మనస్సు, ఆత్మా రెండు ద్రవ్యాలే
.ప్రతి ద్రవ్యం అణు రూపం లోనే ఉంటుంది .స్పేస్ అండ్ టైంకూడా ద్రవ్యాలేనని ఐన్
స్టీన్ కాలాని కంటే ముందే కణాద మహర్షి ప్రపంచమునకు చాటినాడు.
కానీ కాల క్రమేణా భారతీయ
శాస్త్రవేత్తల పేర్లు మరుగన పడి కణాదుని స్థానంలో అలెగ్జాండర్ వెలుగులోకి వచ్చినాడు.
తన చేతిలోని ఆహారపు ముద్దని చూసి అనేక అణువులు కలిసి శక్తి కలిగిన ఒక పథార్థంగా ఏర్పడుతుందనే
ప్రతిపాదనని కనిపెట్టిన కణాదుడు పైకి ఇప్పుడు ప్రపంచ శాస్త్ర వేత్తల దృష్టి మళ్లింది.
ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తల బృందాలు కణాదుడు నివసించిన ప్రభాస క్షేత్రం
లో ఆయన పరిశోధనా గ్రంథాల లోని విషయాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ఇప్పటికైనా
ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయం పై దృష్టి పెట్టాలనీ దీనిని అంతర్జాతీయ వేదిక పైకి
తీసుకు వెళ్ళాలనీ పలువురు కోరుతున్నారు…
అన్నీ అనుకున్నట్లు జరుగుతూ పోతే భారత దేశపు కీర్తి దిగ్దిగంతములకు
వ్యాపించుటకు ఎంతో కాలము పట్టదు.
పరమాణు నిర్మాణం
ఒకే ముద్దగా ఉన్న విశ్వంలో 1375 కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం జరిగిన వెంటనే విడుదలైన మహాశక్తి
సెకనులో కొన్నికోట్ల వంతు సమయంలో వేగంగా చల్లారి ప్రోటాన్లు, న్యూట్రాన్లు
ఏర్పడ్డాయని మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఇవి కొన్ని నిమిషాల్లోనే పరమాణు
కేంద్రకాలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ మహావిస్ఫోటన సమయంలో జరిగిన మార్పులకు
సాక్ష్యాలుగా పరమాణు ఉపకణాలు నేడు మనముందున్నాయి. వీటి అధ్యయనం ద్వారా
విశ్వావిర్భావ రహస్యాలను తెలుసుకునే పరిశోధనలు కొనసాగుతున్నాయి. 'లార్జ్ హార్డన్
కొల్లిడర్' ప్రయోగం వీటిలో ఒకటి. మహావిస్ఫోటన సమయంలో
చిన్న 'పులుస్టాప్' కన్నా తక్కువ పరిమాణంలో గల
చిన్నకణాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా తటస్థ ఛార్జితో పరమాణువులు 3.80 లక్షల సంవత్సరాలు
అయ్యేసరికి ఏర్పడ్డాయి. వాటిలో 76% హైడ్రోజన్, 24% హీలియం పరమాణువులు ఏర్పడ్డాయి. ఒక బిలియన్ సంవత్సరాలు గడిచేసరికి మొదటిగా
నక్షత్రాలు, డ్వార్ఫ్ (కుబ్జ)
గెలాక్సీలు, మూడు బిలియన్
సంవత్సరాలకు ఈ చిన్న చిన్న గెలాక్సీలు కలిసి పెద్దవిగా రూపాంతరం చెందాయి. తొమ్మిది
మిలియన్ సంవ త్సరాలకు మిల్కీవే గెలాక్సీలో సౌరకుటుంబం ఏర్పడింది. అంటే, 500 కోట్ల సంవత్సరాల క్రితమే
మన సూర్యుడు రూపొందాడు. హైడ్రోజను, హీలియం ఇంకా కొన్ని తక్కువ పరిమాణంలో ఇతర మూలకాలతో కలిసి సూర్యుడు ఏర్పడ్డాడు.
450 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యునితో కలవకుండా మిగిలి ఉన్న కొంత పదార్థం కలిసి
మన భూమి ఏర్పడింది. 370 కోట్ల సంవత్సరాల
క్రితమే కర్బనము కలిసిన అణువుల (మాలిక్యూల్స్) తో మొదటి జీవము ఏర్పడింది. పది
లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే భూమి మీద మానవుడు నడక మొదలుపెట్టాడు. మహావిస్ఫోటనం
వల్ల విడుదలైన మహాశక్తి పరమాణు ఉపకణాలుగా రూపు దిద్దుకోవడం విశ్వావిర్భావ
రహస్యాలుగా కొనసాగుతున్నాయి. పరమాణు నిర్మాణం, ముఖ్యంగా పరమాణు ఉపకణాల అధ్యయనం ద్వారా ఈ రహస్యాల్ని ఛేదించడానికి
శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. వీటిలో ఆధునిక పరమాణు ఉపకణాల అధ్యయనం కీలకంగా
కొనసాగుతుంది.
పరమాణు నిర్మాణం-కొన్ని
సిద్ధాంతాలు
డాల్టన్ సిద్ధాంతం:డాల్టన్
పరమాణు సిద్ధాంతం ప్రకారం పదార్థం అణువులతో నిర్మితమవుతుంది.అణువును విభజించడానికి
వీలుకాదు.ఒకే మూలకానికి చెందిన అణువులన్నీ ఒకే రకంగానూ, వేర్వేరు మూలకాలకు చెందిన అణువులు వేర్వేరుగా
ఉంటాయి.తర్వాత కాలంలో థామ్సన్, మిల్లీకాన్ వంటి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగ ఫలితాలు అణువు విభజింప వీలు కాదు
అనే డాల్టన్ వాదన
తప్పని నిరూపించాయి.
థామ్సన్ నమూనా:
థామ్సన్ ప్రయోగం ప్రకారం..
పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు రుణావేశ పూరితాలుగా ఉంటాయి. దీని ఆధారంగా థామ్సన్
పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.థామ్సన్ ప్రతిపాదన ప్రకారం పరమాణువు గోళాకారంలో
ఉండి ధనావేశాన్ని కలిగి ఉంటుంది.పరమాణు భారం.. పరమాణు అంతటా ఏకరీతిన విస్తరించి
ఉంటుంది.ధన, రుణావేశాలు సమానంగా ఉండి పరమాణువు విద్యుత్పరంగా
తటస్థంగా వ్యవహరిస్తుంది.
రూథర్ఫర్డ నమూనా:
1909లో న్యూజిలాండ్కు చెందిన రూథర్ఫర్డ
్చ
కణ పరిక్షేపణ ప్రయోగంతో మరో
నూతన పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. పరమాణువులోని ధనావేశ కణాలన్నీ కలిసి ‘కేంద్రకా’న్ని ఏర్పరుస్తాయి. అయితే కేంద్రకంలో ఎలక్ట్రాన్లు ఉండవు.రుణావేశ పూరిత
ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతుంటాయి (సూర్యుని
చుట్టూ గ్రహాలు తిరిగే విధంగా).పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా
చిన్నది.
పరిమితులు:
నిర్దిష్ట త్వరణంతో వృత్తాకార
మార్గంలో తిరుగుతున్న ఆవేశపూరిత కణాలు నిరంతరం శక్తిని ఉద్గారిస్తూ, కొంత సమయానికి శక్తిని కోల్పోయి కేంద్రకం నుంచి
విడిపోయే అవకాశం ఉంది. అప్పుడు పరమాణువు నాశనమై పదార్థ ఉనికి ఉండదు. కానీ అలా జరగడం
లేదు. తర్వాత జరిగిన పరిశోధనలు, కాంతి ప్రయాణించే విధానం, విద్యుదయస్కాంత వర్ణపటం, వర్ణపట రేఖల విశ్లేషణ వంటి నూతన భావనలు పరమాణు నిర్మాణాన్ని మరింత నిశితంగా
పరిశీలించేట్లు చేశాయి.
బోర్ పరమాణు నమూనా:
ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ
నిర్దిష్ట వృత్తాకార మార్గాల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలనే ‘కక్ష్యలు’ లేదా ‘ప్రధాన శక్తి స్థాయిలు’ అంటారు.ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతున్నంత సేపూ
శక్తిని కోల్పోవు. కాబట్టి ఇవి కేంద్రకంలో పడిపోయే అవకాశం ఉండదు.ఈ కక్ష్యలను ఓ, ఔ, కూ... అనే అక్షరాలు లేదా = 1, 2, 3... అనే సంఖ్యలతో సూచిస్తారు.
కానీ దీనికి కూడా కొన్ని
పరిమితులు ఉన్నాయి. బోర్ కేవలం హైడ్రోజన్ వర్ణపటాన్ని మాత్రమే వివరించాడు. ఈ
నేపథ్యంలో ‘వర్ణపటం’ వివరాలను పరిశీలిస్తే..
విద్యుదయస్కాంత తరంగం:
ఏదైనా విద్యుదావేశం కంపిస్తూ
ఉంటే అది తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు చేస్తుంది. ఈ విద్యుత్
క్షేత్రం, అయస్కాంత క్షేత్రంలో కూడా మార్పునకు లోనవుతుంది.
ప్రసార దిశకు లంబంగా, ఒకదానికొకటి లంబదిశలో ఉండేలా విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఏర్పడే ఈ ప్రక్రియ నిరంతరం
కొనసాగుతుంది. ఈ విద్యుదయస్కాంత తరంగాలు, విస్తృత వైవిధ్యం గల పౌనఃపున్యాల సముదాయాన్ని ‘విద్యుదయస్కాంత వర్ణపటం’ అంటారు.
మాక్స్ప్లాంక్ ప్రతిపాదన:
విద్యుదయస్కాంత శక్తి
అవిచ్ఛిన్నం. దీని నుంచి ఉద్గారం లేదా శోషణం ఎల్లప్పుడూ జిఠకి పూర్ణాంకంగా
ఉంటుంది. ఉ = జిఠ’జి’ ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ6.626 ణ 10ృ34 ఒ..ఈ భావనల ఆధారంగా బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. కానీ
హైడ్రోజన్ వర్ణపటాన్ని అధిక సామర్థ్యం ఉన్న వర్ణపటదర్శినితో చూస్తే కొన్ని ఉపరేఖల
సమూహాలు కనిపించాయి. ఈ ఉపరేఖలను బోర్ వివరించలేకపోయినాడు.
సోమర్ ఫెల్డ్ నమూనా:
సోమర్ ఫెల్డ్, బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచి
రెండో కక్ష్య నుంచి ఒక్కొక్క దీర్ఘ వృత్తాకార కక్ష్యను కలుపుతూ, పరమాణు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష్య రెండు
ప్రధాన నాభుల్లో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించినాడు.పరిమితులుఒకటి కంటే ఎక్కువ
ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల పరమాణు వర్ణపటాలను వివరించడంలో సోమర్ ఫెల్డ్ నమూనా
విఫలమైంది. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా(ఇర్విన్ ష్రోడింగర్):దీని ప్రకారం బోర్
నమూనాలోని కక్ష్యలకు బదులుగా.. ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు, పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో
అధికంగా ఉంటాయి.పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లను కనుక్కునే సంభావ్యత ఏ
ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ‘ఆర్బిటా అంటారు.
అసలు ఈ ప్రతిపాదనలకు మూలము పైన నేను తెలిపిన పాశ్చాత్య శాస్త్రజ్ఞులలో కొందరేమైనా కణాదుని పరిశీలనలు చదివినారేమో! పాశ్చాత్య దేశాలలో, గ్రీకు రోము వంటిదేశాలు మనదేశముతో, పూర్వము, సంబంధము కలిగి యుండేవి అంటుకు చారిత్రికాదార్తములు పుష్కలముగా వున్నాయి. పైపెచ్చు ఆంగ్లేయులు మనదేశమును దాదాపు 350 సంవత్సరములు పరిపాలిన్చినారుకదా! వారు తస్కరించిన భారతీయ విజ్ఞానము మాటలకు అందనిది. కావున ఆవిధముగా కణాద ప్రతిపాదనలు దేశమును దాటియుండవచ్చును అన్న మాటను నిర్హేతుకముగా త్రోసిపుచ్చలేము.
ఏదిఏమైన కనాదునివంటి ఎందరో మహానీయుల్స్ను కన్నా ఈ భూమికి నన్మస్కరించుతూ శెలవు తీసుకొంటాను.
శుభం భూయాత్.