వేంకటేశ్వరుడు
Vinjamuri Venkata Apparao = నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. పండితులను అడిగాను కాని దాటేశారు సరైన సమాధానం చెప్పలేదు. కొంచెం పెద్దలు నా సందేహాన్ని తీర్చగలరు. ఏమంటే ఆదిశంకరులు ఆశేతు హిమాచల పర్యంతం పర్యటించి అనేక మఠాలను నెలకొల్పి హైందవమతాన్ని జాగ్రుతం చేసారు. బాగుంది. చాలా బాగుంది. అయితే ఆయన కొండకోనలలో జనులు చొరరాని కీకారణ్యంగా వున్న తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు తన శైవ మఠాలను వదిలేసి. ఎవరికైనా తన మఠాలపైనే దృష్టి వుంటుంది కదా. శంకర మఠాలను వదిలేసి వైష్ణవ క్షేత్రంలోనే ఎందుకు యంత్రాలను ప్రతిష్టించారు అని. శంకరులవారికి శివకేశవ బేధం లేదు అని చెప్పచ్చు. కేవలం వైష్ణవ క్షేత్రం అభివృద్ధిని కాంక్షించే చేసారంటారా....... పెద్దలెవరైన సరైన వివరణ ఇస్తే బాగుంటుంది.
VVS = ఈ ప్రశ్నలోని విషయాలు సామాన్యంగా అందరికీవచ్చే సంశయాలే. మనందరి పరిజ్ఞానం - పెద్దలు చెప్పినా, ప్రవచనాలు విన్నా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం వెదకినా వచ్చినదే. పురాణ వాఙ్మయము చదివి ప్రమాణములతో చెప్పగలవారు చాలా తక్కువ. మన మొదటి అపోహ శంకరాచార్యుడు శైవుడు, ఆయన వైష్ణవుడు కాడు అనేది. శంకరాచార్యుని చిత్రించే విధానం శైవునిలా విబూతిధారణతో కనుపిస్తుంది. ఈ శైవ, వైష్ణవభేదాలు శంకరుల తరువాత వచ్చినవి. రామానుజ పూర్ణప్రజ్ఞ (మధ్వ) దర్శనాలనే వైష్ణవదర్శనాలంటారు.......
vvs గారి వ్రాతకు జతగా నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయ సంకల్పించినాను.
నిజానికి వెం+కట అన్న ఈ రెండు శబ్దాలు సంస్కృత శబ్దములు కాదని విన్నాను. వీనికి సంస్కృత శబ్దమైన ఈశ్వర కలిపి వెంకటేశ్వర ఐనదని పండితుల మాట. ఇక నిజానిజాలకొస్తే వైష్ణవులు ఎవరైతే విష్ణువే పరబ్రహ్మ స్వరుపుడనుకోటారో వారు ఈశ్వర శబ్దము నుచ్చరించరు. అందుకే వెంకటాచల పతి
యని శ్రీనివాస యని నామంతరముల నెర్పరచుకొని పిలుచుకొంటారు .
యని శ్రీనివాస యని నామంతరముల నెర్పరచుకొని పిలుచుకొంటారు .
మహా పండితులు కోట వెంకటా చలం గారు సహేతుకముగా సాదికారకముగా జగద్గురు ఆది శంకరుల కాలము బి. సి. 509--477 అని నిరుపించినారు. అట్టి ఆది శంకరులు వారు జీవించిన కాలములోనే ధనకర్షణ జనాకర్షణ యంత్రములు వేసియుంటారు . అసలా యంత్రాలు వారు వేసినారా లేదా అంటే అతి ప్రాచీనమైన ధనాకర్షణ యంత్రము స్వామి కొప్పెరను 10 లేక 15 సం.ల క్రితం పునరుద్దరించు నపుడు భూమి యడుగున దొరికింది . అంటే ఆ యంత్రముల పురాతనత్వము మీకు ఎరుకపడి వుంటుంది . శంకరులు సకల దేవతా స్తోత్రములు వ్రాసినా ప్రత్యేకించి వేంకటేశ్వరుని గూర్చి వ్రాయలేదు. కారణం ఆయన శివ కేశవ అభేది గనుక. ఆ విగ్రహమును గూర్చి యా అపర శంకరులకేరుక కనుక.
ఇక భగవద్రామానుజులు (1017–1137)
భగవద్రామానుజులవారు దాదాపు 120 సం. బ్రతికినారు.ఎన్నొ ఉత్థాన పతనాలను అనుభవించినారు. రామానుజులవారు వైష్ణవము నకు ప్రాచుర్యము సంతరింప జేయు వరకు ఆ మూర్తి వెంకటేశ్వరుని గానే ఆరాధింప బడుచుండినది . రామనుజులవారి గురువు యాదవ ప్రకాశ యతి(అద్వైతి),రామానుజుల తెలివితేటలపై మాత్సర్యము వహించుటచే కాలాంతరమున రామానుజులవారు శ్రీ యమునాచార్యుల(అలవందార్ )వారి శిష్యులై విశిష్టాద్వైతియై అద్వైతము పై ఆగ్రహమేమైనా పెంచుకొన్నారేమో వారి కాలములో వాగ్స్పర్ధ లేకాక వైష్ణవ మతాన్తరీకరణములు దేవాలయ మూల విగ్రహ నామాన్తరీకరణములు జరిగినట్లు పెద్దల వల్ల విన్నాను .
ఇక భగవద్రామానుజులు (1017–1137)
భగవద్రామానుజులవారు దాదాపు 120 సం. బ్రతికినారు.ఎన్నొ ఉత్థాన పతనాలను అనుభవించినారు. రామానుజులవారు వైష్ణవము నకు ప్రాచుర్యము సంతరింప జేయు వరకు ఆ మూర్తి వెంకటేశ్వరుని గానే ఆరాధింప బడుచుండినది . రామనుజులవారి గురువు యాదవ ప్రకాశ యతి(అద్వైతి),రామానుజుల తెలివితేటలపై మాత్సర్యము వహించుటచే కాలాంతరమున రామానుజులవారు శ్రీ యమునాచార్యుల(అలవందార్ )వారి శిష్యులై విశిష్టాద్వైతియై అద్వైతము పై ఆగ్రహమేమైనా పెంచుకొన్నారేమో వారి కాలములో వాగ్స్పర్ధ లేకాక వైష్ణవ మతాన్తరీకరణములు దేవాలయ మూల విగ్రహ నామాన్తరీకరణములు జరిగినట్లు పెద్దల వల్ల విన్నాను .
ఏది ఏమైనా వారికి పూర్వము ఆ విగ్రహాన్ని 6 నెలలు శైవాగమ విధానము గాను 6 నెలలు వైష్ణవాగమ విధానము గానూ పూజించేవారు .
వారి కాలములో చంద్రగిరి రాజులు వైష్ణవులైనందువల్ల వారి మాట పై గురుత్వము చేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శ్రీనివాస విగ్రహం గా మార్చినట్లు తెలియ వచ్చుచున్నది .
వారి కాలములో చంద్రగిరి రాజులు వైష్ణవులైనందువల్ల వారి మాట పై గురుత్వము చేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శ్రీనివాస విగ్రహం గా మార్చినట్లు తెలియ వచ్చుచున్నది .
ఇందుకు అనేక కారణాలున్నాయి . అవి తరువాత పోస్ట్ లో తెలియబరచుతాను. నేను విన్న చదివిన ఆధారాలపైనే ఈ మాటలు వ్రాస్తున్నాను .జిజ్ఞాసువులు నన్ను తప్పుగా తలవారని తలుస్తాను.
నిన్నటి పోస్ట్ లో వెంకటేశ్వరుని మూలమూర్తిని శివునిగా విష్ణువుగా బాలాత్రిపురసుందరిగా సుబ్రహ్మణ్యునిగా అన్వఇంచుకొనుటకు గల కారణములను అన్వేషించుదాము . అంతకు ముందు భక్తాగ్రేసరులై భగవంతుని తమకిష్టమైన రీతిలో దర్శించగలిగిన వారేమన్నారో చూస్తాము.
వెంకటేశ పాదాధ్యాయుడై తొలుత అద్యైతియయ్యు పిదప వైష్ణవమును స్వీకరించిన భక్త శిఖామణి అన్నమయ్య ఒక పాదములో ఏమన్నారంటే :
'కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
వెంకటేశ పాదాధ్యాయుడై తొలుత అద్యైతియయ్యు పిదప వైష్ణవమును స్వీకరించిన భక్త శిఖామణి అన్నమయ్య ఒక పాదములో ఏమన్నారంటే :
'కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి నమ్ముదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు'
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు'
అదేవిధంగా పరమ రామ భక్తుడైన త్యాగరాజు గారు తన కృతి లో'శివుడవో మాధవుడవో' అని ప్రశ్నిస్తాడు .
ఇక విషయానికొస్తే ఈ విగ్రహాన్ని 'అమ్మ' అనుకొనుటకు గల కారణమేమంటే
ఔత్తరాహికులు ఈ మూర్తిని అనాది నుండి 'బాలాజీ' అనే సంబోధిస్తారు .'జి' అనేది మర్యాద సూచకము.ప్రాకారానికి నలువైపులా యుండే సింహ విగ్రహాలు సింహవాహినీ తత్వాన్ని మనకు సూచిస్తాయి. శుక్రవారములందు ఈ విగ్రహానికి అభిషేకాలు జరుగుతాయి. ఆరోజు విగ్రహానికి చీర కట్టడం జరుగుతుంది. అమ్మవారికి జరిగే దసరా ఉత్సవాలు ఈ మూర్తికి జరుగుతాయన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. అంతేకాక ఉత్తుంగమైన వక్షస్సు, చూపు మరల్చుకో లేని ముఖ వర్చస్సు, విగ్రహపు వేనుకవైపునుండే ధమ్మిల్లము(కొప్పు) ఇత్యాదులు 'అమ్మ' నే సూచిస్తాయి కదా.
ఇక శివుడనుకోడానికి గల కారణమేమంటే ఆ మూర్తికి అభిషేకము జరుగుతుంది బిల్వదళ పూజా జరుగుతుంది. 'అలంకార ప్రియో విష్ణుః అభిషెక ప్రియో శివః' అన్నది ఆర్యొక్తి. ఆ మూర్తి కి చేతులకు నాగాభరణాలున్నాయి. శంఖచక్రములు లేవు. అర్చకులు వానిని అనుదినము అలంకరించుతారు. ఈ విగ్రహములో త్రిశూలాది చిహ్నములు కుడా వున్నాయని పెద్దలు వాక్రుచ్చుతారు. ఉరమునండు లక్ష్మీదేవిని కూడా అమర్చుతారు.
స్వామి చరణముల శరణు కోరమన్న విధముగా ఉండే హస్త ముద్ర ఒకటి చాలు అది విష్ణు విగ్రహమనడానికి. కేవలము శివుడే ఐతే లింగరుపము లో ఉండవలెను కదా.
స్వామి చరణముల శరణు కోరమన్న విధముగా ఉండే హస్త ముద్ర ఒకటి చాలు అది విష్ణు విగ్రహమనడానికి. కేవలము శివుడే ఐతే లింగరుపము లో ఉండవలెను కదా.
వీటన్నిటికంటే ఇంకొక ముఖ్య విషయమేమిటంటే ఈ విగ్రహము సుబ్రహ్మణునిది అన్న ఆలోచన కలిగించేది .
గుడి ప్రక్కనే వున్న కొలనును 'స్వామి పుష్కరణి' అంటారు . నిరుక్తము సుబ్రహ్మణ్యుని పేర్లను ఈ విధంగా చెబుతుంది.
'దేవసేనాపతిః శూరః స్వామీ గజముఖానుజః ... 'అంటే ఇక్కడ 'స్వామి' అన్న పేరు ఆయనకున్నది అని తెలుస్తున్నది. కొండ మీద
'కుమార ధార' అన్న తీర్థము కుడా వున్నది. ఇక కటి హస్తము కుమారుని విగ్రహములకే ఉంటుందంటారు.
'కుమార ధార' అన్న తీర్థము కుడా వున్నది. ఇక కటి హస్తము కుమారుని విగ్రహములకే ఉంటుందంటారు.
ఇంక ఉపసంహారానికి వస్తాము. అద్వైతము 'న ద్వితీయే ఇతి అద్వైతం' అంటుంది . అదే పరబ్రహ్మ అంటుంది . కానీ ఈ పరబ్రహ్మ వచామగోచరము. మరి ఈ విగ్రహమో వాచా గోచరము. హరి అన్న ఒక్క శబ్దానికి అనంతమైన అర్థాలునాయి. అసలు హరి యన్నా హరుడన్నా హరించే వాడే. ఏమిటి హరిస్తున్నది అంటే మన అన్వయాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు మనము ఈ విగ్రహాన్ని ఆ పరబ్రహ్మ కే అనుసంధించుకొంటే 'ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి' అన్న శాస్త్ర వచనము నిజమును నిరుపించిన వాళ్ళమైతాము.
మహాకవి కాళీదాసు 'ఎకైవమూర్తి ర్బిభిదే త్రిధాసా ' అన్న మాటతో వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ నిలుస్తాను.
మహాకవి కాళీదాసు 'ఎకైవమూర్తి ర్బిభిదే త్రిధాసా ' అన్న మాటతో వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ నిలుస్తాను.
No comments:
Post a Comment