చమత్కార
శ్లోకము
లక్ష్మీ దేవికీ, పార్వతీదేవి కీ మధ్య
సాగిన ఈ సరస సంభాషణను సాదరముగా చదవండి.
శ్లోll భిక్షార్థీ ప్రయాతః
సుతను?బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?
జానే
బృందావనాన్తే,క్వ చ స మృగ శిశు:? నైవ జానే వరాహం
బాలే,కశ్చిన్న దృష్ట:?
జరట వృష పతి:?గోపా ఏవాస్య వేత్తా
లీలా
సల్లాప ఏవం జలనిధి హిమవత్కాన్యయో త్రాయతాం వః
లక్ష్మీ
దేవి చుట్టపు చూపుగా కైలాసానికి వెళ్ళిందట. పార్వతి ఆమెను సాదరముగా తోడుకోనివచ్చి
ఉచితాసీనురాలిని చేసి కుశలప్రశ్నలు అడిగింది. పిచ్చాపాటి మాట్లాడుకోన్నతరువాట
సరసము శ్రుతిమించి లక్ష్మీదేవి ఎగతాళిగా పార్వతీ
నీ భర్త భిక్ష మడుక్కునేందుకు ఎక్కడికి వెళ్ళినాడు?పార్వతి గడుసుగా
బలిచక్రవర్తి యాగానికి వెళ్ళాడు సుందరీ అన్నది.
ఈ
రోజు మీ తైతక్కలు ఎక్కడ ? అన్నది లక్ష్మి ,
పార్వతి వెంటనే బృందావన ప్రాంతం లో అనుకుంటాను అన్నది. మీ అందాల మృగ
శిశువు (వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు కదా!) ఎక్కడ?అన్నది
లక్ష్మి ఎగతాళిగా, అందుకు పార్వతి ఈ వరాహాల (విష్ణువు
వరాహావతారం) సంగతి నాకేం తెలుస్తుంది అన్నది.
మీ ముసలి ఎద్దు ఏదీ కనపడదే?
అన్నది లక్ష్మి. ఎద్దులూ,ఆవుల విషయం ఆవులు కాచే వాడికే తెలియాలి. ఇలా
ఎకసక్కాలాడుకునే లక్ష్మీ,పార్వాతులు మిమ్మల్ని కాపాడుదురు
గాక.
ఎంత
సుందరమైన భాష ఎంత సుందరమైన భావము. ఇంతటి గొప్ప భాషను చేయి జార్చుకొన్నందుకు మనము
సిగ్గుపడవలెనేమో!
No comments:
Post a Comment