మన సుభాస్ చంద్రుని నాయకత్వములో తయారయిన
జాతీయము కాని మహత్తర గీతము
(బాణీ: జనగణమన బాణీయే )
భారత్
భాగ్య హై జాగా
పంజాబ్
సింధ్ గుజరాత్ మరాఠా
ద్రావిడ్
ఉత్కల్ బంగా
చంచల్
సాగర్ వింధ్య హిమాలయ్
నీలా
యమునా గంగా
తేరే
నిత్ గుణ్ గాయేఁ
తుఝ్
సే జీవన్ పాయేఁ
సబ్
జన పాయేఁ ఆశా
సూరజ్
బన్ కర్ జగ పర్ చమ్కే
భారత్
నాం సుభాగా
జయ
హో జయ హో జయ్ హో
జయ్
జయ్ జయ్ హో
భారత్
నాం సుభాగా
సబ్
కో మాన్ మే ప్రీత్ బసాయే
తేరీ
మీఠీ వాణీ
హర సూబే కే రహనేవాలే
హర మజహబ్ కే ప్రాణీ
సబ్
భేద ఆర్ ఫక్ర్ మిటాకర్
సబ్ గోద్ మేఁ తేరీ ఆగే
గూంథే ప్రేమ్ కి మాలా
సూరజ్
బంకర్ జగ పర చమ్కే
భారత్
నాం సుభాగా
జయ
హో జయ హో జయ్ హో
జయ్
జయ్ జయ్ హో
భారత్
నాం సుభాగా
సుబః
సవెరే పంఖ్ పఖేరూ
తేరే
హీ గుణ్ గాయేఁ
బాస్
భారీ భర్పూర్ హవాయేఁ
జీవన్
మే ఋతు లాయేఁ
సబ్ మిల్కర్ హింద్ పుకారేఁ
జయ ఆజాద్ హింద్ కే నారే
ప్యారా
దేశ్ హమారా సూరజ్ బన్ కర్ జగ పర్ చమ్కే
భారత్
నాం సుభాగా
జయ
హో జయ హో జయ్ హో
జయ్
జయ్ జయ్ హో
భారత్
నాం సుభాగా
ఈ గీతము విన్నారా! ఇది నేడు మన జాతీయగీతముగా ఎన్నుకొనబడి
పాడబడుచున్న రవీంద్ర నాథ్ ఠాకూర్ గారి 'జనగణమన అధినాయక జయహే' అన్న గీతమును ఆలంబనగా తీసుకొని
ముక్త భారతదేశ తాత్కాలిక ప్రభుత్వము ( The provisional Government of Free India -- Ārzī Hukūmat-e-Āzād Hind) వ్రాయబడిన ఈ గీతమును జాతీయ
గీతముగా ఆలపించుట జరిగినది. ఈగీతమునకు జాతీయ గీత స్థాయి దక్కవలసినదే కానీ
దక్కలేదు. ఈ గీతము యొక్క భావము పూర్వాపరములు తెలుసుకొనుటకు పూర్వము 'జనగణ మన' ను గూర్చి కాస్త క్లుప్తముగా
ముచ్చటించుకొందాము.
ఈ గీతము జార్జ్ -5 గారు మనదేశమునకు వచ్చు సందర్భముగా నెహ్రూగారి మాటమేరకు రవీంద్రులవారు
వ్రాసినట్లు చెప్పుకొంటారు. ఆ మాటను పుష్టి చేస్తూ అందలి సంబోధన కూడా పురుష వాచకమే
అయి వుంది. మరి దేశమును సంబోధించేదయితే తల్లిగా పోల్చుకొంటాము కాబట్టి
స్త్రీలింగ వాచకమై ఉండవలెను కదా! ఇదికాక ఈ గీతములోని పూర్తి పాఠములో ఒక చరణము
స్త్రీ ని సంబోధించుతూ వుంటుంది. అది భారత మాత సంబోధన మాత్రము కాదు. అది జార్జ్ రాజు భార్యను సంబోధించినది అని మనకు సులభముగా అర్థమైపోతుంది. నేడు 'జనగణమన' 'వందే మాతరం' కన్నా ప్రాధాన్యత సంతరించుకొని
దేశప్రజలచే కొనియాడబడుచున్నది. ఈ విషయమై విస్తారముగా గతములో
వ్రాసియుండినాను. ఇప్పుడు పైన ఎరుకపరచిన గీతమును గూర్చి తెలుసుకొందాము.
21 అక్టోబరు 1943
లో, రెండవ ప్రపంచ యుద్ధ సమయమున, జపాను దేశాధినేత ఆదరణతో Axis powers యొక్క సహకారముతో British
Rule కు విరుద్ధముగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వములో స్థాపింపబడినది.
సంపూర్ణ స్వతంత్ర సముపార్జన తన ధ్యేయముగా, సంగీతాభిమానియైన
బోసు తన సహచరులగు ముంతాజ్ హుస్సేన్ మరియు అబిద్ హసన్ సఫ్రాని (హిందువులకు
గౌరవప్రదమగు కాషాయ వర్ణమును సమైక్యతా చిహ్నముగా తన పేరునకు చేర్చుకొన్నాడు) తో
కలిసి పై గీతమును రచించుట జరిగినది. మరియిక కారణమేమిటంటే హైందవేతరులు ముఖ్యముగా
ముస్లీములకు ‘వందే
మాతరం’ సంస్కృత ఉపమానములు శబ్దములు
కలిగియుండుట చేత రుచించలేదు. అందుకే ఈ పాట బంగాలీ భాషలోగాక హిందుస్తానీ లో
నడుస్తుంది అంటే ఉర్దూ పదాలు కూడా కలుస్తాయి. పైపెచ్చు ఇది యథాతథానువాదము కాదు.
పరాయి పాలకులను పొగడలేదు. బానిసత్వ పోకడలు ఇందులో కనిపించవు. అయినా స్వాతంత్రము
వచ్చిన తరువాత 24 జనవరి 1950 లో తర్జనభరజనల తరువాత బెంగాలీ గీతమగు 'జనగణమనకే'
కే పట్టము కట్టినారు. ఈ గీతము సంపూర్ణముగా తెరమరుగైపోయినది. నేటి
యువతకు అటువంటి ఒక దేశభక్తి గీతము ఉన్నట్లు కూడా తెలియదు.
ఇంకా
ఈ గీతము ప్రత్యకత ఒకటి ఉన్నది. ‘జనగణమన...’ లోని పదములను ఈ గీతములో వాడుకొన్నాగూడా
వానిని దేశ ప్రజలు సవినయముగా భరతమాతను నుతించి నమస్కరించుటకు వాడుకొన్నారు. తమ
జన్మభూమి గుణగానమును చేసినారు కానీ అన్యథా కాదు.
ఇక
ఆ గీత భావము తెలుసుకొందాము.
శుభ సుఖశాంతులు కురియజేసే భారత భాగ్యము మేలుకొన్నది. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్
ఉత్కళము, బంగాళము, చంచల సాగరములు వింధ్య
హిమాలయాలు, నల్లని
యమునా గంగా నీ శుభ గుణగణములే గానము చేస్తూవున్నాయి. మా ఆశలు ఆశయాలు నీ
సౌభాగ్యముతోనే ముడిపడి వున్నాయి. సౌభాగ్యవంతమగు భారత భూమి సూర్యకాంతులు జగమంతా విస్తరిల్లవలె.
సకల సౌభాగ్య దాతా మాతా జయ హో జయ హో జయ హో జయ జయ జయ జయ హో.
నీ
మధురాతిమధురమైన వాణి అందరిలో ప్రేమను నింపవలె. ఏ ప్రాంతమునకు చెందినవారయిన, నీ వడిన,
ఏ మతము వారయినా తమలోని భేదభవములను మరచి ప్రేమ మాలతో నిన్ను అలంకరించవలె.
సౌభాగ్యవంతమగు భారత భూమి సూర్యకాంతులు జగమంతా విస్తరిల్లవలె. సకల సౌభాగ్య దాతా
మాతా జయ హో జయ హో జయ్ హో జయ జయ జయ జయ హో.
సూర్యోదయముతో
పక్షులు తమ కిలకిలారావములతో నీ గుణగానమే చేయవలెను. ఆగుణ సముదాయపరిమళ భరితమైన పవనము
మాజీవితమును నిత్యవసంతము గావింపవలె. నీబిడ్డలమగుమేము ‘స్వతంత్ర భారతమునకు జయము
జయము’ అని జయజయ ద్వానములు
చేయవలె. సౌభాగ్యవంతమగు భారత భూమి సూర్యకాంతులు జగమంతా విస్తరిల్లవలె. సకల సౌభాగ్య
దాతా మాతా జయ హో జయ హో జయ్ హో జయ జయ జయ జయ హో.
ఇంత
అర్థవంతమగు గీతమును ఆసాంతము విస్మరించి మనము దేశమాతకు న్యాయము చేసినామా అన్నది
మిక్కిలి ఆలోచించదగ్గ విషయము.
స్వస్తి.
No comments:
Post a Comment