నేపాల్- జనక్ పూర్
వివాహ పంచమి పండుగ విశేషముగా జరిగే పుణ్యధామము “జనక్ పుర్ ధామ్”.
ఈ పండుగ నాడు ప్రపంచము యొక్క నలుమూలలనుండి లక్షలాదిమంది భక్తులు ఆ
పట్టణమునకు వస్తారు. జనము ఇసుక వేస్తె రాలనంతమంది వుంటారు అని అంటారు. ఇది విశాఖ మాసములో
ఇచ్చట జరుగుతుంది.
జానకీదేవి జన్మించిన
జనక్ పుర్ మందిర్
https://cherukuramamohanrao.blogspot.com/2018/07/blog-post.html
రామాయణంలో విదేహ రాజ్యాన్ని పరిపాలించిన మిథి మిథిల
నగరమును కట్టించి దానిని రాజధానిగా చేసుకొని పరిపాలించినాడు. ఈ మితి/మిథి అన్న శబ్దమునకు మట్టి అన్న
అర్థమునుకూడా అక్కడివారు చెప్పుకొంటారు. ఆ రాజవంశమును జనక వంశము అంటారు. కావున
జనకుడు అన్నది వంశ నామము. సీతమ్మ తండ్రి యగు జనకునిపేరు శీరధ్వజుడు. ఆయన భూమి
దున్నుతూ వుండగా సీత దొరికిన పొలమును సీతామర్షి అంటారు. ఈ మిథిలకు జనకపురి అన్న
నామాంతరము కూడా కలదు. జనక ప్రభువులు వేద విదులు, వేద నిధులు. ఒక జనక మహారాజు
యాజ్ఞావల్క్యుని వంటి మహానుభావునికి తత్వమును అరయజేసినాడు. జనక ప్రభువుల పాలన
అంతరించిన తరువాత ఈ మిథిల 8 ప్రాంతములుగా విభజింపబడినది.
కొన్ని భారత దేశములోని బీహార్ బెంగాల్ వంటి
రాష్ట్రములలో చేరిపోగా కొన్ని నేపాల్ లో
వుండిపోయినాయి. ఆధునిక కాలంలో నేపాల్ లోని జనక్ పూర్ అప్పటి మిథిలగా గుర్తించినారు
నేటి పురాతత్వ శాస్త్రవేత్తలు..
జనక్
పుర్ ను జనక్ పూర్ ధాం గా కూడా పిలుస్తారు. ఇది ఖాట్మండు కు నైరుతీ దిశలో 120
కి.మీ. దూరములోవుంది.
1657లో సీతమ్మ బంగారు విగ్రహము అచ్చట దొరికినదని చెబుతారు. తికంగఢ్ మహారాణి వృష భాను క్రీ.శ.1910లో ఈ భవనము కట్టించి ఆ
విగ్రహమును అందు ప్రతిష్టించినట్లు చెబుతారు. 486౦ చదరపు అడుగుల విస్తీర్ణములో కట్టబడిన
3 అంతస్తుల విశాల భవనము. ఈ భవనము ప్రక్కనగల వివాహ మండపములో సీతారామ కళ్యాణము
జరిగినట్లు జనశృతి. ఈ భవనములో 6౦ గదులున్నాయి. సీతమ్మ గది సీతారాములగది ఇత్యాదులు
అత్యంత ప్రసిద్ధములు. ఈ కట్టడమునకు అయిన ఖర్చు ఆ కాలములో 9 లక్షలట. అందుకే దీనిని
నౌ లఖ మందిర్ అని కూడా అంటారు.
No comments:
Post a Comment