Friday, 14 September 2018

మదాలస and Gabriella Burnel

మదాలసోపదేశము.

https://cherukuramamohanrao.blogspot.com/2018/09/blog-post_14.html

Gabriella Burnell

I can say it to be an enigmatic experience when I listened to an enchanting voice of a lady who looked more Godly in her attire and expression and rendition of the Shlokas in Sanskrit in an Indian Music Tune, I started searching for her name in Google and at last I could get a little information about her. She is Gabriella Burnel.
Gabriella Burnel is a Sanskrit scholar and an accomplished musician and musical theatre performer. After studying Sanskrit at Oxford, she completed a Masters in Drama at Goldsmith University in 2010. She has since written musicals for off-West End theatres in London and performed with the band Gabriella and The Planets. She has also launched “Bespoke Song for you”, a web-based service which offers a personalized song-writing service. It was through her website that The Song of Madālasā was commissioned.

As a four-year-old growing up in London, Gabriella Burnell was introduced to Sanskrit by her parents. Having travelled to India as tourists, the couple had developed a deep appreciation for Indian culture and wanted their daughter to pick up the ancient divine language of the country. Starting with learning the language at St James School in London as a child, Gabriella went on to earn a degree in Sanskrit from Oxford University, pursuing it alongside music.  

 

Today, she is a renowned performing artist whose music is steeped in Sanskrit verses. So immersed is she in the world of the divine language of India that Gabriella has even changed her name to Gaiea Sanskrit. ‘Gaiea’ in Sanskrit means ‘to be sung’, she says.  


She is well-known as a composer and performer of poems and hymns drawn from the Sanskrit tradition. Early in 2016, she set to music a hymn in praise of Adi Sankara which she also performed at a Teacher’s Day event in the London School of Economic Science.
Anybody can hear her rendering the shlokas in the following link.

 

https://www.youtube.com/watch?v=uDd3iupKUyI
మదాలస

మార్కండేయ పురాణము రాశిలో చిన్నది వాశిలో పెద్దది. మార్కండేయ పురాణములో చెప్పిన  దుర్గాసప్తశతి చాలా ప్రత్యేకత గలది. ఇందు మహాకాళి-మహాలక్ష్మి-మహాసరస్వతీ రూపిణియైన దేవి యొక్క మాహాత్మ్యమును 136 అధ్యాయములలో విస్తారముగా ప్రతిపాదింపబడినది. మన్వంతర వర్ణనం కూడా విస్తృతంగా కలిగిన పురాణం ఇది. కొన్ని వైదిక కర్మల ద్వారా అభీష్టఫలాలను ఏ విధంగా పొందవచ్చునో కొన్ని ఉపాఖ్యానాల ద్వారా విశదీకరించబడింది. అనేక విషయాలు మార్కండేయ పురాణం నుంచి దేవీ భాగవంలోకి స్వీకరించబడినాయి. మార్కండేయ పురాణంలో 136 అధ్యాయాలు ఉన్నాయి. దీని శ్లోక శంఖ్య 9,000. కానీ ఇప్పుడు లభ్యమవుతున్న మార్కండేయ పురాణంలో కేవలం 6,900 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి.
ఈ పురాణమును విజ్ఞాన మకుటముగా భావించితే మదాలస చరిత్రము అందు పొదిగిన అమూల్య మణి. ఈ పురాణము నందలి వైశిష్ఠ్యము వల్లనే  పర్గీటర్ చేత ఆంగ్లమునకు ఇది అనువదించట జరిగినది. ఇందలి కొన్ని అధ్యాయములు జర్మన్ భాష లోనికి కూడా అనువదింపబడినా వారు సంస్కృత పాఠమును యధాతధముగా గ్రహించి భావార్థ విశ్లేషణ మాత్రము వారి జర్మన్ భాషలో చదువుకొంటారు. ముఖ్యముగా మదాలస తన కుమారులకు ఊయలలో ఉండగానే చేసిన జ్ఞానోపదేశమును ప్రతి తల్లిదండ్రీ చదివి తమ పిల్లలచేత రోజూ కంఠపాఠమగువరకూ చెప్పించవలసిన బాధ్యత ఎంతో వున్నది.
ఈ మధ్య కాలములో నేను కొందరు మిత్రులతో మాటలాడు నపుడు తాము వేదాంత మార్గమును అవలంబించినట్లు చెప్పుట వినుచున్నాను. నాకు వారి సంభాషణమునందలి ఆంతర్యము సుబోధకము కాలేదు. వేదాంతము అన్నది ఒక కూడలి. అక్కడ నిలుచుకొని చూస్తే శ్రీకృష్ణుడు ఏర్పరచిన పద్దెనిమిది దారులు కనిపిస్తాయి. మొదటిది విశాదయోగమే! అది అనుభవించితే తప్పక మిగిలిన 17 మార్గములలో ఒకటి మనము ఎన్నుకొనవచ్చు. కానీ ఆశ్చర్యమైన విషయము ఏమిటంటే ఆదారుల గమ్యము ఒకటే! కలియుగమున అవతరించిన ఏ గురువయినా, బాబా అయినా, స్వామీ అయినా తానూ నమ్మి పయనించి భగవత్ సాయుజ్యమును పొందిన మార్గమును తన భక్తులకు ఉపదేశించవలసిందే కానీ తానే కనుగొన్న మార్గమని ఎదో చెప్పుట ఆత్మ వంచనే! పైగా ‘అహం బ్రహ్మాస్మి’ అన్న వేదవాక్యమును సాధించి, తమలో దైవత్వమును ఆవిష్కరించుకొన్న భగవాన్ రమణాదులు అద్వైతమును తమ అనుభూతిలోనికి తెచ్చుకొనిరేగానీ అన్యథా కాదు. ఈ జన్మకు నాలాంటివారు చేయగలిగినదల్లా  మనసును విషయ వాంఛలపై పోవనీక భగవంతుని తలచుకొంటూ తగిన గురువుకి ఎదురు చూడటము. ఈ జన్మలో జరిగితే మన అదృష్టము లేదంటే వచ్చేజన్మమునకై వేచియుంటూ అప్పుడయినా ఒక సద్గురు శిష్యునిగా జీవితమును చరితార్థము చేసుకోనగలుగు విధమున పరమాత్మను ప్రార్థించుటయే మనము చేయగలిగిన పని. ఈ జన్మముననే పరమాత్మ తత్వమును తమ అనుభవములోనికి  తెచ్చుకొన్న 18, 19, శతాబ్దపు మహనీయులలో మహావతార్ బాబా, లాహిరీ మహాశయులు, స్వామీ యుక్తేశ్వర్ గిరి, తెలుగువారయిన త్రైలింగ స్వామి గారు ప్రముఖులు. వీరుకాక ఇంకా అనేకులు గురువును ఆశ్రయించి తత్వమరసినవారు గలరు. అందుకే మనము కోరుకో వలసిందీ, కోరుకోగలిగిందీ ఒక్కటే:
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే! (1272 వ పద్యము)
ఈ పద్యము భాగవతములోని దశమస్కంధములో సుదాముడు అను పూలమాలలను కట్టే భక్తుని ఇంటికి బలరామ కృష్ణులు పోయినపుడు సుదాముడు శ్రీ కృష్ణునితో ఈ మాట అంటాడు. ఇది మనము ఆచరించ తగినది. ఆ దేవునికి ఎప్పుడు దయగలిగితే అప్పుడు తానే అయినా వస్తాడు లేకుంటే తన ప్రతినిధిని గురువు రూపములో పంపుతాడు.
ఇక మార్కండేయ పురాణము, మదాలస చరితమునకు వస్తాము. మదాలస దుంధుడను(పాతాళకేతుడు) రాక్షసునిచేత బంధింపబడితే ఋతధ్వజుడనురాజు, గాలవముని అనుగ్రహముచే నొసంగబడిన కువలయాశ్వము నెక్కి కువలయాశ్వుడై   వానిని చంపి ఆమెను చేబడతాడు. పాతాళకేతుని తమ్ముడు తాళకేతుడు ఋతధ్వజుననిపై పగబూనుతాడు.
   కువలయాశ్వుడు ఒకనాడు జనపదాలను రక్షించాలని గుర్రంపై బయలుదేరాడు. మార్గమధ్యమున తాళకేతుడు మునిరూపంలో ఎదురుపడి తాను చేయబోయే యజ్ఞానికి సహాయం కావాలనీ,కువలయాశ్వుని మెడలోని హారం ఇవ్వగలిగితే యజ్ఞం పరిపుష్టిగా జరుగుతుందనీ ప్రాధేయపడతాడు. అడిగినదే తడవుగా కువలయాశ్వుడు తన మెడలోని హారాన్ని తీసి ఇచ్చేస్తాడు. తాళకేతుడు తాను వచ్చే వరకు తన ఆశ్రమాన్ని కనిపెట్టుకొని ఉండవలసినదిగా కువలయాశ్వుని ఒప్పిస్తాడు. అక్కడ మునిరూపంలోని తాళకేతుని మాట విని ఆశ్రమ పరిరక్షణలో ఉంటే, ఇక్కడ తాళకేతుడు రాక్షసమాయతో కువలయాశ్వుని నగరానికి వెళ్ళి తానిచ్చిన హారాన్ని చూపించి కువలయాశ్వుడు చనిపోయాడని ప్రచారం చేస్తాడు. మదాలస ఆ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడుస్తుంది.
తాళకేతుడు ఏమీ ఎరుగనట్టు ఆశ్రమంలోని కువలయాశ్వుని చేరి ధన్యవాదాలు తెల్పి సెలవు తీసుకుంటాడు. కువలయాశ్వుడూ తన పనిని పరిపూర్తి చేయడానికి జనపదాలకు వెళ్ళి వారం రోజుల తర్వాత నగరానికి తిరిగివస్తాడు. విషయం తెలుసుకొని అదంతా రాక్షసమాయని అర్థం చేసుకుంటాడు. కానీ తన ప్రాణానికి ప్రాణమైన మదాలస లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక విరక్తిలోకి వెళ్ళిపోతాడు కువలయాశ్వుడు.
అశ్వతరుడనే నాగేంద్రుని పుత్రులు కువలయాశ్వుని  ప్రాణ స్నేహితులు.
మంచివ్యక్తి, సర్వసమర్థత గల చక్రవర్తి, ప్రజాబంధువు అయిన తమ స్నేహితుడు కువలయాశ్వుని పరిస్థితిని చూసి తట్టుకోలేక నాగపుత్రులు  తమ తండ్రిని చేరి విషయం వివరిస్తారు. లోకంలో మంచివారికి అన్యాయం జరుగరాదనీ, యత్నిస్తే సాధ్యంకానిది లేదనీ వారితో చెప్పి ఆశ్వతరుడు  సరస్వతీ దేవిని మెప్పించి గానం నేర్చుకొని, శివునికై తపస్సు చేసి తన సామగాన గరిమచే మదాలసకు పునర్జన్మ కలిగేలా వరమును పొందుతాడు. ఆవిధముగా మదాలస అశ్వతరునికే పరిపూర్ణ జవ్వనియగు కూతురిగా జన్మిస్తుంది. ఆమెను,  కువలయాశ్వునికి పునర్వివాహం చేస్తాడు.
కాలాంతరములో వారికిఒక కొడుకు కలిగితే విక్రాంతుడు అన్న పేరు పెడతాడు రాజు. ఆమె నవ్వి ఊరకుంటుంది. ఊయలలో ఉండగానే అతనికి వేదాంతము నేర్పుతుంది తల్లి. బాలుడు నడవదొడగిన వెంటనే సన్యాసము స్వీకరించి అడవులకు వెళ్ళిపోతాడు. మరొకసారి కొడుకు పుడితే అతనికి సుబాహు అన్న పేరు పెడతాడు. అతనూ అంతే. మళ్ళీ కొంత కాలానికి ఒక కొడుకు పుడతాడు. అప్పుడు కూడా ఆ బాలునికి రాజే శతృమర్దనుడు అని పేరు పెడతాడు. అప్పుడూ ఆమె నవ్వుతుంది. ఆ బాలుడూ సన్యాసమునే ఆశ్రయించుతాడు.
    అంటే వారికి కలిగిన మువ్వురు కుమారులకూ ఊయలలోనే వేదాంతము నేర్పి విరాగులను చేస్తుంది ఆ తపోవంతురాలు. వారు పిన్నవయసులోనే ఐహిక వాంఛల నొదిలి తపోభూములకు వెళ్ళిపోతారు. ఈ ముగ్గురికీ రాజే పేరుపెట్టి ఉంటాడు. ఈ చివరి బాలునికి ఆమెను పెరుపెట్టమంటాడు రాజు. ఆమె అతనికి అలర్కుడు అని పేరు పెడుతుంది. అలర్కుడు అంటే విరగ పూచిన తన పూవులచేతనే  అలంకరిపబడిన తెల్ల జిల్లేడు చేట్టువంటి వాడు అని అర్థము. ఇదేమి పేరంటే భర్త పెట్టిన మూడుపేర్లు అర్థవంతమయినవి కావు అని ఈ విధముగా తెలుపుతుంది. మొదటివాని పేరు విక్రాంతుడు. అంటే విశేషమయిన క్రాంతి గలవాడు. క్రాంతి అంటే వెలుగు, మార్పు, చైతన్యము. ఈ పేరు శరీరానికి అనుకొంటే అది తనకు తానుగా ఏమీ చేయలేదు. దానిని బుద్ధి ప్రచోదితము చేస్తుంది, మరి బుద్ధి కర్మానుసారిణి. ఇక ఆత్మకు క్రాంతి ఉందా అంటే దానికి ఎటువంటి సంకోచ వ్యాకోచములు లేవు. మరి ఆపేరు దేహానికీ చెల్లదు, ఆత్మకూ చెల్లదు. రెండవ పేరు సుబాహు. మంచి బాహువులు కలవాడు.బుద్ధి కదిలించితే కదిలేవి, కావున అవి పరతంత్రములు. వానికి మంచేమిటి చేడ్డేమిటి. 
ఇక మూడవ పేరు శతృమర్ధనుడు. శరీరము జడమయినపుడు శత్రువులు ఎక్కడనుండి వస్తారు. ఇక ఆత్మకు శత్రువులు లేరు మిత్రువులూ లేరు. కావున మీరు పెట్టిన పేర్లు అర్థవంతములు కావు అని తెల్పినది.
మరి అలర్కుడు అంటే శరీరము ఆత్మ శుద్ధములై, బుద్ధములై సూర్యుని సమానముగా వెలుగులు విరజిమ్ముతూ సార్థక నామదేయుడౌతాడని చెబుతుందిరాజు కోరికపై ఆ బాలునికి ఏలికకు కావలసిన విధులను నేర్పి యుక్తవయసున రాజును చేసి భర్తను గూడి వానప్రస్థమునకు వెళుతుంది. వెళ్ళబోతూ కుమారునికి ఒక ఉంగరమునిచ్చి నీకు దుఃఖము కల్గినపుడు దాని మూత తీసి అందున్న చుట్టబడిన రేకులోని విషయమును చదువుకొమ్మంటుంది. ఆ స్థితి అతనికి కలిగిన వెంటనే అమ్మ మాట గుర్తుకొచ్చి చూసి దత్తాత్రేయుని ఆశ్రయించి ఆయన శిష్యుడైపోతాడు.

నేను ఈ విషయమును గూర్చి ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే  నా మిత్రులు B నాగ సుబ్బారెడ్డి , K P శ్రీనాథ బాబుగార్లు ఒక విదేశ యువతి ఆలపించిన మార్కండేయ పురాణములో మదాలస తన సంతానమునుద్దేశించి తెలిపిన బ్రహ్మజ్ఞానమును WhatsApp లో నాకు పంపియుండినారు. ఆ స్త్రీ యొక్క భక్తి, గౌరవము, ఏకాగ్రత, సంస్కృత భాషాభినివేశము, సనాతన ధర్మమును గూర్చి తెలుసుకొను జిజ్ఞాస నన్నెంతగానో ఆకట్టుకొనింది. మనలో ఎంతమంది ఆమె దారిలో పయనించుచున్నామని ఆత్మ విమర్శన చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతనోవుంది. అసమగ్రమైన అన్య మతములను పట్టుకొని ఊగులాడకుండా, Maria Wirth వ్రాసినటువంటి    PLEASE HINDUS, DON’T SAY: “ALL RELIGIONS ARE THE SAME” అన్న వ్యాసమును చదివితే మనము ఎంతటి అంధకారములో ఉన్నామో, ఏ మహా సముద్రపు అట్టడుగున ఉన్నామో, అర్థమౌతుంది. ఇకనైనా కళ్ళు తెరచి పెద్దలు మనకు వారసత్వములో ఇచ్చిన సాహితీ సంపదను ఉపయోగించ పూనుకొందాము. సంస్కృతము నేర్చుకొందాము. మన ధర్మమును కాపాడుకొందాము.
https://youtu.be/uDd3iupKUyI (Use Ctrl+Mouse click)
ఇక పై ఛాయాచిత్రము లో ఆ తల్లి పాడే గీతము, గీతార్థము క్రింద పొందు పరచినాను: 

శుద్ధోసి బుద్ధోసి నిరంజనోsసి
సంసారమాయా పరివర్జితోsసి
సంసార స్వప్నా త్యజ మోహ నిద్రాఁ
మదాలసోల్లాపమువాచ పుత్రం
ఓ మదాలసానువర్తియౌ పుత్రుడా! నావచనములనాలకించుము. నీవు ఎప్పటికీ కల్మషరహితుడవైన శుద్ధ ఆత్మవు. నీవే నిత్యసత్యమైన ఆత్మవు. నీవు ప్రాకృతిక మాయామోహములకు అతీతునివి. అంటే స్వప్న సమములగు భ్రమలు బంధాలు వదిలి నీ శుద్ధాత్మను పరమాత్మకు అనుసంధించమని మహావేదాంతి మదాలస తన పసికందుతో చెబుతూవుంది.  
శుద్ధోsసి రేతాత్త న తేsస్తి నామ
కృతం హి తత్కల్పనయాధునైవ l
పంచాత్మకం దేహ మిదం న తోsస్తి
నైవాస్య త్వం రోదిషి కస్య హేతోః ll
నీవు శుద్ధమయిన ఆత్మవు. నీవు అనామకునివి అంటే నీకు ఒక ప్రత్యేకమయిన పేరు లేదు.
నీవు ఈ భూమిపైకి వచ్చిన పిదప ఏ పేరుతో పిలువబడుచున్నావో  అది ఒక కల్పిత నామము. అసలు నీ నామకరణమునకు నీవు కర్తవు కాదు. నీ తలిదండ్రులు  తమకు నచ్చిన పేరు నీకు పెట్టుకొంటున్నారు. దాని ఔచిత్యము ఒక విధముగా వారికే తెలియదు. బాహిరముగా కనిపించే శరీరము పంచాభూతాత్మకమైనది. దానిపై నీ ఆధిపత్యము లేదు. దానికీ నీపై ఆధిపత్యము లేదు.మరి నీకిక దుఃఖమెందులకు? 
న వా భవాన్ రోదితి వై స్వజన్మా
శబ్దోsయమాసాధ్య మహీశ సూనం l
వికల్ప్యమానా వివిధైర్గుణైస్తే
గుణాశ్చ భౌతాః సకలేంద్రియేషు ll
ఓ రాజకుమారా! నీవు నీ జన్మమును గూర్చి ఏడ్వ తగదు. ఆ రోదనవల్ల కలిగే శబ్దమే నీకు అన్వయింపబడిన ఒక మాయ. ఇక నీలో కలిగిన గుణములంటావా అవి నీవి కాదు. అవి నీ ఇంద్రియములకు చెందినవి. 
భూతాని భూతైః పరిదుర్బలాని
వృద్ధిం సమాయాంతి యథేహ పుంసః l
అన్నాంబుపానాది భిరేవ తస్మాత్
న తోస్తి వృద్ధిర్ న చ తోస్తి హానిః ll
నీ శరీరమునకు చెందిన ఇంద్రియములు అనేవి నీవి కావు. వాని అనుభూతి వానిదే! అన్నపానాది క్రియలచే కలిగే వృద్ధిహీనతలు నీకు అంటుట లేదు. అసలు వృద్ధిహీనతలన్నవి నీకు అంటవు. 
త్వం కంచుకే శీర్యమానో నిజోస్మిన్
తస్మిశ్చ దేహే మూఢతా మా వ్రజేతాఃl
శుభాశ్శుభౌః కర్మభిర్దేహమేతత్
మదాదిభిః కంచుకస్తే పినద్ధః ll
ఇక దేహము అన్నది నీయొక్క పై తొడుగు మాత్రమే. అది జీర్ణమూ కాక తప్పదు, శీర్ణమూ కాక తప్పదు. దీనిపై నీవు ఎట్టి పరిస్థితిలోకూడా మోహము పెంచుకొనవలసిన అవసరమే లేదు. నీయొక్క పాపపుణ్య కర్మ ఫలమే నీ దేహము. కామ క్రోధాది అరిషడ్వర్గ పరివేష్ఠితము అది. నీవు అది కాదు అన్నది సత్వరము గుర్తెరుంగుము.  

తాతేతి కించిత్ తనయేతి కించిత్
అంబేతి కించిద్ధయితేతి కించిత్l
మమేతి కించి న్న మమేతి కించిత్
త్వం భూతసంఘం  బహుమా నయేథా ll
తండ్రి ఎవరు, తనయుడెవరు, తల్లి ఎవరు, పత్ని ఎవరు, 'నేను' ఏమిటి, 'నేను కాదు' ఏమిటి, ఇదంతా ఈ భూత సముదాయ స్వరూపము. నీవు కాదు అన్నది గుర్తించు. 
దుఃఖాని దుఃఖోపశమాయభోగాన్
సుఖాయ జానాతి విమూఢ చేతాః l
తాన్యేవ దుఃఖానిపునః సుఖాని
జానాతి విద్వా న్న విమూఢ చేతాః ll
దుఃఖోపశమనము కొరకు భోగములను అనుభవించుతున్నావు. కానీ అవీ దుఃఖభాజకములే నని గ్రహించ లేకుండా వున్నావు. సుఖము దుఃఖము అనునవి ఒక వృత్త పరిధిని అంటియున్న రెండు భిన్న బిందువులు. ఆ వలయాకార మార్గములో ఒక బిందువును తాకితే రెండవదానిని కూడా తాకి తీరవలసిందే! విమూఢచిత్తులు కాని విద్వాంసులు ఈ సూక్ష్మమును గ్రహించగలుగుతారు.  
హాసోsస్థి సందర్శన మక్షియుగ్మం
అత్యుజ్వలం యత్కలుషం వసాయాః
కుచాది పీనం పిశితం పనం తత్
స్థానం రతేః కింనరకం న యోషిత్
శరీరము త్వక్మాంసరక్తాదులను ( అంటే చర్మము, మాంసము రక్తములను) కలిగియున్న అస్థిపంజరము. స్త్రీపురుషులిరువురిలోనూ ఇది సహజము. మరి  చిరునవ్వునకు, అవయవ సౌష్ఠవమునకు, కలుషము నిండిన ఉజ్వలమగు కంటి చూపునకు, మాంసభరితమగు కుచములకు ఆకారమైన స్త్రీలు నరక గతికి నాజూకు మార్గములు కారా! అందుచేత 'మమ' అన్నది మరచి అది నీవు కాదని తెలుసుకో!
యానాంక్షితౌ తత్ర గతశ్చ దేహో
దేహేsపిచాన్యః పురుషో నివిష్ఠః l
మమత్వ ముర్వ్యా న తథా యథాస్వే
దేహేతి మాత్రం చ విమూఢతైషా ll

జీవిత శకటములో జీవివయిన నీవు ఉచితాసనముపై కూర్చొనివున్నావు. ఆత్మ నీలో పరివిష్ఠితమయి వుంది. జీవి తన మాయామోహమూర్ఖత్వముచే శరీరము తనది అనుకొనుచున్నాడు. ఆత్మకు స్వపరభేదములు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు అంటవు. నీది  అనుకొనునది నీది కాదు. అసలు నీవనుకొను నీవే నీవు కానపుడు ఆ రథము నీదెట్లవుతుంది. ఆ నిరవగాహన నీ మూర్ఖత్వమునకు సంకేతము.
పుట్టిన బిడ్డకు అంతటి చిన్నవయసులోనే ఇంత వేదాంతము చెబితే అర్థమౌతుందా అన్నది కొందరి సందేహము కావచ్చు. అంతటి లేత వయసులో ఏమి చెప్పినా, అంటే అది మంచయినా చేడ్డయినా వారి హృదయములకు హత్తుకొని పోతుంది. ఇది మనపూర్వులు ఏనాడో చెప్పిన సత్యము. అమెరికా సైంటిస్టులు ఈనాడు ఒప్పుకొన్న సత్యము. శంఖము నుండి నీరు చేతిలో పడింది కాబట్టి తీర్థమయ్యింది. మనము నమ్మి పిల్లలకు మంచి చెబుదాము. దేశమునకు స్వస్థత చేకూర్చుదాము.
  స్వస్తి. 

3 comments:

  1. Great job. Please keep writing whether the readers appreciate or not.
    శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి|

    ReplyDelete
  2. మదాలస మాతృహృదయం చక్కగా ఆవిష్కరించారు. యా దేవీ సర్వభూతేషు🙏🙏🙏.. మరలా పోస్ట్ ముఖ పుస్తకంలో వుంచండి. ప్రస్తుతం అవసరం.

    ReplyDelete