కాశీ ఖండమున కాశీ విశ్వేశుడు
కవిసార్వభౌముడు శ్రీనాథుడు తన 'కాశీ ఖండమున'
వివరించిన కాశి-విశ్వేశ్వర మాపన ప్రావిధి.
నేను శ్రీనాథుడు రచియించిన కాశీ ఖండమునుండి ఈ పద్యమును గైకొనుటకు ఒక ముఖ్య
కారణము ఉన్నది. ఈ పద్యము కాశీని, విశ్వేశ్వరుని గూర్చి తెలుసుకొనుటకు ఇది ఒక
కొలబద్ద. మాపన ప్రావిధి అన్న మాటకు కొలుచుట అనియే అర్థము. ‘కొలమానము’ అన్న మాటను
ఎందుకు వాడలేదంటే అది తెలుగు తత్సమ శబ్ద సంయోగము సంధి పొసగదు కాబట్టి. కానీ
వాడుకలో వున్న పదము ఇదిమాత్రమే!
‘పదుగురాడుమాట పాటియై ధరయిల్లు’ అన్న నానుడి ఉండనే ఉన్నది కదా! ఆ పద్యము
ఏవిధముగా కొలబద్ద అన్నది గమనించుటకు ముందు పద్యము దాని భావమును చూద్దాము.
సీ. చక్రవాళ పరీత సర్వ సర్వంసహా
పరమ తీర్ధములలొ బెరువ
కాశి
కాశికా పట్టణ క్రోశ
పంచక తీర్ధ
సమితి లో సారంబు
జహ్ను కన్య
జహ్ను కన్యా తీర్ధ
సముదాయమున యందు
గడు బెద్ద మణికర్ణికా
హ్రదంబు
మణికర్ణికా తీర్ధ
మజ్జన ఫలము కం
టెను విశ్వనాధు దర్శన
మధికము.
తే.గీ. విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె
గాలకంఠుని కంటె
ముక్కంటి కంటె
దీర్ధములు దైవములు
లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు
సంయ మీంద్ర! (123)
తా. ఓ మహర్షీ! (సంయమము : అనుచితమైన, అహితమైన కోర్కెలకు ఆలోచనలకు కళ్ళెం వేసి ,ఉచితమైన వాటివైపు మనస్సును లగ్నం చేయడమే సంయమము . అది కలిగినవాడు సంయమి.
అటువంటి వారిలో ఇంద్రునివంటి వాడు సంయమీంద్రుడు.) లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ
తీర్ధములలో కాశీ పెరువ అనగా గొప్పది. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ
సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి
గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ
విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ
సత్యము.
మొదట కాశీనాథుడగు విశ్వేశుని గూర్చి కొంత గమనిచుదాము. ఈ పద్యమున వరుసగా
ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి గా ఏదేది పెద్ద అని చెప్పుకొంటూ పోయి చివరకు
అన్నింటికన్నా విశ్వపతి అధికము. అట్టి విశ్వపతి మరియు ఆ విశ్వపతిని పరివేష్ఠించి యున్న
తీర్థములు దైవములు తక్క ఈ త్రిభువనములలో వేరు అధికమగు ప్రస్తాపనే ప్రపంచమున లేదు.
ఇక కాశీ పట్టణము యొక్క కొలతల గూర్చి మాట్లాడుకొందాము. ఈ ప్రమాణము వ్యాసమహర్షి ‘స్కాంద
పురా’ణాంతర్గత ‘కాశీ ఖండము’ న వర్ణింపబడిన
కాశీని గూర్చి మాట్లాడుచున్నాము అన్న విషయము మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినది. అంటే
ద్వాపరమునకు పూర్వమే, పట్టణములు ఉన్నవి అన్నది మనకు తెలియుచున్నది కదా! మరి వ్యాసులవారు స్కాందపురాణము వ్రాసినది ద్వాపరమునందే కదా! దీనిని బట్టి మన
నాగరికత ఎంత పురాతనమైనది అన్నది ఒకపరి ఆలోచించండి. ఇక విషయమునకు వద్దాము.
‘ కాశికా పట్టణ క్రోశ పంచక...’ అని పద్యము యొక్క రెండవ పాదములో గమనించుతాము.
అంటే వ్యాసులవారి కాలమునకు ఈ కాశీపట్టణము ఎంత విస్తారము కలిగియున్నది అన్నది
మనము గమనించవలసియున్నది.
పూర్వ కాలముననే కొలతలను పరిమాణము (volume), చతురస్రము (Area), ప్రమాణము
(length), ఉన్మానము (weight), గా మన
పూర్వులు విభజించియున్నారు. వారికి వ్యాసము (Diameter), వ్యాసార్థము (Radius), π మొదలగు అనేక విషయముల గూర్చి తెలుసు. ఈ విషయములను మనసున
ఉంచుకొని నాటి కొలతల గూర్చి తెలుసుకొందాము.
భాస్కరాచార్యుడు-2 తన ఏకైక ప్రియపుత్రిక నామమున ‘లీలావతి’ యన్న గణిత
గ్రంధమును రచించినాడు.
లియొనార్డ్ యులెర్(Leonhard Euler)
(1707-1783) పేరుతో చతుర్భుజాలపై యులెర్ యొక్క చతుర్భుజం సిద్ధాంతం
లేదా యులెర్ యొక్క చట్టం ఒక కుంభాకార చతుర్భుజం మరియు దాని కర్ణముల మధ్య ఉండే
సంబంధాన్ని వివరిస్తుంది. ఇది సమాంతర చతుర్భుజము యొక్క సాధారణీకరణ, దీనిని పైథాగరియన్ సిద్ధాంతం యొక్క సాధారణీకరణగా చూడవచ్చు. యులెర్ ఈ
పైథాగరస్ సిద్ధాంత నిరూపణము సులభశైలిలో చేసిన రీతి భాస్కరాచార్య-2 నుండి
తీసుకోన్నదేనేమో. ఎందుకంటే ఆయన యూలెర్ కన్నా ఎన్నో శతాబ్దములు ముందు వాడు. nx2 + 1 = y2 అన్న ఈ సమీకరణమును (Equation) ను పల్స్ (Pell’s) సమీకరణము
అంటారు. నిజానికి దీనిని ‘ భాస్కర సమీకరణము’ అనవలసి వుంది. ఎందుకంటే భాస్కరుడు
దీనిని 12వ కనుగొనగా Pell దీనికి 19వ
శతాబ్దములో తనపేరు పెట్టుకొన్నాడు కాబట్టి.
పైన తెలిపినది నేను చెప్పవలసినదానితో సంబంధము లేకున్నా ఈ సందర్భముగా మన
శాస్త్రజ్ఞుల గొప్పదనము ఈ సందర్భముగా తెలియజేసినాను. వేదకాలము నుండి వచ్చు కొలతల
విధానమును ఆయన ‘లీలావతి’లో శ్లోకరూపమున సూత్రీకరించినాడు. ఆసందర్భాములో ఆయన
గొప్పదనము తెలుపుతూ పై విషయము చెప్పవలసివచ్చినది.
పై గ్రంధము కల్గిన ఈ రెండు శ్లోకములను పరికించండి.
యవోదరై రంగుళ మష్ట సంఖై ర్హస్తోంగులైః షడ్గుణీ తైశ్చతుర్భిః
హస్తైశ్చతుర్భి ర్భవతీహ దణ్ణః క్రోశః సహస్ర ద్వితయెన తేషామ్||
స్యాద్యోజనం క్రోశ చతుష్ట యేన తథా కరాణాం దశ కేన వంశః
నివర్తనం వింశతి వంశ సంఖైః క్షేత్రం చతుర్భిశ్చ భుజైర్నిబద్ధమ్||
అంశం అర్థం
4 యవోదరాలు =1 అంగుళం
24 అంగుళాలు =1 హస్తం
4 హస్తాలు =1 దండం
2000 దండాలు =1 క్రోసు (1 కోసు)
4 కోసులు =1 యోజనం
(10 హస్తాలు =1 వంశం (వెదురు) (బహుశ వెదురు కర్ర సగటు పొడవు 10
హస్తాలుగా తీసుకొన్నట్లు వుంది.)
(20 వంశాలు భుజం కలిగిన చతురస్ర వైశాల్యం అనగా 400 చదరపు వంశాలు=1 నివర్తనం)
ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. కోసు లేదా పరుగు ఎంత
దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా
మారుతుంటుంది. రెండున్నర మైలు అంటే ఇంచుమించు ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా
నాలుగు కోసులు. ‘క్రోశ’ లేక క్రోసు లేక కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం
మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది. రెండున్నర
మైలు అంటే ఇంచుమించు 3.2 కి.మీ. గా ఊహించ వచ్చును.
ఈ పంచ క్రోశి యాత్ర అన్నది మణికర్ణిక ఘట్టము నుండి మొదలవుతుంది. తిరిగి
మణికర్ణిక చేరుట తో ముగుస్తుంది. పంచ క్రోశి అన్నది ఈ విధముగా లేక్కింపబడుతుంది.
మణికర్ణిక నుండి కర్దమేశ్వర్ - 3 క్రో
కర్దమేశ్వర్ నుండి భీం చండి - 5 క్రో
భీం చండి నుండి రామేశ్వర్ - 7 క్రో
రామేశ్వర్ నుండి శివపుర్ - 4క్రో
శివపుర్ నుండి కపిల్ ధార - 3క్రో
కపిల్ ధార నుండి మణికర్ణిక - 3క్రో
మొత్తము 25 క్రోసులు. 1 క్రోసుకు 3.2 కి.మీ. అంటే 8౦ కి.మీ.
విశ్వేశం మాధవం డుండిం దందపాణిం చ భైరవంl
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాంll
స్వస్తి.
No comments:
Post a Comment