అనగాననగా ఒక వాస్తవం
అది
1990 వ సంవత్సరము. మానవత లేని మారణ దారుణ గుణముల మహమ్మదీయ గణములు పొరుగు దేశమగు
పాకిస్తాను నుండి అనాది నుండి మన దేశమైన కాశ్మీరము నందు జొరబడి స్థానిక ముస్లిముల
చేయూతతో యువకులతో బాటూ స్త్రీ బాల వృద్ధులను విచక్షణ లేకుండా అందరినీ ఊచకోత కోయగా
కన్నీరు మున్నీరయి విలపించుతూ స్వస్థలమును వదలి జమ్మూ చేరి తాత్కాలికమగు ఒక వలసను
ఏర్పరచుకున్నారు, మిశ్రీవాలా కాంప్, పుర్ఖూ కాంప్, మూతి కాంప్ అన్న పేర్లతో.
తెలుగులో
ఒక జానపద సామెత వుంది ‘ మొగుడు పోయి మొత్తుకొంటూ వుంటే రంకు మగడు వచ్చి
రాళ్ళేసినాడని.’ ఆ విధముగా వారు విషణ్ణ మనస్కులై మాతృ భూమిని విడిచి విలపించుతూ
వుంటే పిలువని పెరెంటమునకు వచ్చినారు విమతమగు క్రైస్తవపు అనుయాయులు తమ మత
పెద్దలతో!
ఆదరణ
అభిమానమునకు ఆటపట్టయినట్లు ఎంతో అనునయము తో ఆ కాందిశీకుల బాగోగులను పరామర్శించుతూ
తాము తెచ్చిన ధనమును వెచ్చించి తమపై అభిమానమును హెచ్చించే ప్రయత్నమును చేయు, వారి మనోగతము ఏమిటని
తెలుసుకొను ప్రయత్నములో ఒక కాశ్మీరీ పండితుడు “మా కొరకు విదేశములనుండి ఎంతో
వ్యయప్రయాసలకోర్చి ఇంత దూరము వచ్చినారు కదా!” అని ఎంతో ఆర్ద్రతా భరిత స్వరముతో ఒక
విమతస్తుని అడిగినాడు. అందు జవాబు గా ఆ వ్యక్తి ఈ విధముగా చెప్పినాడు “మీ సేవ
చేయుటకు మమ్ము దేవుడు ఇచ్చటికి పంపినాడు. మా దేవుడు కష్టమంటే ఇష్టపడడు. అందుకే
మీకు సహాయము చేసి మిమ్ము తన అక్కున చేర్చుకొనుటకు మమ్ము ఇచ్చటికి పంపినాడు. మీరు
క్రైస్తవమునకు మారినారంటే మీ దశ తిరిగి పోతుంది. మీ జీవితము సుఖమయమైపోతుంది”
అన్నాడు. అప్పుడు ఆ పండితుడు “మీరు ఈ మాట చెప్పుటకు ఇంత దూరము రానే అవసరము లేదు.
మీ సహాయమూ మాకవసరము లేదు. సుఖమైన జీవితము కన్నా మా సనాతన ధర్మము మాకు ముఖ్యము.
అందుకే కష్టాలనే కౌగిలించు కొని జన, ధన నష్టమైనా సహించి
ప్రాణమును తృణప్రాయముగా తలచినాము కానీ మా ధర్మమూ మేము వీడలేదు. విటులకొరకు వేటాడే
వెలయాండ్ర జీవితము మాకవసరము లేదు. ఆ విధముగా మేము తలచియుంటే ఇస్లాం మతము తీసుకొని
వారు ఇచ్చే రాయితీలతోబాటూ కోట్ల విలువ జేసే మా ఆస్తులను ఇంటి అంతస్థులను
కాపాడుకునే వాళ్ళం” అన్నాడు.
ఆ
క్రైస్తవ మతస్తుని దిమ్మ తిరిగి పోయింది. ఇక లాభము లేదనుకొని ఏకంగా ముంబాయిలోనే ఒక
Flat బహుమతిగా
ఇస్తామని ఎరవేసినాడు. విషయము కాశ్మీరీ పండిత సమూహమునకు తెలిసి పోవుటతో, విమతస్తుల సహాయము కాదు కదా వారి చేతి మంచి నీరు కూడా వద్దన్నారు.
తిరోన్ముఖులు
కాక తప్పలేదు విజాతీయులు. కాశ్మీరీ పండితుల నిజాయితీ అటువంటిది. ఈ విషయమును చదివిన
వారిలో ఎవరైనా ప్రలోభమునకు లొంగి మత మార్పిడి చేసుకొని యుంటే, లేక తమ బంధుమిత్ర
పరివారములలో ఉంటే నిజాయితీగా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొనుట మంచిది.
"శ్రేయాన్స్వధర్మో
విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే
నిధనం శ్రేయః పరధర్మో భయావహః || “
చక్కగా
ఆచరించబడిన పరధర్మం కన్నా,
గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది ; స్వధర్మాచరణలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే ; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది. “
స్వధర్మమన్నది
ప్రకృతి సహజమైనది. పరధర్మములు ఒకరిచే నిర్దేశింప బడినవి.
ఓ
యువకులారా ఉత్తిష్ఠత జాగృత. ప్రాప్యవరాన్ని బోధత --- లే. మేల్కో. పొందవలసినదీ, చేరవలసిన గమ్యం
గూర్చి తెలుసుకో అని వివేకానందులవారు తరచుగా చెప్పే కఠోపనిషత్ వాక్యమును మనసుతో
చదవండి. ఈ భారత భూమిపై మహనీయులు పుడుతూనే వున్నారు వుంటారు. అది ఈ ధర్మమూ, ఈ దేశము యొక్క విశిష్ఠత. నమ్మకమున్న చోటే మోసమూ వుంటుంది.
అన్నీ
నమ్మనూ వద్దు, అంతా మోసమూ అనుకోవద్దు.
‘ఆనో
భద్రాః క్రతవో యంతు విశ్వతః’ దశదిశల నుండీ సద్భావనా వీవనలు వీచుగాక!
స్వస్తి.
No comments:
Post a Comment