రామాయణము -
ఇండోనేషియా
https://cherukuramamohanrao.blogspot.com/2019/08/blog-post_28.html
శీర్షికను చదువుతూనే నా వంటి సామాన్య పాఠకునికి ఏమనిపిస్తుందంటే, రామాయణము నకు ఇండోనేషియాకు 'అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు' ఉన్న సంబంధమనిపిస్తుంది. నిజమే! కానీ అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు సంబంధము ఉన్నది అని చెప్పుటకు ఈ శీర్షికను ఈ వ్యాసమునకు ఎన్నుకొన్నాను. భారత దేశానికి ఆగ్నేయ దిశలో (South East) ఇండోనేషియా ఉన్నది. ఇక్కడి జనాభాలో ఇంచుమించు 85% ప్రజలు లో ముస్లిములు. మిగిలిన వారిలో 7% హిందువులు. 9% క్రైస్తవులు. 2% బౌద్ధులు.
శీర్షికను చదువుతూనే నా వంటి సామాన్య పాఠకునికి ఏమనిపిస్తుందంటే, రామాయణము నకు ఇండోనేషియాకు 'అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు' ఉన్న సంబంధమనిపిస్తుంది. నిజమే! కానీ అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు సంబంధము ఉన్నది అని చెప్పుటకు ఈ శీర్షికను ఈ వ్యాసమునకు ఎన్నుకొన్నాను. భారత దేశానికి ఆగ్నేయ దిశలో (South East) ఇండోనేషియా ఉన్నది. ఇక్కడి జనాభాలో ఇంచుమించు 85% ప్రజలు లో ముస్లిములు. మిగిలిన వారిలో 7% హిందువులు. 9% క్రైస్తవులు. 2% బౌద్ధులు.
నిజానికి
ఈ దేశము వైశాల్యములో అతి పెద్దది. ప్రపంచ జనాభాలో కూడా నాలుగవ స్థానాన్ని
ఆక్రమించుతుంది. ఇది 18110 చిన్న, పెద్ద ద్వీపముల సమూహము ఇది. ఇందులో జనావాసము
కలిగిన ద్వీపములు సుమారుగా 6000. ఇంచుమించు 24,00,00,000 జనాభా కలిగిన
పెద్ద దేశమిది. ఇది Greater Sunda Islands, Lesser
Sunda Islands గా విభజింపబడి వున్నది. మనము రామాయణములో sunda ఉపసుందులను
గూర్చి వింటాము. ఇండోనేషియా లోని మొత్తము ద్వీపములను జయించి రాజ్యమును ఇద్దరు
అన్నదమ్ములు పంచుకొని, సుంద ద్వీపము ఉపసుంద ద్వీపమను పేర్లతో పరిపాలించుతారు ఈ
ప్రాంతాన్ని. నోరుతిరుగని పాశాత్యులు వీనిని Greater Sunda (అన్న)
Islands, Lesser Sunda (ఉపసున్దుడు అనగా
తమ్ముడగు సుందుడు) Islands అని అన్నారు. భారతములో హిరణ్యకశిపుని
వంశజుడైన నికుంభుని పుత్రులుగా ఒక సుందోపసుందులను చూస్తాము. రామాయణములో వచ్చే
సుందోపసుందులు వేరు అని తెలియ వస్తూవుంది. వీరు జంభుని పుత్రులు. రామాయణమునందు
సుందుడు అగస్త్యుని శాపముచే మరణించినట్లు తెలియవస్తూ వున్నది.
ఈ
గ్రేటర్ sunda లో జావా, బోర్నియో, సుమత్రా, సులావేశి అన్నవి అతి ముఖ్య ద్వీపములు. హిందూ
సభ్యతా సంస్కృతులకు ఆలవాలమైన బాలీ ద్వీపము Lesser Sunda Islands లో వస్తుంది.
ఇంకా ఇందులో లోంబాక్, సున్బావా, టిమోర్, బారత్ దయా ద్వీపములు కాక ఇంకా ఎన్నో
ద్వీపములు వస్తాయి. ‘ఈ ‘బారత్ దయ’ అన్న పేరు వెనుక గల చరిత్ర ను గూర్చి
తెలుసుకొనుటకు ఎవరయినా ప్రయత్నము చేసి వుంటే బాగుండేదేమో!
రామాయణ
కాలముననే ఈ దేశము ప్రముఖమైన చరిత్ర కలిగి ఉన్నది. ఇందులో మూడు ముఖ్యమైన రాజ
కుటుంబాలు మనకు కనిపిస్తాయి. మొదటి కుటుంబము ‘జవ’ చక్రవర్తిది. ఆయన పేరుతోనే జావా
ఏర్పడినది. ఈ జవుని భార్య పేరు శతహ్లద. జవ అన్న సంస్కృత పదమునకు వాడి వేగము అన్న
అర్థము కనిపించుతుంది నిఘంటువులో!. శత అన్న పదమునకు నూరు అన్న అర్థమే కాకుండా
అనేకము అన్న అర్థము కూడా కలదు. శతహ్లద అంటే అందరినీ తన ప్రియవచనములతో గానీ తగురీతి
సత్కరించుతలోగానీ ఎలోటూ లేకుండా ఆనంద పరచేది అని అనుకొన వచ్చును. వీరి కుమారుడు
విరాధుడు. నిజానికి యీతడు గంధర్వుడగు తుంబురుడు. గంధర్వరాజగు కుబేరుని శాపముచే/
నారదుని శాపమనికూడా అంటారు, ఈయన పై దంపతులకు పుత్రునిగా జన్మించినాడు. ఎవరివలననూ
సంతృప్తిని పొందనివాడు కావున విరాధుడని పిలువబడినాడు.
ఇండోనేషియాకు
చెందినదై ఆస్ట్రేలియా కు దగ్గరగా Timor అన్న ద్వీపము ఉన్నది.
ఇది రామాయణ కాలములో తుంబుర ద్వీపముగా పిలువ బడేది.ఈయన యక్షుడు. ఇండోనేషియాను
పాశాత్య్లు కబళించినతరువాత ఈ ప్రాంతమును, తుంబుర ద్వీపమని పలుకలేక తుమ్బోరు,
తిమ్బోరు చివరకు Timor గా మార్చినారు. తుంబురుడు
నారదునికి సమానమగు సంగీత విద్వాంసుడు. శాప వశాత్తు జవ, శతహ్లద పుత్రునిగా
జన్మించుతాడు. ఈతడు రాక్షస ప్రవృత్తి అధికముగా కలుగుటచే తనకు తగినదియైన
రాక్షసనిలయమగు దండకారణ్యమని తలచి అచటికి వెళ్ళిపోతాడు.
వాల్మీకి
రామాయణములోని 3వదగు అరణ్య కాండలోని 3వ సర్గలోని 5\6 శ్లోకములో తన
తల్లిదండ్రులను గూర్చి విరాధుడే రామలక్ష్మణులకు ఈ క్రింది శ్లోకము ద్వారా
తెలియజేస్తాడు.
పుత్రః
కిల జవస్వాహం మరుమాతా శతహ్లదాl
విరాధ
ఇతి మామాహుః పృథివ్యాం సర్వ రాక్షసాం ll
బాల
కాండ లోని 25వ సర్గలో
5,
6, 7, 8, 9 శ్లోకాలను ఒకసారి పరికించుదాము.ఈ శ్లోకముల సారాంశమును మాత్రము ఇక్కడ
తెలియజేసుకొంటాను.ఇక్కడ తాటక వృత్తాంతము మనకు తెలియవస్తుంది. పూర్వము పరాక్రమ
వంతుడు, సద్వర్తనుడు అగు సుకేతువు అన్న ఒక యక్షుడు బ్రహ్మను గూర్చి ఘోర
తపస్సుచేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై వారము కోరుకొమ్మంటే, అపుత్రుడగు అతడు, పుత్ర
భిక్షను కోరినాడు. బ్రహ్మ ఆతనికి పుత్రికనొసగి ఆమెకు రూప లావణ్యములతో కూడా 1000 ఏనుగుల
బలము ఉంటుంది అని చెప్పినాడు. కాలాంతరములో ఆమె అసురుడగు జంభ పుత్రుడగు సుందుని
భార్య అయినది. వారికి శాపగ్రస్తుడగు రాక్షస ప్రవృత్తిగల మారీచుడు జన్మించినాడు. దీనివల్ల
సుకేతువు రాజ్యము కూడా జంభుని రాజ్యములో కలియుటతో మొత్తము ఇండోనేషియాను సుంద
ఉపసుందులు పాలించుట జరిగినది. అట్లే ఉపసున్డునికీ సుబాహు జన్మించినాడు. సుందోపసుందులవలె
వీరిరువురు గూడా అన్యోన్యముగా ఉండేవారు. వీరు సుశిక్షితులు మరియు రావణ సేనాధిపతులు.
రావణుడు అసురేంద్రుడు కాబట్టి వీరు రావణ సామ్రాజ్యమునకు బహుశ సామంతులుగా ఉంటూ
సైన్యాధిపతి సేవలను అందించేవారేమో! దీనిని బట్టి ఇండోనేషియాను యక్షులు, అసురులు,
శాపవశాత్తు రాక్షసులైనవారు పరిపాలించినారని తెలియవస్తూవున్నది.
అసలు
బాల కాండ 25వ సర్గలో శ్రీరాముడు
విశ్వామిత్రుని మన మనసులో రేకెత్తే ప్రశ్న అడుగుతాడు.
అల్పవీరా
యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం
నాగసహస్రస్య ధారయత్యబలాబలమ్ ||
అంటే
'ఓ మునిపుంగవా ! యక్షులు అల్పవీరులు అని వినబడడమైనది. అందువలన అబల అయిన ఆమె
ఎట్లు వేయిఏనుగుల బలము కలిగియున్నది?' అని . దీనినిబట్టి యక్షులు అల్పవీరులు అందుచేతనే మహావీరులైన అసురులకు తమ కన్యలను
ఇచ్చేవారని తెలియవ్స్తూ వుంది. ఇక తాటకిని గూర్చి పైన ముందుగానే చెప్పుకొన్నాము.
వీరంతా రాక్షసాక్రుతి దాల్చినంతనే దండకారణ్యము తమకు బలమగు నెలవని తలచినట్లు
తెలియవచ్చుచున్నది. అందుకే అంతా అక్కడకు చేరినారు.
ఈ
విధముగా రామాయణ కాలమునకు ఇండోనేషియాకు అతుకు పడని సంబంధముంది. నేటికి కూడా
అనేకములగు రామ విగ్రహములో రహదారి కూడళ్ళలో మనకు దర్శనమిస్తాయి. 251 అడుగుల
విగ్రహము అచట కలదని విన్నాము. అంతేకాక రామాయణ పాత్రల యొక్క అనేక విగ్రహములను మనము
ఆ దేశములో చూడవచ్చు. వారి నానేములపై గణేశుని విగ్రహ ముంటుంది. వారి వైమానిక
సంస్తపేరు గరుడ. ఆ దేశాధ్యక్షుడు అమెరికాకు ఇచ్చిన బహుమతి సరస్వతీదేవి విగ్రహము. ఇక్కడి
పరంబనన్ దేవాలయము ఎంతో సుప్రసిద్ధిచెందినది. ఈ దేశములో సుప్రసిద్ధి చెందినా
దేవాలయములు పది ఉన్నాయని విన్నాను. ఇంతటి అనుబంధము ఉంది మనకు ఇండోనేషియాకు. వారి దేశీయ కావ్య గ్రంధము రామాయణము. వాళ్ళు ముస్లిములైనా ప్రతి తల్లీ తన
తనయుడికి రామాయణము ఉగ్గుపలతోపోసి వారికి రుజువర్తన నేర్పుతుంది. ఒకనాటి ఆదేశపు
అధ్యక్షులపేర్లు సుకర్నో, సుకర్నో పుత్రి, సుహార్తో. వారి స్వాతంత్ర్య దినమగు
డిసెంబర్ 27ణ మహా వైభవముగా రామాయణ నృత్యనాతికను ప్రదర్శించుతఎగాక యువకులంతా హనుమద్
వేషధారులై మనకు కనిపిస్తారు. అందుకే
మనదేశమునకు గౌరవమిస్తూ Indo అన్న మాటను తమ దేశము పేరునకు ముందు
తగిలించుకోన్నారేమో!
రాముని
భగవత్స్వరూపునిగా ఎంచి మనము ఆయన విగ్రహములను గుళ్ళలోనే ఉంచుతారనుకోవచ్చు. మరి చిన్న
చిన్న సందేశములతో పాండవుల శిల్పములను ప్రముఖ వీధుల కూడళ్ళలో ఉంచితే యువతలో తమ
పూర్వులు ఘనులు అన్న విశ్వాసముతో ఉత్తేజితులుకారా!
యువకులారా
ప్రపంచమునకు జ్ఞానము పంచిన ఈ దేశములో పుట్టినందుకు గర్వించుదాం.
వందేమాతరం
అని మనసారా తలుద్దాం.
స్వస్తి.