Friday, 31 January 2020

రథసప్తమి


రథ సప్తరథ సప్మి  రథసప్తమి
సప్త సప్త మహా సప్త సప్తద్వీపా వసుంధర
సప్తార్కపర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ
యద్య జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు
తన్మే రోగంచ శోకంచమాకరీ హంతు సప్తమీ
ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చజ్ఞాతా జ్ఞాతేచి ఏ పునః
     ఈ శ్లోకములు చెప్పుకొంటూ 7 నీటితో తడిసిన జిల్లేడు ఆకులను (అర్క పత్రములను) ఆకుయొక్క ముందుభాగమును నువ్వులలో అద్ది, ఒకటి తలపైన, రెండు చెరి ఒక భుజమునకు రెండు మొకాళ్ళకు ఒక్కొక్కటి మరియు రెండు పాదములకు చెరియొకటి వంతున ఉంచి తల స్నానము, నూనె పెట్టుకోకుండా, చేయవలెను. ముమ్మారు చేస్తే ఇంకా మంచిది. మూడు శ్లోకములు చెప్పుకోలేక పోతే పై శ్లోకము ఒకటీ చెప్పుకొన్నా చాలును.
Image may contain: 2 people
చెరుకు రామ మోహన్ రావు



Wednesday, 29 January 2020

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు

https://cherukuramamohanrao.blogspot.com/2020/01/blog-post_29.html

ఇతిహాసం అంటే అవును ఇది యథాతథముగా జరిగినది అన్నఅర్థము అందరికీ తెలిసినదే! ఇటువంటి ఇతిహాసములు అనబడే కావ్యములు వాల్మీకి వ్యాస మహర్షులు రామాయణ భారత రూపములలో మనకు ఇచ్చినారు. అందులో ఎన్నో విషయాలు విశేషాలు ఉన్నాయి. ఒక అవగాహనా బద్ధమైన ఆలోచనతో చదివితే నేడు మనము చదివించే అనేక ఆంగ్ల మాధ్యమ పాఠశాల, కళాశాలల శిక్షణా విషయాలు ఎన్నో మనకు ఎదురౌతాయి. అవి అన్నీ కాక, క్రమశిక్షణ, నీతి, నిజాయితి, ధర్మవర్తన, అవ్యాజ అమలమౌ అభిమానము, ద్వేశారాహిత్యము మొదలగు ప్రవర్తనకు సంబంధించిన ప్రబోధములు ఎన్నో కానవస్తాయి. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి.

Human Anthropology -మానవ వికాస శాస్త్రము

Geography - భూగోళ శాస్త్రము

Human Geography - మానవ భూగోళ శాస్త్రము

Political Administration - రాజ్కనీతి శాస్త్రము

Military Administration - సైన్య నియంత్రణ శాస్త్రము

Defense Strategies - సైనిక వ్యూహా శాస్త్రము

Architecture - వాస్తు శాస్త్రము

Communication Engineering - ప్రసార శాస్త్రము

International Relations - అంతర్జాతీయ సంబంధములు, దౌత్య సంబంధములు

Trade Commerce and Industries – వర్తక వాణిజ్య పరిశ్రమ విభాగము

Human Relations మానవీయ సంబంధములు

Astronomy – ఖగోళ శాస్త్రము

Astrology – జ్యోతిష్ శాస్త్రము

Aeronotics – వైమానిక శాస్త్రము

Medicine and Life Sciences – ఆయుర్వేదము

Forestry and Animal Husbendry – వన మరియు జంతు శాస్త్రము

Family Ethics – కుటుంబ విధానము

Marriage వివాహ విధానము

Human Customs and Beliefs– మానవీయ సంప్రదాయాలు మరియు వలువలు

Town Planning and Village Administration – పట్టణ, గ్రామ వాస్తు మరయు నియంత్రణ

Diplomatic Relationships – దౌత్య సంబంధములు

Naval Administration – నౌకాయాన విధివిధానములు

Metallurgy – లోహశాస్త్రము

Sculpture Art and Architecture – శిల్ప మరియు నిర్మాణ శాస్త్రము

Mathematics - గణిత శాస్త్రము

External Affairs – విదేశీ వ్యవహారములు

Civil Administration – పౌర శాస్త్రము

Moral Science – నీతి శాస్త్రము

Science of Warfare = యుద్ధతంత్ర శాస్త్రము

Leadership qualities – నాయకత్వ లక్షణములు

నేను ఈ వ్యాసమును రామాయణమును ప్రాతిపాదికగా తీసుకొని వ్రాయుచున్నాను. సాధారనముగా ఎందఱో మహానుభావులు, పౌరాణికులు తాత్విక ఆద్యాత్మిక చిన్తనాయుక్తమగు విచారదారతో విశ్లేషించియుండవచ్చుగానీ ఒక సామాజిక, నైసర్గిక, శాస్త్రావగాహనా దృక్పథముతో విశ్లేషించిన వారు తక్కువగా ఉంటారని నా ఉద్దేశ్యము. ఆ దృష్టి కొణములో విశ్లేషించే సాధికారికత నాలో లేకున్నా, తెలిసిన లేక నా అవగాహనలో తెలుసుకోగలిగిన విషయములు పంచుకొను తలంపుతో నా పరిశీలనలను మీ ముందుంచుచున్నాను.    

పైన నేను తెలిపిన అనేక విషయములు రామాయణములో ఉన్నవే! దీనిని బట్టి, ఇన్ని విషయములను కల్గిన రామాయణమును మనము చదువుటకు ఒక జీవితకాలము సరిపోతుందా అన్నది ఆలోచించవలసిన విషయము. భక్తి, యుక్తి, ముక్తి కలిగించే ఇట్టి మహాఇతిహాస సంయుక్తమగు కావ్యము వ్రాసిన వాల్మీకి మహర్షికి తగిన భక్తిగౌరవములను మనమిస్తున్నామా! అన్నది ఆత్మ విమర్శ చేసుకొనవలసిన విషయము. ఇటీవలి ఒక చలనచిత్రములో ఒక దుష్ట పాత్రధారి పేరు వాల్మీకి. కొందరు అనవచ్చు రాముని పేరు పెట్టుకొన్న రాక్షసులు నేడు మన రాజ్యములో లేరా! అని. దీనికి నేను చెప్పగలిగిన జవాబు ఏమిటంటే ‘చలనచిత్రము’ అన్నది ఒక ప్రశస్తికెక్కిన ప్రసార మాధ్యమము.

సాధారణముగా అందలి విషయములపై ఉన్న శ్రద్ధ రామాయణాదులపై ఉండదు. ఇటువంటి కారణము చేతనే చాలా మంది విద్యార్థులు ఇందిరా గాంధీని గాంధీ గారి కూతురిగా భావించుతారు. భర్తపేరుతో వివాహిత పేరును చెప్పుట సాంష్రదాయమనుకొంటే ‘ఇందిరా ఫెరోజ్’ అని తెలిపియుండి ఉంటే ఎటువంటి అపోహకు తావు ఉండియుండదు కదా! రాబోయే కాలములో ‘వాల్మీకి’ అంటే ఫలానా కథానాయకుని తండ్రి, చాలా దుర్మార్గుడు అన్న ఒక ప్రథ ఏర్పడవచ్చు. అందుచే ఆయా పాత్రలకు పురాణములకు సంబంధించిన పేర్లు పెట్టేవిధముగా ఉంటే దుష్ట పాత్రల పేర్లు యధాతథముగా పెట్టుకొనవచ్చును.

ఇక మన రాజ్య పాలనా వ్యవస్థను గూర్చి టూకీకగా తెలుసుకొనే ప్రయత్నము చేస్తాను.

జనపదము అనగా కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాల కలయిక. దానికి ఒక ఏలిక.

అతనిని సామంతుడు అనేవారు. కొంతమంది సామంతులకు ఏలిక రాజు. కొందరు రాజులకు ఏలిక మహారాజు. అట్టి మహారాజులను జయించి తన కీర్తి పతాకమును ఎగురవేసిన ఆతడు చక్రవర్తి. యీతని పరిధిలో ఒక 10 శాతము లేక 15 శాతము భూమండలము ఉండనోపును. అంటే ఇటువంటి కొందరు చక్రవర్తులను తన ఎలుబడిలోవుంచుకొన్నవాడు సామ్రాట్టు. భూగోళమంతా కలిపితే ఒక 15 నుండి 20 మంది సామ్రాట్లు ఉండవచ్చును. అట్టి సామ్రాట్టులను జయించి ఏకఛత్రాధిపత్యమును చాటుకొన్నవాడు  సార్వభౌముడు.

ఈ సమస్త భూమండలమును 7 ద్వీపములు గానూ, మన భారతము జమ్బూద్వీపములో ఉన్నట్లుగానూ మన పూర్వులు తెలియబరచినారు. ఈ జంబూద్వీపమును నవ వర్షములుగా విభజించినారు. ఆయా పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి.

సప్తద్వీపాలు: జంబూ , ప్లక్ష , శాల్మలీ , కుశ , క్రౌంచ, శాక , పుష్కర ద్వీపాలు.

జంబూద్వీపములోని 9 ఖండములు ఇవి:

1.భరత 2.కింపురుష 3.హరి 4.కురు 5.హిరణ్యక 6.రమ్యక 7.భద్రాశ్వ 8.ఇలావృత 9.కేతుమల.

ఇది కొన్ని యుగముల క్రిందటి మాట. ఇప్పుడు ప్రపంచము యొక్క నైసర్గిక స్వరూపము మారిపోయింది.

ఈ నాడు ఐక్యరాజ్య సమితిచే గుర్తింపబడిన దేశములు నాకు తెలిసి, 195. శ్రీరామచంద్రుని కాలములో ఈ రాజ్యముల సంఖ్య చాలా ఎక్కువ. మనకు స్వాతంత్రము వచ్చిన వెంటనే బ్రిటీషు వారు మనలను వదిలి వెళ్ళే సమయమునకు ఉన్న రాజ్యాలు ఇంచుమించు 695. పాకిస్తాన్ బాంగ్లా దేశ్ లోని రాజ్యములు పోగా మిగిలినవి ఇంచుమించు 650. ఈ రాజ్యములన్నీ భారతదేశములో విలీనము చేసిన గొప్పదనము సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారికి చెందుతుంది. ఈ విధముగా ఆలోచించినపుడు మొత్తము భూగోళములో రామాయణ కాలము నాటికి ఎన్ని ఉండవచ్చును అన్నది మన ఊహకు అందదు. కొందరు అసమగ్ర విశ్లేషకులు చెప్పు రీతిగా రామాయణ కాలములో అరణ్య సంస్కృతి కాక, ఎంతో నాగరీకత విలసిల్లేదని పరిశీలనాత్మకముగా చదివితే మనము  తెలుసుకొనవచ్చును. కావున, ఆ రాజ్యములన్నీ ఆయన ఏలుబడిలో ఉండినాయి అంటే ఆయన ఎంతటి వీరుడో, ధీరుడో, శూరుడో ఒక్కసారి ఆలోచించండి.

సార్వభౌముడు అంటే సమస్త భూమండలమునూ తన ఏలుబడిలో కలిగినవాడు. అట్టి మహాపురుషుడు ఒకడే! ఆయనే దశరథాత్మజుడగు శ్రీరామ చంద్రుడు. 'నావిష్ణుర్పృథ్వీపతిః' అన్న ఆర్యవాక్యమునకు అర్థ సమన్వయము కలిగినవాడు. పృథివిని అంతటినీ పాలించగలిగినవాడు మాత్రమె విష్ణువు. మరి రాముడు విష్ణువే కదా!

ఇక కోసలను గూర్చి తెలుసుకొందాము. ఆపనిని రేపు చేద్దాము.........

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-2

కోసలను వాల్మీకి ఏమన్నాడో ఒకపరి పరికించుదాము

బాల కాండ లోని 5 వ సర్గలోని 5వ శ్లోకముద్వారా మనకు ఈ విధముగా తెలియవస్తూవున్నది.

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |

నివిష్ఠః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ ||

అయోధ్యానామ నగరీ తత్రాస్సీల్లోకవిశ్రుతా |

మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం ||

అయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |

శ్రీమతీ త్రీణివిస్తీర్ణా సు విభక్తమహాపథా ||

 

 సరయూనదీతీరములో కోసల అను పేరుగల ఒక మహా జనపదము కలదు. అది ధనధాన్యములతో సంతుష్ఠులైన జనులతో కలదు. ఆ జనపదములో లోక ప్రసిద్దమైన అయోధ్యా నగరము కలదు. దానిని  మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మించినాడు. ఆ నగరము పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు గలగి మిక్కిలి విశాలముగా మహావీధులతో విలసిల్లు చున్నది.

ఇక్కడ ఒకమాట చెప్పుకొనవలసి వస్తుంది.

సముద్రమట్టమునకు కొంత ఎత్తున ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాన్ని పీఠభూమి అని వ్యవహరిస్తారు. ఈ విధమగు పీఠభూమిపై ఏర్పడినది అయోధ్యానగారము. నగరము అన్న పేరుగలిగిన ప్రాంతములకు సముద్రము దగ్గరగా ఉండదు. నగరమునకు మహాపురము అన్న మరొకపేరు ఉన్నది. ఉదాహరణమునకు హైదరాబాదు, బంగళూరు, దిల్లీ మొదలగునవి నగరములుగాగానీ మహానగరములుగానీ పిలువబడుతాయి. పూర్వము ఇట్టి నగరమును రాజధానిగా చేసుకొని రాజులు తమ ఏలుబడిలో ఉన్న ప్రాంతమును పాలించేవారు. ఆ ప్రాంతమును రాజ్యమని, ఆ ఏలికను రాజు అని అంటారు. ఈ నగరాన్మికి కట్టుదిట్టమైన కాపలా, నగరము చుట్టూ ప్రహరీలు, ప్రవేశ ద్వారములు ఈవిధముగా ఎన్నో కట్టుదిట్టాలు కలిగి ఉంటాయి.  

అదే సముద్ర తీరములో ఉండే అతిపెద్ద  ఊర్లను పట్టణములు అంటారు. ఉదాహరణము చెన్నపట్టణము, మచిలీ పట్టణము, విశాఖ పట్టణము, భీముని పట్టణము, కళింగ పట్టణము,నాగ పట్టణము, మొదలగునవి. అదేవిధముగా పల్లెలు, గ్రామములు, ఊర్లు, పేటలు, పురములు, ప్రోళ్ళు ( భట్టి ప్రోలు, అమ్మన ప్రోలు....), ఓళ్ళు (బిక్కవోలు, ఒంగోలు, కందెన ఓలు అంటే కర్నూలు,......) ఈవిధముగా జనాభాను బట్టి వనరులను బట్టి, వసతులను బట్టి వర్గీకరించినారు. ఎన్నో యుగాలకు ముందే! రామాయణమును ఈ విధముగా తార్కికమైన వాస్తవ దృష్టితో పరిశీలించితే  మనకు తెలియవస్తుంది, రామాయణము చరిత్రే అని.

రామో రాజ్యముపాసిత్వా

‘రామో రాజ్యముపాసిత్వా’ అంటే రాముడు రాజ్యమును ఉపవసించినాడు, ఉపాసన చేసినాడు ఉపాసించినాడు అని అర్థము. నిజానికి దీనిని ‘ధ్యేయ వాక్యము’ అంటారు. ఈ ఉపాసన అన్న మాటను దైవధ్యానములో కదా ఉపయోగించుతాము, రాజ్యమును ఉపాసించుట ఏమిటి అన్నది మన మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబును పొందుటకు ముందు అసలు ఉపాసన అంటే ఏమిటో మనము తెలుసుకోవాలి.

ఉపాసన

ఉపాసన అన్న మాటకు అసలు అర్థమే అతి సమీపమున కూర్చొనుట. ఇది ఒక భార్యా భర్తల అనుబంధము. ఉపాసకుడు భార్య. ఉపాసితుడు భర్త. ఒక చిన్న మాట చెబుతాను. మంట అన్నది వెలుగు. అది లేకుంటే చెంతనే ఉన్న సమిధ కనిపించదు. కానీ ఆ సమిధ మంటను చేరితే అది కూడా జ్వాల లేక మంట అయిపోతుంది. అప్పుడు చీకటి అన్న ప్రశ్నఉదయించదు. మన ధ్యేయము అది. ఆ ధ్యేయమును సాధించిన వాడు శ్రీరామచంద్రుడు.

తిరిగీ అసలు విషయమునకు వద్దాము.

నారదుడు వాల్మీకి మహర్షి వద్దకు వచ్చి రామాయణ రచనకు గడంగుమని పురికొల్పుటలో భాగముగా విష్ణుని వద్దకు వెళ్లి దేవతలు విన్నవించుకొనగా రాముడు వారికి చెప్పిన మాటను నారదుడు వాల్మీకికి చెబుతున్నాడు. రామాయణములోని బాలకాండము మనకు రామ కథ సంక్షిప్తముగా నారదుని ద్వారా వాల్మీకి మహర్షితో బాటూ మనకు కూడా తెలియవస్తుంది. అందులో భాగముగా ఈ రెండు శ్లోకములను చూడండి.

రాజ వంశాన్ శత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః |

చాతుర్ వర్ణ్యం చ లోకే అస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి |1-1-96|

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ |

రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మ లోకం ప్రయాస్యతి |1-1-97|

 

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. ఇక్కడ మనము గుర్తు తెచ్చుకోనవలసిన విషయము ఒకటుంది. శ్రీరాముడు రాజగుటకు పూర్వమే పరశురాముడు భూమండలములోని రాజులనందరినీ విచాక్షణారహితముగా మట్టు పెట్టినాడు. మరి ఈ సంపూర్ణ భూమండలము పై తిరిగీ రాజులను పునఃప్రతిష్ఠించ వలసిన అవసరము సార్వభౌమునికి ఉన్నది కదా! అందుచేత అంతటి బృహత్కార్యమును చేపట్టినాడు శ్రీరాముడు.

ఇక పోతే, నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును. [1-1-96, 97]

ఇప్పుడు మొదటి శ్లోకమును కొంత విశ్లేషించుకొందాము. రాముడు సార్వభౌముడు అని మనము మొదటనే నిర్దారించుకొన్నాము. తానూ పరమాత్మ అని ఆయనకు గుర్తులేదు మానవునిగానే వ్యవహరించినాడు అని అనుకొన్నా, ఆ దైవత్వము ఆయనను విడువడుకదా! అందుకే ఆయన ఎన్నో ఎన్నేన్నో సంస్కరణలు చేసి రాజ్యపాలనాను సుప్రతిష్ఠితము చేసినాడు. తన తరువాత రాజ్యమును, తనయొక్క, తన తమ్ముల యొక్కకొడుకుల నడుమ పంపకాలు కూడా జరిగిపోయినాయి. అంటే శ్రీరామ చంద్రుని తరువాత చతుస్సాగరవలయిత నవఖండ మండలమును పరిపాలించిన సార్వభౌముడు మనకు చరిత్రలో కనిపించడు.

రాజవంశాన్ శతగుణాన్ - స్థాపయిష్యతి రాఘవ: |

చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ - స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

భావం : రాముడీ లోకమందు రాజవంశములను నూఱింతలు అభివృద్ధి పరచును. నాల్గు వర్ణములను వారి వారి ధర్మములందే పరివర్తించునట్లు చేయగలుగును. ఈ విషయమును గూర్చి తగు సందర్భమున తెలియజేస్తాను.

మరి తన లక్ష్యమును గూర్చి రాముడు చెప్పినట్లు నారదుడు చెప్పినాడు. ఇదేవిషయమును 5వ సర్గలో రాముడే నేరుగా దేవతలకు చెప్పినట్లు కూడా మనము  బాలకాండ 5 వ సర్గలో చూస్తాము. దీనిని బట్టి మనకు రామచంద్రుడు 11,000 సంవత్సరములు భూమిని పాలించినట్లు తెలియవస్తూవుంది.  ఈ మాట వింటూనే మనలో ఉదయించే అనుమానము మనిషి బ్రతికేది 100 సంవత్సరములైతే 11,000 బ్రతకడము అన్నది అతిశయోక్తి కాదా!

మిగిలినది మరొకసారి.........

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-3

ఈ సందేహానికి ఒక సమంజసమైన వివరణకు నేను ప్రయత్నించుతాను.

శ్రీరాముడు కేవలము సకల సద్గుణ సంభరితుడే కాకుండా సకల విద్యా విశారదుడు. బల అతిబల అన్న అద్భుత విద్యలను విశ్వామిత్రుని ద్వారా నేర్చుకొన్నవాడు. ఆ విద్యలు ఆకలి దప్పులు కలుగానీయక పోవుటయేకాక, సాధించిన వ్యక్తియొక్క రూపలావణ్యములు నిద్రాహారాలు లేకున్నా చెక్కుచెదరవు. నాటికాలమున వశిష్ఠుని వద్ద విద్య నభ్యసించినవాడగుటచే రాముడు యోగసాధన చేసియుంటాడు. నాటి రాజులు నేర్చుకొనవలసిన విద్యలలో యోగవిద్య ఒకటి. కృతయుగములో మహర్షులు నలుబది ఏబది వేళా సంవత్సరములు తపమాచరించేవారు. కలియుగము యొక్క నిడివి 4,32,000 సంవత్సరములైతే దానికి 4రెట్ల నిడివి కృతమునకు, 3రెట్ల నిడివి త్రేతకు ఉండేది. అందుచేత ఆ యుగమున మానవ వయో పరిమితులు కూడా చాలా ఎక్కువ. ద్వాపరమున నారాయణుడే తిరిగీ కృష్ణునిగా జన్మించినా ఆయన 125 స్డంవత్సరముల కాలమే జీవించినాడు. దీనిని బట్టి మనకు యుగ యుగమునకూ ఆయుఃప్రమాణము మారుతూ ఉంటుందని మనకు తెలియవచ్చుచున్నది. పైపెచ్చు విష్ణువు రామావతారములో అంతా తానె నేరుగా చక్కబెట్టవలసిన బాధ్యత గలిగినవాడు. కృష్ణావతారములో ఆయన సారధి మాత్రమె! అంటే కేవలము రథమునకు మాత్రమె అను అపోహ పడవద్దు ఆ యుగమున వున్నా అందరి మనసులకూ అతనే సారధి. తప్పు త్రోవను ఎంచుకొనిన దుర్యోధనునికైనా, ధర్మ మార్గామలంబించిన ధర్మరాజుకైనా!

ఆయుఃప్రమాణమునకు యోగము మూలము. ఒకసారి ఊపిరి పీల్చి వదిలితే దానిని ఒక ప్రాణము అంటారు. పుట్టుకతోనే కొన్ని లక్షలకోట్ల ప్రాణములతో సాధారణ మానవుడు జన్మించుతాడు. వానికి ఒక ప్రాణము నిడివి కొన్ని సెకనులైతే యోగాసాధకునికి కొన్ని గంటలు. ఈవిధముగా యోగ సాధకుడు తన జీవన కాలమును వేలకొలది సంవత్సరములు పొడిగించుకొనగలడు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే సృష్టిలో ఏ జంతువైతే తక్కువ శ్వాస తీసుకుంటుందో ఆ జంతువు ఎక్కువ కాలం బ్రతుకుంది. ఉదాహరణకు కుక్కలు నిమిషమునకు 50-80 మార్లు శ్వాస క్రియను జరుపుతాయి. వాని సంపూర్ణ ఆయుర్ధాయము 11 సంllలు మాత్రమే బ్రతుకుతాయి. గుర్రములు నిమిషానికి 30 సార్లు శ్వాస క్రియను జరుపుతాయి. ఇంచుమించు 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఏనుగులు ప్రతి నిమిషానికి 15-20 మార్లు శ్వాస క్రియను జరుపుతాయి. అవి ఇంచుమించు 100 సంవత్సరాలు జీవిస్తాయి. అదే విధంగా మనుషులు ప్రతి నిమిషానికి 12-25 శ్వాసలు తీసుకోవాలి – 120 సంవత్సరాలు జీవన ప్రమాణం కలిగి వుండాలి. ఇది ఆదర్శవంతమైన జీవితం కలిగినవారికే సాధ్యపడుతుంది. తాబేళ్ళు నిమిషానికి 5-10 శ్వాసలు తీసుకుంటాయి. – 500 సంవత్సరాలు బ్రతుకుతాయి. కావున మానవుడు తన జీవన ప్రమాణమును పెంచుకొనుట అన్నది తన శ్వాస పై ధ్యాస ఉంచుటచే లక్ష్యమును సాధించవచ్చును అని నిర్దారితమౌతూ వున్నది.

ఇక అంత కాలము జీవించుటకు గల హేతువును గూర్చి ఆలోచిదాము.

మొదట నేను పైన తెలిపిన శ్లోకమును తీసుకొంటాను. అది ఈ విధముగా పైన తెలిపియుండినాను.

రాజవంశాన్ శతగుణాన్ - స్థాపయిష్యతి రాఘవ: |

చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ - స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

భావం : రాముడీ లోకమందు రాజవంశములను నూఱింతలు అభివృద్ధి పరచును. నాల్గు వర్ణములను వారి వారి ధర్మములందే పరివర్తించునట్లు చేయగలుగును. ఈ విషయమును గూర్చి తగు సందర్భమున తెలియజేస్తాను.

కావున మనకు తెలియవచ్చేదేమిటంటే పరమాత్ముడు తాను భూమిపై అవతరించుటకు ముందే తన లక్ష్యమును ప్రకటించినాడు. ఏమని? 1. లోకమునందు రాజవంశములను నూఱింతలు అభివృద్ధి పరచుట 2. తమ తమ ధర్మానుగుణముగా చతుర్వర్ణాలు నడచుకొనుట.

ఇప్పుడు ఒకటవ అంశమును పరిశీలించుతాము. రాముడు తాను దైవముగా వ్యవహరించకున్నా మానవునిగా తన బలాబలములు శక్తి అశక్తతలు తెలుసు. అందుకే రావణునితో యుద్ధమునకు తలపడే సమయానికి అంగబలము, బుద్ధిబలము, ఆప్త జనము అన్నీ సంపసదిన్చుకొన్నాడు. తనకు తెలుసు తన తరువాత ఈ అఖండ భూమండలాధినేతగా వేరెవరూ పరిపాలించాలేరని. అందుకు తగిన విధముగా వారి వారి శక్తిని అనుసరించు రాజులను చేసి యవద్భూమండలమును పరిపాలింప జేయ దలంచి ఆ మాట చెప్పినాడు. మరి ఆవిధముగా చేయవలేనంటే ముందు రాక్షస వినాశనము జరగాలి.

అందుకే అంటున్నాడు:

మిగిలినది మరొకసారి ........

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-4

భయం త్యజత  భద్రం  వో హితార్థం  యుధి రావణంl

స పుత్రపౌత్రం  సామాత్యం  సమిత్రజ్ఞాతిబాంధవం

హత్వా క్రూరం  దురాత్మానం  దేవర్షీనాం  భయావహంll 1-15-27

భయాన్ని  వదలిపెట్టండి  .  మీకు  క్షేమమవుతుంది .  మీ  మంచికోరే  నేను ,   దురాత్ముడై    దేవ   దానవ   గంధర్వులను   బాధలకు  గురిచేస్తున్న  రావణున్ని శత్రు శేషం  లేకుండా పుత్ర పౌత్ర , మిత్ర  జ్ఞాతి , అమాత్య ,   బంధువులతో  సహా  సంహరిస్తాను . అంటే సమూలముగా రాక్షస, అసుర, దానవ, దైత్య, పిశాచ (ఇవి అన్నీ వేరు వేరు మూకలు) వర్గములనన్నింటినీ పుత్ర పౌత్ర సమేతముగా మట్టుపెట్టి ధర్మ ప్రతిష్ఠాపన చేయవలయును. ఇది ఒక  సంవత్సరముల స్వల్పకాలములో జరిగేపనికాదు. మూడు గంటల సినిమాలు ముప్పది వేల మందిని మట్టుపెట్టినట్లు గానీ, పాతాళభైరవి లోని నేపాళ మాంత్రికుడు ‘హాం ఫట్’ అంటూనే అనుకొన్నది సాధించినట్లు కానీ చేయ సాధ్యము కానిది. అమిత బలవంతులై, అప్పటివరకు అజేయులై, అనేక మంత్రతంత్రములు నేర్చిన సంపూర్ణ రాక్షస జాతిని  సమూలముగా పెకలించుటకు తప్పక 3,4 వేల సంవత్సరములు పడుతుంది. ఆ తరువాతనే ఎలికలగా నాయకుల ఎన్నిక. అదికూడా భూమండలమంతటికీ! ఇదికూడా అంతే! అసలు పాలకు;లను ఎందుకు గుర్తించి వారిచ్తికి రాజ్యాధికారమును అప్పగించవలె? ఎవరి రాజ్యము వాళ్ళు ఎలుకొంతున్నారు కదా అన్న సందేహము నిజమయిన పాఠకునిలో కలుగుట సహజము. తన తండ్రికి జరిగిన అన్యాయమునకు పరశురాముడు సమస్త భూమండలమునూ 21 మార్లు చుట్టి సమస్త రాజ సమూహమును మట్టుపెట్టినాడు. దశరథుడు లాంటి కొందరు ఎంతయో జాగరూకులై ఆయన దండయాత్రకు వస్తున్నాడు అంటే మంగళ తోరణాలతో మంగళ వాద్యాలతో రాజప్రసాదమును శోభిల్లజేసి ఆ ముప్పునుండి తప్పించుకొన్నారు. అదికూడా ఎందుకు అంటే అటువంటి సమయమున ఆయారాజులకు హాని తలపెట్టనని కూడా పరశురాముడు శపథము చేసినాడు కాబట్టి.

 ఇటువంటి పరిస్థితులలో సరయిన పాలకులను గుర్తించి, రాజ్యములను భౌగోళికముగా, నైసర్గికముగా వర్గీకరించి రాజులను, మహారాజులను, చక్రవర్తులను స్థాపించుట ఏమీ ఎడమచేతి ఆట కాదు.

ఇక పై రెండవ శ్లోకములోని రెండవ పాదము: చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ - స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ll

ఈ పాదమున ముఖ్యమయిన మాట ‘చాతుర్వర్ణ్యం”. ఇది మనకు పంటికింద రాయి. దీనిని గూర్చి కొంత విస్తరణ అవసరము. ఈ వ్యాసమును ఏ కాఫీ తాగుతూనో చదివి ఐనది అని తలువవద్దు. దీనికి మీ మేధస్సు అవసరము. మీ మేధో బలముతో చదివితే మీ బుద్ధికి తోచిన సదాలోచనలను మీరు జోడించగలరు. ఇది మీరు దేశమునకు చేసే సహాయమౌతుంది. ఇపుడు ‘చాతుర్వర్ణ్యం’ ను కూర్చి మాట్లాడుకొందాము.

నేడు మనము వర్ణము అన్న మాటకు ప్రత్యామ్నాయముగా ‘కులము’ అన్న పదమును వాడుచున్నారు. కానీ వేదశాస్త్రపురానాదులలో విరివిగా ‘వర్ణము’ అన్న పదమే వాడబడినది. అయినాకూడా నేను కులము అన్న మాటతోనే నేను చెప్పవలసినది మొదలుపెడుతున్నాను.

కులము అన్న మాటకు అర్థము కొరకు నేను  3 భాషా నిఘంటువు లను  పరిశీలించితే మూడింటిలోనూ ఈ విధమైన అన్వయము చూచుట జరిగినది .

[తెలుఁగు] వంశము, జాతి, తెగ, ఇల్లు, శరీరము, అంతఃపురము

[తమిళము] కులమ్‌, వంశమ్‌, జాతి, ఇనం, ఉడల్‌, వీడు, అరమనై, కుడి.

[కన్నడము] వంశము, మనె, తెగె, వంగడ, శరీర.

ఈ మూడింటిలోనూ వంశము జాతి తెగ అని చెప్పినారే గానీ వేరేమీ తెలుపలేదు. ఇప్పుడు కులము అన్నది చెడ్డ మాట అనుకొందాము,అప్పుడు వంశము ,తెగ , జాతి అన్న మాటలు కూడా తప్పే కదా! కులము సంస్కృత పదమే అయినా వర్ణం అన్న పదాన్ని నాకు తెలిసినంతవరకూ ఆ భాషా సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించినారు. గీతాచార్యులు కూడా

'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః

తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' అని చెప్పినారు. అంటే వారి వారి గుణాలు కర్మల ననుసరించి తగిన విధంగా నేనే ఈ నాల్గు వర్ణములను సృజించినాను అని అన్నారు.వర్ణము అన్న మాటకు బంగారు అన్న అర్థము కూడావుంది.

మరి నాల్గు వర్ణములలో ఏది మేలిమి బంగారము, ఏది కాదు అని మనము నిర్ణయించ గలమా! ప్రాణికోటిని గూడా  నాల్గుభాగాలుచేయడము జరిగింది. స్థావరములని,జంగమములని,జలచరములని,వాయుచరములని. వీనిని ఒకదాని స్థితి నుండి వేరొకదాని స్థితికి తేలేము. అప్పుడు భగవంతుని చేత ఏర్పరుపబడిన ఈ విభాగమును కాదనుట సమంజసమేనా. కులము లాగానే తెలుగు లో 'వాడు' అనే మాటను కూడా తప్పుగా అర్థము చేసుకొంటారు. తెలుగు భాగవతము లో బమ్మెర పోతనామాత్యుడు కృష్ణు ని తలపోసే గోపికలతో 'నల్లని వాడు పద్మనయనమ్ములవాడు ... ఒకడు ... అనే వాడుతాడు. ఇంకొక సన్నివేశములో 'కలడు కలండనెడువాడు' అని ఉపయోగించుతాడు.గతము లో మనము కూడా ఈ ప్రయోగము చేసేవాళ్ళమే కానీ నేడు పరభాషా వ్యామోహ ప్రవాహాములో అన్నిటి తో బాటు ఇదీ కొట్టుకుపోయింది.ఇపుడు దేవునికే ఉపయోగించిన ఆ మాట ఇప్పటి సమాజములో తప్పయి పోయింది. అదే విధంగా 'కులము'కూడా. 'క్యాస్ట్' అనేది ఆంగ్ల పదము కాదు అది 'పుర్తగల్లు' పదము. From Portuguese casta meaning race, breed and ancestry. Breed అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ‘A group of organisms having common ancestors and certain distinguishable characteristics, especially a group within a species developed by artificial selection and maintained by controlled propagation.' అని యున్నది. అదే విధముగా Race అంటే 'A local geographic or global human population distinguished as a more or less distinct group by genetically transmitted physical characteristics.' అని వుంది . మరి మన 'వర్ణం' 'కులం' అన్న మాటలకివి సమానార్థకాలౌతాయా? ఇక 'ancestry' అన్న పదాన్ని మన 'కులము' నకు జత కలుపలేము. కమ్మరి,కుమ్మరి,చాకలి,మంగలి (మంగళకరమైన ప్రతి పనికీ ముందుండేవాడు) అని వాడితే తప్పా.

మిగిలినది మరొకసారి ........

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-5

క్రైస్తవములో ఈ విచక్షణ లేదా. వాళ్ళూ 'బ్లాక్ స్మిత్' 'పోట్టరర్' 'వీవెర్' మొదలగు పదాలను వాడుతారుకదా. అదేవిధంగా అరబ్బీ,ఫార్సీ, గ్రీకు, లాటిన్లలో కూడా ఆయా పనులకు సంబంధించిన పేర్లు ఆయా పనులు చేసే వారికున్నాయి  వున్నాయి . ఈ నాటికీ బ్రిటీషు పార్లమెంటు లోని విభాగాలను 'హౌస్ ఆఫ్ లార్డ్స్' హౌస్ ఆఫ్ కామన్స్' అంటారు. 'లార్డు' 'కామన్' అన్న అంతరాలు వాళ్ళలో ఈ నాటికీ లేవా. మనమెంత కాదనుకొన్నా ఇవి ప్రకృతి జన్యములు. ఇది భగవత్ సృష్టి. మనము లేదనుకోన్నంత మాత్రాన అవి లేకుండా పోవు. కులాన్ని గురించి మాట్లాడే గుణవంతుని ఇంట్లో పనిమనుషు లెందుకు.  అంతా సమమే అయితే ఎవరి పని వారే చేసుకోవచ్చు కదా.

స్థావరముల విషయానికొస్తే వెంపలి మఱ్ఱి రెండూ చెట్లే. ఏ జాతి చెట్టును ఆ పేరు తోనే పిలుస్తాము. కానీ దేని విలువ దానిదే.  పనస పండు ఆకారము వికారముగా నున్నా అది మనకు ఇచ్చే తొనలను ఎంతో ఆనందముగా తీసుకొని తింటూ ఉన్నాము. కాకర చేదు అని తెలిసికూడా దానిని ఎన్నోవిధములుగా వండుకొని తింటూ ఉన్నాము. పైపెచ్చు అది మధుమేహమునకు గొప్ప మందాయె! భగవంతుని సృష్టి లో ఏదీ ఎక్కువ కాదు ఏదీ తక్కువ కాదు. రెండూ పండ్లే యని 'మామిడి పండుకు' బదులు 'ఊస్తిపండు' ను తినగల్గుతామా! అట్లని అమిత చేదైన ఊస్తిని వాడనేవాడమా. మధు మేహమున కది కూడా అత్త్యుత్తమ ఔషధము. ఆకాశములో ఎగిరేవి అన్నీ పక్షులే. గండభేరుండాలు గ్రద్దలు కాకులు పిచ్చుకలు రామచిలుకలు, దేని ప్రత్యేకత దానిదే. అట్లే జలచరాలలోగూడా. భగవంతుని సృష్టి అంతా 'భిన్నత్వములో ఏకత్వమే. '

ఇక మనుషుల విషయము లోనికి వస్తాము. అమెరికా లో స్థానికులైన Red Indians ను ఆంగ్లేయులు ఊచకోత కోయ లేదా! నీగ్రోలను శతాబ్దాల తరబడి బానిసలుగా వాడుకోలేదా! పూర్వము, వర్ణ విచక్షణ సమగ్రముగా పాటించు కాలములో ఊచకోతలు, బానిసత్వాలు మన దేశములో వుండినవా!  ఇప్పటికీ పశ్చిమ దేశాలలో,'తెలుపు' 'నలుపు' తారతమ్యాలను చూస్తూనే ఉన్నాము. ప్రపంచములోని ప్రబలమైన రెండు మతములవారు అన్య మతస్తులను వారి వారి భాషలలో 'పాగాన్స్' అనీ 'కాఫిర్' అని అంటారు. అంటే పరవాలేదు.  వారి వారి దేవుళ్ళు వాళ్ళకు, బలవంతముగా నైనా అన్య మతస్తులను తమ తమ మతములలో చేర్చుకొమ్మని చెప్పినారు. అట్లు చేరని వారిని రంపాలతో కోసి చంపినారని లోతులకు పోయి అధ్యయనము చేస్తే తెలుసుకొనవచ్చును.ఇతరులను గూర్చి చెడ్డగా చెప్పి మన మంచితనము నిరూపించుకో నక్కర లేదు అట్లని వాస్తవాలను గూర్చి తెలుసుకోకుండానూ వుండనక్కర లేదు. మహమ్మదీయులు ఇంచుమించు 12వ శ్గాతాబ్దము నుండి 17 వ శాతాబ్దమువరకు, ఆపైన ఇంచుమించు 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించినారు. అంటే దాదాపు 12 వ శతాబ్దము వరకు ఈ దేశము కేవలము హిందువులదే! ఎప్పటినుండీ అంటే కొన్ని లక్షల సంవత్సరముల నుండి. ఈ రోజు కూడా ఈ దేశస్తుడగు ఏ ముస్లిం లేక క్రిస్టియన్ యొక్క DNA  ఈ దేశపు హిందువుతో పరీక్షించినా

రెండూ ఒకటే అన్నది శాస్త్రజ్ఞ్యులచే నిర్ధారింపబడిన సత్యము. వీరి దురాక్రమణలు జరుగని కాలము వరకు వర్ణ లేక కుల సమస్య అన్నది లేదు.

అసలు వేదాలేమి చెప్పినాయో తెలుసుకొందాము.

యజుర్వేదములోని పురుష సూక్తములో 'బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః  ఉరూ తదస్యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత' అన్నారు. నాకు తెలిసిన మేరకు దీని అర్థాన్ని వివరించుతాను.

ఈ సమాజాన్ని పురుషాకృతి గా వూహించుకొంటే జ్ఞానము(బ్రహ్మ జ్ఞానము కల్గిన వాడు బ్రాహ్మణుడు) తలలో వుంటుంది. బ్రాహ్మలు కాని ఎంతోమంది పరమ జ్ఞానులైనారు  లైనారు. ఊదాహరణకు విశ్వామిత్రుడు,వాల్మీకి,మతంగుడు,శౌనకుడుసూతుడు  మొదలగు వారంతా తమ సాధనతో జ్ఞానమును పొంది బ్రాహ్మణులైన వారే.   జ్ఞానమును సంపాదించనూ వలసిందే,దానిని కపాడనూ వలసిందే.  జ్ఞానమును(సైన్స్) కాపాడుకొంటే సమాజానికి ప్రగతి వుంటుంది. వీరికి(ఈ జ్ఞానులకు లేక ఈ బ్రాహ్మలకు) సలహాలిచ్చుట తప్పించితే సంపాదించే హక్కు లేదు. సలహా తీసుకొనే వాళ్ళే వారి అవసరాలు తీర్చేవారు. దీనికి సైనిక బలగము అవసరమేకదా. మన అణు కేంద్రాలు అంతరిక్ష కేంద్రాలు మొదలైన ఎన్నో ముఖ్యమైన కేంద్రాలకు సైనిక రక్షణ వున్నదా లేదా? కావున జ్ఞానమునకు రక్షణ క్షత్రియులు. క్షత్రియ శబ్దమునకు అర్థమేమంటే 'క్షతయేన త్రాత ఇతి క్షత్రియః' అన్నారు. అంటే గాయము కలుగకుండా ఉండుటకు రక్షణే కాని నిజానికి గాయము చేయు అధికారము వారికిలేదు. అంటే 'Defence' తప్పించితే 'Offence' లేదు. ఏమన్నా ఎదుటివానిని గాయపరుచవలసి వచ్చినా లేక చంప వలసి వచ్చినా అది రక్షణ లోని భాగమే ఔతుంది. పైగా బాహువులకుండేది బలమౌతుంది. బాహు బలము సైనిక బలము మనకు తెలిసిన పదాలే. కావున ఈ బాహు బలము జ్ఞానమునకు అతి చేరువలో వుంటుంది.  మరి ఈ రక్షణ కు వలసినదేది? ధనము. ఈ క్షత్రియబలగపు  ఖర్చంతా భరించుటకు  కావలసింది ఆర్థిక శక్తి. ఈ ఆర్ధిక శక్తికి కావలసినవారు ఆర్ధిక నిపుణులు 'వైశ్యులు.' ఈ వైశ్యుల వృత్తి వ్యాపారమే కాదు వ్యవసాయము కూడా. వీరికి మాంస భక్షణ నిషిద్ధము. ఈ మాంస భక్షణము త్రిగుణములలోని సత్వము ను నశింప జేసి  తామసము తో గూడిన రాజసమును పెంపొందించుతుంది కావున. వ్యాపారము లోనూ వ్యవహారములోను ఓర్పు చాలా అవసరమన్న విషయము అందరికీ తెలిసిందే. మరి వ్యవసాయదారులు ఏవిధముగా నాల్గవ వర్ణమునకు జారినారో తెలియలేదు. ఇప్పటి వ్యవసాయదారులలో, రాజులే కాకుండా,రెడ్డి, కమ్మ, కాపు మొదలగు వారు రాజ్యములేలినవారే కావున రాజులే. రాజులకు మాంసము, వేట నిషిద్ధము కాదు. రానురాను రాజ్యాలులేక వ్యవసాయము నవలంబించినట్లు తెలియవస్తూవున్నది. సమాజము లేక దేశము యొక్క ఆర్ధిక స్థోమతను  'ఆర్ధిక శక్తి' (ఎకనామిక్ స్ట్రెంగ్త్) అంటారు. తొడలలో వుండేది శక్తియే కదా. కావున ఊరువులు అంటే తొడలు 'వైశ్యులు'. ఇక మిగిలినవి పాదాలు. పాదాలను శూద్రులతో పోల్చబడింది . ఈ సమాజము, దేశము నడవాలన్నా సాటి దేశాలకన్నా వేగంగా పరిగేత్తాలన్నా పాదాలుండి  తీరవలసిందే. సమాజ ప్రగతికి 'సేవ' లేకపోతే అసలు సమాజమే లేదు. వృత్తిని, శ్రమను ఎన్నుకొన్న వాళ్ళు శూద్రులు. కాలికి చిన్న గాయమైనా స్పందించేది తల. ఆ తల ఆజ్ఞాపించిన తక్షణం చేతులు ఆ కాలికి తగిన దోహదము చేస్తాయి. తగిన ధనము, ముఖ్యముగా వైశ్యుల వాణిజ్యము నుండి పన్నుల రూపములో సంపాదించిన   ధనాగారము నుండి తీసి ఏర్పాటు చేసిన వైద్యశాలలకు చేర్చి చికిత్స చేయించి బాగుచేయుట జరుగుచున్నది.

అసలు సమాజశ్రేయస్సే శూద్రుల మీద ఆధార పడివుంది. ఎవరైనా సాష్టాంగ నమస్కారము కాళ్ళకు చేస్తారు కానీ తలకు చేయరు. ఇంకొక ముఖ్య విషయం. తోమ్మిదిగజాల నేత చీరను అగ్గిపెట్టె లో పెట్టి ఇచ్సినాడట ఒక సాలెవాడు. ఆయన నైపుణ్యమునకు నమస్కరించకుండా ఉండగలమా. శిల్పము చిత్రలేఖనము వడ్రంగము కంసాలి పని, అది ఇది ఏల అన్నిరంగములలో సర్వతోముఖ అభివృద్ధి చెందినదీ వైదిక దేశము.కారణము సంతానము వారసత్వమును పుణికి పుచ్చుకోవడమే. వారి వారి తెలివి తేటలతో తమ తమ పరిశ్రమలను సర్వతోముఖముగా అభివృద్ధి చేసుకోవడమే. మరి నేడీ దేశము  ఎందుకింత వెనుక  బడినది?ఆంగ్లేయానుకరణ,ఆంగ్లేయానుసరణ. కమ్యూనిష్ట్ క్రిస్టియన్, ముస్లిం వర్గముల ప్రచారము మన ఉదాసీనత. వీటికి తోడు వాస్తవములు తెలుసుకొనే మన తపనను తామసము ఆవరించుట.  

 మిగిలినది మరోమారు………..

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-6

ఆ కాలము లో కూడా స్త్రీపురుషులు కామాతురులై అనులోమ, విలోమ వివాహములను చేసుకొని,   అంటే నాడు నిర్దుష్టముగా అమలులో నుండిన వర్ణ ధర్మమును పాటించక,వర్ణ సాంకర్యము జరిగితే, దానికి తగిన కఠినమైన దండన వుండేది, కావున వారిని దేశ  బహిష్కృతి గావించే వారని పెద్దల   మూలమున విన్నాను. వారు రాను రాను సమాజ బహిష్కృతులుగా ఆటవిక జన జాతులుగా(నేటి S.C.,S.T. లు ఆవిర్భవించి పంచమ జాతి యన్న క్రొత్త వర్గమును ఏర్పరచుకొని యుండవచ్చును.)  యుండవచ్చును.  

ఇక్కడ ఇంకొక ముఖ్య విషయమును మీ ముందుంచుతాను. అది రాజే గానీ, ఎవరో నియంత గానీ  ప్రజాస్వామికమే గానీ దేశమునకు పాలకులైతే ఉండవలసిందే! పాలకులైతే, కొంతకాక కొంతయినా ప్రజాహితము చేయవలసినదే. అందులో అతి ముఖ్యమయినవి విద్య వైద్యము. దేశము యొక్క ప్రగతి  జ్ఞానము, ఆరోగ్యము మీద ఆధారపడుతుంది. ఆరోగ్యము యొక్క అవసరము అందరికీ తెలిసినదే కాబట్టి దానిని గూర్చి చర్చించను.  

 

పూర్వము విద్య అన్న మాటకు అర్థము, ఆయా వృత్తి, శ్రమల నమ్ముకొన్నవారు తమ సంతానమునకు తమ విద్య తగిన సమయమును నుండి నేర్పించేవారు. తండ్రికున్న అనుభవమునకు తన శ్రద్ధ, పట్టుదలను చేర్చి తన వృత్తిలో ఎంతో ప్రగతి సాధించేవాడు. తండ్రే గురువు. సందేహాలు వుంటే గురుకులాలు ఉండనే ఉండినవి. ప్రతి పల్లెలో కూడా నాలుగు వర్ణములవారూ కలిసిమెలసి ఉండేవారు. అందుచేత వారు ఎవ్వరు కూడా బయటి ప్రాంతాలకో నగరాలకో పోయె అవసరము లేకుండా వుండేది. డబ్బు చలామణి తక్కువ అంతా ఇచ్చి పుచ్చుకోవడమే! అంటే బార్టరు విధానమే! ఈ వ్యవస్థను పటిష్ఠము చేసినాడు జగదేక సార్వభౌముడగు శ్రీరాముడు. అసలు చతుర్వర్ణములవారూ తమకు శాస్త్ర నిర్దేశితమైన పనులు చేసుకొనే విధముగా కట్టుదిట్టము చేసి దానిని ఒక కట్టుబాటుగా ప్రవేశపెట్టినాడు రామచంద్రుడు.

దీనివల్ల కలిగే లాభము ఏమిటి అన్నది గమనించండి.

ప్రభుత్వమూ ఖర్చు పెట్టి పాఠశాలలు  కళాశాలలు నడుపుతూవుంది. ఇంకొక ప్రక్క సంఘటిత విద్యాసంస్థలను ప్రోత్సహించుతున్నారు. వారు ముదుసలి రోగి మంచములో నల్లులవంటివారు. ఈ విధానము వలన GDP పెరుగవచ్చు కానీ ధనవంతులకు మాత్రమే ఈ వసతులు అందుతాయి. పేద, పేదగానే నిలచిపోతాడు. GDP అంటే ఏమిటో ఈ దిగువన చదవండి.

Gross Domestic Product (GDP) స్థూల దేశీయ/జాతీయ ఉత్పత్తి

స్థూల జాతీయోత్పత్తి అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో, తరచూ ఏటా ఉత్పత్తి చేయబడే అన్ని తుది వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ యొక్క ద్రవ్య కొలత. దీనిని ఐక్యరాజ్య సమితియే(UNO) ఒప్పుకొనుటలేదు. వారు HDI పెరుగవలెనని నొక్కి చెబుతారు. HDI అంటే ఏమిటో ఈ దిగువన చదువండి.

Human Development Index (HDI)

ఒక దేశం యొక్క సాంఘిక మరియు ఆర్ధిక కోణాలలో సాధించిన మొత్తము విజయాన్ని కొలవడానికి ఉపయోగించే గణాంక సాధనం. ఒక దేశం యొక్క సామాజిక మరియు ఆర్ధిక కొలతలు ప్రజల ఆరోగ్యం, వారి విద్యా స్థాయి మరియు వారి జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి.

నేటి విద్యావిధానమును ఒకపరి పరిశీలించుదాము. నేటి చదువుకోవలసిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుటకు పేదవారయినా సుముఖత చూపరు. పిల్లలు తగినంతగా వచ్చుటలేదని ప్రభుత్వమూ వానిని మూసివేయలేదు. మరి వానిపై ప్రభుత్వమూ పెట్టే అనేక విధములగు ఖర్చు వృధాయే కదా! అదేవిధముగా ఒక పేదవాడు తాను తినీ తినక తన తనయుడిని ఈ సంఘటిత విద్యా సంస్థలకు (Corporate Educational Organizations) పంపి ఎంత సొమ్ము వృధా చేస్తున్నారు. GDP మాత్రం పెరుగుతూ వుంది. కానీ పేద నిరుపేద అగుచున్నాడు. లక్షాధికారి కొటీశ్వరుడగుచున్నాడు. ‘వ్రతము చెడినా ఫలము దక్కవలె’నన్నది ఆర్యోక్తి. ఇక్కడ ‘మున్నూరు రూపాయలూ పోయె, మూతి మీసములూ పోయె, నంబి సోమయాజులు అన్న పేరు మాత్రం పోకపోయె’ అన్నట్లయింది నేటి ప్రభుత్వ పరిస్థితి. ఒక విద్యార్థి Medicine చదువుతాడు దానికన్నా లాభదాయకమని Real Estate Business కు ఆకర్షితుడౌతాడు. Computer Engineering చదివి Cloth Emporium తెరుస్తాడు. పైన తేలిపిన రెండు ఉదాహరణలలోనూ, ప్రభుత్వమూ వారిపై పెట్టిన పెట్టుబడి దండగే! అసలు నా విషయమే తీసుకొందాము, నేను M.Sc. Mathematics చదివికూడా నేను SSC Eligibility గా కల్గిన Bank Clerk గా చేరినాను. గణితములో ఎంతో కృషి చేయవలెనను తలంపు నీరుకారి పోయినది. దీనికి ఒక కారణము ప్రభుత్వ విద్యా విధానము, మరియొక కారణము నా పేదరికము,

ఇటువంటి ఏవిధమయిన ఆటంకములు లేకుండా ఉండు విధముగా మరి రాముడు చతుర్వర్ణములను, వాని విధివిధానములను నిర్దుష్టముగా ఏర్పరచి అమలు పరచినాడు. దీనికి ఆయన మంత్రాంగము మరియు ఋషి ముని యుక్తమగు మేధోవర్గము చేసిన దోహదము కూడా మనము అంచనా వేయలేనిది. నాడు స్వార్థము లేదు. అంతా పరార్థమే! నేడు పరార్థము లేదు అంతా స్వార్థమే! మన పూర్వులు అంటే ఋషి మునులు, శ్రీరాముని వంటి రాజులు అనుభవజ్ఞులు మరియు అభిజ్ఞులు. అందుకే అఖండ భూమండలమూ ఆనందముతో వెల్లివిరిసింది.

మిగిలినది మరొకసారి........

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-7

ఆ విధంగా శ్రీరాముని విధానములో ఈ భాధలు ఏవీ ఎదురు కాకపోగా పల్లెలు, జనపదములు,  పురములు, పట్టణములు, నగరములు వేనికవి స్వయంసంవృద్ధితో అలరారినాయి. ఈ పనులన్నీ ఉండినవి కాబట్టే ఆయన ఈ క్రింది శ్లోకము ద్వారా తన మనోగతము తెలిపినాడు.

దశవర్ష సహస్రాణి  దశవర్షశతానిచ

వత్స్యామి  మానుషే  లోకే  పాలయన్  పృథివీమిమాం ll 1-15-28

అంతే కాదు సంహారం చేసిన  పిదప  పదకొండువేల  సంవత్సరాలు  ధరణిని ఆవు దూడపై చూపించేతంతటి వాత్సల్యముతో,  పాలిస్తాను . ధర్మాన్ని  నెలకొల్పుతాను. అని మాట ఇచ్చినాడు.

 

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ |

రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మ లోకం ప్రయాస్యతి |1-1-97|

నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును. [1-1-96, 97]

 

 

 

అధికార వికేంద్రీకరణ (Decentralization of Power) అన్నది ఆనాడే శ్రీరాముడు పాటించిన పాలనా విధానము. ఆయన పాలకునిగా, తనయునిగా, భర్తగా, మిత్రునిగా, ప్రాణ దాతగా, దుష్టుల ప్రాణ హర్తగా, అవకర విక్రమునిగా, అసమాన సేనాపతిగా, అన్నింటికీ మించి ఆడర్శప్రాయుడగు ధర్మ మూర్తిగా లోకానికి ఒక రాజు ఏవిధముగా వుండవలెనన్నది చూపుటకే  రాజ్యాన్ని ఉపాసించినాడు.

 

 దోచుకొనుటకే అన్య జాతులు ఈ దేశముపై దండయాత్ర సాగించి మన ధన మాన ప్రాణములను దోచుకొన్నారు.ఎంతమంది హిందూ స్త్రీలను చెరిచి మత మార్పిడి చేసినారో చెబితే బహుశా మాటలతో తీరదెమో. ఇతర మతముల దేవుడంతటి కౄరుడా. మన దేశములోని నేటి అన్య మతస్తులొకప్పుడు  ఆర్ష ధర్మాన్ని పాటించిన వారే కదా. వారిని పాశవికంగానో, ప్రలోభాలతోనో  నే కదా మార్పిడి చేసింది.

కుళ్ళు,కుట్ర, కుత్సితము, కుతంత్రము, కూత నీతి కలిగిన పాశ్చాత్యులు మనదేశ సంస్కృతిని చిన్నాభిన్నము చేసినారు.

మన దేశానికీ దుర్దశను ప్రసాదించిన  ఘజని, ఘోరి, మీర్ ఖాసీం, సర్ విలియం జోన్సు మెకాలే కాల్డ్వెల్ మాక్స్ ముల్లర్లను మనము మరచి పోలేము. పురుషులను  కౄరముగా భయపెట్టి, స్త్రీలను పాశవికముగా చెఱచి తమ మతములోనికి, వారి మతగ్రంధము ననుసరించి, ముస్లీములు మార్చితే,  కిరస్తానీలు సామ దాన భేద దండోపాయాలతో, వక్ర భాష్యములతో, తమ మత గ్రంధము చెప్పిన విధముగా మార్చినారు. కానీ వారు ఏ రోజూ మన వేదాంతులతో వాదమునకు నిలిచి తమ గొప్పదనము చాటుకొన్నది లేదు. ఈ నాడు వారు తమ Church లను మన దేవాలయముల రూపములో కట్టించుచున్నారు. వెంకటేశ్వర సుప్రభాతము పోలికన క్రీస్తు సుప్రభాతమును వేలయిన్చినారు. అష్టోత్తరములు శతనామములు  ఈ విధముగా ఎన్నో హేయమైన రీతులలో మనలననుకరించుచున్నారు. మనకు మాత్రము చీమ కుట్టినట్లు కూడా లేదేమో అనిపిస్తుంది.

Caste అన్న పోర్చుగీసు పదము 'వర్ణము' 'కులము 'నకు సమానము కాదు. విద్య నేర్పించే గురువు వద్ద వున్నా అనేక రఖముల విద్యార్థులను కలిపి గురు కులము అనేవారు . 'కుల్యుడు' అంటే గౌరవింప దగినవాడు. కుల్యా అంటే ఒక చిన్న నీటి ప్రవాహము . అంటే ఇవన్నే కలిసే 'భగవంతుడు' అనే సముద్రము చేరుతాయి అని అర్థము . పెద్దలు ఏపనీ విచక్షణారహితముగా చేయలేదు . మన పెద్దలను మనము గౌరవిద్దాం .

తరువాత రామాయణములోని మరొక అంశమును గూర్చి ముచ్చటించుకొందాము.

ఇది కేవలము అదనపు సమాచారము :

ఈ దిగువన తెలుసుకొనగోరు జిజ్ఞాసువులకు Google నుండి నేను  సేకరించిన విషయము మీ ముందుంచుచున్నాను.

 Etymology The English word "caste" derives from the Spanish and Portuguese Casta, which the Oxford English Dictionary quotes John Minsheu's Spanish dictionary (1599) to "race, lineage, or breed." When the Spanish colonized the New World, they used the word to mean a "clan or lineage." However, it was the Portuguese who employed 'Casta' in the primary modern sense when they applied it to the many in-marrying hereditary Indian social groups they encountered upon their arrival in India in 1498. The use of the spelling "caste," with this latter meaning, is first attested to in English in 1613. In the western world, this misconception is one of the most misunderstood and misinterpreted concepts of Hinduism. The correct term in a spiritual context is ‘Varna’ (Class), and not ‘Jaati’ (Caste), as misused in the western world. The social system of the four classes (Varnas) was created to assist everyone in society to behave as per their natural temperament, i.e. their constitution, which is composed of the three subtle components trigunas) and to assist in their spiritual evolution. In other words, the system of the four classes is incorporated into Hinduism to provide guidance on behavior and spiritual practice (sādhanā) according to one’s potential and requirement, to enable one to experience Bliss. Unfortunately, there is ignorance about this purpose of the social system and thus its portrayal is misleading.

తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' Division of labor is adapted in those days with a concept of one for each and each for all. మొదలు మన పెద్దలు చేసిన విభజనలో తప్పులేదన్నది గ్రహించండి. పిదప అందులోని మంచిని మీరు పాటించండి. ఎవరికి వారు మంచికి మారిపోతే మార్చవలసిన వారి అవసరము ఉండదు. గుణానికి,భక్తికి,పేద పెద్ద తేడా లేదు. కులము గుణము వేనికవే . అందుకే కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణముచేత అన్నారు పెద్దలు. నేటి తరము లో ధనము వుండీ ప్రజలకు పంచిన గుణవంతులైన మహనీయులు ఎందఱో వున్నారు . లేనివారిలో బాగుపడేవాని కాలులాగేవారూ చాలామంది వున్నారు.

మిగిలినది ఇంకొకసారి......

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-8

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరంl

ఏకైకమక్షరం ప్రోక్తం మహా పాతక నాశనంll

రాములవారి అవతారము భూమిపై నిలచినది 11వేల సంవత్సరములు అని శ్రీమహావిష్ణువే చెప్పినట్లు పైన చెప్పుకొన్నాము. వాల్మీకి మహర్షి వ్రాసిన శ్రీమద్రామాయణము 24వేల శ్లోకములు మాత్రమే కలిగి 40 సంవత్సరముల రామ చరిత్ర మాత్రమే తెలుపుచున్నది. సీతామాత తదనంతరము కూడా రాముడు కొన్నివేల సంవత్సరములు రాజ్యమేలినాడు. మరి మొత్తము కాలపు ఇతిహాసము వ్రాస్తే శతకోటి ప్రవిస్తరము కావలసినదే కదా! మరి ఎవరు వ్రాసినారు అంటే, శాతాధికులగు వాల్మీకి సమకాలీనులగు వశిష్ట, వామదేవ, విశ్వామిత్ర, సీత, రావణ, ఆంజనేయాది  మహనీయులు వ్రాసినారు. ఆ రామాయణములన్నీ గ్రహించితే రామాయణము శతకోటి ప్రవిస్తారమౌతుంది. వాల్మీకి తన మనోనేత్రమునకు కనిపించిన విషయరచానకు ప్రాధాన్యమిస్తే,ఈ రచయితలు తమ తమ అనుభవములోనికి వచ్చిన సూక్ష్మాతి సూక్ష్మ విషయములను కూడా మనకు అందించినారు. ఉదాహరణకు  హనుమద్రామాయణములో వివిధ వానర జాతుల పుట్టుపూర్వోత్తరములు అన్నీ సవివరముగా ఇవ్వబడినాయి. ఇవన్నీ  ఎందుకు చెప్పవచ్చినానంటే, మనము ‘ఉడుతాభక్తి’ అన్న నానుడి మనము విరివిగా వింటూనే ఉంటాము. ఈ విషయము వాల్మీకి రామాయణములో మనకు అగుపించనిది.కానీ వందల వేల రామాయణములు ఉన్నపుడు ఈ ప్రస్తాపన వేరు ఏదయినా రామాయణములో ఉండవచ్చునన్నమాట త్రోసి పారవేయ జాలనిది. ఇప్పటికీ మనదేశములోని సుప్రసిద్ధ గ్రంథాలయములలో తాకని తాళపత్ర నిధులను చీమల బారులతో పోల్చవచ్చును. ఇందు చెద పట్టినవేన్నో! ఈ ఉడుత ఉదంతము, నిశితముగా పరిశీలించిన,  శ్రీరామ చంద్రుని నాయకత్వ లక్షణములను ఎంత గొప్పగా వ్యక్తము చేయుచున్నదో గమనించండి.

ఒక వ్యక్తిచేసిన పనిని, చేయగలిగిన పనిచేత భాగించి దానిని 100 చేత గుణించగా వచ్వ్చిన లబ్దము ఆ వ్యక్తి చేసిన పని శాతము. ఉదా.  150KG బరువు ఎత్తగలిగిన వ్యక్తి 75KG ల బరువు ఎత్తినాడని అనుకొందాము.   (75  150) × 100 = (7500  150) = 50%. అంటే  అతని శ్రమ శాతము 50% మాత్రమే. అదే 5గ్రాముల బరువు ఎత్తే వ్యక్తి 10 గ్రాములు మోస్తే అతని శ్రమ శాతము 2౦౦%. ఆ విషయమును గుర్తించి రాములవారు ఉడుతను అంత  ఆప్యాయముగా దువ్వి యుంటాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధమగు గుర్తింపు  హనుమకు కూడా దక్కుతుంది, రామునివలన, ఒక సందర్భములో! ఈ ఉదంతము శ్రీరాముని నాయకత్వ లక్షణమునకు నిలువుటద్దము. మనకు ఆమోదయోగ్యము  మరియు ఆచరణ యోగ్యము. నా అనుభవములో కొందరు వార్దుషి(Bank) అధికారులను చూసినాను. వారు ఎటువంటి పరిస్థితులలోనూ తమ నేతృత్వములో పనిచేయువారల  నిజాయితీని, నిబద్ధతను గుర్తించి కూడా బహిర్గత పరచరు. నా అనుభవములో నేను పనిచేసిన శాఖాదిపతితో ‘నిబద్ధతతో పనిచేసే వ్యక్తులను గుర్తించి వీపు చరిచితే చాలు,  వారు అమిత ఉత్సాహముతో ఏపనినయినా నిర్వహించుతారు’ అని చెప్పినాను, నా పద పురోగతిని లెక్కించకుండా! అంత చిన్నవిషయములపై కూడా అంత జాగరూకత  కలిగినవాడు శ్రీరామ చంద్రుడు. అందుకే ఆయన జగదేక రాముడు. A leader can communicate your worth and potential in such a way, that you come to see it in yourself అన్న వాస్తవానికి నిలువుటద్దము ఆ సకల సద్గుణాభిరాముడు.

 

రామాయణము ఇతిహాసమా కాదా, లేక ఇది ప్రాతఃస్మరణీయులైన ఆంగ్లేయులు చెప్పిన విధముగా Myth అని మనము నమ్మవలసినదేనా! ఒకసారి ఆ వాస్తవమును పరిశీలించుదాము.

9వ శతాబ్దములో రాజశేఖర కవి ఇతిహాసము’ నకు తానూ రచించిన ‘కావ్యమీమాంస’ ద్వారా ఎంత చక్కని నిర్వచనమిచ్చినాడో ఒకపరి గమనించండి.

‘ఇతిహాస వేద ధనుర్వేదౌ గాంధర్వవేద ధనుర్వేదౌవ్యుపవేదః’ అని తెలిపినారు పెద్దలు. వారు ఇంకా ఏమన్నారంటే:

వరక్రియా పురాకల్ప ఇతిహాస గతిర్ద్విధా l

స్వాద్యేక నాయకః పూర్వః ద్వితీయా బహునాయకాఃll

అనగా మహానీయులగు వేదవిదులు పూర్వము మనకొసగబడిన ఇతిహాస విధానమును రెండు విధములుగా విభజించినారు. 1. ఏకనాయక ఇతిహాసము, 2. బహునాయక ఇతిహాసము. రామాయణము మొదటి కోవకు చెందితే, భారతము రెండవ కోవకు చెందినది.

ఇంకా

ధర్మార్థ కామ మోక్షాణాం ఉపదేశ సమన్వితంl

పూర్వ వృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతౌll

అనికూడా అన్నారు. అంటే  ధర్మార్ధకామమోక్షములు అనే చతుర్విధ పురుషార్ధములు, ఉపదేశములు, పూర్వవృత్తాంత కథలతో కూడినది ఇతిహాసము అని అనబడుతుంది. నిజానికి ‘చరిత్ర’ అన్నమాట ‘ఇతిహాసమునకు’ సమానార్థకము కాదు. ‘చరిత్ర’ అన్న మాటకు ‘Character’ అన్నది ఆంగ్లమున సమానార్థకము.

ఇతిహాస పురాణానాం వేదం సముపబృహ్మయేత్l

విభేదాలప శ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి ll

అన్నది శాస్త్ర వచనము. వేదములు శాస్త్ర పురాణములలో నిక్షిప్తము చేయబడినవి. అ జ్ఞానమును చక్కగా ఉపయోగించుకోనమని పెద్దల ఆదేశము. ఎక్కడ అరకొర విద్య నేర్చుకోన్నవారి నోటబడి తనపై వేటు పడుతుందో అని వేదము భయపడుతుందట. అందుకే సర్వ వేదార్థ సారమును ఇతిహాస పురాణములలో మహానీయులగు మన మహర్షులు జొప్పించి మన చేతికందించినారు. కానీ నేడు వాని విలువ తెలియని మనకు ‘మొరటువానికి మొగిలిరేకిచ్చినట్లు’ అయ్యింది.

ఇంకొక ఆశ్చర్యకరమగు విషయము ఏమిటంటే History అన్న పదము His Story అన్న రెండుపదముల సంయోగము. ఆ His అను మాట దేశ పాలకునికి అన్వయము. Story అంటే కథ. అంటే History అన్న మాటకు ‘వాని కథ’ అని అర్థము. మరి "ఇతి-హాసం" - అనగా "అవును ఇలా జరిగిందని చెప్పబడినది" అని అర్థము. దీనిని బట్టి వాస్తవమును అర్థము చేసుకొందాము.ఏదో అతడు రాజయినాడు, పాశ్చాత్యుల ప్రకారము,

దేశాలు జయించినాడు, ఎవరెవరినో చంపినాడు, ఒకరోజు తానూ చచ్చినాడు అన్నది మాత్రమే ‘His Story’ లేక ‘History’,

మిగిలినది మరొకసారి......

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-9

ఎప్పటికీ జిజ్ఞాసువు ఒక విషయమును మరచిపోడు. అతడెపుడు కూడా తనకు తెలిసినదంతా వాస్తవము అనుకోడు తెలియనిది అబద్ధమనీ అనుకోడు. రామాయణము, మానవుని వైజ్ఞానిక ప్రతిభ పెరిగిన తరువాత ఇతిహాసముగా గుర్తింపబడినది. ఇకమీద ఇది అభూతకల్పన కాదు. ఈ క్రింది వాస్తవమును మనసు పెట్టి చదవండి.

ఒక ఖగోళ రహస్యమునకు సంబంధించిన విషయమును వాల్మీకి మహర్షి ఎంత నిగూఢముగా మనకు తెలియబరచినాడో తెలుసుకొందాము.

బాలకాండ 18 వ సర్గము. 16 వ శ్లోకము ఈ విధముగా వుంది.

గుణవంతో సురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాఃl

జగుః కలం చ  గంధర్వా ననృతుశ్చాప్సరో గణాఃll బాలకాండ 18-16

దశరథుని నలుగురు పుత్రులూ రూపములోనూ గుణములోనూ నిరుపమానులు. వారు ప్రోష్ఠపద నక్షత్రమువలె అన్యోన్యత కలిగి వుండినారు. వీరి జనన కాలమున గంధర్వులు గానము చేసినారు. అప్సరసలు నాట్యము సల్పినారు. దేవదుందుభులు మ్రోగినాయి. అన్నది స్థూలముగా శ్లోకార్థము. ఇందు మనకు కావలసింది ‘రుచ్యా ప్రోష్ఠపదోపమాః’ అన్న పదము మరియు దాని విశ్లేషణ. రుచి అన్న మాటకు ప్రకాశము అన్నది ఒక అర్థము. మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కదా! మరి ఒక నక్షత్రము పేరు చెప్పి, దానివలె ప్రకాశించుచున్నారు  అంటే కొంత ఎబ్బెట్టుగా వున్నట్లు తోచకమానదు. నలుగురు స్త్రీలను ఉద్దేశించి చెబుతూ, ఆ నలుగురి ముఖములూ చంద్రబింబములవలె వున్నాయి అని అంటే మనసుకు రుచించదు కదా! మరి ఇది ఎలా సరిపోతుంది, అన్నది సమస్య. అది ఇపుడు కాస్త ఈ పదప్రయోగను గూర్చి తెలుసుకొనే ప్రయత్నమూ చేస్తాము. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రములు రెంటినీ కలిపి  ‘ప్రోష్ఠపద’ అని అంటారు. మరి ఇప్పుడు కూడా రెండేకదా అయినది, వారు అన్నదమ్ములు నలుగురు కదా! అన్న సందేహము వస్తుంది. అక్కడే వున్నది అసలు రహస్యము. పూర్వాభాద్ర రెండు ప్రకాశవంతమగు నక్షత్రములను కలిగియుంది. అదేవిధముగా ఉత్తరాభాద్ర కూడా రెండు తేజోవంతమైన నక్షత్రములను కలిగియుంది. ఈ నాలుగూ నాలుగు చుక్కలు (Points) గా గ్రహించి అవి A,B,C,D అన్న బిందువులుగా భావించి కలిపినట్లు ఊహించితే ఇంచుమించుగా ఒక చతురస్రము (Square) ఏర్పడుతుంది,  అంటే AC, BD ల దూరములో సూక్షమైన తారతమ్యాలు వుంటాయిగానీ AB, CD లు ఒకే దూరాన్ని కలిగివుంటాయి. ఇది మనకు A,C మరియు B,D ల అంటే రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నుల అన్యోన్యతను తెలుపుతాయి. ఇదీ వాల్మీకి మహర్షి ఒకే పదములో  ఖగోళ శాస్త్రమును ఆధారము చేసుకొని అన్నదమ్ముల అన్యోన్యతను ఎంతో నిర్దుష్ఠముగా తెలియజేసిన విధానము. దీనినిబట్టి నాటి ఖగోళ శాస్త్ర విజ్ఞానము మనకు తెలియవచ్చుట లేదా!

నిరంతర భక్తితత్పరులు భగవంతుని అవిరళానుగ్రహ ప్రాప్తులగు ఆ మహానీయులకే, కేవలము తమ ధ్యానముతో ఖగోళ స్థితి గతులను తెలుసుకొనుట, అట్టి కావ్యములు వ్రాయుట, వానిని ఆచంద్రార్కము నిలిపివుంచుట సాధ్యము. వాల్మీకి మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండప్రణామములు 

మరొక పర్యాయము మరికొన్ని విశేషాలతో.......

రామాయణము-శ్రీరామ సార్వభౌముడు-10

రామాయణ కాలములో నాగరీకత

వాల్మీకీ రామాయణము కేవలము రామ కథను మాత్రమె తెలుపుట లేదు. విస్తారముగా చదివిన వారికి అందు అనేక విషయములు బోధపడుతాయి. ఆ కాలమునాటి నాగరికతను గూర్చి ఈ ఖండములో చర్చించుదాము.

నాగరికతను నగర, పట్టణ, ప్రాంత, గ్రామ్య, అరణ్య నాగరికతలుగా మనము విభజించుకొనవచ్చును.,

ఇప్పుడు ముఖ్యముగా అయోధ్య లంకాపట్నమును తీసుకొందాము.

అయోధ్యను స్వయముగా మనువు నిర్మించినాడని వాల్మీకి మనకు తెలియజేసిన విశేష విషయము. ఈ శ్లోకము ఆ విషయమును మనకు ధృవపరచుతూ వుంది.

అయోధ్యానామ నగరీ తత్రాసీన్ లోకవిశ్రుతాl

మానునా మానవేంద్రేణ యాపురీ నిర్మితాస్వయంll

అంటే లోకములో అయోధ్యగా ప్రఖ్యాతమయిన నగరము మానవేంద్రుడగు మనువుచే నిర్మింపబడినది. సమతల ప్రదేశములో నిర్మితమయినందువల్ల అయోధ్య మిథిల వంటి ప్రాంతములను పురి లేక నగరి అని పిలిచేవారు. ఈ అయోధ్యానగారమునకు అనుబంధముగా ఎన్నో జానపదాలు గ్రామాలు ఉండేవి. రాములవారి వనవాసకాల సంచారసమయములో సీతా లక్ష్మణుల కూడి గ్రామముల ఎల్లల బయటనుండి ప్రయాణము చేయునపుడు(Bypass Paths) ఎన్నో గ్రామాల వర్ణన మనకు వాల్మీకి రామాయణములో మనకు కనిపిస్తాయి. ఇక అరణ్య నాగరికతను గూర్చి కాస్త తెలుసుకొందాము. అచటి జనావాసములు నాటికే చిన్నచిన్న దోనెలు, పడవలు నదులు దాట వాడేవారు. అడవి జంతువులను అవసరము మేరకు వేటాడి ఆహారముగా తీసుకొనేవారు. పుట్టతేనె వారివద్ద ఎప్పుడూ నిలువ వుండేది. వారిలోని ప్రేమాభిమానములకు గుహుడే మనకు నిదర్శనము. పైగా ఋషి ముని పర్ణశాలలు, గురుకులాలు అరణ్యాలలోనే ఉండేవి. పైగా యుద్ధవిద్యా విన్యాసములకు సాధనకు అరణ్యాలే పట్టుకొమ్మలు. నేటికి కూడా మన Military Academy లు ఊరికి దూరముగానే కదా ఉన్నాయి! నాడు వనవాసానుగతులగు మహర్షులు రాక్షస సంహారమునకు తాముదర్శించిన అస్త్రములను, సంపాదించిన శాస్త్రములను రామునికి బహూకరించి శాంతిస్థాపనకు దోహదము చేసినారు. నేడుకూడా మన అణుపరీక్షలు జనావాసములకు బాగా దూరముగానేకదా చేస్తారు!  

ఈ విధముగా విద్య నేర్చుకొనే తరుణములో రాజకుమారులకు ఆటవికులతో పరిచయమగుటచే శిక్షణ ముగిసినతరువాత కూడా వారి ఆటవిక సన్నిహితులకు రాజభవనములలో నిరంతరాయ ప్రవేశము ఉండేదని మనకు తెలియవస్తూ వున్నది. దీనివల్ల ఒకరి నాగరికతతో మరొకరికి అవగాహన ఉండేదని రామాయణము ద్వారా మనకు తెలియవస్తూవున్నది. అందుకే సీతారామలక్ష్మణులు ఆటవికులు ధరించే నారచీరలు కట్టుకొనే అరణ్యవాసమునకు బయలుదేరినారు. ఈ నారతో చేసిన వస్త్రముల వాడుక నేడు మన దేశమున మరుగైనా ఇప్పటికీ మనకు దాదాపు 1500 కిలోమీటర్ల దూరములో ఉన్న Fizi ద్వీపములలో చూడవచ్చునని చదివియుండినాను. హృద్యంగమమైన ఆ అరణ్య వాతావరణము మన అనాది నాగరికతకు ప్రతీక.

అదేవిధముగా లంకానగరము విశ్వకర్మచే నిర్మితమయినట్లు వాల్మీకి రామాయణమున గ్రంథస్థము చేయబడినది. ఆవిషయము ఈ శ్లోకపాదము తెలుపుతుంది.

పాలితం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణఃl

లంకాపట్టణము మూడు పర్వతములను పునాదిగా చేసుకొని నిర్మించుట జరిగినది. ఆవిధముగా విశాలమయిన స్థలములో కట్టబడుటచే దీనిని లంకానగరము అనికూడా అన్నారు. నగరము, పట్టణము, దుర్గము మొదలగు జనావాసములను గూర్చి ముందు మీ ముందుంచిన భాగములలో చేప్పియున్నాను. రావణ లంకానగరము. అపూర్వ నిర్మాణ సంయుక్తము..  శత యోజన విస్తీర్ణ నగరము. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని కుబేరుని అనంతరము మార్చినాడట రావణాసురుడు.  అంతా బంగారుమయమై అత్యంత విలాస జీవనం గడిపేవాడని చెబుతారు రావణుని గూర్చి. అందుకే వాల్మీకి రామాయణములో లేకున్నా ఈ దిగువన ఇవ్వబడిన శ్లోకము అత్యంత ప్రాచుర్యములోనికి వచ్చింది. (కొందరు ప్రక్షిప్తము అని కూడా అంటారు).

అపి స్వర్ణమయీ లఙ్కా న మే లక్ష్మణ రోచతే ।

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥

లంకలో రావణాసురునితో యుద్ధం పూర్తి అయి, రావణుడు నిర్జింపబడిన తరువాత స్వర్ణమయమై మనోహరముగా ఉన్న లంకా వైభవాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన లక్ష్మణుడు, లంకా సౌందర్యం మీద, లంకా వైభవం మీద పెరిగిన మక్కువతో అన్నగారైన రాములవారితో మనం ఇక్కడనే స్థిరపడదాము, మరల అయోధ్యకి తిరిగి వెళ్ళుట ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఆ సందర్భం లో రాముల వారు లక్ష్మణునితో మాతృ మూర్తి యొక్క, మాతృ భూమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పిన అమోఘమైన వాక్యాలు.

“ఓ లక్ష్మణా! లంక స్వర్ణమయమైననూ నాకు రుచించదు. ఎందుకంటే జనని మరియు జన్మ భూమి స్వర్గము కంటెనూ ఉత్కృష్టమైనవి”. అందుకే యుగాలు గడచినా రాముని మరువలేము రాముడు హృదయారాముడై మనలో నిలచిపోయినాడు.

ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవని తెలియుచున్నది. లంకలో చాలా ప్రాంతాల్లో గుహలు, సొరంగాలు విరివిగా కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుని ఈ ప్రతిభకు కారణము విశ్వకర్మ మరియు మయులని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి కలిపే  అనుసంధానవ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు, వాహనములు శీఘ్రముగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సౌకర్యమును కలిగి ఉన్నాయి. లంక రాజ్య నగర వర్ణన రామాయణం సుందరకాండ లోని రెండవ సర్గలో 09-26 శ్లోకములవరకు వర్ణింపబడినది.

వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు ఆకాశమునుండి చూచినపుడు లంక పట్టణము విమానాకారము కలిగి ఆకాశ హర్మ్యాలతో అలరారుచుండినదట. అంటే నాటికే ఈ విధమగు ఆకాశహర్మ్యాలు(Sky Scrapers) ఉండేవి అన్న విషయము మనకు విదితమగుచున్నది. నాటి విమానములు, ఈ నాటి విమానాకారములు కాదు, ఆనాటి విమానాకారము అంటే అది ఈనాటి పెద్దపెద్ద దేవాలయములలో తేరు రూపములో వుంటుంది.

ప్లవమానాం వివాకాశే దదర్షం హనుమాన్ పురీం

 అదేవిధముగా రావణ భవనములన్నీ మయనిర్మితములు. మరి విశ్వకర్మ దేవతా వాస్తు శిల్పి, మయుడో రాక్షస జాతికి చెందినవాడు కదా అదెట్లు సాధ్యము అంటే, విశ్వకర్మ లంకను నిర్మించినది కుబేరుని కొరకు. కుబేరుడు రావణాసురుని తండ్రి  విశ్రవసుకు తన పెద్దభార్యయగు ‘ఇలబిల’ కు జన్మించినవాడు కుబేరుడు. రెండవ భార్య కైకసి సంతానము రావణ కుంభకర్ణ విభీషణులు. కైకసి మొదటి చెల్లెలు రెండవ చెల్లెలునగు పుష్పోత్కట, రాకలకు వరుసగా మహోదరమహాపార్శ్వాదులు మరియు ఖర దూషణ త్రిశిరులు జన్మించినారు. విశ్రవసు పెద్దకుమారుడగు కుబేరుని జయించి రావణుడు రాజ్యమును హస్తగతము చేసుకొని లంకానగరమునుండి ఆతనిని పారద్రోలినాడు. ఆపై మయుని కుమార్తె మండోదరిని వరించి వివాహము చేసుకొన్నాడు. మయుడు విశ్వకర్మకు సమాంతరమైన వాస్తు శిల్పి కాబట్టి తన అల్లుని రాజధానిలోని హర్మ్యములను తన పర్యవేక్షణలో నిర్మింపజేసినాడు. వీనిని నాడు విమానగృహాలుగా పిలిచేవారు.

గృహాని నానాని వసురాజితాని దైవాసురైశ్చతి సుపూజితాన్

సర్వైశ్చ దోషైః పరివర్జితాన్ కపిర్ గగర్స్య స్వబలార్జితాన్

తాని ప్రయత్నాని సమాహితాని మాయెన సాక్షానివ నిర్మితాని

మహీతలే సర్వ గుణోత్తరాణి దధర్ష్య లంకాదిపతే హర్మ్యాని

ఈవిధముగా లంకానగరి గొప్పదనము మన కళ్ళకు కట్టినట్లు కనబరచినాడు వాల్మీకి మహర్షి.

ఇక తిరిగీ అసలు విషయమునకు వస్తే,

అయోధ్యలో దశరథుడు యజ్ఞవాటికను నిర్మించదలచినపుడు సరయునదికి ఉత్తరభాగమున ఒక సంవత్సరకాలమునకు తగిన ఒక క్రొత్త తాత్కాలిక పురమునే (Like Olympic Village Now-a-days) నెలకొల్పినాడు. కారణము యజ్ఞమునకు వచ్చు గొప్పగొప్పవారి అంతస్తుకు అనుకూలముగా మనోజ్ఞమగు భవనాలు వీధులు బాటలు, రథ్యలకు (High Ways) ఇరుప్రక్కలా తమ ఛాయను విస్తరింపజేయు వృక్షములు, దాహార్తులకు, గుర్రములకు నీటి వసతి మొదలగునవి ఎన్నో ఏర్పరచినాడు. వినోదమునకు నాట్యశాలలు మొదలగు అనేక మనోజ్ఞ మందిర నిర్మాణములను గావింపజేసినాడు. ఈవాస్తవములు

వాల్మీకి రామాయణములోని బాల కాండలోని 6, 7, 8, పద్యములలో వివరముగా తెలుపబడింది. ఆ శ్లోకములు ఈ దిగువన ఇవ్వబడినవి.

తతోఽబ్రవీత్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞ కర్మసు నిష్ఠితాన్ |

స్థాపత్యే నిష్ఠితాం చ ఏవ వృద్ధాన్ పరమ ధార్మికాన్ |1-13-6|

కార్మంతికాన్ శిల్పకారాన్ వర్ధకీన్ ఖనకాన్ అపి |

గణకాన్ శిల్పినః చ ఏవ తథా ఏవ నట నర్తకాన్ |1-13-7|

తథా శుచీన్ శాస్త్ర విదః పురుషాన్ సు బహు శ్రుతాన్ |

యజ్ఞ కర్మ సమీహంతాం భవంతో రాజ శాసనాత్ |1-13-8|

పిమ్మట వసిష్ఠుడు (5 వ శ్లోకములోని అవసర భాగము)యజ్ఞకర్మలయందు రాజుచే నియుక్తులయిన బ్రాహ్మణులను, సమర్థ వాస్తుశాస్త్రజ్ఞులను (Civil Engineering), ధార్మికోత్తములైన పెద్దలను, యజ్ఞపరిసమాప్తి వరకు అచ్చటి సమస్త కార్యకలాపములను పర్యవేక్షించు వారిని (Executives), ఇటుకలు మున్నగునవి సిద్ధపరచువారిని, సృక్సృవాది ఉపకరణములు చేయు వడ్రంగులను, , లేఖకులను, శిల్పకారులను, ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ ఇవ్వవలసియున్నది. రెండవ శ్లోకము ఆదిలో ‘కార్మంతికాన్’ అన్న పదప్రయొగము వాల్మీకి మహర్షిచే జరిగినది. నాడు దినకూలికి పనిచేసేవారిని ‘కార్మంతికులు’ (Daily Laborers) అనేవారు. చిత్రకారులను, బావులను త్రవ్వువారిని, రసాత్మక నటులను, నర్తకులను,సచ్ఛరిత్రగల శాస్త్రజ్ఞులను సమఘ్ర విషయానుభావము కలిగినవారిని పిలిపించి సరియైన వ్యూహమును సభాసడులతో చర్చించి ఏర్పరచికార్యమును అత్యంత వైభవోపెతముగా నిర్వహించినాడు.

ఇక్కడ మనకు రెండు విషయాలు మిక్కిలి స్పుటగా అగుపించుతాయి. 1. దశరథుని కార్యదేక్షా దక్షత మరియు ఉత్తమ నాయకత్వము, 2. నాటి అందుబాటులో ఉన్న వివిధ విధములగు వనరులు. ఏ మన్వంతరములోని త్రేతాయుగము లోని రామకథ అన్నది ప్రక్కనుంచితే, ఒక వేళ ఈ మహాయుగములోని త్రేతాయుగామును తీసుకొన్నా అంటే 8,64,000 సంవత్సరములక్రితమే ఈ దేశపు నాగరికత ఎంతగా విస్తరిల్లి యున్దినదో మనసారా గమనించండి. మన కనులకు కన్పట్టు విధముగా వ్రాసిన వాల్మీకి మహర్షికి మనసా శిరసా, ఉరసా నమస్కరించండి.

స్వస్తి.

మరొకమారు మరొక విషయముతో.........

శ్రీరామ సార్వభౌముడు-11

రామాయణ కాలమున పట్టణ వాతావరణము

భారత దేశ చరిత్ర క్రీస్తుకు పూర్వము ఫలానా సంవత్సరముండి మొదలయినది అని ఎవరయినా చెబితే అది కేవలము అంధుని ముందు అద్దమే! బీహారు, గుజరాతు, తమిళనాడు, ఆంద్ర, రాజస్థాను అసదిగాగల రాష్ట్రములలో అనేకమయిన పురావస్తువులు దొరుకుట జరిగినది. దొరికిన వస్తువులకు carbon Dating విధానమును అమలు పరచి ఆయా వస్తువుల యొక్క ఇంచుమించు కాలమును నిర్ణయించవచ్చునేమోగానీ, ఇక ఆయాస్తలములలోగానీ, వేరువేరు స్థలములలో గానీ, ఇక దొరకవు అనిగానీ, ఇంతకు మించిన పాతవి ఉండవు అనిగానీ చెప్పలేము కదా! కావున మనము కాల నిర్ణయము కొరకు వేదపురాణేతిహాసములపైనే ఆధారపదవలసియుంటుంది. ఇప్పుడు అవి తప్పు అని అనలేని విధముగా అందులో తెలిపిన దేశకాల పరిస్థితులు నేటి  చారిత్రిక పరిశోధనలతో సరిపోవుచున్నవి. నేటి వేదవిదులు తెలిపిన ప్రకారము రామాయణము ఇపుడు జరిగే వైవస్వత మన్వంతరములోని 24వ మహాయుగములోని త్ర్తాతాయుగమున జరిగినట్లు విదితము చేసినారు. ఇపుడు మనము 28వ మహాయుగములోని కలియుగములో ఉన్నాము.  రామాయణ కాలము యొక్క విషయమునకు వస్తే కొందరు ఆధునిక పూర్వేతిహాస శాస్త్రజ్ఞులు 6000  సంవత్సరముల క్రితము, 7000  సంవత్సరముల క్రితముఅని చెబుతూ వుంటారు. మన పంచాంగములు సృష్టి ఆవిర్భావము నుండి ఎన్ని కోట్ల సంవత్సరములు జరిగిపోయినాయి అన్నది, ప్రతి సంవత్సరము చేబుతూనే వస్తూ వున్నాయి.  పొరుగింటి పులిహోర రుచి, మనయింటి వంటకమునకు రాదు'. ఇది ఆలోచనాపరులు గ్రహించవలసిన విషయము. ఈ విధముగా కొన్ని వేల కోట్ల సంవత్సరములనుండి వచ్చే సృష్టిని 6000, 7000 సంవత్సరములకు కుదించుట అసంగతము అవాస్తవము కాదా! కావున మన ఊహకందని కాలము నుండి ఉన్న ఈ సృష్టిలో ఒకే తిథివార నక్షత్ర యోగ కరణములు పునరావృతమగు అవకాశము లేదా! ఈ వాస్తవమును దృష్టిలో ఉంచుకొంటే రామాయణము ఏ ఏ త్రేతాయుగామునకు సంబంధించినది అన్నది శాస్త్రజ్ఞులు ఎవరయినా తెలుసుకొన వచ్చును. ఇప్పుడు ఒక మాట చెబుతాను : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ New Delhi వారు రామ జననము. క్రీస్తు పూర్వం 5114, జనవరి 10 అర్ధరాత్రి 12:05కు. జరిగినట్లు చెబుతున్నారు. పలుగు పార పట్టుకొని పరిశోధనకు పోలేని వయసులో నేను చెప్పగలిగే మాట ఒకటే! పైన ఏ తేదీన అయితే రామజననము జరిగినదని చెప్పబడినదో  రాములవారు వాల్మీకి జీవించియున్న త్రేతాయుగములో అదే సమయమున పుట్టియుండవచ్చును, అంటే 24 వ మహాయుగములోని ఆ తేదీన జన్మించియుండవచ్చును.  ఆ లెక్కలు కట్టుట శాస్త్రజ్ఞుల పని.

మరి అంతకాలము నుండు వుండే నాగరికత లో పట్టణములు పట్టణ జీవన విధానము ప్రత్యేకముగా ఉండవా! ఎందుకుండవూ? తప్పకవుంటాయి. మరి ఆ తీరు తెన్నులను ఇపుడు పరిశీలించుదాము.  

భాగీరథీం దుష్ప్రతరామంశుధానే మహానదీంl

ఉపాయాద్రాఘవస్తూర్ణం ప్రాగ్వటే విశ్రుతే పురేll (2-71-9)

 తన సైన్య బలగముతో గంగా మహాప్రవాహము దాటుత కష్టమని ఎరింగి భరతుడు సుప్రసిద్ధమగు రేవుపట్టణమైన ప్రాగ్వట నగరమున విడిది చేసెను.అంటే గొప్ప గొప్ప నదుల తీరముల వెలసిన నగరములను కూడా పట్టణములు అనేవారు. కావున అచటి నాగరికత కూడా అందుకు అనువుగా ఉండేదని తెలియవస్తూ వున్నది.

ప్రసాదమాల వతతాః సౌధ ప్రాకార సంవృతాః l

పతాక శోభితాః సర్వే సునిర్మిత మహాపథాఃll

అయోధ్యను గూర్చి వాల్మీకి ఈ విధముగా చెప్పుచున్నాడు: ఇళ్ళన్నీ, ప్రసాదమాల వతతాః, అంటే వరుసలలో కట్టబడివున్నాయి. అంటే ఈ పద్ధతి ఈ నాటిది కాదు కొన్ని కోట్ల సంవత్సరములకు పూర్వము జరిగిన రామాయణములోనే ఇవికలవు అని మనకు తెలియవస్తూ వున్నది. మరి నేటి నాగరికత కూడా అంతే కదా! ఇంకా ఆయన ఏమిచేప్పుయ్చున్నాడో గమనించండి. సౌధములు అనగా ‘సుధ’ చేత అనగా సున్నము చేత నిర్మింపబడినవి అని అర్థము. సౌధములు వేసిన పునాదులను బట్టి ఎంతో ఎత్తుగా వుంటాయి. ఇంతకు మునుపు, నేను అందజేయుచున్న ‘ఆంధ్ర భాగవత వినీలాకాశములో కొన్ని నక్షత్రాలు’ అన్న శీర్షిక కింద ‘అల వైకుంఠ పురంబులో.....’ పద్యమున వచ్చు ‘ఆమూల సౌధము...’ అన్న మాటను విస్తరిస్తూ పై విషయమును వివరముగా తెలిపినాను. సున్నముతో ఇసుకను తగుపాళ్ళలో కలిపి బెల్లము కోడిగుడ్లు మొదలగు వస్తువులను తగిన మోతాదులో కలిపి గానుగ పట్టి ఎంతో నున్నగా రుబ్బిన మినప పిండిలాగా తయారుచేసి ఇటుకల లేక రాళ్ళ నద్యన్ బంధనకే గాక పూతలకు కూడా వాడేవారు. ఆకత్తదములకు ఎటువంటి Asian Paints అవసరముండదు. అవి శతాబ్దాలపాటు నిగనిగలాడుతూ ఉండేవి. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా గండికోటలోని, దేవాలయమును పడగొట్టించి కట్టించిన మసీదు ఇందుకు తార్కాణము. ఇటువంటి మేడలు ప్రహరీలను అంటే ప్రాకారములను అంటే Compound Walls కలిగియుండేవి. చూచుచున్నారు కదా నాటి పట్టణ గృహనిర్మాణ కౌశలము. ఇవి కాకుండా ఆ సౌధములు ఎట్టయినా స్తంభములు కలిగిన పటాకములతో అలరారు చుండేవి. ఈ నాడు కూడా పంచతారా పణ్యారాతిధ్యభవనముల (Five Star Hotel Buildings) ప్రాకారములను ఆనుకొని మనము చూడవచ్చును. అట్లే పెద్దపెద్ద ప్రభుత్వ భవనములపైగానీ, పారిశ్రామిక భావనములపై గానీ ప్రధాన నగరములలో చూడవచ్చును. విదేశీ రాయభార కార్యాలయములపి కూడా ఆయాదేశ పతాకములు ఎగురుతూ ఉంటాయి. అంటే ఈ సాంప్రదాయము రామాయణ కాలమునకే ఉండినదన్నమాట. మన సంస్కృతి ఎన్ని కోట్ల సంవత్సరములదో గమనించండి. అంతేకాక ప్రపంచములోని ఇతర దేశములు మనలను ఎంతగా అనుసరించినాయో, అనుకరించినాయో చూడండి. అంతే కాకుండా ‘సర్వే సునిర్మిత మహాపథాః’ అంటే అంతటా చక్కగా నిర్మింపబడిన, మన రహదారుల మాదిరి వెయబడినవి కాదు, గట్టి పునాదితో, మిక్కిలి చిత్తశుద్ధితో వేయబడినవి. అందులో కూడా మన మన High Way ల వలె అత్యంత విశాలముగా ఉన్నవి అనుటకు ‘మహా పథ’ అను పదమును ఆ మహనీయుడు వాడినాడు. ఒక్క శ్లోకమునకు ఎంతటి వివరణ అవసరమైనదో చూడండి.

పై విషయమును వాల్మీకి ఈనాటి కట్టడములు చూసి వ్రాసినవాడు కాదు కదా!

అయోధ్య వీధులలో శ్రీరామ చంద్రుడు తన నివాసము నుండి రాజ ప్రాసాదమునకు పోవునపుడు వీధులు ఏవిధముగా ఉండినవో దిగువ శ్లోకములలో గమనించండి.

సగృ హైః అభ్ర సంకాశైః పాణ్డురైః ఉపశోభితం l 

రాజ మార్గం యయౌ రామః మధ్యేన అగరు ధూపితం ll |2-17-2 |

చందనానాం చ ముఖ్యానామగురూణాం చ సంచయైఃl

ఉత్తమానాం చ గంధానాం క్షౌమకౌశాంబరస్య చll |2-17-3|

అవిద్ధాభిశ్చ ముక్తాభిరుత్తమైః స్ఫాటికైరపిl

శోభమానం అసంబాధం తం రాజ పథం ఉత్తమంll  |2-17-4|

సంవృతం వివిధైః పణ్యైః భక్ష్యైః ఉచ్చ అవచైః అపిl

దదర్శ తం రాజపథం దివి దేవపథం యథాll   |2-17-5|

అని శ్లోకములకు కలిపి భావమును మీ ముందుంచుచున్నాను. ఆకాశమును తాకుచూ తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మెదలనుంది వచ్చు అగరువంటి వివిధ సుగంధ ద్రవ్యముల పొగలతో ఆ రాజమార్గములు నిండియున్నాయట. అంటే ఆ కాలములో  Pollution  Illusion గా మాత్రమే ఉండినది. ఉత్తమములగు చందనాది సుగంధ ద్రవ్యములు, వివిధ వర్ణముల పట్టువస్త్రములు, రంధ్రములు వేయబడని మంచి ముత్యములు, శుద్ధ స్ఫటికములు, వివిధములగు తినుబండారములు, వివిధ వర్ణ సౌరభ పుష్పములు, కలిగి ఒప్పారుచుచున్న నగర వీధుల గుండా రామచంద్రుడు రథముపై పయనించుచున్నాడు.

 

శాతకుంభ మయీం రమ్యం మణిరత్న సమాకులాంl

సుధార్మామివ ధర్మాత్మా సగణః ప్రత్యపధ్యత।।2.81.10।।

 धर्मात्मा righteous, सगणः along with his disciples, शातकुम्भमयीम् with gold finishing, रम्याम् lovely, मणिरत्नसमाकुलाम् inlaid with gems and precious stones, सुधर्मामिव like Sudharma, (the assembly hall of Indra), प्रत्यपद्यत reached.

(అయోధ్యాకాండ 81వ సర్గ 19వ శ్లోకము)

సచంద్ర తారాగణ మండితం యథాl

నభఃక్షపాయ మమలం విరాజతేll

నరేంద్ర మార్గః తదాప్య రాజతంl

క్రమేణారమ్యః శుభ శిల్పి నిర్మితఃll

తారాచంద్ర విరాజితమగు ఆకసము ఓలె వాస్తు శాస్త్రజ్ఞులు,శిల్పులు(Architects) అభియంతలు (Engineers) ఈ భవనములను తీర్చి దిద్దినారు. ఇటువంటి అందమగు భవనముల వరుసల మధ్య రాజమార్గములు విరాజితమై ఉన్నాయి. అంటే రాజు తన రథ గజ తురగ పదాతి దళ సిబ్బందితో విచ్చేయుటకు అన్నివిధముల అనుకూలమగు మార్గమును రకజమార్గము అంటారు. దానిని మనము ఈనాటి 6 Lane Track ను పోల్చవచ్చును. మనకు నాటి అయోధ్య నేటి డిల్లీకి సమానముగా ఉండేదా? అన్న సందేహము కలిగే అవకాశము ఉన్నది. రాముడు సార్వభౌముడు. సమస్త భూమండలమునకు రాజు. అంటే అయోధ్య సమస్త భూమండలమునకు రాజధానియే కదా! మరి అటువంటప్పుడు ఆనగరము ఎంత గొప్పగానూ ఎంత సుందరముగానూ, ఎన్నెన్ని వసతులతోనూ నిడియుండి ఇటు స్థానికులకు అటు తమతమ పనులకై ప్రపంచములోని పలు ప్రాంతముల నుండి తమతమ పనులకై  వచ్చువారాలకు తగిన వసతిని సమకూర్చు సువిధ ఏర్పరచియున్తారని మనము సులభముగా ఊహించుకొనవచ్చును. నాటి భారతీయులు సుశిక్షితులు మరియు క్రమశిక్షణాయుతులు. అట్టివారిని నేడు మనదేశములో మనము చూచుట వేపచెట్టుకు మామిడి పిందెలు చూడటమే!

అసలు అయోధ్య నగర విస్తీర్ణమును గమనించండి:

ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ .

శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తమహాపథా ৷৷1.5.7৷৷

అయోధ్య ( శ్రీమతీ) అందముగా మరియు ఆకర్షణీయముగా, (సువిభక్తమహాపథా) అత్యంత ప్రణాళికాబద్ధముగా,, (మహాపురీ) ఆ బృహత్ పట్టణము, చక్కగానూ, సుసంపన్నముగానూ,, సుందరమగు రీతిలో విభజింపబడి  పన్నెండు యోజనముల పొడవు మరియు మూడు యోజనముల వెడల్పుతో విస్తరించింది. అంటే దశ చ ద్వే చ 12, (యోజనాని) యోజనములు (48 క్రోసులు లేక 96 మైళ్ళు), (ఆయతా) పొడవు,  (త్రీణి) 3యోజనములు  (12క్రోసులు లేక 24న్ మైళ్ళు, (విస్తీర్ణా) in వెడల్పు కలిగినది. అంటే .94x24x2.59=5,843.04 చ.కి.మీ. అన్న మాట.(గూగుల్ సౌజన్యము). ఈ విస్తీర్ణము నేతిమన రాజధాని డిల్లీ నగరముకన్నా చాలా ఎక్కువ.

రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా .

ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశ: ৷৷1.5.8৷৷

(సువిభక్తేన) చక్కని ప్రణాళికా బద్ధమగు రేఖాచిత్రముతో (with well-laid out), (ముక్తపుష్పావకీర్ణేన) సంపూర్ణముగా వికసించి రాలిన వివిధ వర్ణ పుష్పచయముతో, , (నిత్యశ:)నిరతమూ, (జలసిక్తేన) నీటి జల్లులతో, తడుపబడుచున్న (మహతా) విశాలమైన, (రాజమార్గేణ) ప్రధాన రహదారులు , శోభితా శోభిల్లుచుండెను.

ప్రకాశ కరణార్థం చ నిశాగమనా శంకయాl

దీప వృక్షాం తథా చక్రుః అసురధ్యాసు సర్వశఃll

తాం నష్టతిమిరాం దీపైః భాస్వరైశ్చ మహాగృహైఃl

నగరీం రాక్షసేంద్రస్య సదదర్శ మహాకపిఃll

రాత్రులు ఏవిధమైన కష్టము లేకుండా ప్రజలు సంచరించుటకు వీధులలో దీప వృక్షములను ఏర్పాటు చేసేవారు. ఇక్కడ దీప వృక్షములు అన్న మాటను ఈ కాలము విభావరి కార్యక్రమాలలో చెట్ల కొమ్మల చుట్టూ చేసే వెలుతురు అధికముగారాని విద్యుత్ దీపాలంకరణ కాదు. ఇక్కడ వృక్షము అన్న మాటను ఎత్తయిన చెట్టువలె ఉన్న స్తంభమునకు శాఖలను అమర్చి వానిని దీపశోభితము చేసినారు. నేటివలె ఒక స్తంభమునకు ఒక దీపము కాకుండా వెలుతురు రహదారిపై అన్ని దిశలా వ్యాపించు ఏర్పాటు చేసినారు. ఇటువంటి సువిధ మనము నేడు రహదారి కూడళ్ళలో మాత్రమే చూస్తాము. ఆనాడు అసుర సంధ్యవేళ మొదలు రాత్రంతా, అంత వెలుతురు ఇచ్చేమాదిరి ఏవిధమైన దీపాలు వెలిగించేవారు అన్నది పరిశోధకులు నిగ్గుతెల్చవలసిన విషయము. ఇంతే కాకుడా వీదులలోనున్న అనేకానేక అతిపెద్ద భవంతుల నుండి కూడా వెలుగులు విరజిమ్మీ దీపకాంతి ఇటు ఇళ్ళలోనూ అటు వీధులలోనూ కూడా చీకటులను పారద్రోలేవి.

హనుమంతుడు అంత అర్ధ రాత్ర సమయములో లంకను ఎంత బాగా తిలకించినాడో గమనించండి.

శారదామ్బుధరప్రఖ్యైర్భవనైరుపశోభితామ్.

సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితామ్৷৷5.3.3৷৷

సుపుష్టబలసమ్పుష్టాం యథైవ విటపావతీమ్.

చారుతోరణనిర్యూహాం పాణ్డురద్వారతోరణామ్৷৷5.3.4৷৷

భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ.

తాం స విద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్మార్గనిషేవితామ్৷৷5.3.5৷৷

మన్దమారుతసఞ్చారాం యథేన్ద్రస్యామరావతీమ్.

శాతకుమ్భేన మహతా ప్రాకారేణాభిసంవృతామ్৷৷5.3.6৷৷

కిఙ్కిణీజాలఘోషాభిః పతాకాభిరలఙ్కృతామ్.

ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్৷৷5.3.7৷৷

 లంక చేరుకున్నందుకు సంతోషంగా ఉన్న హనుమంతుడు, దాని ప్రాకారంపై నిలబడి, శరన్సమానమగు ధవళ కాంతితో మెరుస్తూవున్న అందమైన భవనాలుచల్లగా వీచె పిల్లగాలులు, సాగర ఘోషా సంయుక్తమై, తారాతోరణాలతో అలంకరింపబడిన విల్వంపులతో (కమానులు, Arches)మరియుఅలకాదిపుడగు కుబెరుని సైన్యము బోలె సుశిక్షిత సైన్యమును కలిగిఏనుగులను కలిగి  పవిత్ర నగరం పాతాళ రాజధానియగు  భోగవతి   పాములచే రక్షించబడిన విధముగా ఇక్కడ కూడా రక్షణ కలిగి, . బంగారు ప్రాకారంతో చుట్టుముట్టబడిన ఈ నగరం ఇంద్రుని రాజధాని అమరావతిని పోలి ఉంది, జెండాలు ఎగిరిపోతూ అలంకరించబడి, చిన్న గంటలు వినిపించే శబ్దాలతో ప్రతిధ్వనించింది. ఇంత గొప్పగా ఉన్నాడని చెప్పినాడు చూచి అబ్బురమండిన ఆంజనేయుడు.

దీనిని బట్టి నాటి నగరములు ఎంత గొప్పగా అందముగా ఆకర్షణీయము గా ఉంటూ తగిన రక్షణ వలయమును కూడా కలిగియుండేవి అని  తెలియవస్తూ వున్నది. ఈ విధముగా చెప్పుకొనుటకు ససాక్ష్యముగా వాల్మీకి రామాయణము ఇంకా ఎన్నో విషయయములను మన ముందు ఉంచినా, ఇవి చాలు అన్న ఉద్దేశ్యముతో మీ ముందు ఉంచినాను. దిగువన నేటికీ కనిపించే, నాటి రామాయణ వాస్తవాలు మీ ముందుంచుచున్నాను.

లంకానగరము యొక్క వివరములు: ఇందు నాటి లంక యొక్క నేటికీ నిలచిన స్మృతులను చూడవచ్చు. అప్పుడు లంక అంతా ఒకే నగరముగా ఉండినదేమో! నేటికీ, నాటి లంకకు నిలువుటద్దమై నిలచిన, ఈ స్మృతి చిహ్నములను చూడండి ఆంధ్రజ్యోతి May 25 2016 సౌజన్యముతో:

రావణుడు సీతను ఎత్తుకెళ్లి దాచిన ప్రదేశము, హనుమంతుడు దహనం చేసిన నగరము, లక్ష్మణుని కోసం ఆంజనేయుడు తెచ్చిన సంజీవని పర్వతమును దించిఉంచిన ప్రదేశం. రాముడు రావణుణ్ణి సంహరించిన స్థలము. రామాయణానికి సంబంధించిన ఈవిధమయిన ఎన్నో ఆనవాళ్లను ఇప్పటికీ పదిలంగా దాచుకున్న శ్రీలంకను తప్పక సందర్శించాల్సిందే. అది ఎంతటి పెద్ద నగరమో తెలుస్తుంది. ఆ కాలములో లంకలోని ఎక్కువ భాగమును లంక యను పేరుతోనే వ్యవహరించినారేమో!

సీతమ్మను వెతుకుతూ లంకను చేరిన హనుమంతుడు ఆ నగర సౌందర్యాన్ని చూసి అబ్బురపడ్డాడట. ఇది లంకా పట్టణమా? లేక స్వర్గమా? అని అనుకున్నాడట. హనుమంతుని సైతం మైమరపింప చేసిన లంకానగర శోభ శ్రీలంకలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అంటే రామ్కాయన కాలమునకు లంక ఎంత పెద్ద నగరమో గమనించండి.

ఇప్పుడు రామాయణ కాలము నాటి ప్రదేశములను, ప్రత్యేకమగు పేర్లతో అక్కడి వారలు వారి భాషలో పిలుచుకొనే ప్రాంతములను చూస్తాము.

గుర్లపోత

రావణుడికి సంబంధించిన అయిదు విమానాశ్రయాలను లంకలో చూడొచ్చు. గుర్లపోతలో విమాన మరమ్మత్తు కర్మాగారం కూడా ఉంది. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదట. దీనిని సింహళ భాషలో గుర్లపోత అంటారు. అంటే పక్షివాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు. అంటే ఎగిరే నెమలి అని అర్థము.

సీతా కొటువ

సీతమ్మ కోట అని పిలుస్తారు. జానకీ దేవిని  ఇక్కడే ఉంచినట్లు చెబుతారు. అంటే ఆ తల్లిని ఆకోటలోని అశోకవనములో రావణాసురుడు ఉంచినాడన్న మాట.

అశోకవనము

అశోకవాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని రావణుడు బంధించి ఉంచినాడన్నది మనకు అందరికీ తెలిసిన విషయము. చెడుతలంపు కలిగిన వాడయినా తానెంతో మక్కువ కలిగిన సీతమ్మను ఆచట వుంచినాడు అంటే ఆ వనము ఆనంద నందనమై తప్పక ఉండియుంటుంది. అచటి ప్రకృతి శోభకు సీతమ్మ మురిసి, తనకు త్వరగా వశమవుతుందని ఆశించినాడు కానీ ఆతని ఆశ అడవి కాచిన వెన్నెలే అయినది. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించినారో కానీ వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. ఆశ్చర్యాలు అద్భుతాలకిది ఆలవాలము.

సీత ఎలియా

సీత ఎలియా అంటే రావణుడు సీతమ్మను ఇక్కడికి రథంలో తెచ్చేందుకు వాడిన దారి అని అర్థము. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటికుండము అని ఇక్కడి ప్రజల విశ్వాసము. పక్కనున్న వాగులో సీతమ్మ సాన్నం చేసేదని చెప్తారు. ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులను ఇక్కడ చూడొచ్చు. వీటిలో కొన్ని అడుగులు పెద్దవి, కొన్ని చిన్నవి ఉంటాయి. హనుమంతుడు తన ఆకారాన్ని మార్చుకోగలడు అన్నదానికి ఇవి సంకేతంగా కనిపిస్తాయి.

ఉస్సంగోడ

ఇది రావణుడి విమానాశ్రయము. ఇక్కడికి సమీపంలోని మొక్కల్లో నల్లమట్టి ఉంటుంది. ఇది మామూలు నల్లరేగడి మట్టి గానో లేక మరొకవిధమగు మట్టిగా భ్రమించితే అది మన పోరాబాతవుతుంది. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది. హనుమంతుని లంకాదహనము కారణంగా మట్టి ఈ విధంగా మారిందని తలచుట తప్ప, ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు.

ఇస్త్రిపుర

అంటే స్త్రీలు సంచరించే ప్రాంతం అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి బీభత్సం చేసిన తరువాత రావణుడు ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించినట్లు ఇచ్చటి వారల కథనము. ఇక్కడి నుంచి కూడా రావణగోడా అనే ప్రాంతమునకు సీతను మరొకమారు కూడా తరలించినట్లు ఇక్కడివారు తెలియజేస్తారు. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది.

గాయత్రి పీఠం (లంకాధీశ్వరర్‌ ఆలయం)

మేఘనాధుడు(ఇంద్రజిత్తు) తపస్సు చేసి శివుడిని మెప్పించిన స్థలం. ఇక్కడి శివలింగం నర్మదానది నుంచి వచ్చిందట. ఇది ఇక్కడి మొదటి గాయత్రి పీఠము.

 

పాతాళలోక

ఇది మైరావణుని రాజ్యము. రామలక్ష్మణులను అపహరించిన మైరావణుడు వారిని ఈ ప్రదేశంలోనే దాచినట్లు చెబుతారు. హనుమంతుడు మైరావణుని వధించి రామలక్ష్మణులను

తన భుజాలపై ఎక్కించుకుని తీసుకొనివెళ్ళినాడని చెబుతారు. ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా ఉంటుంది అని చూసినవారు చెబుతారు.

సంజీవని పర్వతం

ఇది రితిగలలో ఉంది. మేఘనాధుడి నాగాస్త్రానికి మూర్చపోయిన లక్ష్మణుడికి స్పృహ తెప్పించడానికి హనుమంతుడు సంజీవని మూలిక తెచ్చేందుకు హిమాలయమునకు వెళ్ళిన విషయము మనకు తెలిసినదే!  అయితే సంజీవని మూలికను గుర్తించలేని హనుమంతుడు కొండనే పెకిలించుకుని వస్తాడు. ఆయన అంత దూరము త్కన భుజముపైనుంచుకొని యుద్ధప్రదేశమునకు వచ్చి ఎంతవిసురుగా భూమిపై వేసియుంటాడో మనము కొంతలో కొంత ఊహించివచ్చు. ఆయన ఎంత విసురుగా వేసినాడంటే అది అయిదు ముక్కలై రుమసల, ఇంగాల్‌, రితిగల, తొలుకొండ, ఇంగిరిపితియ అనే ఐదు చోట్ల పడినదట. ఈ పర్వతాన్ని రాముసోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం. ఇది ఆంజనేయుడు తీసుకువచ్చిన సంజీవి పర్వతమే అనడానికి అనేక కారణాలున్నాయి. ఇలాంటి పర్వతభాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు. మనకు ఇది మామూలు కొండగా అనిపించినా, శ్రీలంక ప్రజలు దీనిని ఆయుర్వేద వైద్యశాలగా భావించుతారు. ఈ పర్వతములో దొరికే మొక్కలన్నీ ఔషధ గుణములు కలిగియుండుట అత్యంత ఆసక్తికరమగు విషయము.  ఈ ఔషధ వనస్పతి  పెరుగవలెనంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే సాధారణంగా కనిపిస్తుంది.  ఈ లంకను రామాయణ కాలమునాటి  లంకయే అను వాస్తవమునకు ఎంతయో పుష్టిని చేకూర్చుతూ వున్నది.

కెలీనియా

ఇది రావణుని తమ్ముడు విభీషణుని రాజభవనము ఉన్న ప్రాంతము. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్టు చరిత్ర చెబుతుంది. బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు. ప్రక్కనే  విభీషణుని భవనమును కూడా  సందర్శించుతారు. లంక చట్టసభలో(Parliament) నేటికీ విభీషణుని చిత్రపటము కనిపిస్తుంది.

దునువిల

ఇదొక సరోవరము. దునువిల అంటే బాణ ప్రయోగముచే ఏర్పడిన సరోవరము అని అర్థము. రాముడు రావణుడిపై ఇక్కడే బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడని చెబుతారు. దీనిపక్కనే ఒక ఎత్తైన కొండ ఉంటుంది. ఇక్కడి నుండి రామసైన్యమును మొదటిసారి రావణాదులు చూసినట్లు చెబుతారు.

కటరగమ

యుద్ధము చివరి రోజున ఇంద్రుడి కోరికపై రామునికొరకు యుద్ధము చేయుటకు కార్తికేయుడు యుద్ధరంగానికి వచ్చినట్లు చెబుతారు. అందుకు గుర్తుగా ఇక్కడ కార్తికేయుని ఆలయము కనిపిస్తుంది.

ఎహంగల

అంటే విశ్రాంతిశిల(Bedrock) అని అర్థం. ఇక్కడే రావణుడి దేహాన్ని ప్రజలు చివరిసారి నివాళి అర్పించేందుకు ఉంచినారట. ఈ కొండపైనుంచిన రావణ దేహమును, ఆయన దీర్ఘకాయుడు, 3 మైళ్ల దూరం నుండి, మూడు పక్కల నుండి కూడా స్పష్టంగా కనిపించినాడని ప్రజలు చెప్పుకొంటారు.

దివురుంపోల

ఈ మాటకు అర్థము  ఒట్టు వేసిన ప్రదేశము అని. ఇక్కడే సీతమ్మ అగ్నిపరీక్షకు గురియై నిలిచినదట. శ్రీలంక న్యాయవ్యవస్థ కూడా ఇక్కడి ఆలయాన్ని గౌరవించి ఇక్కడ వివాదాలకు తీర్పు చెప్పటాన్ని సమ్మతిస్తుందట.

మునీశ్వరం

రాముడు పుష్పకవిమానంలో తిరిగి వెళ్తుండగా రావణుని చంపిన బ్రహ్మహత్యాపాతకం వెంట పడసాగింది. అయితే ఈ మునీశ్వరం అనే ప్రాంతానికి రాగానే ఆ దోషం రాముడికి కనిపించలేదట. వెంటనే శివుణ్ణి ప్రార్థించి దోష నివృత్తికి ఉపాయం కోరగా శివుడు, మానవారి, తిరుక్కోణేశ్వరం, తిరుకేదేశ్వరం, రామేశ్వరములలో శివలింగములను ప్రతిష్ఠించమని ఆదేశించినాడట.

తిరుక్కోణేశ్వరం

ఇక్కడ అగస్త్య మహాముని శివుడి ఆజ్ఞతో ఆలయం నిర్మించినాడట. రాముడు ఇక్కడి లింగాన్ని ఆరాధించినట్లు చెబుతారు. ఈ ఆలయాన్ని దర్శించవలసినదే!

కన్నియ

తన తల్లి అంత్యక్రియల తరువాత స్నానాదులకు మంచినీరు కరువైనదట. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టినాడట. దీంతో ఏడు చోట్ల నీటి ధార ఉబికి వచ్చినదట. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉంటాయి. ప్రత్యక్షముగా వానిని చూడవచ్చు.  

స్వరంగ మార్గములు

రావణుని నిర్మాణ నైపుణ్యాన్ని చాటి చెప్తూ ఇక్కడ అనేక భూగృహాలు ఒకదానితో ఒకటి అనుసంధించబడి ఉన్నవి. ఇవి మానవ నిర్మితములని చూసిన వారికి తెలుస్తుంది. ఆనాటి నైపుణ్యమును  తెలుసుకొనవలెనంటే ఈ సొరంగములను తప్పక చూడవలసినదే!

నేను ఈ వివరములను తెలియజేయుతలోని ముఖ్య ఉద్దేశ్యమేమన రామాయణ కాలమునకే

నగరనిర్మాణ కళాకౌశలము ఎంతగొప్పగా ఉండినదో అని చెప్పుటయే కాక తత్సంబంధ అవశేషములు నేటికి కూడా వుండుటతో నేటి ప్రపంచము నమ్మితీరవలసిన పరిస్థితి ఏర్పడుచున్నది.

ఇంతటి విభవమును నాటి శ్రీరామ చంద్రుడు, ఆయన అయోధ్యానగరము ఆయన వైరియగు రావణబ్రహ్మయొక్క నగరము ఉండినవి. తగిన పరిశోధనలు జరిగితే మనము రామాయణము నుండి తెలుసుకొన వలసిన విషయములు లెక్కకు మిక్కుటములు.

రామేతి రామభద్రేతి రామ చంద్రేతి వా స్మరన్

నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి.

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్.

భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్

తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్

స్వస్తి

శ్రీరామ సార్వభౌమ-12

రామాయణము ‘ఆర్య’ అన్నది జాతివాచకమా!

  మొదట ‘ఆర్య’ శబ్దము రామాయణములో ఏ అర్థముతో ఉపయోగింపబడినదో చూద్దాము.

మొట్టమొదట మనము తెలుసుకోనవలసినది 'ఆర్య' అన్న పదము ఒక జాతి వాక్యము కాదు. రాముల వారిని సీతమ్మ 'ఆర్య' ‘ ఆర్య పుత్రా’అనియే సంబోదించుట మనము వాల్మీకి రామాయణములో చూడగలము. అక్యర్య అన్నపదమును పూజ్యుడు, పండితుడు, జ్ఞాని, సంస్కారవంతుడు మొదలుగాగల విశేష గుణకలితులకు ఉపయోగించేవారు. మద్రాసులో బ్రహ్మశ్రీ బాలకృష్ణ శాస్త్రిగళ్ అన్న గొప్ప పండితుడుండేవాడు. ఆకాలములో ప్రతిదినమూ Hindu డిన పత్రిక వెనుక వైపు ఆయన వేదాంత ఉపన్యాసమును క్రమము తప్పక ప్రచురించేవారు. ఆయన నాపై ఎంతో వాత్సల్యము కలిగియుండేవారు. ఆయన Imperial Bank ఉద్యోగి. అది SBI అయిన తరువాత కూడా కొంతకాలము ఉన్నతాధికారిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసినారు. వారి తమ్ముడు వారిని ఎప్పుడూ ‘ఆర్య’ అనే సంబోధించేవారు. దీనిని బట్టియే ఇది ఆంగ్లేయుల కుట్ర అని మనకు తెలియవస్తూవున్నది. అసలు మనవారు "కృణ్‌వం తో విశ్వమార్యం " అన్నారు. అంటే ఈ విశ్వములోని ప్రతి మనిషినీ, నీతి నియమ నిష్ఠలు కలిగిన మహానుభావునిగా తీర్చి దిద్దవలెనని చెప్పినారు. అంతేగానీ ఈ జగత్తును Aryan Race గా చేయుట కాదుకదా! వారిద్రుష్టిలో ఆఫ్రికావాసులు ఆర్యులయ్యే అవకాశమే లేదుకదా!

అసలు ఆర్య శబ్దమునకు వ్యుత్పత్తి ఏమిటంటే ‘ఆరాతి యాన్తి ఇతి ఆర్యః’. ఈ మాటకు ఈ దిగువన ఇచ్చిన విశ్లేషణ చదవండి.

పూర్వము మహర్షులు పర్ణశాలలు నిర్మించుకొని అడవులలోనున్నా దేశపాలకులకు గురుఉలుగా వ్యవహరించేవారు అంటే రాకపోకలు ఉండేవి. జ్ఞానమును పంచుకోనిత జరిగేది. అంతేకాక నావికా వ్యాపారముచేత భారతీయులేందరో విదేశములకు పోయి జ్ఞానదానము చేసేవారు. విదేశీయులు కూదా ఓడలలో వచ్చి ఇక్కడ జ్ఞాన సముపార్జన చేసేవారు. ఆవిధముగా "కృణ్‌వం తో విశ్వమార్యం " అన్న మాటకు కట్టుబడి యుండినట్లు తెలియవస్తూ ఉన్నది.

బాలకాండ ప్రథమ సర్గ 16వ శ్లోకము ఈ విధముగా చెబుతూ వున్నది.

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిఃl

ఆర్యః సర్వ సమశ్చైవ సదైవ ప్రియదర్శనఃll

నదులు సముద్రనును కలిసినట్లు సత్పురుషులు నిరంతరము రాముని చేరుచుందురు. అతను అందరికినీ పూజ్యుడు. ఇక్కడ ‘ఆర్య’ అన్న శబ్దమునకు’పూజ్యుడు’ అన్న పదము అన్వయమైనది.ఎవ్వరి ఎడలనూ వైషమ్యములుగానీ తారతమ్యములుగానీ లేకుండా మెలగువాడు. దీనిని బట్టి ‘ఆర్య’ శబ్దము ఎంత ఉత్క్రుష్ఠమైనదో తెలియవచ్చుచున్నదికదా! ఇది జాతి వాచకము కాదని స్పష్టమగుచున్నది కదా!

ఈ శ్లోకమును చూడండి

గత్వాతు సుమహాత్మానం రామం సత్యపరాక్రమమ్l

.ఆయాచద్భ్రాతరం రామమ్ ఆర్యభావపురస్కృతః.ll

త్వమేవ రాజా ధర్మజ్ఞ, ఇతి రామం వచో2 బ్రవీత్.ll

ప్రసన్న హృదయుడు, సత్యసంధుడు, పరాక్రమవంతుడు, అయిన శ్రీరాముని జేరి, భరతుడు మిక్కిలి పూజ్య భావముతో ‘ ఓ ధర్మజ్ఞా! జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు.అని పలుకుచూ శ్రీరాముని వేడుకొనెను. ఇక్కడ ‘ఆర్యభావ పురస్కృతః’ అన్న మాటకు ‘శ్రేష్ఠత్వము’ ఆపాదించ బడినది. ఎక్కడనూ ఆమాట జాతి వాచకముగా చెప్పబడలేదు. ఈ విషయమును గమనించండి:

'అహకుల కులీనార్యా సభ్యసజ్జన సాధవః' అని అమరములో 'ఆర్య' అన్న శబ్దమునకు అనేక పర్యాయ పదములనిచ్చినది. అమరసింహుడు ప్రమర వంశజుడైన విక్రమార్కుని కాలము వాడు. ఆయన సభా నవరత్నములావు ఒకడు.. విక్రమార్కుడు క్రీ.పూ1-క్రీశ1 మధ్యకాలమున భారత దేశమును పాలించినవాడు. మరి ఆకాలములోనే ఆర్య శబ్దము నిర్వచింపబడియుంటే మాక్సుముల్లరెవరు దానిని త్రోసిరాజని తన నూతన సిద్ధాంతమును ప్రతిపాదించుటకు?కుట్ర పూరితమైన తెలివితేటలుగా మెకాలే గారు తన తండ్రికి వ్రాసిన లేఖలోని సారాంశమును ఆయన వ్రాసిన భాషలోనే యథాతథముగా చదవండి.

Lord Macaulay had written to his father, a Protestant minister in 1836: “Our English schools are flourishing wonderfully.

The effect of this education on the Hindus is prodigious. It is my belief that if our plans of education are followed up, there will not be a single idolater among the respectable classes in Bengal 30 years hence.

And this will be effected without any efforts to proselytise, without the smallest interference with religious liberty, by the natural operation of knowledge and reflection. I heartily rejoice in the project.”

ఆయన భారతీయుల మేధస్సులో అప్పుడు చొప్పిమ్పదలచిన్క, ఇప్పుడు చొప్పించిన మోసపూరితమగు భావన ఏమిటంటే భారత దేశములో మొదటినుండి ఉన్నవారు ద్రావిడులు. పశ్చిమ ఏషియా నుండి వచ్చిన ‘ఆర్య’జాతివారు ద్రావిడులపై మొహెంజొదారో హరప్పాలవడ్డ యుద్దముచేసి అనేక మందిని చంపి దక్షిణ భారతమునకు తరిమివేసి ఉత్తరాభారతమును ఆక్రమించుకొన్నారు. వారివలెనే ఐరోపాలోని ఆర్యజాతి ఇప్పుడు భారత దేశమును ఆక్రమించుకొన్నది. కావున మనమూ మనమూ ఒకటే ఎవరు పాలించితే ఏమున్నది అన్న కొత్తనినాదముతో ఔత్తరాహికులపై వలవిసిరినారు. ఇంచుమించు ఒక శతాబ్దము కాలము మనము కూడా అదేభ్రమలో ఉండుట జరిగినది. ఇది ఇట్లుండగా కాల్డ్వెల్ వంటి పాస్టర్లు దక్షిణదేశము చేరి ఆర్యులు మిమ్ము మోసగించినారు వారిపై ఉద్యమించండి అని పురికొలిపి ముఖ్యముగా తమిళులను తమ భావానుసారులుగా చేసుకొన్నారు. ద్రావిడ ఉద్యమమునకు మూలకర్తలు వారే! ఈ విధముగా అటు ఇటు కూడా చిచ్చు రగిల్చి వేడుక చూస్తూ ఉండిపొయినారు. +ఇప్పుడు కనులు తెరిచినాము కానీ జరుగవలసినది జరిగి పోయినది. అయినా ఫరవాలేదు ఆలస్యమయినా అసలు విషయము అర్థమైనది కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడగలము.

ఈవిధముగా భారదేశ చరిత్ర వక్రీకరణ ఆరంభమైనది.

రామాయణము నిజమునకు ఒక కల్పవృక్షము. అధ్యయనము చేసే ఆసక్తి ఉండవలెనేగానీ అందు లేని విషయమే లేదు.ఇహము పరము రెండూ చూపే శ్రీరామ చరితమది.

స్వస్తి.

శ్రీరామ సార్వభౌమ-1౩

రామాయణము నాటి కార్మిక వ్యవస్థ

నాటి కార్మిక వ్యవస్థ ఏవిధముగా ఉండినది అన్న విషయమును చూద్దాము.

ఈ వెట్టి చాకిరీ చేయలేక ప్రాణం పోతూవుంది అన్న మాట ముఖ్యముగా శ్రీమతి రుసరుసలాడే సమయములో ఆమె నోటినుండి వినేమాట. అదే విధముగా ఒక అధికారి వద్ద పనిచేసే బంట్రోతు, ఆయన స్వంత పనులు చసె సమయములో అనుకొనే మాట ‘ఈ వెట్టి చాకిరీ ఇంకా ఎంత కాలము చేయవాలేనో’ అని పదేపదే మనసులో అనుకొంటూ వుంటాడు. ఈ ‘వీట్టి’ అనే మాట ఎక్కడ నుండి వచ్చినది, అసలు దీని అర్థమేమి అన్నది ఈ క్రింద తెలుపబోయే రామాయణములోని శ్లోకము చెబుతుంది.బాధాకరమైన విషయము ఏమితంటే నేటి ప్రవచనకారులలో కొందరు ఈ విధమగు శ్లోకముల విశ్లేషణ జోలికి పోరు. వారికి కథ యొక్క నడక రాముని గుణసంపద పైనే ధ్యాస. రాముని గుణములను ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్న ఒక్క మాటతో అనల్పార్థమును తెలిపిన, రాముడు చంపదగిన శత్రువు మారీచుడు రావణునితో చెప్పిన, మాటకన్నా గొప్పమాట చెప్పలేరు. అప్పుడు 11వేళా సంవత్సరములు పాలించిన రాముడు ప్రవేశపెట్టిన, లేక కాపాడుకొంటూ వచ్చిన అనేక సంస్కరణలను గూర్చి జిజ్ఞాసువులకు తెలియజేస్తూ వస్తే ప్రామాణికతను కోరే ఈ కాలము  వారికి అనేక దృష్టాంతరముల చూపి రామాయణము అన్నది చరిత్ర అని నిరూపించనగును. అప్పుడు శ్రీరామచంద్రుని చరిత్ర పురుషునిగా నిరూపించి సాంఘీక శాస్త్రములో ప్రతి విద్యార్థికీ చదివే అవకాశము కల్పించి రాముని ఉయోక్క, భారత దేశము యొక్క బావుతానుయ్ హిమాలయాలపై ఎగురవేయవచ్చును. అసలు విషయమునకు వస్తే,

నేను చెప్పదలచిన శ్లోకము ఇది:

విష్టికర్మాన్తికాః సర్వే మార్గ శోధక రక్షకాఃl

ప్రస్థాపితా మయా పూర్వం యాత్రాపి మమ రోచతేll

(అయోధ్యా కాండ -82వ సర్గ-20వ శ్లోకము)

స్థూలముగా పై శ్లోకమునకు అర్థము ఏమి చేబుతారంటే, భరతుడు రాముని చూడ బలమైన  ఇచ్చ కలిగినవాడై చిత్రకూతమున ఉన్న శ్రీరాముని చూచుటకు పరివారముతో బయలుదేరుటకు గానూ ముందు కూలీలను పంపి రాముని చేరుటకు తమ యాత్రను సుగమాము చేయబూనినాడు అని.

కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి రెండు పదములను వాడినాడు. మన ముఖ్య ఉద్దేశ్యము ఆ రెండు పదములను విశ్లేషించడము.

మొదటిది ‘విష్టి’. ఈ మాటను వివరణాత్మకముగా విశ్లేషించుటకు ఒక పల్లెటూరిని తీసుకొందాము. దానికి ఒక మంచినీటి బావి అవసరము ప్రక్కన పారే ఒక ఏటినుండి కాలువ తెయ్యుట అవసరము, ఒక బండి బాటను సంస్కరించుట లేక ఉద్ధరించుట

(To Repair) మొదలగు పనులకు ఆయా పనులకు తగిన కూలీలను పిలిచి వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చి వారి తిండీతీర్థములకు వసతి కల్పించి పనులు చేయించుకో వలసి వస్తుంది. కానీ రాయన కాలములో ఆయా గ్రామములలోనే ఆయాపనులు చేసే వ్యక్తుల వర్గములుండేవి. ఒకర్ రెండు పనులు అంతకు మించి తెలిసిన వార్కూడా ఉండేవారు. ‘వారు నిజానికి విష్టి కార్మికులు’ . నేడు ఆ మాట అపభ్రంశమయి ‘వెట్టి చాకిరి’ అయ్యింది.

మరి ఆ కాలములో ‘విష్టి’ యొక్క ప్రాధాన్యత ఏమిటి. వారికి తగిన ధనమునోసగాక ఎందుకు పనిచేయిన్చుకోనేవారు అన్నది మన సందేహము. ఈ విష్టి జనములకు సంతోషముగా తమ సంసారము గడుపుకోనుటకు తగిన ధాన్యము, బట్టలు మొదలుకొని ఆయా వ్యక్తులకు, వారి సంసారములకు తగినన్ని నిత్యావసర వస్తువులు, బట్టలతో సహా రాజు యొక్క గ్రామ పాలక వర్గము సమకూర్చేది. ఆ వెట్టి వారినుండి ఎటువంటే అసంతృప్తి లేక ప్రతిఘటన ఉండేదికాదు. వారికి పని ఉన్నపుడు చేసేవారు. లేకుంటే హాయిగా తిని విశ్రమించేవారు. అంటే ప్రతి గ్రామము కూడా స్వయంసిద్ధమై  పురోగమనము సాగించేది. మరి అంతబాగా ఉన్న వ్యవస్థను ఇపుడు ఎందుకు రూపుమాపవలసి వచ్చినది అంటే ఏకైక కారణము పరాయి పాలనే!

హింస, వెలది, పానము కపటము దుష్ప్రవర్తన అన్నవి పంచ ప్రాణములుగా కలిగి ఇంచుమించు, 600 సంవత్సరములు పాలించిన తురుష్కులు, 200 సంవత్సరములు పాలించిన పాశ్చాత్యులు ముఖ్యముగా ఆంగ్లేయులు మన సంస్కృతి సంస్కృతమును సవ్యమగు రీతిలో అర్థము చేసుకొనక పోవుటయే గాక, పాలకులు కావున,  తమకనుకూలముగా సాంప్రదాయములను నిర్వచించి మన సంస్కృతిని చిన్నాభిన్నము చేసినారు. వారి సమ్మెట పోట్లతో ‘విష్టి’ లేక ‘వెట్టి’ అన్న సాంప్రదాయమునకు క్రూరత్వమును ఆపాదించి మన నాగరికతకే మచ్చ తెచ్చినారు. వారు మన ‘విష్టి’ కర్మచారులకు అసలు ఎటువంటి ఆదాయము కలిగించకుండానే పనులు చేయించుకొన్న క్రూరులు.

ఈ సందర్భములో google wikipedia ఈ ‘వెట్టి చాకిరీ’ ని గూర్చి ఏమంటున్నాడో చూడండి:

వెట్టి లేదా వెట్టి చాకిరి అన్నది  ఒక సాంఘిక దురాచారము.

వెట్టి చాకిరి అనగా అప్పు తీసుకొన్న వ్యక్తి, ఆ అప్పు తీర్చలేక పోయినపుడు ఆ దళారి వద్ద చాకిరి చేసి అప్పు తీర్చాలి. అప్పు చేసిన వ్యక్తి నిరక్ష్యరాశుడైన కారణముచే  లెక్కించుట తెలియక జీవితాంతం చాకిరి చేయవలసి వచ్చేది. కొన్ని సందర్భాలలో అప్పు తీసుకొన్న వ్యక్తి చనిపోయినపుడు తన తరువాత తరం వెట్టి చాకిరి చేయవలసి వచ్చేది.

అంటే వాస్తవాలకు ఎంతటి వక్రీకరణ జరిగిపోయిందో చూడండి. ఈదేశము రాజులు ఈ దేశమును యుగాల తరబడి పరిపాలించినంత కాలము ఎటుంటి విప్లవములూ, పాశ్చాత్యదేశాములలో వలె రాలేదు. అదే ఇక్కడి రాజుల మరియు ప్రజల ధర్మ నిబద్ధతకు తార్కాణము.ఈపాలకుల పాలనకు పూర్వము ప్రజలలో మరియు పాలకులలో నియమము, నిబద్ధత, నీతి, నిష్ఠ, నిర్మలత అన్నవి తమ పంచ ప్రాణములుగా కలిగియుండినారు. అందువల్ల ‘వెట్టి’ అన్నది సత్పాలనకు ఉపకరణముగా ఉండేది.

ఇక ‘కార్మాంతిక’ అన్న పదమును గూర్చి తెలుసుకొందాము. నేడు మనము ఉపయోగించే ‘కార్మిక’ అన్న శబ్దమునకు ‘కర్మచేయువాడు’ అనియే అర్థము. కర్మ అన్నది ఒక నిర్దేశించబడిన పని. తనకు తానే గానీ, తన కన్నా పెద్దలో, పై అధికారులో లేక ప్రభుత్వ నిర్దేశము చేతనో లేక పూర్వజన్మ పాపపుణ్య కర్మల ఫలితము వలననో  మనకు ప్రాప్తింపబడిన బాధ్యత. దానిని ఆచరణలో ఉంచినపుడు అది క్రియగా మారుతుంది. ఆవిధముగా ప్రాణమున్న ప్రతివ్యక్తి ‘కార్మికుడే’! అందుచేతనే ఈ శబ్దము నాడు వాడుకలో లేదు. బదులుగా ‘కార్మాంతిక’ అన్న పదము ఉండేది. ‘కార్మాంతిక’ అంటే ఒప్పగించిన పనిని పూర్తి చేసిన పిమ్మట తగు ఫలితమును పొందేవాడు. అది దినసరి అయితే ‘భత్యము’ అవుతుంది. నెలసరి అయితే జీతము అవుతుంది. ఆ కాలములో జీతమునకు బదులుగా ఒక గ్రామమునే ఒక పెద్దను ఏర్పరచి ‘అగ్రహారము’ అన్న పేరుతో ఇచ్చేవారు. ఇక్కడ ‘హారము’ అన్న మాటను తీసుకొండి. హారము అంటే ‘మాల’. మాల అన్నది ఒక వృత్తాకారము. వృత్తము అన్నది ఒకబిందువు నుండి మరొక్క బిందువు అపైనికొకటి ఈ విధముగా కొనసాగుతూ వలయము పూర్తి అవుతుంది. దీనికి ఆది అంతము లేదు. ఇది ‘అక్షయము’. ‘అగ్ర’ అన్న మాటకు ‘బ్రాహ్మణ’ అన్న అర్థము తీసుకొనవలసి ఉంటుంది. అంటే ఆ గ్రామముయొక్కఇంత చక్కటి వ్యవస్థ కలిగియుండినది మన భారతదేశము.  సుఖశాంతులు వారి మీద ఆధారపడియుండుటయే గాక ఆగ్రామమునకు సంబంధించిన ఆదాయము అందరూ పంచుకొనేవారు వారిలో కష్టమునకోర్చి ఫలితము సాధించిన వారికి ప్రతిఫలము ఎక్కువగా ఉండేది. కానీ అది అందరికీ ఆమోదయోగ్యముగా ఉండేది. ఆ గ్రామములో ఒక్కొక్క వృత్తి వారికి ఒక్కొక్క వీధియుండేది. నా బాల్యములో నేను పెరిగిన కడప జిల్లాలోని జమ్మలమడుగులో వీధుల పేర్లే ‘చాకలి వీధి, మంగలి వీధి, కుమ్మరి వీధి’ అని ఈ మాదిరిగా ఉండేవి. ఇందులో ఎవరికీ ఆత్మన్యూనతాభావము ఉండేదికాదు. పైపెచ్చు తమ వర్గము పేరు తాము చెప్పుకోనుటకు ఎవరూ ఏనాడూ తటపటాయించేవారు కాదు. ఒక వర్గమునకు మరియొక వర్గమునకు మధ్యన సుహృద్భావము ఇతోధికముగా ఉండేది. ఇంత చక్కటి వ్యవస్థ కలిగియుండినది మన భారతదేశము.

మళ్ళీ రామాయణము లోనికి వస్తే భరతుడు శ్రీరామ చంద్రుని సపరివారముగా చూడబోవుటకు మునుపే ఈ ‘విష్టి’ ‘కార్మాంతికు’లను పంపి ‘రథ్యలను’ అంటే రహదారులను  మరమ్మత్తులను చేయ పంపి కష్టములేని ప్రయాణమునకు ఏర్పాటుచేసినాడు. చిత్రకూటము చేరుటకు ఎన్నోకొన్ని పల్లెల గుండా వారు పోవలసివస్తుంది. కావున ఆయా పల్లెలలోని ‘విష్టి’ ‘కార్మాంతికులు’ తమ గ్రామ పోలిమేరలవరకు ప్రభువు ఆదేశము ప్రకారము మరమ్మత్తులు చేస్తే రహదారుల మరమ్మత్తులు మహారాజు పనిచిన ‘విష్టి’ ‘కార్మాంతికులు’చేసేవారు. ఈ విధముగా నాటి, నేటి మన పరిభాషలో చెప్పవలెనంటే, కార్మిక వ్యవస్థ ఊహించుటకు వీలుకానంత పటిష్టముగా ఉండేది. ముస్లిం మరియు ఆంగ్లేయ పాలకులవలె వారు నిర్వచించిన వెట్టిచాకిరీని, వారు చేయించుకొన్నట్లు  చేయించుకోలేదు.

 స్వస్తి.

     శ్రీరామ సార్వభౌమ-14-రామాయణము ఇండొనేషియా

శీర్షికను చదువుతూనే నా వంటి సామాన్య పాఠకునికి  ఏమనిపిస్తుందంటే, రామాయణము నకు ఇండోనేషియాకు 'అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు' ఉన్న సంబంధమనిపిస్తుంది. నిజమే! కానీ అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు సంబంధము ఉన్నది అని చెప్పుటకు ఈ శీర్షికను ఈ వ్యాసమునకు ఎన్నుకొన్నాను. భారత దేశానికి ఆగ్నేయ దిశలో (South East) ఇండోనేషియా ఉన్నది. ఇక్కడి జనాభాలో ఇంచుమించు 85% ప్రజలు లో ముస్లిములు. మిగిలిన వారిలో 7% హిందువులు. 9% క్రైస్తవులు. 2% బౌద్ధులు.

నిజానికి ఈ దేశము వైశాల్యములో అతి పెద్దది. ప్రపంచ జనాభాలో కూడా నాలుగవ స్థానాన్ని ఆక్రమించుతుంది. ఇది 18110 చిన్న, పెద్ద ద్వీపముల సమూహము ఇది. ఇందులో జనావాసము కలిగిన ద్వీపములు సుమారుగా 6000. ఇంచుమించు 24,00,00,000 జనాభా కలిగిన పెద్ద దేశమిది. ఇది Greater Sunda Islands, Lesser Sunda Islands గా విభజింపబడి వున్నది.

జవ అన్న గంధర్వరాజు  పరిపాలించిన కారణముగా ఆ దేశమునకు జావా అన్నది పూర్వ నామము. శతహ్లద  ఆయన భార్య. తుంబురుడు వారి కుమారుడు. ఈ మాటలు రాములవారితో స్వయముగా, శపింపబడి రాక్షస రూపములో ఉన్న విరాధుడు చెబుతాడు. తత్సంబంధ శ్లోకమును మీకు దిగువన తెలియజేసినాను.

ఈతడు శాపమునకు పూర్వము యక్ష రాజగు కుబేరుని ఆస్థానమున సంగీత విద్వాంసునిగా కొలువున్నవాడు. ఆయన అత్యంత ప్రతిభాశాలి యగు వైణికుడు. ఆయన వీణ పేరు ‘కళావతి’. ఆతను రంభయందు  మరులుగొని, తన రాజగు కుబేరునే కొలువ మరిచినాడు. అది తెలిసిన కుబేరుడు ఆతనిని ‘రాక్షసునిగా పుట్ట’ మని శపించినాడు. ఆవిధముగా అతడు విరాధుడను రాక్షసునిగా జిన్మించి, రామునిచే నిర్జించబడి శాపవిముక్తుడయినట్లు మనకు వాల్మీకి రామాయణము తెలుపుచున్నది.

మనము రామాయణములో సుంద ఉపసుందులను గూర్చి వింటాము. ఇండోనేషియా లోని మొత్తము ద్వీపములను జయించి రాజ్యమును ఇద్దరు అన్నదమ్ములు పంచుకొని, సుంద ద్వీపము ఉపసుంద ద్వీపమను పేర్లతో పరిపాలించుతారు ఈ ప్రాంతాన్ని. నోరుతిరుగని పాశాత్యులు వీనిని Greater Sunda (అన్న) Islands, Lesser Sunda (ఉపసుందుడు అనగా తమ్ముడగు సుందుడు) Islands అని అన్నారు. భారతములో హిరణ్యకశిపుని వంశజుడైన నికుంభుని పుత్రులుగా ఒక సుందోపసుందులను చూస్తాము. రామాయణములో వచ్చే సుందోపసుందులు వేరు అని తెలియ వస్తూవుంది. వీరు జంభుని పుత్రులు. రామాయణమునందు సుందుడు అగస్త్యుని శాపముచే మరణించినట్లు తెలియవస్తూ వున్నది.

ఈ గ్రేటర్ sunda లో జావా, బోర్నియో, సుమత్రా, సులావేశి అన్నవి అతి ముఖ్య ద్వీపములు. హిందూ సభ్యతా సంస్కృతులకు ఆలవాలమైన బాలీ ద్వీపము Lesser Sunda Islands లో వస్తుంది. ఇంకా ఇందులో లోంబాక్, సున్బావా, టిమోర్, బారత్ దయా ద్వీపములు కాక ఇంకా ఎన్నో ద్వీపములు వస్తాయి. ‘ఈ ‘బారత్ దయ’ అన్న పేరు వెనుక గల చరిత్ర ను గూర్చి తెలుసుకొనుటకు ఎవరయినా ప్రయత్నము చేసి వుంటే బాగుండేదేమో!

 

రామాయణ కాలముననే ఈ దేశము ప్రముఖమైన చరిత్ర కలిగి ఉన్నది. ఇందులో మూడు ముఖ్యమైన రాజ కుటుంబాలు మనకు కనిపిస్తాయి. మొదటి కుటుంబము ‘జవ’ చక్రవర్తిది. ఆయన పేరుతోనే జావా ఏర్పడినది. ఈ జవుని భార్య పేరు శతహ్లద. జవ అన్న సంస్కృత పదమునకు వాడి వేగము అన్న అర్థము కనిపించుతుంది నిఘంటువులో!. శత అన్న పదమునకు నూరు అన్న అర్థమే కాకుండా అనేకము అన్న అర్థము కూడా కలదు. శతహ్లద అంటే అందరినీ తన ప్రియవచనములతో గానీ తగురీతి సత్కరించుతలోగానీ ఎలోటూ లేకుండా   ఆనంద పరచేది అని అనుకొన వచ్చును. వీరి కుమారుడు విరాధుడు. నిజానికి యీతడు గంధర్వుడగు తుంబురుడు. గంధర్వరాజగు కుబేరుని శాపముచే/ నారదుని శాపమనికూడా అంటారు, ఈయన పై దంపతులకు పుత్రునిగా జన్మించినాడు. ఎవరివలననూ సంతృప్తిని పొందనివాడు కావున విరాధుడని పిలువబడినాడు.

ఇండోనేషియాకు చెందినదై ఆస్ట్రేలియా కు దగ్గరగా Timor అన్న ద్వీపము ఉన్నది. ఇది రామాయణ కాలములో తుంబుర ద్వీపముగా పిలువ బడేది.ఈయన యక్షుడు. ఇండోనేషియాను పాశ్చాత్యులు కబళించినతరువాత ఈ ప్రాంతమును, తుంబుర ద్వీపమని పలుకలేక తుమ్బోరు, తిమ్బోరు చివరకు Timor గా మార్చినారు.  తుంబురుడు నారదునికి సమానమగు సంగీత విద్వాంసుడు. శాప వశాత్తు జవ, శతహ్లద పుత్రునిగా జన్మించుతాడు. ఈతడు రాక్షస ప్రవృత్తి అధికముగా కలుగుటచే తనకు తగినదియైన రాక్షసనిలయమగు దండకారణ్యమని తలచి అచటికి వెళ్ళిపోతాడు.

వాల్మీకి రామాయణములోని 3వదగు అరణ్య కాండలోని 3వ సర్గలోని 5\6 శ్లోకములో తన తల్లిదండ్రులను గూర్చి విరాధుడే రామలక్ష్మణులకు ఈ క్రింది శ్లోకము ద్వారా తెలియజేస్తాడు.

పుత్రః కిల జవస్వాహం మరుమాతా శతహ్లదాl

విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వ రాక్షసాం ll

బాల కాండ లోని 25వ సర్గలో

5, 6, 7, 8, 9 శ్లోకాలను ఒకసారి పరికించుదాము.ఈ శ్లోకముల సారాంశమును మాత్రము ఇక్కడ తెలియజేసుకొంటాను.ఇక్కడ తాటక వృత్తాంతము మనకు తెలియవస్తుంది. పూర్వము పరాక్రమ వంతుడు, సద్వర్తనుడు అగు సుకేతువు అన్న ఒక యక్షుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సుచేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకొమ్మంటే, అపుత్రుడగు అతడు, పుత్ర భిక్షను కోరినాడు. బ్రహ్మ ఆతనికి పుత్రికనొసగి ఆమెకు రూప లావణ్యములతో కూడా 1000 ఏనుగుల బలము ఉంటుంది అని చెప్పినాడు. కాలాంతరములో ఆమె అసురుడగు జంభ పుత్రుడగు సుందుని భార్య అయినది. వారికి శాపగ్రస్తుడగు రాక్షస ప్రవృత్తిగల మారీచుడు జన్మించినాడు. దీనివల్ల సుకేతువు రాజ్యము కూడా జంభుని రాజ్యములో కలియుటతో మొత్తము ఇండోనేషియాను సుంద ఉపసుందులు పాలించుట జరిగినది. అట్లే ఉపసుందునికీ సుబాహు జన్మించినాడు. సుందోపసుందులవలె వీరిరువురు గూడా అన్యోన్యముగా ఉండేవారు. వీరు సుశిక్షితులు మరియు రావణ సేనాధిపతులు. రావణుడు అసురేంద్రుడు కాబట్టి వీరు రావణ సామ్రాజ్యమునకు బహుశ సామంతులుగా ఉంటూ సైన్యాధిపతి సేవలను అందించేవారేమో! దీనిని బట్టి ఇండోనేషియాను యక్షులు, అసురులు, శాపవశాత్తు రాక్షసులైనవారు పరిపాలించినారని తెలియవస్తూవున్నది.

అసలు బాల కాండ 25వ సర్గలో  శ్రీరాముడు విశ్వామిత్రుని మన మనసులో రేకెత్తే ప్రశ్న అడుగుతాడు.

అల్పవీరా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |

కథం నాగసహస్రస్య ధారయత్యబలాబలమ్ ||

అంటే 'ఓ మునిపుంగవా ! యక్షులు అల్పవీరులు అని వినబడడమైనది. అందువలన అబల అయిన ఆమె ఎట్లు వేయిఏనుగుల బలము కలిగియున్నది?' అని . దీనినిబట్టి యక్షులు అల్పవీరులు అందుచేతనే మహావీరులైన అసురులకు తమ కన్యలను ఇచ్చేవారని తెలియవస్తూ వుంది. ఇక తాటకిని గూర్చి పైన ముందుగానే చెప్పుకొన్నాము. వీరంతా రాక్షసాకృతి దాల్చినంతనే దండకారణ్యము తమకు బలమగు నెలవని తలచినట్లు తెలియవచ్చుచున్నది. అందుకే అంతా అక్కడకు చేరినారు.

ఈ విధముగా రామాయణ కాలమునకు ఇండోనేషియాకు అతుకు పడని సంబంధముంది. నేటికి కూడా అనేకములగు రామ విగ్రహములో రహదారి కూడళ్ళలో మనకు దర్శనమిస్తాయి. 251 అడుగుల విగ్రహము అచట కలదని విన్నాను. అంతేకాక రామాయణ పాత్రల యొక్క అనేక విగ్రహములను మనము ఆ దేశములో చూడవచ్చు. వారి నాణెములపై గణేశుని విగ్రహ ముంటుంది. వారి వైమానిక సంస్థ పేరు గరుడ. ఆ దేశాధ్యక్షుడు అమెరికాకు ఇచ్చిన బహుమతి సరస్వతీదేవి విగ్రహము. ఇక్కడి పరంబనన్ దేవాలయము ఎంతో సుప్రసిద్ధిచెందినది. ఈ దేశములో సుప్రసిద్ధి చెందినా దేవాలయములు పది ఉన్నాయని విన్నాను. ఇంతటి అనుబంధము ఉంది మనకు ఇండోనేషియాకు. వారి దేశీయ కావ్య గ్రంధము రామాయణము. వాళ్ళు ముస్లిములైనా ప్రతి తల్లీ తన తనయుడికి రామాయణము ఉగ్గుపలతోపోసి వారికి రుజువర్తన నేర్పుతుంది. ఒకనాటి ఆదేశపు అధ్యక్షులపేర్లు సుకర్నో, సుకర్నో పుత్రి, సుహార్తో. సుకర్నోగారి పుత్రి సుక్మావతి 2021 అక్టోబరు లో హిందూ మంతములోనికి మారదముతో వేలాసి ఇండోనేశియనులు హిందూమతమునకు తిరిగీ వచ్చి చేరినారు.  వారి స్వాతంత్ర్య దినమగు డిసెంబర్ 27న మహా వైభవముగా రామాయణ నృత్యనాటికను ప్రదర్శించుటయేగాక యువకులంతా ఆంజనేయ వేషధారులై మనకు కనిపిస్తారు.  అందుకే మనదేశమునకు గౌరవమిస్తూ Indo అన్న మాటను తమ దేశము పేరునకు ముందు తగిలించుకోన్నారేమో!

రాముని భగవత్స్వరూపునిగా ఎంచి మనము ఆయన విగ్రహములను గుళ్ళలోనే ఉంచుతారనుకోవచ్చు. మరి చిన్న చిన్న సందేశములతో పాండవుల శిల్పములను ప్రముఖ వీధుల కూడళ్ళలో ఉంచితే యువతలో తమ పూర్వులు ఘనులు అన్న విశ్వాసముతో ఉత్తేజితులుకారా!

యువకులారా ప్రపంచమునకు జ్ఞానము పంచిన ఈ దేశములో పుట్టినందుకు గర్వించుదాం. వందేమాతరం అని మనసారా తలుద్దాం. రామాయణము మనకు శిరౌదార్యమను వాస్తవమును గుర్తించుదాం.

స్వస్తి.

                                 శ్రీరామ సార్వభౌమ-15  

రామాయణ కాలమున సంఖ్యామానము

గణితమునకు మూలము సంఖ్యామానము. సంఖ్యామానమునకు ఆది గురువు భారత దేశము.

‘0’ ను భారతీయులు కనిపెట్టినారు అని ప్రపంచము ఒప్పుకొనింది. కానీ దానిని ఆర్యభటుడు కనుగొన్నటుల చరిత్ర కారులు తెలిపినారు, నిజానికి భారత గణితంలో సంఖ్యాస్థాన విలువలు వ్రాయడానికి శూన్యాన్ని ‘0’ (సున్న) అనే ఆకారాన్ని ఎప్పటి నుండి వ్రాయ మొదలిడినారు అన్నది ఏ చరిత్రకారుడూ ఇదామిద్ధముగా చెప్పలేదు. క్రీ.శ. 500వ సంవత్సరంలో ఆర్యభట్ట వ్రాసిన సంఖ్యాశాస్త్రంలో సున్న లేదు కానీ శూన్యానికి ఖాళీస్థలాన్నిసూచించినారు. కొంత కాలం శూన్యాన్ని సూచించడానికి చుక్క (.) Dot ను వ్రాసేవారు. క్రీ.శ. 628 లో బ్రహ్మగుప్తుడు తన గ్రంథం ‘బ్రహ్మస్ఫుట సిద్ధాంతం’ (The opening of the Universe) ల సంఖ్యాగణితంలో అంకెల విలువలు వ్రాయడాన్ని సూత్రీకరణ చేసినాడు. అందులో సున్న, ఋణాత్మక (negative) అంకెల గురించి వ్రాసినాడు.  ఇతిహాసముగా నిరూపింపబడిన రామాయణములో వాల్మీకి సంఖ్యామానమును గూర్చి విపులముగా విశదముగా యుద్ధకాండలో తెలిపియున్నాడు. ఒకసారి యుద్ధకాండ పరిశీలించుదాము.

వాల్మీకి రామాయణములోని యుద్ధ కాండ లోని 28వ సర్గలో మనము గణితమును గూర్చి తెలుసుకొంటాము, ముఖ్యముగా సంఖ్యామానమునుగూర్చి. .

 

శతం శత సహస్రాణాం కోటిమాహుర్ మనీషిణః l

శతం కోటి సహస్రాణాం శంఖ ఇత్యభిదీయతే ll

 

శతం శంఖు సహస్రాణాం మహాశంఖు ఇతిస్మృతమ్ l

మహాశంఖ సహస్రాణాం శతం బృందమితిస్మృతమ్ ll

 

శతం బృంద సహస్రాణాం మహాబృంద మితిస్మృతమ్ l

మహాబృంద సహస్రాణాం  శతం పద్మమితిస్మృతమ్ ll

 

శతం పద్మసహస్రాణాం మహాపద్మ మితిస్మృతమ్ l

మహాపద్మ సహస్రాణాం  శతం ఖర్వమిహోచ్యతే  ll

 

శతం ఖర్వసహస్రాణాం మహాఖర్వ మితిస్మృతమ్ l

మహాఖర్వ సహస్రాణాం సముద్రమభిదీయతే ll

 

శతసముద్ర సాహస్రం ఓఘ ఇత్యభిదీయతే l

శతమోఘ సహస్రాణాం మహౌఘ ఇతి విశ్రుతః ll

ఒకటి =1

పది =10 =101

వంద =100=102  

వెయ్యి =1000=103

పదివేలు =10000=104

లక్ష =100000=105

పదిలక్షలు =1000000=106

కోటి =10000000=107

పది కోట్లు= 100000000=108

శంఖము =1000000000=109

సహస్త్ర కోటి =10000000000=1010

మహాశంఖము =100000000000=1011

న్యర్భుద్ధం =1000000000000=1012

బృందం(ఖర్వం) =10000000000000=1013

మహాఖర్వం =100000000000000=1014

పద్మం =1000000000000000=1015

మహాపద్మం =10000000000000000=1016

(వాల్మీకి మహాపద్మముగా తెలిపినారు) (క్షోణి) =100000000000000000=1017

మహాక్షోణి =1000000000000000000=1018

ఖర్వం(శంఖం) =10000000000000000000=1019

మహాశంఖం =100000000000000000000=1020

మహాఖర్వం(క్షితి) =1000000000000000000000=1021

మహాక్షితి =10000000000000000000000=1022

సముద్రం(క్షోబం) =100000000000000000000000=1023

మహా క్షోబం =1000000000000000000000000=1024

ఓఘం(నిధి) =10000000000000000000000000=1025

మహానిధి =100000000000000000000000000=1026

మహౌఘం(పరాటం) =1000000000000000000000000000=1027

పరార్థం =10000000000000000000000000000=1028

అనంతం =100000000000000000000000000000=1029

సాగరం =1000000000000000000000000000000=1030

అవ్యయం =10000000000000000000000000000000=1031

అమృతం =100000000000000000000000000000000=1032

అచింత్యం =1000000000000000000000000000000000=1033

అమేయం =10000000000000000000000000000000000=1034

భూరి =100000000000000000000000000000000000=1035

మహాభూరి =1000000000000000000000000000000000000=1036

 

అంటే రాములవారి కపిసైన్యము మహౌఘం(పరాటం) ఉండినది=1000000000000000000000000000=1027 అంత ఉన్నది అని వాల్మీకి రామాయణము తెలియజేస్తూ ఉన్నది. ఇంకా ఈ సంఖ్యకు పైన ఇంకా సంఖ్యామానము ఉన్నది అంటే మన పూర్వులు ఎంతటి మేధావంతులో అర్థము చేసుకోండి. ఇంత సంఖ్యను 1,2,3, అంటూ ఎంచుట సాధ్యము కాదు కాబట్టి ఏ ఏ కపినాయకుడు తన ప్రాంతము నుండి ఎంత బలగాముతో వచ్చినదీ తెలుసుకొని ఆ మొత్తములను కూడి(సంకలనము) పై సంఖ్యగా నిర్ధారించి యుండవలె. మరి యుద్ధము మొదలయిన పిమ్మట ఏరోజుకారోజు వీరులు మరణించినవారు పోగా ఇక మిగిలినది ఎందరు అన్నది తెలుసుకొనుటకు వారు తప్పక తీసివేత (వ్యవకలనము) తెలుసుకొని యుండి తీరవలసినదే కదా!

మరి పైన శ్లోకరూపములో తెలిపిన సంఖ్యామానము రామాయణములో ఎవరు ఎవరితో చెప్పినట్లు?

యుద్ధము నిశ్చయమైన పిమ్మట సువేలాద్రిపై విడిది చేసిన రామదండు బలగము ఎంత ఉన్నది తెలుసుకొని రమ్మని గూఢ చర్యమున అత్యంత ప్రతిభావంతులైన శుక, సారణులను పంపుతాడు రావణాసురుడు. వారు చద్మవేశామున సువేలాద్రి చేరి తచ్చాడుచున్నది చూసి వారు తమ బలగాములోని వారు కాదని పసికట్టి వారిని విభీషణ సుగ్రీవ, ఆజనేయాదులు ఉన్న చోటికి తీసుకొని పోతారు, అచ్చట ఉన్న కపిమూక. వారుఫలానా అని రామునితో  తెలుపుతాడు విభీషణుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వారి బంధమును విడిపించి వారికి వలసిన సమాచారమునంతా సేకరించుకొని పొమ్మని, కపి మూకతో వారిరువురికి అన్నివిధములా సహకరించమని చెబుతాడు.

ఆవిధముగా రామదండును గూర్చి తెలుసుకొని పోయి, రావణునితో రామడను ఎంత ఉన్నది తెలుసుకోవలెనంటే మొదట వారి సంఖ్యామానము తెలుసుకొనవలెనని చెబుతూ విలేవారీగా సంఖ్యామానమును తెలియజేస్తారు.

మరి రావణునికి తెలియని సంఖ్యాశాస్త్రమా! అని పాఠకులు తలువవచ్చు. ఇది ‘దశమూల సంఖ్యా విధానము’.  అసలు ఈ ‘దశమూల’మునుండియే పాశ్చాత్యుల Decimal పుట్టినది. తాము పలుకుటకు సులభముగా ఉండుటకు ‘దశమూల’ ను  Decimal చేసుకొన్నారు. రావణ రాజ్యములో ఈ సంఖ్యామానము వాడుకలో లేదు. వారిది రెండు అంకెల కొలమానము. ఆ రెండు . మరియు –’ అంటే నేడు మనము వాడే 0 1 Binary numbers అన్నమాట. Binary numbers లో విలువలు ఈ క్రింది విధముగా ఉంటాయన్నమాట.

0 0 0 1   numerical value 20

0 0 1 0   numerical value 21

0 1 0 0   numerical value 22

1 0 0 0   numerical value 23

ఇది ఉదాహరణ మాత్రమే!

మనది దశాంశ మూలమయితే రావణుని పాలనలో వింశతి అనగా 20 మూలము. అంటే

202=400; 4002=16000 ........ఆ ప్రకారముగా ఉండేది. అంటే రామయణ కాలములోనే  ఈ Binary System ఉండినదనేకదా అర్థము. మరి Leibniz గారికి ఈ గౌరవము దక్కినది. అసలు ఈ Binary System ను పింగళుని ఛందశ్శాస్త్రానికి ఆలంబన. కానీ పింగళుడు క్రీస్తుపూర్వము 2వ శతాబ్దము వాడని నేటి చరిత్రకారులు నిర్ధారించినారు. మరి వారు చెప్పిన ప్రకారము అయితే క్రీస్తుపూర్వము 2వ శతాబ్దము తరువాత ఛందోబద్ధ కావ్యములగు రామాయణ, భారత, పురాణాదులు రచింపబడినట్లు తాలువ వలెనా! లేక వాల్మీకి కాలము నుండి వస్తూ వున్న ఛందశ్శాస్త్రానికి పింగళుడు పరిపూర్ణత చేకూర్చినాడనుకోవచ్చునా! అసలు నిర్దుష్ఠముగా పింగలుడు 2వ శతాబ్దము వాడని ఈ నవతరము పండితులు నిర్ధారించినారా! అన్నది ఇంకా తేలవలసిన విషయమే!

అసలు ఖగోళము జ్యోతిషము రామాయణ కాలము నాటికే ఎంతో పరిణతి చెందిన శాస్త్రములు. వానిని గూర్చి మరొక పర్యాయము ముచ్చటించుకొందాము. నాకు తెలిసినది అణువంత. నేను తెలిపినది అందులో అణువంత. అద్భుత ప్రజ్ఞావంతులగు నేటి యువత, అందులో అణువంత తెలుసుకోగలిగినా, అల్లుకుపోగలిగిన దీశాలురు. వారు మనదేశమునకు పూర్వ వైభవమును సంతరించుదురుగాక.

స్వస్తి.