Monday, 24 February 2020

మాంగళ్య బలం


మాంగళ్య బలము
ఏ పాత చలన చిత్రానికో ఇప్పుడు సమీక్ష రాస్తూవున్నానని అనుకోవద్దు. పెళ్ళయిన స్త్రీకి మాంగళ్యము యొక్క ఆవశ్యకత ఏమిటి అన్నది తెలుపుట నా ఉద్దేశ్యము.
ఈ వ్యాసములో వివాహ విధివిధానాలను గూర్చి మాట్లాడబోవుట లేదు. మాంగళ్య గరిమను గూర్చి మాత్రమే నాకు తెలిసిన మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. అందుకు సంబంధిన కొన్ని విషయములను మాత్రము ప్రస్తావించుతాను. అసలు విషయము తెలియజేయుటకు ముందు, మారిపోతున్న లేక మాశిపోతున్న సామాజిక సాంప్రదాయాన్ని గూర్చి నాలుగు మాటలు తెలియజేస్తాను.
మేము యౌవ్వన దశలో ఉన్న కాలములో వివాహిత  తాళిబొట్టు, స్త్రీ యొక్క  భర్త జీవితమో లేక ఆమె జీవితమో ముగిసేవరకు, స్త్రీ గళము నుండి విడివడేది కాదు. ఆతరువాత రాత్రి సమయములో పడుకొనే సమయములో తీసి పక్కన ఉంచేవారు.
ఏనాటి అగ్రహారమొ
మానాటికి మాన్యమాయె మాపని దీరన్
మీనాటి కండ్రిగాయెను
నానాటికి తీసి కట్టు నాగంభోట్టూ !
తాళిబొట్టు మొదట తల్లడిల్లెను రాత్రి
దిండు క్రింద జేరి దిగులు పడుచు
తుదకు లాకరెక్కి దూరమై పోయెరా
రామ మొహనుక్తి రమ్య సూక్తి !

అన్నట్టు ఏకంగా Locker లోకి చేర్చివేసినారు ఆధునిక నారీమణులు, నవసమాజ శిరోమణులు. ఒకవేళ అర్దాంతరంగా భర్త పోవుట తటస్థిస్తే ఒక కొత్తవాదన తెరమీదికి తెచ్చి
మంగళ సూత్రమొకటే కదా భర్తతో బాటూ వచ్చింది మిగతవి ముందునుండినే ఉన్నాయి కాబట్టి అవి అట్లే ఉంచుకోనుటలో తప్పేముంది అని అన్నారు, అన్నది ఆచరించుతూ వున్నారు. వారి అభిమతము వారిది. కాదని, వారిని ఎవరూ తప్పు పట్టలేరు. ఇక్కడ ఒక్క మాట తప్పక చెప్పుకోవలసి వస్తుంది. నాడు భార్య భర్త అన్నది ఒక అనిర్వచనీయ సంబంధం, Switch Light చందం, ఆత్మీయతా బంధం, ఇగిరిపోని చందన గంధము. నిజమయిన మమతానురాగాలతో వర్ధిల్లిన జంటలో భర్త పోతే ఆ స్మృతులు ఆ ఇల్లాలిని వీడ తరమా! అది నిజమైతే ఈ ఆడంబరము అవసరమా! నీతి నియమాలు విలసిల్లె సభ్య సమాజములో తాళి ఉన్నా, వైధవ్యము వచ్చినా ఆ స్త్రీని అసహ్య దృష్టితో పూర్వాతి పూర్వము చూచేవారు కాకపోగా, వారి యెడల ఎంతో గౌరవముగా మెలిగేవారు. నేడు అటువంటి వాతావరణము సమాజములో, ఎక్కడో తప్ప, ఇంకా నెలకొని వుందని చెప్పగలమా!
నేటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే వైదిక ధర్మానుచరులగు సోదరీమణుల నవీనత నడినెత్తికెక్కి నాట్యము చేస్తుండగా,  మంగళసూత్రాన్ని మరచిపోయినారు. అంతేకాక నేటి సినిమాలు టీవీలు తాళి గౌరవమును దిగజార్చిదానిని ఒక ఆట వస్తువుగా చేసివేసినారు.
పతికన్న అతివకు పైపూత మెరుగాయె
పనికిమాలిన డాబు బహుళమాయె
ఇంటిలోపల వంట వంటికి బరువాయె
స్విగ్గి భోజనములు చేరువాయె
అమ్మగారింటితో అధిక బంధమ్మాయె
అత్త మామల పొత్తు అణగి పోయె
తలువ సిజేరియన్ తలమానికమ్మాయె
సహజమౌ కానుపు సమసిపోయె
మట్టియలు గాజులొక్కటై మట్టి కరచె
బట్టబయలాయె బాడీకి బట్టలేక
బొట్టు కట్టుయు మరి తాళిబొట్టు చూడ
మాడిపోయిన అట్టయ్యె మగువకిలను



ఈరోజులలో భర్తకంటే దేహ సౌందర్యానికి ప్రాధాన్యమిచ్చే, ఆచారాలకన్నా పాశ్చాత్య నాగరికతకు ప్రాధాన్యమిచ్చే, భర్త అభిష్టానికన్నా పరుల పొగడ్తలకొరకు ఎదురుచూసే మహా సాధ్విమణులు చాలామంది మనకు దర్శనమిస్తారు ముఖ్యముగా విద్యాధికులలో ఇలాంటి అనాగరికత చాల ఎక్కువగా కనబడుచున్నది. కొంతమంది భర్తలుకూడా తమకు ఇష్టములేకపోయిన గొడవలెందుకులే అని సర్దుకుని బ్రతుకుతున్నారు మగడు కట్టిన తాళి ఎగతాళిగా మారినా ఇంకా నల్లపూసలుమాత్రం ధరిస్తున్నారు ఫేషనుకోసం!

మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ ఫేస్బుక్ ఫోటోలు కూడా, ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది సక్రమమైన విధానమే అయితే మనపూర్వీకులు దీనినే అమలు పరచియుండేవారు. వారు చేసే ప్రతి పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సే తమ లక్ష్యముగా ఉంచుకొంటారు.
మాంగళ్య గరిమను గూర్చి క్షీరసాగరమధన సందర్భంలో పార్వతీ దేవి తన మాగళ్యము పై ఎంత నమ్మకను ఉంచుకొంటుందో చూడండి.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగటమన్నది  మాత పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగళ్య గరిమయట.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాl
కంఠే బాధ్నాని సుభగే త్వం జీవ శరదాంశతంll
ఇక్కడ సుభగ అన్న మాటకు ఒక పెద్ద వేదపండితుని నుండి తెలుసుకొన్న అర్థమును మీ ముందుంచుతాను.
ఆయన ‘భ’ అన్న మాటకు అభివృద్ధి అన్న అర్థమును చెప్పి దానిని సమర్థించినాడు. నభము అంటే ఆకాశము. దానికి అభివ్ర్ద్ది లేదు కదా! శుభము అంటే సు+భ ము అని. మరి శుభకార్యము ఎదయినాకూడా అభివృద్ధికే కదా దోహదము చేస్తుంది. భాగము అనగా స్త్రీ యొక్క ఉత్పత్తి స్థానము. ‘భ’ అంటే అభివృద్ధి ‘గ’ అంటే గామించుట అనగా ముందునకు సాగుట. మరి సంతానము అభివృద్ధిని తెస్తుంది మరియు వశమును పురోగామిమ్పజేస్తుంది.
సు+భగా శుభకరమైన శ్రేయస్కరమైన పురోభివృద్ధి కలిగించుదానా! అని అక్కడ సంబోధింపబడింది. మూడక్షరాల ఆ పదములో ఎంత అర్థము దాగియున్నదో చూడండి. ఇప్పుడు శ్లోకార్థము చూద్దాము.
ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.


భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాతకులు మనదేశాముపై దండయాత్రలు చేసినా  మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అంటే కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించినారో చూడండి. అందుకే ఆడపిల్ల పుడితే బాల్యంలోనే మాంగల్య తంతు జరిపించేవారు అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కానీ నా ఆలోచన వేరొక విధముగా ఉన్నది.
'అష్టవర్షాత్‌ భవేత్‌ కన్యాపుత్రవత్‌ పాలితామయా
ఇదానీం తవ దాస్యామ దత్తాం స్నేహేనపాలయం'
పూర్వము అమ్మాయికి 8 ఏళ్ల వయసులో,  రజస్వల కాకమునుపే వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయికి 4 సంవత్సరముల మొదలు 8 తేడా ఉండేది. అప్పటికి అమ్మాయి రజస్వల అయివుండేది కాదు. అందుచేత ఇరువురు ఆటపాటలలో కాలము గడిపేవారు. అందుచే ఇరువురినడుమ అనురాగము పెరిగేది. అమ్మాయి రజస్వల అయినవెంటనే అమ్మగారింట్లో ఉండిపోయేది. అటుపిమ్మట పునః సంధానము చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపేవారు. ఇరువురి నడుమ ముందే అనుబంధము ఏర్పడుతచే ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి ముదిరిన తరువాత పెళ్ళిళ్ళు చేస్తూ వున్నారు.లోతుగా ఆలోచించే అమ్మాయి తల్లిదండ్రులకు ఇందులోని అనర్థము అర్థము కాగలదు. 
మిగతది రేపు.....
మాంగళ్య బలం(చివరి భాగము)
భారతావనిలో పిండారీలుథగ్గులు వంటి కిరాతకులు మనదేశముపై దండయాత్రలు చేసినా  మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అంటే కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించినారో చూడండి. రత్నగర్భ యగు ఈదేశమును కొల్లగొట్ట తలువని విదేశస్థులు లేరు. తరువాతి కాలములో వచ్చిన మ్లేచ్ఛులు. తురుష్కులు, యూరోపియనులు స్త్రీలను ఆటవస్తువుగా చూసినారు. అందుకే ఆడపిల్ల పుడితే బాల్యంలోనే మాంగల్య తంతు జరిపించేవారు అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కానీ నా ఆలోచన వేరొక విధముగా ఉన్నది.
పూర్వము అమ్మాయికి 8 ఏళ్ల వయసులో,  రజస్వల కాకమునుపే వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయికి సంవత్సరముల మొదలు 8 తేడా ఉండేది. అప్పటికి అమ్మాయి రజస్వల అయివుండేది కాదు. అందుచేత ఇరువురు ఆటపాటలలో కాలము గడిపేవారు. అందుచే ఇరువురినడుమ అనురాగము పెరిగేది. అమ్మాయి రజస్వల అయినవెంటనే అమ్మగారింట్లో ఉండిపోయేది. అటుపిమ్మట పునః సంధానము చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపేవారు. ఇరువురి నడుమ ముందే అనుబంధము ఏర్పడుతచే ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి ముదిరిన తరువాత పెళ్ళిళ్ళు చేస్తూ వున్నారు.లోతుగా ఆలోచించే అమ్మాయి తల్లిదండ్రులకు ఇందులోని అనర్థము అర్థము కాగలదు.


మంగళసూత్రంలో ముత్యంపగడం ధరింపజేసే సాంప్రదాయం మనదిఎందుకంటేముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యంసౌందర్యంమనస్సుశాంతిఆనందములకుఅన్యోన్యదాంపత్యములకు కారకుడుశారీరకంగా నేత్రములుక్రొవ్వుగ్రంథులుసిరలుధమనులుస్తనములుస్త్రీల గుహ్యావయములునరములుఇంద్రియములుగర్భధారణప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపంకలహాలుమూర్ఖత్వంసామర్ధ్యమురోగముఋణపీడలుఅగ్నివిద్యుత్భయములుపరదూషణకామవాంఛలుదీర్ఘసౌమాంగల్యముదృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరమురక్తస్రావముగర్భస్రావముఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజగ్రహ కక్ష్య లోనికి వస్తుంది. స్త్రీకి ఆ రోజు రుతుసమయము ఆసంనమౌతుంది. ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనము కావాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదుదానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.
అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

ముత్యంపగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీరములోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగాభౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలనుదోషాలను తొలగిస్తాయని
అనుభవజ్ఞులయిన పెద్దలు చెప్పిన మాట.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యంపగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.
తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని, బాల్యము నుండియే తమ బాలికలకు మన సంస్కృతి కి తగిన కట్టుబట్టలు, వేష భూషలు సిగ్గు బిడియము నేర్పించి సంస్కారవంతులగు ఉపాధ్యాయులు గల పాఠశాలలకు పంపితే విద్యతో బాటుగా వినయము, సమయానుకూలమగు బిడియము, ధైర్యము, చతుర సంభాషణము, ఆట, పాట అన్నీ నేర్చుకొంటారు. ‘స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం, సాహసం షడ్గుణం’ అన్నారు పెద్దలు. పాశ్చాత్య అనుకరణలకు ఇకనైనా తలయొగ్గకుండా మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. ఈ రోజు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించకపోతే, వారు, వారి పిల్లలకు నేర్పించుటకు ఏమీ వుండదు.అందుకే  మన ధర్మము యొక్క విశిష్ఠతను పిల్లలకు, అర్ధమయ్యే వరకు తెలియపరుద్దాం. ప్రతిఒక్కరూ మీ మీ కుటుంబముల నుండియే నాంది పలకండి. 
చినుకు చినుకు చేరి చిన్న కాలువయౌను
కాల్వలెల్ల కలియ కలుగు నదులు
కలసియట్టి నదులు కడలియౌ గమనించు
రామమోహనుక్తి రమ్య సూక్తి
ప్రేమవివావాహాల కన్ననుతల్లిదండ్రులుఅనురూపుడైన వరుని నిర్ణయించి ధారాదత్తముగ వివాహమొనర్చు విథియే "ఏకక్రియాద్వ్యర్థకరీబభూవ" యను విధి ప్రకారము ఈ లోకమున కీర్తికరము పరలోకమున ముక్తి ప్రదమని పెద్దలవలన శాస్త్రధర్మముల ననుసరించియు గుర్తించిన వారు గనుక భారతీయులైన సనాతన ధర్మ పరాయణులెల్లరు సత్సాంప్రదాయముగ భావించిన వారై తమ పుత్రులకు పుత్రికలకుకులానుక్రమముగ నీ ధర్మమును విధిగ ననుసరించుచున్నారు.
కన్యాదానంతు సర్వేషాందానానాముత్తమం స్మృతం" అను రీతిని తమకులమునకు సాంప్రదాయమునకు జెందిన వరునకు యథాశక్తిని అలంకరించిన కన్యను దానము అనగా బ్రాహ్మవివాహ రూపమైనధారాదత్తముగ యధా శాస్త్రానుసారము వివాహము చేసినచో సమస్త దానములకన్నా నీ కన్యాదానముత్తమోత్తమమైనదిగా రాణించగలదు.
ధర్మార్థ కామ మోక్షదాం దారాః సంప్రాప్తి హేతః
పరీక్ష్యన్తే ప్రయత్నేన పూర్వమేవ కరగ్రహాత్‌"
అను ధర్మాన్ని పురష్కరించుకొని ధర్మము అర్థము కామము మోక్షణము అను నాల్గు పురుషార్థములకు కారణభూతురాలుగ నేర్పడి వంశమునకు కీర్తిప్రతష్ఠతీను వంశాభివృద్థిని చేకూర్చదగు సమర్థురాలుగ మున్ముందు కాదగియున్నదిగాన కన్యను సర్వవిథములా పరిశీలించివివాహమునకు తగిన కన్యకయని నిర్ణయించుకొనిన యనంతరమే వివాహము నిశ్చయించుకోవలయును.
వివాహములలో ఆలస్యము జరుగుకొద్దీ మామిడి పళ్ళకొరకు మామిడి తోటకు కాపు బండ్లలో బజారుకు వెళ్ళినతరువాత పోవడము వంటిది. అప్పుడు ఆ తోటలో పనికి వచ్చే పళ్ళను, పట్టుమని, పది కూడా చూడలేము.

స్వస్తి.


Saturday, 22 February 2020

విదర్భ దేశము - రుక్మిణి కళ్యాణము


విదర్భ దేశము-రుక్మిణీ కళ్యాణము
నేను రుక్మిణీ కల్యాణమును గూర్చి తెలుపబోవుట లేదు. అందు నాకు తోచిన కొన్ని ముఖ్య విషయముల గూర్చి తెలియజేయుట నా ఈ వ్యాసము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
విదర్భ దేశము విదర్భ రాజ్యమునకు రాజధాని. ఈ దేశమునకు పేరెన్నికగన్న రాజు భీష్మకుడు. ఆయన కుమార్తె రుక్మిణి అని, ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు విదర్భ వచ్చి ఆమె అన్న రుక్మి ని శృంగభంగము చేసి, అతనిని ఆశ్రయించిన బంధు మిత్రులను ఓడించి, రుక్మిణిని ద్వారకకు కొనితెచ్చి వివాహము చేసుకొన్నది భాగవతులందరికీ తెలిసిన విషయమే! ఈ సందర్భములో ఎక్కువ మందికి తెలియని ఒకటి రెండు విషయములు తెలుపుతాను.
1.   కర్మ యోగమును ఆశ్రయించినవారు  దర్భ లేకుండా క్రతువులను చేయలేరు. అదే జ్ఞానయోగమును ఆశ్రయించిన వారికి దర్భ అవసరము లేదు. విదర్భ జ్ఞాన మార్గీయులచే పాలింప బడినది కాబట్టి ఆ దేశము\ప్రాంతము విదర్భ అంటే దర్భ అవసరములేని ప్రాంతమైనది.
2.   రుక్మి భీష్మకుని పెద్ద కుమారుడు. ఇతనికి నలుగురు అనుజులు ఉన్నారు.
జ్ఞాన\అజ్ఞానమునకు 5 గణుపులు ఉంటాయి అని పెద్దలు చెబుతారు. ఈ ఐదు గణుపులలో  మొదటి గణుపు రుక్మి. ఐదు మందిలో ఇద్దరు పెద్దవాడయిన రుక్మి అనుచరులు. మిగత ఇర్వురు ఉదాసీనులు. అంటే వాళ్ళు దేనినీ తవ్వరు పూడ్చరు. ఈ 5గణుపులకు సమన్వయార్థమును ఒకసారి పరిశీలించుదాము. నిజానికి ఇవి  త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణశ్రోత్రములు అన్న  జ్ఞానేంద్రియ పంచకములు. వ్యాస భాగవతములో ఈ 5గురి పేర్లు  ఈ విధముగా ఇవ్వబడినాయి. రుక్మము  అంటే బంగారము. అది జ్ఞానమునకు ప్రతీక. విదర్భను గూర్చి  మొదలే జ్ఞానాపేక్ష కల్గిన దేశముగా చెప్పుకొన్నాము కదా! అందుకే ఆ దేశ ప్రభువగు  భీష్మకుడు తన 5 మంది  కుమారులకు మరియు 6వ సంతానమైన కుమార్తెకు జ్ఞానాన్వయమైన రుక్మము అనగా బంగారము అన్న పేరు వచ్చేలాగున ఈ  విధముగా పేర్లు పెట్టినాడు. ఆ పేర్లు వరుసగా 1. రుక్మి 2. రుక్మకేశుడు 3. రుక్మబాహు 4. రుక్మరతుడు  5. రుక్మమాలిని చివరిగా కుమార్తె పేరు రుక్మిణి. ఈ పేర్లు చెప్పకనే ఒక వాస్తవాన్ని చెబుతూ ఉన్నాయి. భీష్మకుని మొదటి కుమారుడు రుక్మి. అంటే  సువర్ణము . దాని ఆ రుక్మికి శోభను కూర్చేవాడు రుక్మ కేశుడు. మనిషికి జుట్టు అందము. ఇక బలము కూర్చేవాడు రుక్మ బాహు. అంటే రుక్మికి ఆకర్షణ బలము ఈ ఇరువురు తమ్ములు. మిగిలిన ఇరువురిలో ఒకరు రుక్మ రతుడు. అంటే  ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వేద వాక్యమును నమ్మి ఆరాధించేవాడు. కావున ఐహికము, దైహికము అయిన ప్రలోభమయమగు కర్మలకు యీతడు అతీతుడు. బ్రహ్మజ్ఞాన రతుడు కాబట్టి ఆయన ఏదీ పట్టించుకోడు.ఇక మిగిలిపోయిన చివరి తమ్ముడు రుక్మ మాలిని. ఏ జ్ఞానమయితే రుక్మమో దానికి కాపుదారుడు ఈయన. తోటకు మాలి ఉన్నట్లు ఈయన తత్వమసి అన్న వేదవాక్కును(ఛాందోగ్యోపనిషత్తు) నమ్మి ఆ రుక్మమే తానై కాపాడేవాడు. కావున ఈ ఇరువురు రాగ ద్వేషాలకు అతీతులు.
  జ్ఞానేంద్రియ పంచకములయిన త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణశ్రోత్రము లను గూర్చి ఒకమాట చెప్పుకొందాము. చర్మము కన్నులు నాలుక ముక్కు చెవులు బాహ్యానుభవమును గూర్చు ఇంద్రియములు. ఇవి ఇటు మంచిని అటు చెడును కూడా తమ అనుభవములోనికి తీసుకోగలుగుతాయి. కానీ ఇవి ఏ మనసుకైతే చేర్చుతున్నాయో ఆమనసు సత్కర్మ పక్షపాతియైతే సత్వము సత్కర్మలను ఆశ్రయించుతుంది. దుష్కర్మ పక్షపాతియైతే ఆదారి లోనే పోతుంది. ఈ ద్వంద్వముల వాళ్ళ మనసు ఎప్పుడూ ఘర్షణకు లోనవుతూ వుంటుంది. అందుకే మనోనిశ్చలత మనిషికి ఎంతో అవసరము అన్ని ఎన్నోవిధములుగా పెద్దలు చెప్పినారు. అందుకే రుక్మి అతని మొదటి ఇరువురు సోదరులూ, అతని స్నేహితులూ పరమాత్ముడగు శ్రీకృష్ణునిచే శృంగభంగమునకు గురియైనారు.
ఈ విధముగా మన పురాణేతిహాసములన్నీ తమసోమా జ్యోతిర్గమయ అన్న వేదవాక్కునకు దృష్టాంతరములు. వీనిని ఆకళింపు చేసుకొని పాటించితే జీవాత్మ పరమాత్మ సాయుజ్యమును చేరుకొంటుంది. ఇదియే శ్రీకృష్ణ పరమాత్మను జీవాత్మయగు రుక్మిణీదేవి  కల్యాణమాడుట. ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహత ఏర్పడుతుందో అప్పుడు పరమాత్మ మిగిలిన అంటే కర్మఫలము వల్ల ఏర్పడిన దోషములను సవరించి ఆత్మను తనలో ఐక్యము చేసుకొంటాడు.
స్వస్తి.

Friday, 21 February 2020

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము


ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము

ఈ జ్యోతిర్లింగ స్తోత్రమును అనునిత్యము పఠించిన వారికి ఏడేడు జన్మల పాపములు హరించుకుపోతాయని ఫలశ్రుతి.

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్l
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్  ll
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ l
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే ll
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే l
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే ll
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః l
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.     ll
ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్

సంపూర్ణ స్తోత్రం:
సౌరాష్ట్రదేశ విశదే‌తి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||
శ్రీశైలశృంగే వఇబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదా వసంతం |
తమర్జునం మల్లికపూర్వమేక్ం నమామి సంసారసముద్రసేతుం ||
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహఅం సురేశం ||
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||
యామ్యే సదంగే నగరే‌తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురై యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే యద్దర్శనాత్ |
పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||
సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||
సానందమానందవనే వసంతమానందకందం హతపాపబృందం |
వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
ఇలాపురే రమ్యవిశాలకే‌స్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదారతార స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
జ్యోతిర్మయం ద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజో‌తి భక్త్వా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||

Saturday, 8 February 2020

శ్రీ కృష్ణుని గూర్చి గోపికల ఆరాటము (వ్యాస భాగవతము):

శ్రీ కృష్ణుని గూర్చి గోపికల ఆరాటము (వ్యాస భాగవతము):
అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద ధీరుత
నాద్రుష్టేతు న ద్రుష్టేతు భవతా లభ్యతే సుఖం
గోపికల ఆరాటము:
కృష్ణా! కనిపించక పోతివా నిన్ను చూడవలెనని తహతహ. కనిపించితివా నిన్ను వీడవలెనను బెంగ, నిన్ను చూచినా కష్టమే! చూడకున్నా కష్టమే!
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్

కాళీయ మర్దన సమయములో, కాళీయుని మదమడచిన తరువాత ఆయన పత్నులు 55 విశేషణములతో శ్రీ కృష్ణ పరమాత్మను స్తుతించినారు.