మాంగళ్య బలము
ఏ పాత చలన చిత్రానికో ఇప్పుడు సమీక్ష రాస్తూవున్నానని అనుకోవద్దు.
పెళ్ళయిన స్త్రీకి మాంగళ్యము యొక్క ఆవశ్యకత ఏమిటి అన్నది తెలుపుట నా ఉద్దేశ్యము.
ఈ వ్యాసములో వివాహ విధివిధానాలను గూర్చి మాట్లాడబోవుట లేదు.
మాంగళ్య గరిమను గూర్చి మాత్రమే నాకు తెలిసిన మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను.
అందుకు సంబంధిన కొన్ని విషయములను మాత్రము ప్రస్తావించుతాను. అసలు విషయము
తెలియజేయుటకు ముందు, మారిపోతున్న లేక మాశిపోతున్న సామాజిక సాంప్రదాయాన్ని గూర్చి
నాలుగు మాటలు తెలియజేస్తాను.
మేము యౌవ్వన దశలో ఉన్న కాలములో వివాహిత తాళిబొట్టు, స్త్రీ యొక్క భర్త జీవితమో లేక ఆమె జీవితమో ముగిసేవరకు, స్త్రీ
గళము నుండి విడివడేది కాదు. ఆతరువాత రాత్రి సమయములో పడుకొనే సమయములో తీసి పక్కన
ఉంచేవారు.
ఏనాటి అగ్రహారమొ
మానాటికి మాన్యమాయె మాపని దీరన్
మీనాటి కండ్రిగాయెను
నానాటికి తీసి కట్టు నాగంభోట్టూ !
తాళిబొట్టు మొదట తల్లడిల్లెను రాత్రి
దిండు క్రింద జేరి దిగులు పడుచు
తుదకు లాకరెక్కి దూరమై పోయెరా
రామ మొహనుక్తి రమ్య సూక్తి !
అన్నట్టు ఏకంగా Locker లోకి చేర్చివేసినారు ఆధునిక నారీమణులు, నవసమాజ
శిరోమణులు. ఒకవేళ అర్దాంతరంగా భర్త పోవుట తటస్థిస్తే ఒక కొత్తవాదన తెరమీదికి
తెచ్చి
మంగళ సూత్రమొకటే కదా భర్తతో బాటూ వచ్చింది మిగతవి ముందునుండినే
ఉన్నాయి కాబట్టి అవి అట్లే ఉంచుకోనుటలో తప్పేముంది అని అన్నారు, అన్నది ఆచరించుతూ
వున్నారు. వారి అభిమతము వారిది. కాదని, వారిని ఎవరూ తప్పు పట్టలేరు. ఇక్కడ ఒక్క
మాట తప్పక చెప్పుకోవలసి వస్తుంది. నాడు భార్య భర్త అన్నది ఒక అనిర్వచనీయ సంబంధం, Switch
Light చందం, ఆత్మీయతా బంధం, ఇగిరిపోని చందన
గంధము. నిజమయిన మమతానురాగాలతో వర్ధిల్లిన జంటలో భర్త పోతే ఆ స్మృతులు ఆ ఇల్లాలిని
వీడ తరమా! అది నిజమైతే ఈ ఆడంబరము అవసరమా! నీతి నియమాలు విలసిల్లె సభ్య సమాజములో
తాళి ఉన్నా, వైధవ్యము వచ్చినా ఆ స్త్రీని అసహ్య దృష్టితో పూర్వాతి పూర్వము
చూచేవారు కాకపోగా, వారి యెడల ఎంతో గౌరవముగా మెలిగేవారు. నేడు అటువంటి వాతావరణము
సమాజములో, ఎక్కడో తప్ప, ఇంకా నెలకొని వుందని చెప్పగలమా!
నేటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే వైదిక ధర్మానుచరులగు సోదరీమణుల
నవీనత నడినెత్తికెక్కి నాట్యము చేస్తుండగా, మంగళసూత్రాన్ని మరచిపోయినారు. అంతేకాక నేటి
సినిమాలు టీవీలు తాళి గౌరవమును దిగజార్చిదానిని ఒక ఆట వస్తువుగా చేసివేసినారు.
పతికన్న అతివకు పైపూత మెరుగాయె
పనికిమాలిన డాబు బహుళమాయె
ఇంటిలోపల వంట వంటికి బరువాయె
స్విగ్గి భోజనములు చేరువాయె
అమ్మగారింటితో అధిక బంధమ్మాయె
అత్త మామల పొత్తు అణగి పోయె
తలువ సిజేరియన్ తలమానికమ్మాయె
సహజమౌ కానుపు సమసిపోయె
మట్టియలు గాజులొక్కటై మట్టి కరచె
బట్టబయలాయె బాడీకి బట్టలేక
బొట్టు కట్టుయు మరి తాళిబొట్టు చూడ
మాడిపోయిన అట్టయ్యె మగువకిలను
ఈరోజులలో భర్తకంటే దేహ సౌందర్యానికి ప్రాధాన్యమిచ్చే, ఆచారాలకన్నా పాశ్చాత్య నాగరికతకు ప్రాధాన్యమిచ్చే, భర్త
అభిష్టానికన్నా పరుల పొగడ్తలకొరకు ఎదురుచూసే మహా సాధ్విమణులు చాలామంది మనకు
దర్శనమిస్తారు ముఖ్యముగా విద్యాధికులలో ఇలాంటి అనాగరికత చాల ఎక్కువగా కనబడుచున్నది.
కొంతమంది భర్తలుకూడా తమకు ఇష్టములేకపోయిన గొడవలెందుకులే అని సర్దుకుని
బ్రతుకుతున్నారు మగడు కట్టిన తాళి ఎగతాళిగా మారినా ఇంకా నల్లపూసలుమాత్రం
ధరిస్తున్నారు ఫేషనుకోసం!
మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ ఫేస్బుక్
ఫోటోలు కూడా, ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు,
గాజులు లేకుండా ఉన్నవే. ఇది సక్రమమైన విధానమే అయితే మనపూర్వీకులు
దీనినే అమలు పరచియుండేవారు. వారు చేసే ప్రతి పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ
శ్రేయస్సే తమ లక్ష్యముగా ఉంచుకొంటారు.
మాంగళ్య గరిమను గూర్చి క్షీరసాగరమధన సందర్భంలో పార్వతీ దేవి తన
మాగళ్యము పై ఎంత నమ్మకను ఉంచుకొంటుందో చూడండి.
“మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగటమన్నది మాత పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగళ్య గరిమయట.
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాl
కంఠే బాధ్నాని సుభగే త్వం జీవ శరదాంశతంll
ఇక్కడ సుభగ అన్న మాటకు ఒక పెద్ద వేదపండితుని నుండి తెలుసుకొన్న
అర్థమును మీ ముందుంచుతాను.
ఆయన ‘భ’ అన్న మాటకు అభివృద్ధి అన్న అర్థమును చెప్పి దానిని సమర్థించినాడు.
నభము అంటే ఆకాశము. దానికి అభివ్ర్ద్ది లేదు కదా! శుభము అంటే సు+భ ము అని. మరి
శుభకార్యము ఎదయినాకూడా అభివృద్ధికే కదా దోహదము చేస్తుంది. భాగము అనగా స్త్రీ యొక్క
ఉత్పత్తి స్థానము. ‘భ’ అంటే అభివృద్ధి ‘గ’ అంటే గామించుట అనగా ముందునకు సాగుట. మరి
సంతానము అభివృద్ధిని తెస్తుంది మరియు వశమును పురోగామిమ్పజేస్తుంది.
సు+భగా శుభకరమైన శ్రేయస్కరమైన పురోభివృద్ధి కలిగించుదానా! అని
అక్కడ సంబోధింపబడింది. మూడక్షరాల ఆ పదములో ఎంత అర్థము దాగియున్నదో చూడండి. ఇప్పుడు
శ్లోకార్థము చూద్దాము.
ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి
కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు
నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా
సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.
భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి
కిరాతకులు మనదేశాముపై దండయాత్రలు చేసినా మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని
చేయకుండా విడిచిపెట్టేవారు. అంటే కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించినారో
చూడండి. అందుకే ఆడపిల్ల పుడితే బాల్యంలోనే మాంగల్య తంతు జరిపించేవారు అని పెద్దలు
చెబుతూ ఉంటారు.
కానీ నా ఆలోచన వేరొక విధముగా ఉన్నది.
'అష్టవర్షాత్ భవేత్ కన్యాపుత్రవత్ పాలితామయా
ఇదానీం తవ దాస్యామ దత్తాం
స్నేహేనపాలయం'
పూర్వము అమ్మాయికి 8 ఏళ్ల వయసులో, రజస్వల కాకమునుపే వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయికి
4 సంవత్సరముల మొదలు 8 తేడా
ఉండేది. అప్పటికి అమ్మాయి రజస్వల అయివుండేది కాదు. అందుచేత ఇరువురు ఆటపాటలలో కాలము
గడిపేవారు. అందుచే ఇరువురినడుమ అనురాగము పెరిగేది. అమ్మాయి రజస్వల అయినవెంటనే అమ్మగారింట్లో
ఉండిపోయేది. అటుపిమ్మట పునః సంధానము చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపేవారు.
ఇరువురి నడుమ ముందే అనుబంధము ఏర్పడుతచే ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. ఇప్పుడు 30
ఏళ్ళు వచ్చి ముదిరిన తరువాత పెళ్ళిళ్ళు చేస్తూ వున్నారు.లోతుగా ఆలోచించే అమ్మాయి
తల్లిదండ్రులకు ఇందులోని అనర్థము అర్థము కాగలదు.
మిగతది రేపు.....
మిగతది రేపు.....
మాంగళ్య బలం(చివరి భాగము)
భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాతకులు మనదేశముపై దండయాత్రలు చేసినా మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అంటే కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించినారో చూడండి. రత్నగర్భ యగు ఈదేశమును కొల్లగొట్ట తలువని విదేశస్థులు లేరు. తరువాతి కాలములో వచ్చిన మ్లేచ్ఛులు. తురుష్కులు, యూరోపియనులు స్త్రీలను ఆటవస్తువుగా చూసినారు. అందుకే ఆడపిల్ల పుడితే బాల్యంలోనే మాంగల్య తంతు జరిపించేవారు అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కానీ నా ఆలోచన వేరొక విధముగా ఉన్నది.
పూర్వము అమ్మాయికి 8 ఏళ్ల వయసులో, రజస్వల కాకమునుపే వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయికి 4 సంవత్సరముల మొదలు 8 తేడా ఉండేది. అప్పటికి అమ్మాయి రజస్వల అయివుండేది కాదు. అందుచేత ఇరువురు ఆటపాటలలో కాలము గడిపేవారు. అందుచే ఇరువురినడుమ అనురాగము పెరిగేది. అమ్మాయి రజస్వల అయినవెంటనే అమ్మగారింట్లో ఉండిపోయేది. అటుపిమ్మట పునః సంధానము చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపేవారు. ఇరువురి నడుమ ముందే అనుబంధము ఏర్పడుతచే ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి ముదిరిన తరువాత పెళ్ళిళ్ళు చేస్తూ వున్నారు.లోతుగా ఆలోచించే అమ్మాయి తల్లిదండ్రులకు ఇందులోని అనర్థము అర్థము కాగలదు.
మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.
పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజగ్రహ కక్ష్య లోనికి వస్తుంది. స్త్రీకి ఆ రోజు రుతుసమయము ఆసంనమౌతుంది. ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనము కావాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.
అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీరములోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయని
అనుభవజ్ఞులయిన పెద్దలు చెప్పిన మాట.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.
తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని, బాల్యము నుండియే తమ బాలికలకు మన సంస్కృతి కి తగిన కట్టుబట్టలు, వేష భూషలు సిగ్గు బిడియము నేర్పించి సంస్కారవంతులగు ఉపాధ్యాయులు గల పాఠశాలలకు పంపితే విద్యతో బాటుగా వినయము, సమయానుకూలమగు బిడియము, ధైర్యము, చతుర సంభాషణము, ఆట, పాట అన్నీ నేర్చుకొంటారు. ‘స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం, సాహసం షడ్గుణం’ అన్నారు పెద్దలు. పాశ్చాత్య అనుకరణలకు ఇకనైనా తలయొగ్గకుండా మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. ఈ రోజు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించకపోతే, వారు, వారి పిల్లలకు నేర్పించుటకు ఏమీ వుండదు.అందుకే మన ధర్మము యొక్క విశిష్ఠతను పిల్లలకు, అర్ధమయ్యే వరకు తెలియపరుద్దాం. ప్రతిఒక్కరూ మీ మీ కుటుంబముల నుండియే నాంది పలకండి.
చినుకు చినుకు చేరి చిన్న కాలువయౌను
కాల్వలెల్ల కలియ కలుగు నదులు
కలసియట్టి నదులు కడలియౌ గమనించు
రామమోహనుక్తి రమ్య సూక్తి
ప్రేమవివావాహాల కన్నను, తల్లిదండ్రులు, అనురూపుడైన వరుని నిర్ణయించి ధారాదత్తముగ వివాహమొనర్చు విథియే "ఏకక్రియాద్వ్యర్థకరీబభూవ" యను విధి ప్రకారము ఈ లోకమున కీర్తికరము పరలోకమున ముక్తి ప్రదమని పెద్దలవలన శాస్త్రధర్మముల ననుసరించియు గుర్తించిన వారు గనుక భారతీయులైన సనాతన ధర్మ పరాయణులెల్లరు సత్సాంప్రదాయముగ భావించిన వారై తమ పుత్రులకు పుత్రికలకు, కులానుక్రమముగ నీ ధర్మమును విధిగ ననుసరించుచున్నారు.
కన్యాదానంతు సర్వేషాం, దానానాముత్తమం స్మృతం" అను రీతిని తమకులమునకు సాంప్రదాయమునకు జెందిన వరునకు యథాశక్తిని అలంకరించిన కన్యను దానము అనగా బ్రాహ్మవివాహ రూపమైనధారాదత్తముగ యధా శాస్త్రానుసారము వివాహము చేసినచో సమస్త దానములకన్నా నీ కన్యాదానముత్తమోత్తమమైనదిగా రాణించగలదు.
ధర్మార్థ కామ మోక్షదాం దారాః సంప్రాప్తి హేతః
పరీక్ష్యన్తే ప్రయత్నేన పూర్వమేవ కరగ్రహాత్"
అను ధర్మాన్ని పురష్కరించుకొని ధర్మము అర్థము కామము మోక్షణము అను నాల్గు పురుషార్థములకు కారణభూతురాలుగ నేర్పడి వంశమునకు కీర్తిప్రతష్ఠతీను వంశాభివృద్థిని చేకూర్చదగు సమర్థురాలుగ మున్ముందు కాదగియున్నది, గాన కన్యను సర్వవిథములా పరిశీలించి, వివాహమునకు తగిన కన్యకయని నిర్ణయించుకొనిన యనంతరమే వివాహము నిశ్చయించుకోవలయును.
వివాహములలో ఆలస్యము జరుగుకొద్దీ మామిడి పళ్ళకొరకు మామిడి తోటకు కాపు బండ్లలో బజారుకు వెళ్ళినతరువాత పోవడము వంటిది. అప్పుడు ఆ తోటలో పనికి వచ్చే పళ్ళను, పట్టుమని, పది కూడా చూడలేము.
స్వస్తి.
No comments:
Post a Comment