డాక్టర్ సతీష్ పట్కి
కొల్హాపూర్
పద్మవ్యూహము, సుభద్ర కడుపులో అభిమన్యుడు
ఉన్నపుడు, అర్జునుడు, గర్భవతియై
పడుకొని ఉన్న సుభద్రతో పద్మవ్యూహ ప్రవేశ నిర్గమనముల గూర్చి ముచ్చటించుచుండినాడన్న
విషయము మనకు తెలిసినదే! ఆమె నిదురపోవుటచే, అర్జునుడు నిర్గమనమును
గూర్చి తెలుపుట నిలిపివేసినాడు. ఇది కూడా మనకు తెలిసినదే! అదే విధముగా గర్భవతి యగు హిరణ్యకశిపుని భార్య లీలావతి నారదుని ఆశ్రయములో ఉన్నపుడు, గర్భస్త శిశువగు ప్రహ్లాదుడు కూడా నారదుడు చెప్పే విష్ణు లీలా విలాసమును విని పరమ విష్ణు భక్తుడైపోతాడు.
కానీ గర్భస్త శిశువు వినుట ఏమిటి అది గుర్తుంచుకొని యువకునిగా
ఉన్నపుడు పద్మవ్యూహమున ప్రవేశించుట ఏమిటి అని నేటికీ ఎందరో అల్పజ్ఞాన సంపన్నులు, అపూర్వ
(పూర్వము అంటే తూర్పు అని ఒక అర్థము, అపూర్వము అంటే పూర్వమునకు వ్యతిరేకము అంటే
పశ్చిమము, Europians) విజ్ఞాన బాధితులు, నేటికీ ఎగతాళి చేస్తూ వుంటారు.
కానీ భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారిచే సత్కరింపబడిన డాక్టర్
సతీష్ పట్కి గారు తెలిపిన ఈ వాస్తవమును గమనించండి. ఈయన స్త్రీ గర్భధారణా విషయిక నిపుణులు.
ఇల్లాలు గర్భమును దాల్చి 16 వారములు దాటినా తరువాత గర్భస్థ శిశువుకు, తల్లి
ఆలకించే అంటే శ్రద్ధతో వినే విషయాలు గుర్తుగా ఉండిపోతాయి. ఆవిధముగా అభిమన్యుడు
పద్మవ్యూహ భేదనమునకు ఉపక్రమించినాడు.
మన పూర్వులగు ఋషులు, జుట్టు గడ్డాలకు ప్రాదాన్యతనిచ్చి
పెంచుకోలేదు. వారి దృష్టిలో శరీరము ఒక ఉపాధి మాత్రమే. వారి యావజ్జీవిత కాలమూ మానవ
కళ్యాణమునకు పాటుపడిన మహనీయులు. వారిమాట మనకు వరహాల మూట అన్న వాస్తవాన్ని
గుర్తుంచుకొని భారతీయ బహుశాస్త్ర విజ్ఞానమును గూర్చి తెలుసుకొండి. వారు
పాశ్చాత్యులవలె, స్వార్తపరత్వముతో, డబ్బుపై యావతో, Patents కొరకు పాటుపడిన వారు
కాదు. ఆ మహనీయుల బాటలో నడచి భారత జాతీయ కేతనము ఎవరికీ అందని ఎత్తులో రేపరేపలాడనీయండి.
స్వస్తి.
No comments:
Post a Comment