Wednesday, 14 October 2020

జ్యోతిర్లింగముల కథ-ద్వితీయ ఖండము 9, 10, 11, 12

 

జ్యోతిర్లింగముల కథ-ద్వితీయ ఖండము

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము

      https://cherukuramamohanrao.blogspot.com/2020/10/9.html

    సానందమానందవనే వసంతమానందకందం హతపాపబృందం |

            వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

ప్రసిద్ధ పుణ్య క్షేత్రములు మూడు విధములు , 1. స్థల, 2. జల, 3. శిల క్షేత్రములు.

1. నైమిశారణ్య స్థల మహత్మ్యమునకు ప్రతీక. (స్థల)

2. గండకి సాలగ్రామములకు ప్రసిద్ధి, అట్లే నర్మద తులా పరీక్షకు నెగ్గిన బాణ లింగములకు ప్రసిద్ధి.(జల)

3.తిరుమల శ్రీనివాసుని క్షేత్రము (శిల)

ఈ మూడింటినీ కలిగినది కాశీ పట్టణము. ఈ ఒక్క మాట చాలు ఆపుణ్యక్షేత్ర ప్రకర్ష లేక మహత్తును తెలుపుటకు.

అట్టి కాశీని, కాశీనాథుని గూర్చి తెలుపుటకు శివుని మదిలో తలచుకొనుచూ, అల్పజ్ఞుడ నైన నేను వ్రాయ సమకట్టినాను. నాకోసము మీరు చదువనక్కరలేదు విశ్వనాథుని కొరకైనా చదువండి. భక్తితో చేసే పనులకు ఫలితముంటుంది.

గంగా నది ఒడ్డున నివసించిన ”కాస్య ,కాస ,ఖాసా ”అని పిలువ బడి చివరకు కాశీ ”లయిన వారి నగరము ‘కాశి’ అయినది అని భాషా శాస్త్రజ్ఞులు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు.. ఋగ్వేదం లో ”శున హోత్రుని మనుమడు” ”కాశి ”అనే వాని చేత నిర్మించ బడిన నగరం కనుక కాశీ అనే పేరు వచ్చి నట్లు వుంది .”హావెల్ ”పండితుడు క్రీ.పూ.1400 -1000  ప్రాంతం లో కాశీలు ఇక్కడే వుండే వారని వ్రాసినాడు. స్కాంద పురాణములో కాశీ పరమేశ్వరునిచే నిర్మింపబడినదని తెలియవస్తూ వున్నది. ‘కాశ్యాన్తు మరణాన్ ముక్తి’  "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" – అన్నది శాస్త్రవచనము. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని చారిత్రికులు భావిస్తారు. కాశి 5 క్రోసుల కైవారము కలిగిన క్షేత్రము.ఇందుకే దీనిని ‘పంచ క్రోశి’ అంటారు. ఇది నాటి పట్టణ వైశాల్యమును తెలుపుతుంది.

కవిసార్వభౌముడు శ్రీనాథుడు తన 'కాశీ ఖండమున -వివరించిన కాశి 'మాపన ప్రావిధి'

నేను శ్రీనాథుడు రచియించిన కాశీ ఖండమునుండి ఈ పద్యమును గైకొనుటకు ఒక ముఖ్య కారణము ఉన్నది. ఈ పద్యము కాశీని, విశ్వేశ్వరుని గూర్చి తెలుసుకొనుటకు ఇది ఒక కొలబద్ద. మాపన ప్రావిధి అన్న మాటకు కొలుచుట అనియే అర్థము. ఆ పద్యము ఏవిధముగా కొలబద్ద అన్నది గమనించుటకు ముందు పద్యము దాని భావమును చూద్దాము.

సీ. చక్రవాళ పరీత సర్వ సర్వంసహా

పరమ తీర్ధములలొ బెరువ కాశి

కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ

సమితి లో సారంబు జహ్ను కన్య

జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు

గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు

మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం

టెను విశ్వనాధు దర్శన మధికము.

తే.గీ.    విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె

గాలకంఠుని కంటె ముక్కంటి కంటె

దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల

సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. ఓ మహర్షీ! (సంయమము : అనుచితమైన, అహితమైన కోర్కెలకు ఆలోచనలకు కళ్ళెం వేసి ,ఉచితమైన వాటివైపు మనస్సును లగ్నం చేయడమే సంయమము . అది కలిగినవాడు సంయమి. అటువంటి వారిలో ఇంద్రునివంటి వాడు సంయమీంద్రుడు.) లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో కాశీ పెరువ అనగా గొప్పది. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

మొదట కాశీనాథుడగు విశ్వేశుని గూర్చి కొంత గమనిచుదాము. ఈ పద్యమున వరుసగా ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి గా ఏదేది పెద్ద అని చెప్పుకొంటూ పోయి చివరకు అన్నింటికన్నా విశ్వపతి అధికము. అట్టి విశ్వపతి మరియు ఆ విశ్వపతిని పరివేష్ఠించి యున్న తీర్థములు దైవములు తక్క ఈ త్రిభువనములలో వేరు అధికమగు ప్రస్తాపనే లేదు. ఇక కాశీ పట్టణము యొక్క కొలతల గూర్చి మాట్లాడుకొందాము. ఈ ప్రమాణము వ్యాసమహర్షి ‘స్కాంద పురా’ణాంతర్గత కాశీ ఖండము’ న వర్ణింపబడిన కాశీని గూర్చి మాట్లాడుచున్నాము అన్న విషయము మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినది. అంటే ద్వాపరమునకు పూర్వమే, పట్టణములు ఉన్నవి అన్నది మనకు తెలియుచున్నది కదా! మరి వ్యాసులవారు స్కాందపురాణము వ్రాసినది ద్వాపరమునందే కదా! దీనిని బట్టి మన నాగరికత ఎంత పురాతనమైనది అన్నది ఒకపరి ఆలోచించండి. ఇక విషయమునకు వద్దాము.

కాశికా పట్టణ క్రోశ పంచక...’ అని పద్యము యొక్క రెండవ పాదములో కాశీ వైశాల్యమును గమనించుతాము.

అంటే వ్యాసులవారి కాలమునకు ఈ కాశీపట్టణము ఎంత విస్తారము కలిగియున్నది అన్నది మనము గమనించవలసియున్నది.

మిగిలినది మరొకసారి............................. 

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-2వ భాగము

పూర్వ కాలముననే కొలతలను పరిమాణము (volume), చతురస్రము (Area), ప్రమాణము (length), ఉన్మానము (weight), గా మన పూర్వులు విభజించియున్నారు. వారికి వ్యాసము (Diameter), వ్యాసార్థము (Radius), π మొదలగు అనేక విషయముల గూర్చి, మనకు తెలిపినారని భ్రమపడుతున్న, నిన్న మొన్నటి ఆంగ్లేయులకన్నా వేళా సంవత్సరముల లేక లక్షల సంవత్సరముల  పూర్వమే తెలుసు. ఈ విషయములను మనసున ఉంచుకొని నాటి కొలతల గూర్చి తెలుసుకొందాము.

భాస్కరాచార్యుడు-2 తన ఏకైక ప్రియపుత్రిక నామమున ‘లీలావతి’ యన్న గణిత గ్రంధమును రచించినాడు.

లియొనార్డ్ యులెర్(Leonhard Euler) (1707-1783) పేరుతో చతుర్భుజాలపై యులెర్ యొక్క చతుర్భుజం సిద్ధాంతం లేదా యులెర్ యొక్క చట్టం ఒక కుంభాకార చతుర్భుజం మరియు దాని కర్ణముల మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. ఇది సమాంతర చతుర్భుజము యొక్క సాధారణీకరణ, దీనిని పైథాగరియన్ సిద్ధాంతం యొక్క సాధారణీకరణగా చూడవచ్చు.  యులెర్  ఈ పైథాగరస్ సిద్ధాంత నిరూపణము సులభశైలిలో చేసిన రీతి భాస్కరాచార్య-2 నుండి తీసుకోన్నదేనేమో. ఎందుకంటే ఆయన యూలెర్ కన్నా ఎన్నో శతాబ్దములు ముందు వాడు, nx^2 + 1 = y^2 అన్న ఈ సమీకరణమును (Equation) ను పల్స్ (Pell’s) సమీకరణము అంటారు. నిజానికి దీనిని ‘ భాస్కర సమీకరణము’ అనవలసి వుంది. ఎందుకంటే భాస్కరుడు దీనిని 12వ శతాబ్దములో  కనుగొనగా Pell దీనికి 19వ శతాబ్దములో తనపేరు పెట్టుకొన్నాడు కాబట్టి.

పైన తెలిపినది నేను చెప్పవలసినదానితో సంబంధము లేకున్నా ఈ సందర్భముగా మన శాస్త్రజ్ఞుల గొప్పదనము ఈ సందర్భముగా తెలియజేసినాను. వేదకాలము నుండి వచ్చు కొలతల విధానమును ఆయన ‘లీలావతి’లో శ్లోకరూపమున సూత్రీకరించినాడు. ఆసందర్భాములో ఆయన గొప్పదనము తెలుపుతూ పై విషయము చెప్పవలసివచ్చినది.

పై గ్రంధము కల్గిన ఈ రెండు శ్లోకములను పరికించండి.

యవోదరై రంగుళ మష్ట సంఖై ర్హస్తోంగులైః షడ్గుణీ తైశ్చతుర్భిః

హస్తైశ్చతుర్భి ర్భవతీహ దణ్ణః క్రోశః సహస్ర ద్వితయెన తేషామ్||

స్యాద్యోజనం క్రోశ చతుష్ట యేన తథా కరాణాం దశ కేన వంశః

నివర్తనం వింశతి వంశ సంఖైః క్షేత్రం చతుర్భిశ్చ భుజైర్నిబద్ధమ్||

అంశం                            అర్థం

4 యవోదరాలు      =1 అంగుళం

24 అంగుళాలు      =1 హస్తం

4 హస్తాలు             =1 దండం

2000 దండాలు      =1 క్రోసు (1 కోసు)

4 కోసులు              =1 యోజనం

(10 హస్తాలు            =1 వంశం (వెదురు) (బహుశ వెదురు కర్ర సగటు పొడవు 10 హస్తాలుగా తీసుకొన్నట్లు వుంది.)

(20 వంశాలు భుజం కలిగిన చతురస్ర వైశాల్యం అనగా 400 చదరపు వంశాలు=1 నివర్తనం)

ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది. రెండున్నర మైలు అంటే ఇంచుమించు ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. ‘క్రోశ’ లేక క్రోసు లేక కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది. రెండున్నర మైలు అంటే ఇంచుమించు 3.2 కి.మీ. గా ఊహించ వచ్చును.  ఈ పంచ క్రోశి యాత్ర అన్నది మణికర్ణిక ఘట్టము నుండి మొదలవుతుంది. తిరిగి మణికర్ణిక చేరుట తో ముగుస్తుంది. పంచ క్రోశి అన్నది ఈ విధముగా  లేక్కింపబడుతుంది. చతురస్రము యొక్కభుజము ‘x’ అయితే   వైశాల్యము x2 . అవుతుంది అన్నది మనకు తెలిసిన విషయమే! అంటే కాశీ యొక్క విస్తీర్ణము 5x5=25 అవుతుందన్నమాట. ఈ లెక్క గమనించండి.

మణికర్ణిక నుండి కర్దమేశ్వర్ - 3 క్రో

కర్దమేశ్వర్ నుండి భీంచండి - 5 క్రో

భీం చండి నుండి రామేశ్వర్ - 7 క్రో

రామేశ్వర్ నుండి శివపుర్ - 4క్రో

శివపుర్ నుండి కపిల్ ధార - 3క్రో

కపిల్ ధార నుండి మణికర్ణిక - 3క్రో

మొత్తము 25 క్రోసులు. 1 క్రోసుకు 3.2 కి.మీ. అంటే 8౦ కి.మీ.

విశ్వేశం మాధవం డుండిం దందపాణిం చ భైరవంl

వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాంll

వారణాశి లోని అత్యంత ప్రధాన శివబృందము పైన శ్లోకములో తెలుపబడినది.

పైన తెలియ జేసినా వివరములు అన్నీ చదివిన తరువాత పాఠకులకు సహజముగా వచ్చే సందేహమేమిటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగములలోని ప్రధాన జ్యోతిర్లింగమగు విశ్వేశ్వర జ్యోతిర్లింగమును గూర్చి తెలుపకుండా ఈ అవసరము లేని వివరములు ఎందుకు?

ఎందుకంటే నాటి కాశీ యొక్క కైవారము నేటి కొలతలో తెలిపితే కదా సాధారణ పాఠకునికి సాకల్యముగా సమగ్రముగా అర్థమయ్యేది. దీనివలన మనకు మనపూర్వులు అత్యంత ప్రతిభా సంపన్నులని తెల్యుట లేదా! మనము పాశ్చాత్యులవద్ద బౌద్ధిక దాస్యము చేయనవసరము లేదు, అన్నది తెలుపుటకు, వ్యాసుని నాటి కాశీ వైశాల్యము నిర్దుష్టముగా తెలియజేయుటకు ఈ వివరమును వ్రాయవలసి వచ్చినది.

 

ఇతిహాసపురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించినారు. ఈ వాస్తవమును గమనించండి.

వారణాసీ పరిమాణము

తూర్పు దిక్కున "గంగానది" మధ్యభాగము, దక్షిణమున "అసీ" నది, పడమటి దిశయందు "పాశపాణి వినాయకుడు", ఉత్తరమున "వరణానది" అవధిగా కల్గి, ఆ మధ్యనున్న క్షేత్రము "వారాణసి". ఇది దివ్యమును విశేష ఫలసాధనమునైనది.

అవిముక్త పరిమాణము

విశ్వేశ్వర లింగమునుండి నాల్గు దిక్కులందు రెండువందల ధనుస్సుల పరిధిలోపల నున్న ప్రదేశము "అవిముక్తము". ఈ క్షేత్రమునందు ముక్తి అవశ్యము లభించును. ఏ మాత్రము సందేహము లేదు.

అంతర్గృహ పరిమాణము

తూర్పున "మణికర్ణికేశ్వరుడు", దక్షిణమున "బ్రహ్మేశ్వరుడు", పడమటి దిశ యందు "గోకర్ణేశ్వరుడు", ఉత్తరమున "భారభూతేశ్వరుడు" సరిహద్దులుగాగల క్షేత్రము "విశ్వనాథుని గృహము". ఈ క్షేత్రమునే "అంతర్గృహము" అందురు.

కాశి కంటె వారణాసి, వారణాసి కంటె అవిముక్తము, అవిముక్తము కంటె అంతర్గృహము పరిమాణములో చిన్నవి. అనగా కాశీపరిధి లోపల వారాణసి, వారాణసి పరిధిలోపల అవిముక్తము, అవిముక్తము పరిధిలోపల అంతర్గృహము నున్నవని గ్రహించవలెను.

మిగిలినది మరొక మారు.........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-3వ భాగము

 భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుండి జ్ఞానము 

మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచినది. పురాణాలను 

అనుసరించి, దివోదాసుని కారణముగా, అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు 

వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని 

దశాశ్వమేథ ఘాట్‌కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికినాడు.

చరిత్ర పుట్టకముందు కాలం నుంచి దేవాలయం ఉన్నట్లుగా చెప్పబడింది. దేవాలయం 

ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి 

ఇండోర్ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించినారు. దేవాలయ 

ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తైన కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్ మహారాజు రంజిత్ 

సింగ్ 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చినారని చెప్పబడింది. 1983 సంవత్సరంలో దేవాలయ 

నిర్వహణ బాధ్యతలను ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు

చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్తంభాలు మరియు 

హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభించుతాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు

లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు. పురాతనమైన వారణాశి నగరంలో నాలుగవ 

భాగం గంగాతీరంలోనే ఉంది.

వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.

సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం

వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!

ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి

ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం 

శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థన చేస్తారు. 

సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని 

కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ 

పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం 

చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి 

సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ 

పరమేశ్వరులకు మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చినారు. ఇపుడు 

వాళ్ళిద్దరూపరబ్రహ్మ స్వరూపూడగు పరమేశ్వరుని జూచి ‘మా కర్తవ్యమేమి? అని 

అడిగినారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పినాడు. నిర్గుణము నుండి సగుణమయిన 

తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ 

తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది. 

శంకరుడు వారణాసిని కలిగన భూభాగమును తన త్రిశూలముతో పైకెత్తి, ఇది ప్రపంచములోని 

మొదటి నగరమై వారణాసి గా ఖ్యాతిగాంచి, ప్రళయ కాలమున కూడా అకుంఠితముగా 

ఉండిపోతుంది అని శెలవిచ్చినాడు. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన 

మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న 

మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసినాడు. అందుచే 

కాశీ మోక్షపురి అయినది. కాశి భోగపురి కాదు. పాపరాశి దగ్ధమగుటకు శరీరంతో కాశీ 

పట్టణంలోకి ప్రవేశించగలిగిన వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.

కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు 

తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం 

లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. 

అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. అయిదు క్రోసుల 

కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు 

ప్రారంభం చేసినాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట 

ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన 

తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. 

శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార లోతయిన పల్లము 

ఏర్పడి అందులోనికి ప్రవహింప దోదగినది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం 

ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థము’గా 

ప్రఖ్యాతి చెందినది. బావి వలె యుండిన ఆ ప్రాంతము గంగాప్రవాహములో కలిసిపోయినా 

పేరు చిరస్మరణీయముగా నిలచిపోయినది.

 ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటము మీద 

పడి అక్కడినుండి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి 

వారణాసి. అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేసినారు 

‘ఈశ్వరాఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు 

కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను 

నామంతోను పిలవబడతావు’ అని అర్థించినారు. జ్వాజ్వాలాయ రూపుడగు శివుడు తత్క్షణము 

లింగరూపము దాల్చి అది స్వయంభూ జ్యోతిర్లింగమయినది. ఈశ్వరుడు సృష్టి చేసినాడు. ఈ 

సృష్టి నిలబడుటకు ఆహారం అవసరము. అందుకు అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త 

విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ  అన్నము పెట్టడానికి ప్రకృతిగా 

మారింది.

మిగిలినది మరొక మారు.....

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-4వ భాగము

‘భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు సన్మార్గమున నడచి చూపిస్తే వెనకనున్న వాళ్లు దానిని అనుసరించి పావనులౌతారు. అందుకని వ్యాసుని అటువంటి పరీక్షకు నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకు అన్నము దొరకకుండా చేసినాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి ఒక  స్త్రీ మూర్తి బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చినాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టివేసినారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చుండమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.

వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించవలెను. నీకు ఈశ్వరానుగ్రహము కలుగవలెనంటే, గంగకు ఆవలి ఒడ్డున చేరి పరమేశ్వరుని సేవించుకొమ్మని జగన్మాత పలికింది. తదాజ్ఞను ఔదల ధరించి వ్యాసుడు అచట నివాసమేర్పరచుకొనుటచే ఆ ప్రదేశమునకు ‘వ్యాస కాశీ’ అన్న పేరు స్థిరమైనది.

ఇక్కడ దివోదాసుని వృత్తాంతము క్లుప్తముగా తెలియబరచుతాను.

పూర్వము ఈ ప్రపంచాన అధర్మం పెరిగి ధర్మం సన్నగిల్లుతున్న సమయంలో సృష్టికర్తయైన 

చతుర్ముఖ బ్రహ్మ తిరిగి ధర్మస్థాపన చేయదలచి, ధర్మాత్ముడు,క్షత్రియ వంశజుడు అయిన 

రిపుంజయుడు బ్రహ్మనుద్దేశిచి యఙ్ఞం ప్రారంభించగా, అతనని భక్తికి మెచ్చిన బ్రహ్మ అతని ఎదుట 

ప్రత్యక్షమయి " రిపుంజయా! ప్రపంచమున అధర్మమూ, అన్యాయమూ బాగా 

పెరిగిఅల్లకల్లోలమైపోయింది  నీవు వెంటనే రాజ్య పాలన చేపట్టి, ఈ జగత్తుకు సార్వభౌముడవై 

పాలించుము’ అనగా అప్పుడు రిపుంజయుడు బ్రహ్మదేవుని " ఓ బ్రహ్మదేవా! మీ కోరిక మేరకు నేను 

రాజ్యపాలన చేస్తాను కానీ. నా రాజ్యమునకు కాశీ పురము రాజధాని కావాలి. నా రాజ్యములో 

దేవతలకు చోటు ఉండకూడదు. నేను సర్వంసహాదికారము కలిగి ఈ ధరాతలమును 

పరిపాలించుతాను’ అని అన్నాడు. బ్రహ్మదేవుడు ఈ షరతుకు సరేనంటూ కాశీని వీడుటకు 

విశ్వేశుని  మాత్రము ఒప్పించావలసి వస్తుందంటూ అంతర్థానమయినాడు. బ్రహ్మ మరియు ఇతర 

దేవతల విజ్ఞప్తులను త్రోసిపుచ్చలేక భారమైన హృదయముతో, ఈశ్వరీ సమేతమగు సకల 

పరివారముతో మంధర పర్వతమును చేరినాడు, కానీ మనసు కాశీని వీడలేదు.

ఆనాటి నుండి రిపుంజయుడు దివోదాసుడనే నామంతో కాశీ నగర కేంద్రంగా ఈ ప్రపంచాన్ని 

పాలించడం మొదలుపెట్టినాడు, రిపుంజయుడు. దివోదాసుడు తన రాజ్యాన్ని న్యాయబద్ధంగా

ఎటువంటి బాధలు లేక అద్భుతంగా పాలిస్తున్నాడు. తన రాజ్యానికి కావలసిన ప్రతి ఒక్కటీ తనే 

సృష్టిస్తూ తన ప్రజలను పోషించసాగినాడు. పరమేశ్వరుడు దివోదాసుడి కారణంగా కాశీలో అడుగే 

పెట్టలేకపోయినాడు. రోజరోజుకూ దివోదాసుడికి గర్వం పెరిగిపోసాగింది. ఎలాగైన దివోదాసుడిని 

దారిలోకి తేవాలని నిర్ణయించిన పరమశివుడు పార్వతీదేవి రూపాలైన 64 మంది దేవతలను 

దివోదాసుడి రాజ్యానికి పంపినాడు. కానీ కాశీ నగర సౌందర్యము మరియు దివోదాసుడి 

నీతిమంతమైన పాలన చూసి ఆ దేవతలందరూ ఏమి చేయలేక అక్కడే ఉండిపోయినారు. ఈ 

విఫలయత్నం తరువాత పరమశివుడు సూర్యదేవుడిని పంపినాడు. సూర్యదేవుడు ఒక జ్యోతిష్యుడి 

రూపంలో కాశీకి చేరినాడు. కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయినాడు.

మిగిలినది వేరొకమారు.........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-5వ భాగము

తరువాత బ్రహ్మదేవుడు ఒక సన్యాసి రూపంలో కాశీకి వళ్ళి దివోదాసుడి చేత అశ్వమేధ యాగం 

చేయించినాడు. ఇక చివరి ప్రయత్నంగా పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు తోనూ, తన కుమారుడైన 

గణపతితోను కలిసి ఒక ఉపాయమునాలోచించినాడు. దాని ప్రకారముగా వినాయకుడు కాశీ 

నగరానికి ఒక జ్యోతిష్యుడి రూపంలో అద్భుత మైన కాంతి పుంజంతో ఒంటి నిండా విభూతి రేఖలు

సింధూరపు రంగు పట్టు బట్ట, శాలువ ధరించి, లావుపాటి శరీరముతో వినాయకుడు దివోదాసుని 

రాజధానియగు కాశీని చేరినాడు. తన వాక్కు నిజం అవుతుందని చెప్పుతూ జనాన్ని 

ఆకర్షించినాడు. జరిగిందీ, జరుగుతున్నది, జరుగ బోయేదీ అన్నీ ఖచ్ఛితం గా చెప్పి అందరి 

మనసుల్ని ఆకర్షించినాడు

ఇలా వినాయకుడి జ్యోతిష ప్రతిభ రాజ ఆస్థానానికి కూడా చేరింది. రాణి కోరిక పై రాజు ఆయన్ను 

ఊరేగింపుగా ఆస్థానానికి గౌరవంగా రప్పించినాడు. వారి ఆతిధ్యాన్ని పొంది నాలుగు వేదాలు

సకల శాస్త్రాలు, పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందినాడు వినాయకుడు. ఈ 

వినాయకుడేడుంఠి వినాయకునిగా కాశీన పేరుగాంచినాడు.  ఒక ఏకాంత ప్రదేశంలో డుంఠి 

వినాయకునితో చక్రవర్తి "మాకు ఈ ప్రజా పాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా. ఏదైనా ఉంటె 

ఆజ్ఞాపిస్తే చేస్తాను" అన్నాడు. అప్పుడు డుంఠి మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు. మీ లాగా 

ఇంతకు ముందెవ్వరూ ఇంత ధర్మబద్ధముగా, పరిపాలన చేయలేదు. భవిష్యత్తులో కూడా 

చేయబోరు. రది ఏమయినా వచ్చే రోజులు మంచివి కావు. నేటికి సరిగ్గా పద్దెనిమిదో రోజున మీ 

జీవితానికి ఒక సుముహూర్తం వస్తోంది. ఒక తేజో విరాజితుడగు బ్రాహ్మణోత్తముడు మీ దర్శనం 

కోరివస్తాడు. ఆయన చెప్పి నట్లు నడుచుకోండి. మీ జన్మ చరితార్ధమయ్యే రోజు ఆ రోజే. అని చెప్పి 

డుంఠి వేదలిపోయినాడు. శివాఙ్ఞ మేరకు కాశీ రాజైన దివోదాసుణ్ణి కాశీ నుండి 

పంపించివేయడానికి శ్రీ మహవిష్ణువే ఆ బ్రహ్మణుని రూపంలో కాశీకి వచ్చినాడు. ఆయన తన 

వేదాంతముతో, దివోదాసుని మనసును వైరగ్యం వైపుకు మరల్చగలిగినాడు. అప్పుడు దివోదాసుడు 

తన కుమారిడికి రాజ్యం అప్పగించి తాను అడవులలోకి వెళ్ళి సమాధి చెంది శివునిలో 

లీనమయినాడు. అలా శివ కార్యం పూర్తి చేసిన నారాయణుడు, కాశీ నగర అందాలను చూస్తూ 

నగరమంతా విహరిస్తూ, అక్కడి గంగా తీరంలోని పంచగంగా ఘాట్ కు చేరుకున్నాడు...అదే 

సమయంలో ఆ ఘాట్ వద్ద 'అగ్ని బిందు' అనే పేరు గల ఋషి తపస్సు చేసుకుంటున్నాడు... శ్రీ 

మహా విష్ణువును చూసిన అగ్ని బిందు భక్తి పారవశ్యంలో నారాయణుని పలు విధాలుగా 

కీర్తించి,స్తోత్రం చేసినాడు. మహర్షి అగ్నిబిందు భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ఋషిని ఏదైనా 

వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడు అగ్నిబిందు "నారాయణా! నీవు బిందుమాధవునిగా ఈ 

ప్రదేశంలోనే ఉండి భక్తులను అనుగ్రహించు." అని అన్నాడు. అగ్నిబిందునకు కోరిన వరమును 

ఇచ్చిన నారాయణుడు, తాను ఎప్పుడూ ఈ పంచగంగా ఘట్టముననే ఉంటానని అగ్నిబిందు 

ఋషిని అనుగ్రహించినాడు. పరమేశ్వరుడు తిరిగీ కాశీపతి అయినాడు.

మిగిలినది మరొక మారు...... 

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-6వ భాగము

మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరుడికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవ్రేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. ఆయన వారణాసి పట్టణమునకు క్ష్ట్రపాలకుడు.  కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమము, అది యాత్రకు పూర్ణత్వమును చేకూర్చుతుంది. కాశీ పట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి. ఈ విషయమును ఒక పాశ్చాత్యుడు ఎంత చక్కగా నిరూపించినాడో చూడండి.

US Colorado University Professor John M Melville, (Astro Physicist), అంతరిక్ష 

భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు, స్కాంద పురాణములోని కాశీ ఖండములో వర్ణించిన విధముగా 

రేఖాగణిత సహకారముతో తాను ఎంతయో శ్రమించి, విశ్వనాథ జ్యోతిర్లింగము కేంద్రముగా

12 సూర్య మందిరములను ఎంతెంత దూరములో ఏ విధముగా నిర్మింపబడినాయి అన్న ఒక 

పటము గీచుకొని, అందలి నిజానిజములను పరిశీలించుటకై 1994 లో మనదేశములోని కాశీ 

నగరమునకు వచ్చుట తటస్తించినది. అక్కడ ఆయన వారణాశి హిందూ 

విశ్వవిద్యాలయమునండలి శ్రీ P B సింగ్ అన్న ఆచార్యుని కలసి ఆయనకు విషయమంతా చెప్పి  

సహాయము కోరినారు.

అందులకు సమ్మతించి ఆయన John M Melville కి సహకరిప దొడగినాడు. ఇరువురు ఆ 

చిత్రపటము సహాయముతో మొత్తము కాశీ పురము తిరిగి కాశీ ఖండములో వున్న 

ఆలయములు, ఆయన చిత్రపటము ప్రకారమూ సరిగా అదే స్థానములలో యుండుట గుర్తించి 

అచ్చెరువందినారు.

Professor John తన వెంట cosmic energy (వైశ్విక చైతన్య శక్తి) కొలువగలిగే radars 

(మార్గ దర్శనులను) మరియు GPS (Global Positioning System) ల ద్వారా ఈ 

ప్రదేశములు ఉనికిని ఆయన తెలుసుకొనగలిగినాడు. అసలు ఈ GPS అంటే ఏమిటి అన్నది 

చాలా మితముగా తెలిపే ప్రయత్నమూ చేస్తాను తెలియని వారి కోసము.

ఏదైనా ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించేది గ్రహం. గ్రహం చుట్టూ పరిభ్రమించే  

యంత్రపరికరాన్ని ఉపగ్రహం (Satellite) అంటారు అన్నది మనకు తెలిసినదే! భూమి చుట్టూ 

పరిభ్రమించేందుకు ప్రయోగించిన యంత్రాలను (Machine) మనము కృత్రిమ ఉపగ్రహాలుగా 

వ్యవహరిస్తూవుంటాము. ఇలాంటి కృతిమ ఉపగ్రహములెన్నో మన భూమి చుట్టూ, ఇతర గ్రహాల 

చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా సేవలందిస్తూ ఈ కృత్రిమ ఉపగ్రహాలు మానవ 

వనరులై మన మేధస్సుకు అద్దము పట్టుచున్నవి. కొన్ని ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ 

వాతావరణానికి సంబంధించిన ఫోటోలు తీస్తూ ముందస్తు హెచ్చరికలు అందిస్తాయి.  

మరికొన్ని ఉపగ్రహాలు ఇతర గ్రహాలు, సూర్యుడు, కృష్ణబిలాలు (Black holes),ఫోటోలు తీస్తూ 

విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతున్నాయి. చాలా ఉపగ్రహాలు అనేకములగు 

సంపర్క సమాచారములకు (Communications) ఉపయోగపడుతున్నాయి. మన ఇళ్ళలో 

కూర్చుని వేర్వేరు దూరదర్శని వాహినుల (TV Channels) లో వివిధ కార్యక్రమాలు 

(Programmes)  చూస్తున్నాము. ప్రపంచములోని నలుమూలల నుండి దూరవాణి పిలుపులకు 

(PhoneCalls) కు, కలన యంత్రములకు(Computers)కు అంతర్జాలమునకు(Internet) 

అనుసంధానానికి ఎన్నో అవసరాలకు ఉపగ్రహాలే ఆధారము. గోళస్థాన గ్రాహకము (Global 

Positioning System) (GPS) అన్నది కూడా ఇందులో ఒక భాగమే! సమగ్రమైన పరిశీలన 

పరిశోధన జరిగిన తరువాత ఆయన తన అభిప్రాయమును ఈ విధముగా తెలియజేసినాడు.

Each of the 12 sun temples were located in such a way that it indicated the 

movement speed and intensity of light during the apparent movement of 

the sun across the 12 signs of zodiac.

సాపేక్ష సూర్య భ్రమణములో 12 రాశులలోనూ, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నెల ఆయన 

ఉంటాడు అన్నది మనకు తెలిసిన విషయమే! ఆసమయములో సూర్యుని యొక్క కాంతి 

కదలిక, వేగము, తీవ్రత, ఆయా సూర్యదేవాలయముపై ప్రతిఫలించుచున్నదట. ఈ 

దేవాలయములను ఏ రాజూ కట్టించిన దాఖలాలులేవు. ఈ క్షేత్రము అత్యంత పురాణ ప్రసిద్ధము 

అయినది కాబట్టి ఈ దేవాలయాలు ఏ ఋషులు మునులు కట్టినవో అయివుందవలసినదే! 

మరి వారిలో ఇంత గణితశాస్త్రజ్ఞత వుండినది అంటే ఎన్నివేల సంవత్సరముల క్రిందటనే 

మనవారు ఎంతటి విజ్ఞాన ప్రజ్ఞావంతులో తెలియవస్తూవున్నది. Professor John M Melville 

తన ఆశ్చర్యమును ప్రకటించుతూ ఈ విధముగా అంటూవున్నాడు.

It is a mystery how the ancient Indians had fixed the site for these temples by 

mathematical calculation, through intuition or meditation.

అంటే  ఈవిధముగా ప్రత్యేకతను సంతరించుకొన్న స్థలములను, ఆ మహనీయులు ఎటువంటి 

యంత్ర పరికరముల సహాయము లేకనే, గుర్తించుటకు కారణము, భారతీయుల గణితశాస్త్ర 

విజ్ఞానమా, ధ్యానమా లేక జ్ఞానమా! అన్నది అర్థముకాక అబ్బురపడుచున్నానన్నాడు. నిరంతర 

ధ్యాన మగ్నము కల్గిన సాధకునికి ‘రుతంభర ప్రజ్ఞ’ అన్నది అలవడుతుందట. అది ఇటువంటి 

మహత్తర శక్తులను సాధకునికి కలుగజేస్తుంది. అట్టి మహానుభావులకు, ఇటువంటి ప్రతిభ 

అతీంద్రియ జ్ఞానము ద్వారా అబ్బుతుందని మన శాస్త్రములు తెలియజేయుచున్నాయి.

ఈ విషయము తెలిసిన తరువాతనైనా పాఠకులు తమకున్న పరిధిలో పదిమందికి తెలియజేసి 

మన దేశమునకు, మన ఋషులకు వాసి వన్నె తెస్తారని ఆశించుతాను.

మరొకమారు మరికొంత...........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-7వ భాగము

తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది. కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ – తులసీ ఘాట్ గోడమీద ఉన్న లోలార్కబింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది.

కాశీ పట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.

 

కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం. ఎన్నో విష్ణ్వాలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్న విష్ణ్వాలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతివారు దర్శనం చేయాలి.

తరువాత డుంఠి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీ పట్టణంలో ఉన్న డుంఠి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంఠి గణపతి అని పేరు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.

అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణములలో చేరి, ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకునిగా ఆ స్థితిని పొందినాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడుతాడు.

కాశీవిశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్ళు తీసుకు వెళ్లి, ఆయన తలమీద పోసేస్తే చాలు, ఆయనకు ప్రత్యేకముగా వేరేమీ తీసుకు వెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అన్నది ఒక నియమము. వారణాసి ఊరికే వెళ్లి వచ్చేయడం కాదు. మణికర్ణికా ఘట్టంలో స్నానము భక్తులకు తప్పనిసరి.

వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనము విశాలాక్షి అమ్మవారిని తప్పక దర్శనము చేసుకొనవలసి యుంటుంది. అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠ చేసినారు. దానియందు అయ్య, అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్లి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుందట.

‘కాశ్యాంతు మరణాన్ ముక్తిః’ – కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో మరణించునాతడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి గానూ పార్వతీదేవి వాని వద్దకువచ్చి కూర్చుని తన పమిటతో ఆ తనికివిసురుతుంది. వాడు సేదతీరి ఏ బాధలేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంఠి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అపుడు ఆ వ్యక్తి ఎంతగానో సేదతీరుతాడు. భృంగి వచ్చి లలాటమునందు మంచి సువాసనలు వెదజల్లే మారేడు దళములను నాసికము వద్ద ఉంచుతాడు. స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా అవసాన దశకు చేరుకొని వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడిచెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడట. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే లయమవుతున్నాయి. జన్మ జన్మల పాపములను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమపావనమయిన భూమి.

సానందమానందవనే వసంత మానందకందం హృతపాపబృందంl

వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యేll

మరొకమారు 8వ భాగము -------

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము 8వ భాగము

మహమ్మదీయ పాలకుల దేవాలయ పైశాచిక విధ్వంసకాండ

క్రీ.శ 1194 లో, ఒట్టోమన్ ముస్లిం ఆక్రమణదారుడు కుతుబుద్దీన్ ఐబాక్ పాలనా కాలములో కాశీలోని అనేక  ఆలయాలు కూల్చివేయబడినాయి. ఈతని తరువాత పాలించిన ముస్లిముల కాలములో కూడా ఎన్నో ఆలయాలు విద్వంసము కాబడినాయి.  విద్యా రాజధానిగా బనారస్ మధ్యయుగ కాలంలో కూడా  ప్రసిద్ధి చెందియుండినది. ఫిరోజ్ షా క్రీ.శ 1376 లో మిగిలిన పురాతన మందిరాలను, క్రీ.శ 1496 లో సికందర్ లోధిని కూల్చివేసినాడు. ఈ సమయంలో సూఫీ ఉద్యమము ప్రారంభమయి  అతిపెద్ద శాంతిదూతలుగా పరిగణించబడిన కబీర్ దాస్  మరియు సంత్ రవిదాస్ గారలు  హిందూ-ముస్లిం ఐక్యత కొరకు ఎంతో కృషి చేసినారు.       

కాశీ విశ్వేశ్వరాలయము-జ్ఞానవాపి మసీదు

కోల్కతా లోని ఏషియాటిక్ లైబ్రరీ లో మనము 1669 లో ఔరంగజేబు తనసేనానికి, కాశీ విశ్వనాథుని ఆలయము ధ్వంసము చేయ ఇచ్చిన ఫర్మానా మనము చూడవచ్చు.  ఆతని ఆజన ప్రకారమే మందిరము ద్వంసముజేసి అదేచోటున మసీదు కట్టటము సంభవించింది. ఆసమయమున విశ్వనాథ భక్తుడగు పూజారి స్వామీ జ్యోతిర్లింగమును గుండెకు ఆనించుకొని జ్ఞానవాపి (అనగా జ్ఞాన దాతయగు బావి) లో దూకినాడట. అందుచే అసలయిన జ్యోతిర్లింగము ఇప్పటికీ జ్ఞానవాపిలోనే ఉండిపొయినది. కానీ ఆ బావి మసీదు యొక్క ప్రాకారములో ఉన్నది. ఇప్పటికీ, ఇప్పుడున్న మందిరములోనే నిలిచిపోయిన నంది, మసీదు కట్టకమునుపు విశ్వనాథ లింగము ఉన్న స్థానము వైపే చూచుచుండుట  మనము చూడవచ్చు. అసలు కాశీ అన్న పేరునే తొలగించి ‘మొహమ్మదాబాదు’ అన్న పేరును ఆ పట్టణమునకు పెట్ట ప్రయత్నిచినాడు ఔరంగజేబు  కానీ ఆతని పప్పులు ఉడకలేదు. ఈ సందర్భముగా కవిరాజ్ చంద్రభాన్ కాశ్మీరీ, ఔరంగజేబుకు ఒక లేఖ ఈవిధముగా వ్రాసినాడు “ఏ శహన్ షా మేరె మందిర్ కా కరిష్మా దేఖ్. ఇస్ కే గిర్నేకే బాద్ భీ తేరే ఖుదా కా ఘర్ బంతా హై”. ధైర్యముగా ఔరంగాజేబునకే ఎంత గొప్ప మాట వ్రాసినాడో చూడండి. పడగోట్టించిన ఆలయమును 108 సంవత్సరముల తరువాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించినది. కాష్మీరునకు రాజయిన రంజీత్ సింహుడు 1853 లో తానూ సిఖ్ఖు మతస్థుడయి ఉండి కూడా గోపురములకు బంగారు తాపడము చేయించినాడు. ఇప్పటికీ ఈ గుడిని మసీదు ప్రక్కన నిలిచి మన దుర్భాగ్యమును గుర్తుచేస్తూనే ఉన్నది. చీనా యాత్రికుడు యువాన్ త్సువాంగ్ క్రీ.శ. 627-642 ల నడుమ మన దేశమును సందర్శించినపుడు వ్రాసిన ‘కాశీయాత్ర ఉపాఖ్యానము’ లో  నూరడుగుల ఎత్తు మందిరములో కాశీనాథుని జ్యోతిర్లింగము విరాజమానమాయి ఉండినట్లు తెలియవచ్చుచున్నది. ఇది చాలదన్నట్లు మహమ్మదీయులు లో మసీదుకు చుట్టూ ఉన్న ప్రాంతమంతా తమదేనని కోర్టు లో వ్యాజ్యము వేసినారు. 1936 లో చారిత్రిక ధార్మిక వాస్తవిక ఆధారాల కారణముగా ఈ వ్యాజ్యము వీగి పోయింది. ముస్లీములు హై కోర్టుకు పోయినా 1942 లో వారి తీర్పు కూడా వారికి ప్రతికూలముగానే వచ్చినది.

1669 లో వారణాసి మీదుగా, తనకు తోడుగానున్న హిందూ మిత్ర రాజులతో కూడి బంగాల్ పోతూ వుండినాడట. హిందూ రాజ పత్నులు వారణాశి లో గంగా స్నానము చేయ సంకల్పించుట చేత ఒక 5 మైళ్ళ దూరములో మజిలీ వెయ ఆజ్ఞాపించినాడట ఉదాత్త హ్రుదయుడగు ఔరంగజేబు. రాజ పత్నులు పల్లకీలలో వెళ్లి స్నానాదులు చేసి తిరిగీ స్థావరము చేరి చూస్తె కచ్చ్ రాణి తిరిగిరాలేదన్న సంగతి గ్రహించినారట. అపుడు ఔరంగజేబు తన సేనానాయకుని పనిచి ఆమెను వెదకి పిలుచుకురమ్మని చెప్పినాడట.

ఆటను ఆలయమునకు వెళ్లి రాణి కొరకు వెదకుతూ వుంటే ఆమె అతనికి ఒక మూలాన ఎక్కడో ఏడుస్తూ కనిపించినదట. ఆతను కారణమడిగితే విశ్వనాథుని మందిర అర్చకుడు తన శీలమును దోచుకొన్నట్లు చెప్పినదట. ఆమాటను ఆ సేనానాయకుడు ఔరంగజేబు చెవిని వేసినంతనే, అతడు ఆగ్రహోదగ్రుడై మందిరమును ధ్వంసము చేయించి మసీదును నిర్మింపజేసినాడట.

మార్క్సిస్టులు మహమ్మదీయులు కల్పించిన ఈ కట్టు కథలోని నిజానిజాలను ఒకపరి పరికించుదాము.

1.       బ్రాహ్మణ అర్చకులు ఎప్పుడూ సత్వగుణ సంపన్నులు. అందులోనూ దేవాలయ ప్రాంగణములో, అందులోను విశ్వనాథ జ్యోతిర్లింగము సమక్షమున ఇంత నీఛ కార్యమునకు గడంగుతాడా? అసలు అట్టి నీచుని గుణము సాటి అర్చకులకు ముందే తెలిసి ఆతనికి ఉద్వాసన చెప్పియుండరా!

2.    భక్తుల రాకపోకలు జరుగు సమయములో ఆ అర్చకునికి అసలు ఏకాంతము ఎట్లు లభించింది. దేవాలయములో రహస్య ప్రదేశములు ఉండవు కదా!

3.    ఇక ఆరాణి రాలేదన్న వెంటనే ఆమె భర్త స్వయముగా తానూ బయలుదేరి పోడా? ఎవరో పరాయి వాడిని పంపుతాడా!

4.    హిందూరాజులు, ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఆలయమునే విద్వంసము చేయమని చెబుతారా? అట్లు చెప్పుటయే గాక ఆస్తలములో మసీదు కట్టించమని కోరుతారా?

5.    ఈ విషయమునకు సంబంధించిన చారిత్రిక ఆధారము ఇప్పటివరకూ ఏదయినా దొరకినదా!

6.    కోల్కతా లోని ‘ఏషియాటిక్ లైబ్రరీ’ లో ఏప్రిల్ 1667 లో ఔరంగజేబు మందిర విధ్వంసము చేయుటకు నొసగిన ఆదేశపత్రము నీతికినీ అతని దుష్ట బుద్ధికి నిలువుతద్దమై నిలుచుచున్నది. మరి 1669 జరిగినట్లు చెప్పబడే పై కాకమ్మ కథ అవాస్తవమని మనకు అర్థమగుట లేదా!

ఇందులోని ఏ సందేహమునకూ జవాబు లేకుండా ఈ కాల్పనిక కథను నమ్మ వీలవుతుందా!

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 9వ భాగము

బిందుమాధవాలయము-ఆలంఘీర్ మసీదు

ఇప్పటి వరకు దొరకిన చారిత్రిక ఆధారాల ప్రకారము బిందు-మాధవ ఆలయం - “క్రీ.శ. ఐదవ శతాబ్దం  నుండి వారణాసిలోని అతి ముఖ్యమైన విష్ణు ఆలయంమత్స్య పురాణములో, ఆది కేశవ దేవాలయముతోబాటూ,వారణాసిలోని ఐదు ముఖ్యమైన తీర్థాలలో ఇది కూడా ఒకటిగా పేర్కొనబడింది. ఇది ప్రాకృతిక భీభాత్సములు జరిగిన ప్రతిసారీ పునర్నిర్మించబడినది.  16 వ శతాబ్దంలో అంబర్‌కు చెందిన రాజా మాన్ సింగ్ నిర్మించిన గొప్ప ఆలయంలో తిరిగీ బిందుమాధవుని పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగినది. ఆర్.వై.ఆర్. 26, రంజాన్  నెల 20/13 సెప్టెంబర్ 1682, రికార్డుల ప్రకారము, ఈ ఆలయాన్ని కూల్చివేసి, ఇక్కడ ఒక మసీదును నిర్మించమని ఔరంగజేబు

ఫర్మాన్ జారీ చేయుట జరిగినది. ఈ జారీ చేసిన, పర్షియన్ భాషలోని, ఫర్మాన్ ను దేవాలయము యొక్క స్థానములో కట్టించిన మసీదుకు ఎడమ వైపు  నేటికీ చూడవచ్చు. ఫర్మాన్ అందుకొన్న బనారస్ దివాన్ రఫీ-ఉల్-అమిన్, ఆలయమును నేలమట్టము చేసిన తరువాత  "ఆదేశాలకు అనుగుణంగానంద్-మాధో (బిందు-మాధవ్) ఆలయాన్ని కూల్చివేసినట్లు నివేదిక పంపుతూ ఈ వ్యవహారమును గూర్చి  ఇంకా   ఆదేశాలకై  ఎదురుచూస్తున్నట్లు తెలియజేసినాడు. అక్కడ ఒక మసీదు నిర్మించాలని చక్రవర్తి ఆదేశించినాడు. ఆ ఆదేశముల మేరకే ఆ మసీదు కట్టించబడినది. దీనిని ఆలంఘీర్ మసీదని, ధరేరా మసీదని అంటారు.

ప్రస్తుత ఆలయాన్ని 19 వ శతాబ్దంలో ఔంధ్ (సతారా, మహారాష్ట్ర) రాజా నిర్మించారు. ఈ ఆలయం దక్షిణ భారతీయులలో ఎంతో గౌరవించబడింది; బిందు-మాధవ దేవాలయమును  దక్షిణ భారతదేశములోని విష్ణు-కంచిగా భక్తులు గౌరవిస్తారు. ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు, ముఖ్యంగా మార్చి నెలలో.

 

బిందు మాధవ విగ్రహము నేడు ఆలయచ్ఛాయలే లేని  ఒక సాధారణ గృహములో వెలసియున్నది, భవనం యొక్క వెలుపలి భాగం వారణాసి సందులలోని ఇతర ఇళ్ళలాగానే  ఉంటుంది. ఎటువంటి అలంకారాలూ లేని విశాలమైన గదిలో సాలిగ్రామ శిలతో తయారు చేయబడిన ఈ విగ్రహము ప్రతిష్ఠింపబడి యుంటుంది.

'అన్నపూర్ణ ఇంటిలోనే అన్నమే కరువాయెనా' అన్నట్లు ధర్మబద్ధమగు మన దేవాలయములను పడగొట్టి మసీదులు కట్టించుకొన్నా, వంటి మీద వాలిన ఈగవలె దులుపుకొంటున్నాము.

 

కాశీపుర ప్రాధాన్యత ప్రత్యేకత

విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవంl

వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాంll

కాశీ ప్రపంచానికి అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరము మరియు ఆధ్యాత్మిక రాజధాని. స్వయంగా పార్వతీ సమేతుడై శివుడు స్వయంయ్గా నివాసముంటాడని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి.  ప్రళయకాలంలో కూడా మునుగని అతి ప్రాచీన పట్టణము. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పై కెత్తి కాపాడతాడని ప్రతీతి. కాశీ భువి పై ఉన్న సప్త మోక్షదాయక క్షేత్రములలో అతి ముఖ్యమైనది మరియు ద్వాదశ జోతిర్లింగాలలో శ్రేష్ఠమైనది.  కాశీలో గంగా స్నానం, మొదట విశ్వనాథుడు, బిందు మాధవ దర్శనం, డుంఠి గణపతి, దండపాణి, కాలభైరవ దర్శనముఒకప్పుడు 72 వేళా ఆలయములు కల్గిన కాశీ క్షేత్రము, స్కందుడు, గంగానది, అమ్మవారు అన్నపూర్ణ, మణికర్ణికా ఘట్టము అత్యంత ప్రాముఖ్యమయినవని పైన చెప్పిన శ్లోకము తెలియజేయుచున్నది. లోకమాత  విశాలాక్షి కూడా అత్యంత దర్శనీయమయిన మహిమాన్విత విగ్రహము.  

1. కాశీ విశ్వనాధుని దేవాలం 2. అన్నపూర్ణాలయం 3. విశాలాక్షి ఆలయం 4. కాల భైరవాలయం 5. మృత్యుంజయేశ్వరాలయం 6. సారనాద్ మందిరం 7. వ్యాస కాశి 8. దండపాణి మందిరం 9. చింతామణి గణపతి మందిరం 10. బిర్లా టెంపుల్ 11. సంకట విమోచన హానుమాన్ మందిరం 12. శ్రీ త్రిదేవి మందిరం 13. దుర్గా మందిరం 14. తులసి మానస మందిరం 15. గవ్వలమ్మ మందిరం 16. కేదారేశ్వర మందిరం 17. తిలబండేశ్వరాలయం 18. జంగన్ వాడి మఠ్ 19.గంగా హారతి 20. బిందు మాధవుడు 21. వారాహిదేవి 22. దత్తమందిరము (దత్తపీఠము ) ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. ఇవి అతి కొంచెము మాత్రమే. మానవ శరీరములోనే 72 వేల నాడుల ప్రతీకగా ఇక్కడ 72 వేల మందిరములు వెలసియుండేవట.

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడని అంటారు. కాశీలో మరణించిన వారికి యమ బాధ తప్పి పునర్జన్మ ఉండదట.  డుంఠి గణపతి, కాలభైరవుడు కాశీలో మరణించిన ఒక్కొక ప్రాణి యొక్క చిట్టా చిత్రగుప్తుని వద్దనుండి తెప్పించుకొని పరిశీలించి యమ యాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తారట.కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తరవాత పూజారులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీ దారం కడతారు. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. కాబట్టే జీవిత చరమాంకమును చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే మోక్షప్రాప్తిని పొందుతాడు.

గోముఖం నుండి బయలు దేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘట్టముల (ఘాట్) దూరం జరగలేదు. కాశీ లో కొన్ని వింతలు : కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు, గొందులు కలిగి ఆ సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికి జాడ దొరక కుండా ఉంటుంది. కారణము ఏమిటంటే దేవాలయములు ముస్లిముల వాత పడకుండా ఉండుటకు. అయినా వారి దౌష్ట్యానికి దేవాలయములు విద్వంసము కాక తప్పలేదు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్య పోయారు. అప్పటి పూర్వీకులు శక్తి పాతము వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుని అభిషేకించిన తరవాత భక్తుల చేతి రేఖలు మారి పోతాయని అంటారు. విశాలాక్షి అమ్మవారిది శక్తి పీఠము. జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలో అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీ లో వున్నది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు, ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి అందులో కొన్ని :- 1) దశాశ్వమేధఘాట్:- బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. ఇప్పటికీ రోజూ సాయంకాల సమయంలో విశేషమైన గంగా హారతి జరుగుతున్నది. ఈ హారతి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఎంతటి వారికైనా ఇక్కడ భక్తి పరవళ్ళు తొక్కుతుంది. ప్రయాగ్ ఘాట్: ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా, సరస్వతిలు కలుస్తాయి. 3) సోమేశ్వర్ ఘాట్: చంద్రుని చేత నిర్మితమైనది. మీర్ ఘాట్: సతీదేవీ కన్ను పడిన స్థలం. ఇక్కడే యముడు

ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. నేపాలీ ఘాట్:- పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు. మణి కర్ణికా ఘాట్: ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించినాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట. విశ్వేశ్వర్ ఘాట్:  ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్య తప్పస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవున్ని దర్శిస్తారు. పంచగంగా ఘాట్: ఇక్కడే భూగర్భం నుండి గంగలో ఐదునదులు కలుస్తాయి. గాయ్ ఘాట్: ఇక్కడ గోపూజ జరుగుతుంది. తులసి ఘాట్: తులసిదాస్ సాధన చేసి రామచరితమానస్ లిఖించమని శివుని ఆదేశం పొందిన స్థలము. హనుమాన్ ఘాట్: ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వానర రూపములో వస్తుంటాడని అంటారు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండము ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించినారు. అస్సిఘాట్: పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపిన ఖడ్గమును ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థంగా ఉద్బవించింది.  హరిశ్చంద్రఘాట్: సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం చేసే కూలీగా పని చేసి, దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు, ఈ రోజు వరకు కుడా ఇక్కడ ఎప్పుడూ శవాలను కాలుస్తూ ఉంటారు. మానససరోవర్ ఘాట్: ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుందని. నారద ఘాట్: నారదుడు లింగం స్థాపించాడు. చౌతస్సిఘాట్: ఇక్కడే స్కంధ పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ఇష్టమైన స్థలం, ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయని అంటారు. 17) రాణామహల్ ఘాట్: ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నము చేసుకున్నాడని అంటారు. అహిల్యా బాయి ఘాట్: ఈమె కారణం గానే మనం ఈ రోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీ లోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయుల దండ యాత్ర కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసినారు ఎంతో సుందరంగా ఉండే క్షేత్రాన్ని విద్వంసం చేయగా మిగిలిన కాశీని ప్రస్తుతం మనం చూస్తున్నా కాశీ. విశ్వనాథ, బిందు మాధవముతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చివేసి అదే స్థలంలో మసీదులు నిర్మించినారు. నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించినారు. కాశీ పుణ్యక్షేత్రం గురించి, ఇక్కడి మహత్యాల గురించి స్వయంగా అనుభవిస్తే తప్ప చెబితే అర్ధం అయ్యేది కాదు. మచ్చుకు రెండు మూడు ప్రస్థావించుతాను.

మిగిలినది మరొకసారి.........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 10వ భాగము

 జగద్గురు శంకరుల కాశీ వాసము

శంకరులవారు కాశీలోవున్నకాలములో  ఒకనాడు వ్యాసమహరి స్వయంగా ఆచార్యులవారిని అనుగ్రహించాలనుకొన్నారు. ఈశ్వరావతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసినదిగా శ్రీ గోవిందభగత్పాదులవారికి ఆజ్ఞాపించినవారు వ్యాసులే. వారు శంకరభాష్యము లోకోపకారకమైన మహాగ్రంథమని లోకం గ్రహించేలా చెయ్యాలనుకొన్నారు. శంకరభాష్యం ప్రశస్తమైనదని నలుగురూ తెలుసుకొనవలెనంటే, దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి, శంకరులు వానికి అన్నిటికి సమాధానాలు చెప్పాలి; అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడి అవుతుంది అని ఆయన తలపోసినాడు. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యులవారి వద్దకు వచ్చి వారి భాష్య రచనపై జటిలమైన వాదమును లేవనెత్తినారు. వ్యాసులవారి ఆక్షేపణలకు ఆచార్యులవారు సమాధానాలు చెపుతున్నారు. వ్యాసులవారు ఆచార్యులవారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యులవారు వానికి యుక్తియుక్తంగా సమాధానాలు చెపుతున్నారు. ఇలా జరిగే వాదప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థంకాని క్లిష్టస్థితికి చేరుకొన్నాయి. ఈ వాదప్రతివాదములు చూచి ప్రక్కనున్న శిష్యులు, ఇతరులు కూడా ఒకరి మొగాలు ఒకరు చూచుకొనసాగినారు. వృద్ధబ్రాహ్మణరూపంలో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరుగెడుతూ ఉంటే ఆచార్యులవారి ప్రతివాదం సాగరగంభీరమై అలరారుతోంది. అపుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదులవారు 'ఉద్దండవాదన కొనసాగించే యీ వృద్దబ్రాహ్మణుడెవరై ఉంటాడు?' అని జ్ఞానదృష్టితో పరింకించి, 'ఈ వచ్చినవాడు వ్యాసుడు' అని గ్రహించి, వెంటనే

'శంకర శ్శంకర స్సాక్షాత్‌ వ్యాసో నారాయణ స్స్వయం|

తయో ర్వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం||'

శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము అయినవారు. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేమి చేయగలను? అని పలికి, వాస్తవముగా ఈ భాష్యము మీహృదయములోని అభిప్రాయలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి' అని వ్యాసులవారిని ఆర్థించేరు. తత్‌క్షణమే వ్యాసులు నిజరూపం ధరించినారు.

అపుడు శంకరులు - నేను వచ్చిన పని పూర్తి అయింది, పదునారేడులు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి' - అని వ్యాసులతో పలికినారు. దానికి వ్యాసులవారు నేను మరియొక పదునారేడ్లు అనుగ్రహించుచున్నాను; భాష్యరచన మాత్రము చాలదు, దానిలోని సిద్ధాంతములను భరత ఖండమున ప్రచారము చెయ్యవలెను, ఎటుదిరిగీ కొందరు ఏవో ఆక్షేపణలు తప్పక లేవదీస్తారు, వానికి సమాధానాలు చెప్పాలి; భాష్యవిషయాలను సిద్ధాంతీకరించాలి' - అన్నారు. శంకరులు దానికి అంగీకరించినారు. వ్యాసుల కోరికను తీర్చుటకై వారు దిగ్విజయము గావించినారు.

మరొక విషయము. శంకరులు కాశీనగరంలో ఉన్న సమయంలో వారిని ఆశ్రయించి శిష్యులైనవారిలో పద్మపాదాచార్యులవారు ఒకరు. వారికి ఈ పేరు ఏర్పడడానికి కారణమైన కథ ఒకటి ఉన్నది.

ఒక నాడు పద్మపాదులవారు గంగ కావలి యొడ్డు, శంకరులు గంగ కీవలియొడ్డున ఉన్నారు. ఆ సమయంలో శంకరులు గంగలో స్నానం చేసినారు. వారి బట్టలు తడిసి ఉన్నాయి. వారు ధరించవలసిన పొడిబట్టలు ఆవలి యొడ్డున పద్మపాదులదగ్గర ఉన్నాయి. శంకరులు పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటదలచి - 'ఆ వస్త్రములు తీసికొని రమ్మని' - ఆజ్ఞాపించేరు. పద్మపాదులకు గురువు ఆజ్ఞవినగానే గంగ విషయము, దాని లోతు, వేగము అన్నీ మరచిపోయేరు. ఆయన వస్త్రములు చేతబట్టుకొని నేలమీద నడచినటులే గంగలోకూడా నడవసాగినారు. అప్పుడు గంగ వారి పాదాలక్రింద పద్మాలను వికసంపజేస్తూ వచ్చింది. అనగా వారి పాదాలు గంగమీదకాక గంగలో ఆయన పాదములక్రింద వికసించిన  పద్మములపై పడుతూ వచ్చినవి.

 ఈ విధంగా వారు గంగను దాటి గురువును సమీపించినారు. ఇది చూచిన వారంతా వారి గురుభక్తిని కొనియాడేరు. ఆ నాటినుండియు పద్మములచే భరింపబడిన పాదములుకలవారైనందున వారికి 'పద్మపాదులు' అని పేరు ఏర్పడినది.

 గంగదాటి వచ్చిన పద్మపాదులను జూచి - 'మీరుగంగను ఎలా దాటినారు?' - అని ప్రశ్నించగా వారు - ఏ ఆచార్యుని స్మరిస్తే సంసారసాగరమే మోకాటిలోతుగా మారుతుందో, ఆ ఆచార్యుల ఆజ్ఞాపాలనలో గంగ అడ్డు కాలేదంటే ఆశ్చర్యమెందుకు? అని బదులు పలికినారట.

మిగిలినది మరొక మారు .........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 11వ భాగము

 జగద్గురు శంకరుల కాశీ వాసము

కాశీలో జరిగిన తోటకవృత్తాంతమును ఇపుడు చూద్దాము.

ఆదిశంకరులవారిని నుతిస్తూ వారి నలుగురు ప్రథమ శిష్యులలో ఒకరైన, ఆనందగిరి 

అన్న పూర్వ నామము కలిగి, శంకరులచేత ప్రతిష్ఠింపబడిన ఉత్తరామ్నాయ 

పీఠమునకు మొదటి పీఠాధిపతియైన తోటకాచార్యులవారు, ఆపెరును ఎట్లు 

సార్థకము చేసుకొన్నారో తెలుసుకొందాము. ఆయన శంకరులవారి శిష్యులయిన 

కొత్తలలో మందమతిగా వుండేవారట. అందుచే అందరూ ఆయనను 'గిరి' అని 

'అచల' అని పిలిచేవారట. అంటే వారి దృష్టిలో ఆయన అంత మొద్దు.

కాశీలో, ఒకనాడు శంకరులవారు ఆనందగిరి యొక్క అచంచల భక్తిని మిగత 

శిష్యులకు చూపనెంచి, ఆవల ఒడ్డుననున్న తన ఆరవేసిన బట్టలను తెమ్మన్నాడు. 

శిష్యులు ఆలస్యమును సహించలేక పాఠము చెప్పమని శంకరులవారిని తొందర 

చేసినారు. శంకరులవారు తమ తపః శక్తితో ఆనందగిరిని సకల వేదశాస్త్ర పండితుని 

గావించినాడు.

బట్టలు తెచ్చి నిలిచిన ఆనందగిరి పారవశ్యముతో తదేకముగా గురువును చూస్తూ

కష్టమగు తోటక వృత్తములో, గురుస్తోత్రమును ఎనిమిది శ్లోకములలో చేసినాడు. 

అదే తోటకాష్టకముగా ప్రసిద్ధినందినది. ఆయన అప్పటినుండి తోటకాచార్యులుగా 

పిలువబడినారు.

ఇపుడు కాశీలో శంకరులవారు జగతికి అందించిన అనర్ఘ రత్నమగు ‘మనీషా 

పంచాకము’ను గూర్చి తెలుసుకొందాము.

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరినారు. అపుడొక ఛండాలుడు వారికి ఎదురుగా నాలుగు కుక్కలతో సమీపించినాడు. ఆచార్యుల శిష్యులు ఆతనిని దూరంగా తొలగమన్నారు. కాని అతను తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించినాడు.

అన్నమయా దన్నమయం, అధవాచై తన్యమేవ చైతన్యాత్‌|

ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి?||

- మనీషా పంచకం.

బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రో2యం శ్వపచో2య మిత్యపి మహాన్‌కో2యం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని|

శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పినారు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివో2హం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ప్రశ్నించినాడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.

దోసెడు నీళ్ళు నేలపై చల్లినామనుకొందాము. అపుడు అవి ఎన్నో జలకణాలై నేలమీద పడతాయి. ఆ జలకణాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఆకాశంమీద సూర్యుడొక్కడే ఉన్నాడు. ఆ ఒక్క సూర్యుడూ ఈ చిన్న పెద్ద జలకణాలలో చిన్నవాడుగా పెద్దవాడుగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఆ జలకణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలున్నూ అంతరిస్తాయి. ఆకాశము లోని సూర్యబింబము ఒక్కటే మిగులుతుంది. అలాగే పరమాత్మ అంతఃకరణోపాధుల యందు ప్రతిబింబిస్తాడు. ఆ ఉపాధుల భేదాల ననుసరించి ప్రతిబింబ భేదాలు ఉంటాయి. ఉపాధియైన అంతఃకరణము అనగా మనస్సు లేకపోతే యీ ప్రతిబింబము ఉండదు. బింబమైన పరమాత్మయే నిలిచి దీపిస్తాడు. మనస్సు ప్రవాహం వంటిది. ప్రవాహం అంటే సంతతమైన గమనము కలిగియుంటుంది. మనస్సు యొక్క యీ గమనాన్ని నిలిపితే మనస్సు ఉండదు. ప్రతిబింబం ఉండదు. బింబమైన పరమాత్మ అద్వయమై, అవ్యయమై భాసిస్తుంది. ఇది స్థూలముగా బింబ ప్రతిబింబవాదము.

ఇక అవిచ్ఛిన్నవాదము. అది కూడా పైవిషయాన్నే నిరూపిస్తుంది కాని విధానము వేరు. బావిలో నీరున్నది. అందులో నుండి ఒక ఘటము నిండుగ నీరు తీసినామని అనుకొందాముము, ఘటములోని నీరు బావిలోని నీరు ఒక్కటే కాని ఉపాధిభేదం ఉన్నది. ఆకాశం అంతటా ఉన్నది. అంతటా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అంటారు. ఘటంలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఘటం ఉన్నంతవరకు ఘటాకాశం మహాకాశం వేరువేరుగా కనిపిస్తాయి కాని ఘటం పగిలిపోగానే ఒక్కమహాకాశమే గోచరిస్తుంది. అలాగే ఉపాధిభేదాన్ని బట్టి అనగా మనసుయొక్క వ్యత్యసస్థితిని బట్టి పరమాత్మకూడా వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంటాడు. ఘటం పగులగానే ఘటాకాశ మహాకాశాలు ఒక్కటైనట్లు మనస్సు నశించగానే అద్వయమైన పరమాత్మ గోచరిస్తాడు. ఇది అవిచ్ఛిన్నవాదం.

ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ ఛండాలుడు ఆచార్యులవారితో తర్కమునకు దిగినాడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరుకలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ ఛండాలుడు పేర్కొన్న వస్తువు ఙ్ఞాన సముద్రము లేక ఆనంద సముద్రము అయినది. జ్ఞాన ప్రాప్తి జరిగితే ఆనంద సాగరమున ఒలలాడుచున్నట్లే! నిరవధికమైన ప్రేమతో మరియు చైతన్యముతో నిండినదియే ఆనంద సాగరము. అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని ఆ ఛండాలుడు ఆచార్యులవారిని ప్రశ్నించినాడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పవలెనని మనము భావిస్తాము. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడిందికాబట్టి ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పినారు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇంతటి మహాపురుషులని నాకు ఇప్పుడు గోచరమైనది. నేను ఇప్పుడు బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్న వాస్తవాన్ని తెలుసుకొన్నాను అని సవినయముగా ఆ బ్రహ్మవేత్తయగు ఛండాలునికి నమస్కరించినాడు. అప్పుడు ఆదిశంకరులద్వారా పురుడు పోసుకోన్నదే ‘మనీషా పంచకము’. జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది అన్న ఈ విషయమునే వివరణాత్మకముగా శ్రీ శంకరులు 'మనీషాపంచకము' అన్న పంచశ్లోకావళిని  మనకు అందించినారు.

చకార కుక్షి

భోజరాజు ఆస్థాన కవిపండిత మూర్ధన్యుడైన కాళీదాసునకు కాశీ పట్టణమున జరిగిన ఈ ఉదంతమును చదవండి.

కవికులగురువుగా గణుతికెక్కిన  సంస్కృత మహాపండితుడు మహాకవి కాళిదాసు.

సంస్కృతములో అజరామరమైన రఘువంశము కుమార సంభవము , మేఘ

సందేశము వంటి కావ్యములు మరియు అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్ని మిత్రము,

విక్రమోర్వశీయము  వంటి నాటకము లు వ్రాసిన మహాను భావుడు.

ఒక సందర్భంలో కాళిదాసు కాశీకి పోతాడు. ఎందుకు ఎప్పుడు ఎవరితో అన్న ప్రశ్నలు దయతో వేయవద్దు. చాటువులలో ఆ వివరాలు నేనెక్కడా గుర్తించలేదు. కాళిదాసు కాజోలు (ప్రసిద్ధ హిందీ నటి) కాయస్త

వంశజులటనే అని ఒక పాఠకుడు అడిగినాడు. నా ఉద్దేశ్యములో వారిని  కలుపుచున్నది ఏకై''బంధమే. చాటువులు చదివేటపుడు చరిత్రలోకి దయతో పొవద్దు. ఆయన చరిత్రను గూర్చి మరొకసారి ఎప్పుడైనా ముచ్చటించుకొందాము.

మహాభారత రచయిత అయినవేదవ్యాసుని విగ్రహం చూసి, ఆ విగ్రహము బొడ్డులో వ్రేలు పెట్టి, ఈయన "చకార కుక్షి" అని ప్రక్కవ్యక్తితో హేళనగా అన్నాడట మన కాళీదాసు. అంటే పొట్ట (కుక్షి) నిండా ''కారములున్నవాడు అని అర్ధం. వ్యాసులవారికి కోపము వచ్చింది, దానితో కాళీదాసు వ్రేలు వ్యాసవిగ్రహపు బొబొడ్డులోనే ఇరుక్కుపోయింది.

దీనికి కారణం ఒకటుంది.

మహాభారతం వ్యాసుల వారు చెబుతూ వుంటే వినాయకుడు వ్రాయడానికి ఒప్పుకొంటాడు. అయితే వినాయకుడువ్యాసునికి   ఆపకుండా చెప్పాలని ఒక షరతు పెడతాడు. వ్యాసుడు తెలివిగా క్లిష్టమైన సమాసాలతో శ్లోకాలు చెప్పడం మొదలు పెడతాడు.  అవి అర్థం చేసుకోవడానికి వినాయకుడు స్వల్ప వ్యవధి తీసుకొనేవాడు. వానిని వ్యాస ఘట్టములు అంటారు. ఆ కాస్త సమయాన్ని వ్యాసుడు తరువాత శ్లోకం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకునేవాడు.

వినాయకుని వేగమునకు సరిదీటుగా శ్లోకములను చెప్పుటకు గానూ వ్యాసులవారు 'చ కారములను ఎక్కువగానేవాడవలసి వచ్చేది. వారి వేగము మనము ఊహించుకోలేము. అందుకే మహా పండితుడైనకాళిదాసు ఆయనను చకార కుక్షి అని ఆక్షేపిస్తాడు.  దానికి కోపమొచ్చిన వ్యాసుడు కాళిదాసును ఒక్క చకారం కూడ లేకుండా ద్రౌపదికి, పాండవులకు గల బాంధవ్యాన్నిశ్లోకరూపములో చెబితే గాని వ్రేలు వదలనని చెబుతాడు. "రక్షించినారు స్వామీ!" అని కాళిదాసు ఈ దిగువశ్లోకము చెబుతాడు.

ద్రౌపత్యా పాండుతనయాః పతిదేవరభావుకాః

నదేవరో ధర్మరాజః సహదేవో నభావుకః

ధర్మరాజు మరిది కాడు, సహదేవుడు బావ కాడు అని ఒక్క 'చకారం' వాడకుండా ఈ చమత్కార శ్లోకము చెప్పినాడు కాళీదాసు.  వ్యాసుడు సంతసిల్లి కాళీదాసును దీవించి పంపుతాడు.

మనము కాళిదాసు దండి భారవిని గూర్చి ఎంతో గొప్పగా చెప్పుకొన్నాము చెప్పుకొంటూ వుంటాము . అసలు ఈ శ్లోకము చూడండి.

ఉపమా కాళిదాసస్య భారవే అర్థ గౌరవహ:

దండిన్యా పద లాలిత్యం మాఘై సంతి త్రయో గుణః

మాఘ కవి శిశుపాలవధ అన్న ఒక్క కావ్యమే వ్రాసినది.మిగతవి ఏవయినా వ్రాసినాడేమో నాకు తెలియదు.  కాళీదాసు ఉపమాలంకారములు, భారవి యొక్క అర్థ గౌరవము, దండి యొక్క పదలాలిత్యము ఆ కావ్యమునకు సొంతమట. ఆయనెంత గొప్పవాడో చూడండి.

అంతంత పౌరాణిక చారిత్రిక పురుషులు నడయాడిన ప్రాంతము కాశి.

మరొక మారు 'త్రైలింగ స్వామి' వారిని గూర్చి తెలుపుతాను.......

త్రైలింగ స్వామి

మన తెలుగువాడై యుండికూడా తెలుగువారిచే అధికముగా గుర్తించబడని త్రైలింగ స్వామిని గూర్చి ఈ విశ్వనాథ జ్యోతిర్లింగము అన్న శీర్షిక క్రింద వ్రాయుట అసంగతముగా నేను అనుకోనుటలేదు. ఎందువల్ల అంటారేమో ఈయన , మహా మహిమాన్వితుడై , మహామహులచే మహానీయు డనిపించుకొని విశ్వనాథునిలో లీనమైన వారు.(సినిమాలలో చూపే విధముగా కాదు). వారి పాదదోయికి సాష్టాంగ ప్రణామముల నాచరించూదాము.

మనకు ప్రేమానంద తెలుసు, నిత్యానంద తెలుసు, బాలసాయి తెలుసు, అసారాం తెలుసు,పీర్ బాబా తెలుసు కానీ నిజమైన యోగుల గూర్చి తెలియదు. ఎందుకంటే ప్రచార సాధనాలకు కావలసిన మసాలాలు నిజాయితీ లో  వుండవు. ఒక స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి,స్వామి శివానంద,లాహిరీ మహాశయులు ఈ విధంగా చెప్పుకొంటూపోతే చెంతాడంత అయ్యే ఈ మహనీయుల గూర్చి మన వార్తా పత్రికలలో, దుర్దర్శనులలో(దూర దర్శనులలో) బహు తక్కువగా వింటాము. ఈ జాబితాలోఒక మహారత్నమే త్రైలింగ స్వామి. ఇప్పుడు, మన తెలుగు వాడయి వుండి మనలో ఎక్కువమందికి తెలియని,తెలిసినా తలువని,తలచినా  తెలుపని ఆ మహనీయుని గూర్చి తెలుసుకొందాము.

పుట్టింది తెలుగు నాట నయినా ,ఆయన జీవితములో అధిక శాతము కాశీ లోనే గడిచింది .ఆయన చూపించిన మహిమలు పొందిన సిద్దులు, దివ్య విభూతులు అనేకం,అపారం, అనంతం .ఆయన అసలు పేరు శివ రామయ్య. విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామము లో జన్మించినారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబము. ఆయన జననం  19 -12 -1607   తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుండి ఐహిక వాంఛల  మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చని పోవడం జరిగింది. శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళ దాకా గడిపి హటాత్తుగా స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో వున్న బస్తర్ చేరి అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళి ఆయనతో సన్యాస దీక్ష గడించి గణపతి స్వామి అనే దీక్షా నామమును స్వీకరించినాడు. గురు సమక్షం లో పదేళ్ళు సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు. సిద్ధులు పొందిన కాలమునుండి ఆయన దిగంబరుడే! ఆయనకు అప్పుడు 78 సంవత్సరాలు వయసు. గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరినాడు. అచ్చట ఆయన చూపిన  లీలలకు ఆశ్చర్య చకితులై ఆయనను అపర రామలింగేశ్వరుడేయని  కొనియాడినారు అక్కడివారు .అక్కడి నుండి నేపాల్ చేరి అక్కడ అడవి లో తపస్సు చేసుకొంటూవుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగా చేష్టలుడిగి కూర్చొని వుండి పోయింది. రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి  పులిని చంపటానికి ప్రయత్నిస్తే వలదన్నాడు ఆయన. నేపాల్ రాజుకు ఆవిషయము తెలుపగా ఆయన వచ్చి సాష్టాంగ దండ ప్రణామమునాచరించి అనేక కానుక లిస్తే వలదని  జంతు హింస చేయ వద్దన్న హితవు చెప్పి అక్కడి నుండి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలము తపస్సు చేసి నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించినాడు. ఒక రోజూ తెల్లవారు ఝామున నర్మదా నది లో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నట్లు ఈయన దానిని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూసి ఆయన మహిమ ను గుర్తించడం జరిగింది. ఆవిషయము స్వామికి తెలిపితే తనను వదలి వెళ్ళిపోతాడని మిన్నకుండినాడు. అయినా ఈయన ఒక చోటునుండే వాడు కాదు గదా!

           1733 లో  ప్రయాగ చేరినారు .తపో నిష్ఠలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పడవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్ఞ చేయడమే కాకుండా,అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే  . స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించినాడు. ఆశ్చర్య పడటము శిష్యుని  వంతైనది.

  ఊరూరు తిరుగుతూ వీరు 1737 లో తన 130వ ఏట కాశీ చేరడము జరిగింది. అంతే ! తాను, జీవాత్మనుపరమాత్మ సాయుజ్యము చేర్చేవరకు అంటే 150 సంవత్సరములు కాశీ లోనే గడపడము జరిగింది. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహము. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరముతో దిశమొలతో. మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, బాన కడుపుతో కాశీ నగర వీధుల్లో సంచరించే వాడు. క్షురకులెవరైనా తనకు క్షురకర్మ చేస్తే చేయించుకొనేవాడు. గంటల కొలదీ గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు లేదంటే గంటల కొద్దీ నీటిలోనే మునిగియుండే వాడు. ప్రాణాయామమంటే శ్వాస నియంత్రణ. రేచక (గాలిని బయటికి వదలడం), పూరక (లోనికి పీల్చడం), కుంభక (లోపలి ప్రాణ వాయువును అలానే నిలిపి ఉంచడం ) హృదయాన్ని పరిపుష్టం చెయ్యడానికి, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ప్రాణాయామం ఉపకరిస్తుంది. ఇందులో ఆ మహనీయుడు పరాకాష్ట నందుకోగలిగినాడు కాబట్టి ఆయనకు ఆ విద్యలు సిద్ధించినాయి. కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించినాడు స్వామి. వేద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతానాథ బంధోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరినాడు. కొంత కాలము తరువాత అక్కడినుండి దశాశ్వమేధ ఘాట్ కు తన మకామును మార్చినాడు ఆ మహనీయుడు.  ఒక మరాఠీగృహిణి రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తూ ఈ దిగంబర స్వామిని చూసి ఏవగించు కొనేది .ఆమె భర్తకు రాచపుండు. ఆవిడ శ్రేయోభిలాషులెందరో ఆమెను దిగంబరస్వామి శరణు వేడమన్నారు. తాను ఏవగించుకొనే వ్యక్తిని శరణు కోరడము ఆమెకు మింగుడు పడలేదు. భర్త వ్యాధి ముదర జొచ్చింది. గత్యంతరాలన్నీ తలుపులు మూసివేయడముతో స్వామిని శరణు కోరక తప్పలేదు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి

ఆయన కాళ్ళ మీద పడింది. దయామయుడైన ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది.

                  కాశీ మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గావుండేవారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించినారు. వారు ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టినారు. తెనుగు దేశము అంటే త్రిలింగ దేశమే కదా! అప్పటి నుండి ఆయనకు ఆపేరే స్థిరపడి పోయినది. 1800  లో తన స్థావరమును దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవానికి మార్చినారు.

ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు యోగ సమాధిలో ఉండటమే! అందుకే ఆయనను ”మౌన బాబా ”అన్నారు .ఆనోటా ఈనోటా స్వామివారి మహాత్మ్యము ప్రాకి కాశీ రాజును చేరింది. ఆయన గంగా నదిలో వున్నారని తెలిసి తన పడవలో ఆప్రాంతము చేరినారు. స్వామిని గుర్తించి పడవలోనికి సాదరముగా ఆహ్వానించినారు. స్వామి అందులో కూర్చున్న తరువాత వారితో ముచ్చటిస్తూ బ్రిటీషు వారు తన గొప్పదనమునకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గమును స్వామికి చూపింప దలచి ఆయన చేతికందివ్వబోతే అది జారి గంగలో పడిపోయింది. వెంటనే అంత లోతుకు దిగి దానిని తెచ్చేవారు సులభముగా దొరకరుకదా! వారు వచ్చేవరకు కత్తి గంగలో వున్న చోటనే ఉండిపోవదు కదా! ఖిన్నుడయిన రాజును చూసి స్వామి పడవలో కూర్చొనియుంటూనే తన చేతిని గంగలోపలికి పోనివ్వజేసినాడు. ఆచేయి ఎంత లోతుకుపోయినదో మనకు తెలియదు కానీ అది బయటికి మాత్రం రెండు ఒకే విధమైన కత్తులతో వచ్చింది. తన కత్తిని తీసుకొమ్మని రాజును అడిగితే ఆయన అది గుర్తించలేకపోయినాడట. స్వామి రాజుకత్తిని రాజుకు ఇచ్చి రెండవ కత్తిని తిరిగీ గంగలో పారవేసినాడట.

           దిగంబరంగా తిరగటం కొంత మందికి నచ్చక స్వామిపై  కేసు పెట్టినారు ఆయన గొప్పదనము తెలియని కొందరు మూర్ఖులు. కోర్టు లో కేసు నడిచింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని న్యాయాధీశుని ఉత్తరువు. రాజు తలచితే దెబ్బలకు కొదువా! స్వామిని తక్షణము న్యాయస్థానములో ప్రవేశ పెట్టినారు. ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివరించినా ఆయన పెడచెవిని పెట్టటము జరిగింది కారణము అతను ఆంగ్లేయుడు. స్వామి శుద్ధ శాఖాహారియని తెలిసిన ఆ న్యాయాధిపుడు  మాంసము స్వామి తింటే శిక్షించను అన్నాడు.  స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. జవాబు వచ్చేలోపలే  తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని ఆ మహానుభావుడు తినివేయుట జరిగినది. విడ్డూరమైన విషయము ఏమిటంటే  దుర్గంధమునకు బదులు సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. మతి పోయింది న్యాయాధీశునకు! స్వామి మహిమను గ్రహించిన న్యాయపతి వారు దిగంబరముగా తిరగవచ్చునన్న తీర్పును ఇచ్చివేయడము జరిగింది.

ఒక సారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తూవుంటే మర్మాంగాన్ని గుంజినాడు. అది అలాగే కొన్ని గజాలు సాగింది. వాడు భయ పడి పారి పోయినాడు. దుండగులు కొందరు ఆయనకు సున్నపు తేటనిచ్చి పాలు అని చెప్పినారు. స్వామి ఎటువంటి తటపటాయింపు లేకుండా శుభ్రంగా త్రాగినాడు. ఆ దుండగుని కడుపు మండనారంభించింది. వాడు తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై వాలినాడు. స్వామి వానితో " ఇప్పుడు తెలిసినదా నీవు నేను వేరుకాదని" సైగలతో అన్నారు. దుండగీడు చెంపలు వేసుకొని స్వామికి సాగిలబడి మ్రొక్కి క్షమాపణ చెప్పుకొని అచటనుండి నిష్క్రమించినాడు. స్వామి మింగిన దానిని మూత్ర రూపమున విసర్జించినారు.

త్రైలింగ స్వామి వారి మరికొన్ని విశేషాలతో మరొక సారి .......

త్రైలింగ స్వామి-2

              శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్ తో కలిసి మౌన  స్వామిని దర్శించినారు .ఆయనకు స్వామివారు  నశ్యం వేసుకొనే కాయ అంటే పొడుంకాయ కానుకగా ఇచ్చినారట. పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పినారట స్వామి. పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరూ మహా పురుషులే.పరమ హంసలే. ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంతగా గౌరవించినారంటే మన త్రైలింగ స్వామి ఎంతటి మహిమాన్వితుడో మనకు అర్థమౌతుంది. స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పినారట పరమ హంస.

వేరొకమారు  అర్ధ మణుగు పాయసము అంటే 5.6 కిలోల పాయసము వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించినారట.

మరొక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్ లో ఉన్న  స్వామి దగ్గరకు  వచ్చినారు .ఇద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరూ మాయమైనారు. అరగంట తర్వాత స్వామి మాత్రమే తిరిగి వచ్చినారు. తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చినట్లు సైగలతోనే చెప్పి స్వామి అందరి సందేహాల్ని తీర్చినారు . అంటే ఆయన అష్టసిద్ధులు గడించిన మహిమాన్వితుడు అన్న విషయము మనకు అర్థమౌతుంది.

వారణాశికి వచ్చిన మరొక మహనీయుడైన లాహిరీ మహాశయుని గూర్చి త్రైలింగ స్వామివారు నాలుగు మాటలు చ్వెప్పుటకు తమ మౌనము వీడినారు. వారి శిష్యులు వెంటనే " స్వామీ! సర్వ సంగ పరిత్యాగులై పరమేశ్వరానుగహము బడసిన మీరు ఒక సామాన్య సంసారి కొరకు మౌనము వీడుటయా!" అన్నారు. అందుకు స్వామివారు ఈ విధంగా తమ శిష్యులకు శెలవిచ్చినారు " ఏమాత్రము నొప్పి కలిగించకుండా తల్లి పిల్లి తన కూనలను ఎక్కడ వుంచితే అక్కడ యిమిడి పోతాయి. లాహిరీ మహాశయులు కూడా అటువంటి యొక పిల్లికూన వంటివారు. తల్లి ఆదేశము ప్రకారము ఆయన సంసారమన్న స్థావరములో ఇమిడి పోయినారు. నేను సర్వసంగ పరిత్యాగినై సాధించినది వారు సంసారములో వుంటూనే సాధించ గలిగినారు. వారిని గూర్చి మాట్లాడుట నాకు అమ్మ యొసగిన వరము" అన్నాడు. ఇప్పుడు నేను వ్రాసిన వారి మహాత్మ్యములను గూర్చి కూడా అనేక విధములుగా వారిని గూర్చి లోకులు చెప్పుకొంటారు. కానీ వారి మహత్తును గూర్చిన అనుమానము మాత్రము ఎవ్వరికీ లేదు.

పంచ గంగా ఘట్టం లో చిన్న భూగృహం నిర్మింపజేసుకొని  32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26 -12 -1887 న సర్వజిత్తు నామ  సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం  స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషము. పతంజలి యోగములో విభూతి పాదములో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగములో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు. ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో వ్రాసినారు .కాని మన తెలుగు వారి దృష్టి దాని మీదికి పోలేదు. 280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై  ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన  ముద్రాలంకారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించ టానికి.

త్రైలింగ స్వామినేనమః

ఈ విధముగా చెప్పుకొంటూ పోతే కాశీ మహాత్మ్యము కమనీయ సాగారమౌతుంది. అందుకే స్కాంద పురాణాంతర్గతమగు ‘కాశీ ఖండము’ను కవిసార్వభౌముడగు శ్రీనాథుడు ప్రతెఎక కావ్యముగా వ్రాసినాడు.

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథంl

జగన్నాథనాథం సదానందభాజంl

భవద్భవ్యభూతేశ్వరం భూతనాథంl

శివం శంకరం శంభు మీశాన మీడేll

అందుకే అక్షరము ముక్క రాని నేను పైవ్యాసమును భక్తిశ్రద్ధలతో వ్రాయుటకు నాచిత్తము మొత్తము వారణాశిపై నిల్పుచూ ఆ కాశీనాథుని ఈ విధముగా ప్రార్థించి వ్రాయుట మొదలుపెట్టినాను.

    అల్పుడ నేను నాదు మతి అల్పము అల్పము భావ సంపదల్

శిల్పము రీతి నిల్పగల చింతన మాసె మనస్సునందు, నా

కల్పన వాయువాహమగు కప్రము భంగిని ఆవిరవ్వగా

తెల్పగ సాధ్యమెట్లగును తెల్పుము త్ర్యంబక కాశికేశుడా

 

కాశీనాథ అనాథ నేను పథమా కన్పించరాదాయె నే

నాశావేశము మేళవింప శుభదాంశాయుక్త ప్రజ్ఞప్తులన్

కాశీ పట్న విభూతికిన్ కలుపుచున్ కౌతూహలాపేక్షతో

ఈశా తెల్పగ నెంచినాను దయతో ఈడేర్చుమా కోరికన్

స్వస్తి.

జ్యోతిర్లింగముల కథ-ద్వితీయ ఖండము

10వ జ్యోతిర్లింగము-నాసికా త్ర్యంబకము

అంబకము అంటే 'కన్ను'.  త్ర్యంబకము అంటే మూడుకన్నులు. త్ర్యంబకేశ్వరుడు అంటే 

ముక్కంటి అని అర్థము. సూర్య సోమాగ్నులు పరమశివుని మూడు కన్నులు.

త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్l

ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ll

అన్న ఈ మంత్రమును మహా మృత్యుంజయ మంత్రము అంటారు.

అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు పుష్టిని చేకూర్చేవాడు 

అయిన శివుని మేము పుజిస్తున్నాము. దోసపండు తొడిమ నుండి విడిపడు విధముగా

మేము కూడా మరణము నుండి, విముక్తి లేక విడుదల పొందాలి అని అర్థము.

ఈ మంత్రం పఠనము అపమృత్యువు లేక అకాల మృత్యువు నుండి అనుష్ఠాతను 

కాపాడుతుందని కానీ కలకాలము ఆంజనేయుని వలె, అశ్వత్థామ వలె చిరంజీవిగా 

ఉంచుతుందని కాదు. మృత్యుంజయ మహామంత్రంతో జనన  మరణ శృంఖల  నుండి 

విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.

స్వయముగానే ఇక్కడి జ్యోతిర్లింగము త్రయంబకేశ్వర లింగము కాబట్టి, ఈయన 

సముఖములో నిష్ఠతో జపించిన వారికి అపమృత్యు భయము అంటదు.

ఇక అసలు విషయానికి వద్దాము.

పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటి ఆలయాన్ని మాత్రం 1730 

లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా 

తెలుస్తుది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించినారు. 

ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణము. ఆలయము చుట్టూ నిర్మాణం 

లోపలివైపు చతురస్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.

గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల 

శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట 

ఊరుతూ ఉంటుంది. అది దేవాలయ్ం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ 

ఉంటుంది. కుశ అంటే ధర్భ, ఆవర్తనమంటె ఈ తీర్థము చుట్టూ దర్భ కలిగినది అని 

అర్ధము. దీనిలో స్నానము చేయుట వలన సర్వపాపములు రోగములు పోతాయని 

భక్తుల విశ్వాసము. గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చు ప్రారంభంలో 

తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చొట 

బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని ఇచ్చటి 

ఐతిహ్యము.

ఈ ఆలయము బ్రహ్మగిరి, నీలగిరి మరియు కలగిరి అనే మూడు కొండల మధ్య ఉంది. 

ఈ ఆలయంలో శివ , విష్ణు మరియు బ్రహ్మలను సూచించే మూడు లింగాలు (శివుని 

యొక్క ప్రతిమా రూపం) ఉన్నాయి . ఈ ఆలయపు కొలనును అమృతవర్షిణి అని 

పిలుస్తారు, ఇది 28 మీ (92 అడుగులు) పొడవు 30 మీ (98 అడుగులు) వెడల్పు 

వుంటుంది. బిల్వతీర్థము, విశ్వనంతర్థ మరియు ముకుందతీర్థ అనే మరో మూడు నీటి 

శరీరాలు ఉన్నాయి. గంగాదేవి, జలేశ్వర, రామేశ్వర, గౌతమేశ్వర, కేదార్‌నాథ, రామ

కృష్ణ , పరశురామ, లక్ష్మీ నారాయణ వంటి వివిధ దేవతల చిత్రాలు ఉన్నాయి . ఈ 

ఆలయంలో అనేక మఠాలు మరియు సాధువుల సమాధులు ఉన్నాయి

పురాతన త్రయంబకేశ్వరాలయం నాసిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం 

అనే పట్టణంలో ఉన్నది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది 

ఒకటి. ఇది పవిత్ర గోదావరికి జన్మస్థానము ఇదే! ప్రఖ్యాత సినీరంగ పితామహుడు దాదా 

సాహెబ్ ఫాల్కే ఇక్కడనే జన్మించినాడు.

గోదావరి పుట్టుక మరియు గోదారి దారి

పూర్వము సహ్యాద్రి శ్రేణిలోని బ్రహ్మగిరి పర్వత ప్రాంతములో 12 సంవత్సరములు 

విపరీతమగు కరువు కాటకములు సంభవించినవి.

అది గౌతమ మహర్షి నివాస ప్రాంతము. ఆ ప్రాంతములోని మునిజనులు జానపదులు 

తిండి నీరులేక తిప్పలుబడు చుండగా చూడలేక తన తపః శక్తితో గౌతమ మహర్షి 

ప్రోద్దుట వడ్లు, మంత్రించి పొలములో జల్లితే సాయంత్రమునకు పంట సిద్ధముగా 

వుండేది, అందుచేత తరువాతి రోజు ప్రొద్దునే వంట సిద్ధముగా ఉండేది. ఋషివర్యులు

ఎంతమంది వచ్చినా చింత లేకుండా భోజనము పెట్టి పంపేవారు. రోజురోజుకు అతిథుల 

సంఖ్య పెరుగసాగింది. పరిస్థితి రానురాను విషమింప జొచ్చినది.

ఇది ఇట్లుండగా పార్వతీ దేవి శివుని తలపై గంగ తాండవించుతూ ఉండుట సహించలేక 

ఆమెను భూమిపై దించే ప్రయత్నమూ చేయ సంకల్పించి తనకుమారులు వినాయక 

శంముఖులకు తన ఇష్ట సఖియగు జయకు తన సంకల్పమును తెలిపి సహకరించమని 

కోరింది. అందుకు తగినవాడు గౌతముడే అని కూడా తెలియజేసింది. వారు మువుఉరు 

మాత పార్వతి ఆజ్ఞను ఔదల దాల్చి అవకాశామునకు ఎదురు  చూడదొడగినారు.

వారు మువ్వురూ చక్కగా అలోచించి  ఒక మాయాధేనువును  గౌతమును పొలము 

లోనికి ప్రవేశింప జేసినారు. అది ఆ ఆవుకు నిత్యకృత్యమై పంటను పాడుజేయ జొచ్చినది. 

ప్రతి రోజూ ఈ ఘోరమును చూస్తూ సహించలేని గౌతముడు ఆ పొలములో కనిపించిన 

దర్భపుల్లతో అదిలించినాడు. మాయాధేనువు కదా! వెంటనే మరణించింది. గోహత్య 

నిజముగానే జరిగిపోయినదని తలచి పరితపించ సాగినాడు గౌతముడు. అప్పుడు 

వినాయకుడు ఒక వృద్ధ ముని రూపములో వచ్చి గౌతమునికి ‘శివుని గూర్చి 

తపమాచరించి గంగను ఆ ధేనువు దేహము పై ప్రవహింపజేస్తే ఆగోవు బ్రతుకుతుం’దని 

సలహా ఇచ్చినాడు. వల్లెయని గౌతముడు ఆ విధముగానే తపమాచరించగా, గౌతముని 

కోరిక మేరకు, శివుడు ప్రత్యక్షమయి తన జటను ఒకదానిని నేత్తినుండి పెకలించి 

గౌతమునకిచ్చి దానిని బ్రహ్మగిరిపై ప్రతిష్ఠించితే,  అచట గంగోద్భవము జరుగుతుందని 

తెలిపి అంతర్ధానమైనాడు. గౌతముడు ఆవిధముగా చేసి తాను భ్రమించిన 

గోహత్యాపతకమును పోగొట్టుకొని సంతృప్తిచెందినాడు. ఆవిధముగా గంగ గౌతముని 

కారణముగా గోవుకారణముగా భువిని చేరుటచే గోదావరి అని, గౌతమి అని ప్రసిద్ధి 

వహించినది.

మిగిలినది మరొకమారు.........

10వ జ్యోతిర్లింగము-నాసికా త్ర్యంబకము-2

ఈ కథ ఇక్కడ ఆగలేదు. సకలదేవీ దేవతా పరివేష్ఠితుడై అలరారుచున్న పార్వతీ 

సమేతుడగు పరమేశ్వరుని దర్శింప వచ్చి భృంగీశ్వరుడు ఏమరిపాటుననో, శివుని విశ్వ 

సుందర రూపమును చూచియో ఆయనకు మాత్రమే ప్రదక్షిణము చేసినాడు.

అలిగిన మాత నేరుగా గౌతమాశ్రమము చేరినది. తానున్న చోటికి పరమేశ్వరుని 

రప్పించుకొన దలచి తగిన మార్గమును తెలియజేయుమని మాత గౌతముని అడిగినది. 

మహర్షి గౌతముడు పార్వతీ దేవికి ‘ గౌతమీ స్నానమోనరించి  శివ లింగమును 

ప్రతిష్ఠించి కేదారవ్రతమును తదేక ధ్యానముతో ఋషి ప్రోక్త విధానమును తుచ 

తప్పకుండా ఆచరించింది. పరమేశ్వరుడు పరమ సంత్రుప్తుడై పార్వతికి ప్రత్యక్షమైనాడు. 

మాట తనకు స్వామీ శరీరములో అర్ధ భాగమును కోరుతూ ఆయనను అచటే 

కేదారేశ్వరునిగా వెలయమని తెలిపినది. చిత్తశుద్ధితో చేసే కేదారవ్రతము భార్యాభర్తలను 

అవిభాజ్యులుగా చేస్తుంది. నమ్మకము అన్నింటికీ అత్యంత ముఖ్యము. ఈ గిరిపై కైలాస 

వాసి యగు శంకరుడు విలసిల్లుటచే ఈ ప్రాంతము శంకరగిరి మాన్యమై మన నోటి 

నానుడుగా మారినదేమో!

కేదారము అంటే వరిమడి అన్న అర్థమే కాకుండా తలముపై ఎత్తుగా నిలిచినది అంటే 

అది గుట్ట కావచ్చు, హిందూ గోసంతతి మూపురము కావచ్చు. మనము ఇక్కడ 

మూపురము అన్న అర్థము తీసుకోనవలసియున్నది. మూపురమును పోలిన రూపు 

కలిగియుండుటతచే కేదారము అన్న పేరు సార్థకమైనదేమో!

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో త్రయంబకేశ్వరంలో పుట్టింది. ఆగ్నేయ దిశగా 

ప్రవహిస్తూ బాసర వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవహించి పాపికొండల వద్ద తూర్పుగోదావరి జిల్లాలో 

ప్రవేశిస్తుంది. రాజమండ్రి నుంచి 97 కిలోమీటర్లు ప్రవహించి యానాంఅంతర్వేది

కోరంగి ప్రాంతాలలో సముద్రంలో సంగమిస్తున్నది.

 నాసిక్‌ నుంచి మొదలై రాజమండ్రి దాటి...అంతర్వేది నదీ సంగమం వరకు సహ్యాద్రి

పర్వతాలు లేదా బ్రహ్మగిరి పర్వతాలుగా చెప్పుకునే ప్రాంతంలో ఉన్న పడమటి 

కనుమలలో ఉన్న ఆ ఎత్తయిన కొండను ఎక్కితే గోదావరి పుట్టుక చూడవచ్చు. బ్రహ్మగిరి 

ఆలయ సానువుల నుంచి దీన్ని చేరుకోవటానికి 700మెట్లు ఎక్కవలసియుంటుంది, 

లేదా చిన్న నీటి దారి కూడా ఏర్పాటు చేసినారు. ఆ పైకి వెళితే చిన్న ఊటగా కనిపిస్తుంది 

గోదావరి పుట్టుక ప్రాంతం. అక్కడి నుంచి ధారగా కిందికి చేరుతుంది. అక్కడ 

కుషావత్‌కుండ్ అనే ప్రాంతంలోకి నీరు చేరుకుటుంది. అక్కడ శివాలయం ఉంటుంది. 

భక్తులు ఇక్కడకు చేరుకుని తదుపరి నాసికా త్రయంబకం వెళతారు. అలాగే గోదావరి 

ఈ కుషావత్‌కుండ్ నుండి నాసికా త్రయంబకం చేరుకుంటుంది. అక్కడి నుంచి దీని 

నడక ప్రారంభమవుతుంది. 3.12 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం నుంచి వచ్చి 

చేరిన వాన నీటితో తూర్పు కనుమల్లో ప్రవేశిస్తుంది. సముద్రమట్టానికి 1607 మీటర్ల 

ఎత్తులో ఉన్న గోదావరి నది చిన్న ధారగా మొదలై,.ఇంతింతై మరి ఇంతయై ఆపైనంతై ... 

అన్నట్లు త్ర్యంబకేశ్వరము నుండి బయలుదేరి చివరకు అంతర్వేది కోరంగి ప్రాంతాలలో 

బంగాళాఖాతములో కలుస్తుంది.

ప్రధాన దేవాలయము

గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల 

శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీరు 

 ఊరుతూనే ఉంటుంది. అది దేవాలయము ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో 

కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, ఆవర్తనం అంటే ఒక చుట్టు (Encircling) అని 

అర్ధము. అంటే ఈ సరోవరము చుట్టూ దర్భ ఆవరించి ఉన్నది అని అర్థము. దీనిలో 

స్నానం సర్వపాప నివారణము, ఇహపర బాధ విదారణము, అని భక్తుల విశ్వాసము. 

గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చు ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో 

గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చొట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు 

దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడింది అని స్థల పురాణము.

ఆలయ విశిష్టత: సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై 

ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. 

మొదట నందిదర్శనము ముగిసిన పిమ్మట త్రయంబకేశుని దర్శించుకుంటాము. ఇది 

మన సంప్రదాయమే! ఆలయ ప్రాంగణంలో  ఓ కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ  

గోదావరి న‌దీ జలాలతో నిండి ఉంటుంది అని పైన చెప్పుకొన్నాము. గుడి ప్రాంగణము 

బాగా   విశాల‌మైనది. గుడి మొత్తము  నల్లరాతితో నిర్మించుట జరిగినది. ఆలయ 

ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమరి ఉన్నాయి. గుడి 

ప్రాకారాలను ఎత్తుగా నిర్మించినారు. గుడిలోని కలశములు బంగారుతో చేయబడినవి 

ఈ కలశముల తయారీ 16వ శతాబ్దంలో జరిగినట్లు చరిత్ర ఆధారాలున్నవి.  ఇందుకు 

గానూ ఆ కాలములో  16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు కూడా ఆధారాలు 

వున్నవి. అవే ఈ కాలములో ఎన్ని కోట్లయి ఉండేవో!

సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి పెద్ద లింగం ఇదేనని 

తెలుస్తోంది. ఇది స్వయంభూ జ్యోతిర్లింగమన్నది మనకు తెలిసిన విషయమే! గర్భగుడి 

లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. ఈ మూడు లింగాలను 

కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపల నుంచి  ఎప్పుడూ జలం 

వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది  ఇప్పటికీ

అంతుదొరకని విషయమే! ఆ జలము అనునిత్యమూ శివలింగమును అభిషేకము చేస్తూ 

ఉంటుంది. అయితే గర్భగుడిలోనికి అంద‌రికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల 

దూరం నుండియే చక్కనైన అద్దము సహాయముతో స్వామి దర్శనము కల్పించుతారు.

మిగిలినది మరొకమారు...............

10వ జ్యోతిర్లింగము-నాసికా త్ర్యంబకము-3

పాండవులు నిర్మించిన కోనేరు మరియు కుంభమేళ

 ఇక్కడ పాండవులు ఒక కోనేటిని నిర్మించినారని పురాణాలు చెబుతున్నాయి. అది 

ఎల్లపుడూ గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేటిలోనికి నేరుగా బ్రహ్మగిరి 

పర్వత శ్రేణుల నుండి వచ్చే నీరు ప్రవహిస్తుంది  అని చెబుతారు. ఇక్కడ స్నానము సకల 

పాపహరణమని నమ్మకము.  కుంభమేళా నిర్వహించే సమయంలో దేశము 

నలుమూలలనుండి వచ్చేసాధువులు, హిమాల‌యాల నుంచి వచ్చే ఋషులు, అఘోరాలు 

ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు.  ఈ కోనేరు   చుట్టూ అనేక లింగాలు మరియు 

వివిధ దేవతా మూర్తులకు నెలవు.

కుంభమేళా. అన్ని పుణ్య తీర్థములలో జరిగినట్లే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి 

ఇక్కడ కూడా ఘనముగా జరుగుతుంది.. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మూడు 

కూడా ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా 

నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై 

ఉంటారని భక్త్గుల నమ్మకము.

ఇతర దేవాలయాలు

గంగా గోదావరి దేవాలయం

గంగా గోదావరి దేవాలయం అనేది నాసిక్ లో ఉంది. నాసిక్ లో రాంకుండ్ సమీపంలో 

గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై 

ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు.

బాలచంద్ర గణపతి మందిరం (ఫాలచంద్ర గణపతి మందిరము)

బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 

21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది.

గోదావరి ప్రవర సంగమం

గోదావరి ప్రవరా నదుల సంగమస్థలంలోని అందమైన ప్రదేశమిది. ఔరాంగాబాదుకు 

40 కిలోమీటర్లు దూరం. రామాయణంతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశంలో సిద్దేశ్వరం

రామేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయి.

చంగ్ దేవ్ మహరాజ్ మందిరం, పుణతాంబ, కోపర్ గాఁవ్

ఇక్కడ సాధువు వందేవ్ మహరాజ్ సమాధి ఉంది. గోదావరి ఒడ్డునే ఉన్న ఈ పుణతాంబ 

షిర్డికి దగ్గర్లో ఉంటుంది.

సుందర నారాయణ మందిరం

గోదావరికి సమీపంలో ఉన్న ఈ మందిరాన్ని 1756లో గంగాధర యశ్వంత 

చంద్రచూడు నిర్మించినాడు. ప్రధానమూర్తి నారాయణుడు. ఆయనకు ఇరువైపులా లక్ష్మీ 

సరస్వతులు కొలువై ఉన్నారు. దీనికి దగ్గర్లోనే బదరికా కొలను ఉంటుంది. ఈ 

కొలనును ప్రముఖ మహారాష్ట్ర సాధువు సంత్ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరిలో ప్రస్తావించాడు. 

మార్చి21 నాడు ఆలయంలోని విగ్రహాల మీద సూర్య కిరణాలు ప్రసరించడం విశేషం. ఈ 

ఆలయ నిర్మాణశైలిలో మొగలుల వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది.

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి. వేళా 

దేవాలయాలను పడగొట్టిన ఔరంగజేబు పేరున వెలసిన పట్టణ  ఔరంగాబాదు 

విమానాశ్రయము నుండిలేదా ముంబయి విమానాశ్రయము నుండి కూడా  నేరుగా, 

నాసిక్‌కు వెళ్లవచ్చు. 

స్వస్తి.

మరొకమారు 11వ జ్యోతిర్లింగమయిన కేదారనాథలింగమును గూర్చి తెలుసుకొందాము.. 

 

11వ జ్యోతిర్లింగము-కేదార్ నాథ్ 

నా కేదార్ నాథ్ యాత్రానుభవము

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |

సురాసురై యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||

 ఇది హిమాలయ పర్వతమునందు వెలసిన జ్యోతిర్లింగము. నరనారయణులుగా పురాణ 

ప్రసిద్దులగు మహర్షులు, సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు 

చేయుచున్నపుడు ద్యోతకముయిన శివలింగము ఇది. బదరీ క్షేత్రమునకు అవతలి వైపు 

హిమాలయాల్లో కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి 

ఆరాధించేవారు. అప్పుడు, ఒకానొక దినమున, ఆ శివలింగమునుండి పరమశివుడు 

ఉద్భవించి ‘మీరు ఎముకలు కొరికే ఈ చలిలో ఏకాగ్రచిత్తులై  చేసిన పూజకు నేను ఎంతో 

సంతసించినాను. మీకేమి కావలయునో  కోరుకొనమని అడిగినాడు ఆ కరుణామూర్తి. 

అప్పుడు వారు “స్వామీ ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయ 

పర్వతశృంగముల మీద నీవు స్వయంభూ లింగమై వెలసి భక్తాభీష్ట ప్రదాతవుకమ్మని 

అడిగినారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ జ్యోతిర్లింగమై వెలసినాడు అన్నది 

పురాణ కథనము.

అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగములలో దీనిని మొట్టమొదటిదిగా చెప్పుకొంటారు. 

కేదార్ నాథ్ ఆలయం 8వ శతాబ్దంలో  నిర్మించబడినట్లుగా చెప్పుకొంటారు. దీనిని 

ఆదిశంకరాచార్యులవారు కట్టింపజేసినారని చెప్పినా, సరియైన ఆధారములు 

అలభ్యములు. అసలు శంకరులవారు క్రీ.పూ. 509 లో జన్మించినట్లు ఘంటా పథముగా, 

‘విమర్శకాగ్రేసర’ ‘భారత చరిత్ర భాస్కర’ బిరుదాంకితులు శ్రీయుతులు ‘కోట 

వెంకటాచలము గారు నిరూపించినారు. కావున ఆసేతు సీతనగ పర్యంతమూ తిరిగిన 

ఆ అపరశంకరులకు వారి జీవిత కాలములోనే మంచులో కూరుకొని పోయిన 

కేదారనాథ జ్యోతిర్లింగము తమ యోగదృష్టికి కనిపించి యుండవచ్చును. అప్పటి 

రాజుచేత ఆ లింగమునకు వారు గుడిని నిర్మించ పురమాయించియున్నా దాదాపు 1300 

సంత్సరముల కాలములో (క్రీ.పూ.6వ శతాబ్దము నుండి క్రీ.శ. 8వ శతాబ్దపు 

మధ్యకాలము) ఆ ఆలయము శిథిలమై మంచులో కూరుకోనిపోయి ఉండవచ్చును.  

ఏదిఏమయినా సుమారు 1000సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత 

ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద చక్కగా దీర్ఘచతురస్రాకారములో మలచిన 

పెద్ద రాతి గుండ్లను ఉపయోగించి నిర్మించినారు. ఇటువని రాళ్ళను ‘సోగలు’ అని 

తెలుగులో అంటారు. పైగా ఇచట దేవాలయపు గోడకు ఉపయోగించిన ఆ రాళ్ళు అన్నీ L ఆకారములో మలచి ఒకటి నిడువు గానూ మరొకటి దానిపై బోర్లించిన రీతిలోనూ 

ఉంచి కట్టుటచే ఎటువంటి జలప్రళయమునకైనా ఎదురొడ్డి నిలువగలదు. 

అందువలననే 2013 లో వచ్చిన జలప్రళయమునకు దేవాలయము చెక్కు చెదరకుండా 

నిలచినది. ఆదిశంకరులు ఇక్కడ శివసాయుజ్యము చెందినాడంటారు. 

దేవాలయమునకు వెనుకవైపు వారి సమాధి ఉన్నట్లుగా చెబుతారు. వాస్తవము ఆ 

శంకరునకే ఎరుక. అతి ప్రాచీన శివలింగములలో ఇది ఒకటి. ఇది సముద్ర మట్టమునకు 

3,583 మీటర్ల  (11,755 అడుగులు) ఎత్తులో వుంది.

గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ 

నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ 

పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడి 

చేరటానికి రోడ్డు మార్గం లేదు.

ప్రస్తుతపు కేదార్ నాథ్ ఆలయము గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం 

ఉండదు. కేవలం ఒక ఎద్దు మూపురములా మాత్రమే కనిపిస్తుంది. అందుకు కారణము 

ఈ విధముగా చెప్పుకొంటారు మరియు, దానినే భక్తులందరూ ఎంతో నిష్ఠతో 

పూజించుతారు.

కురుక్షేత్ర యుద్ధము ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. 

యుద్ధంలో ఎందరినో హత్య చేయుటయే కాకుండా విరోధులయిన, సగోత్రీకులను 

కూడా నిశ్శేషముగా చంపినారు కాబట్టి,   ఆ పాతకము తమకు అంటుకుండా 

ఉండుటకు,  సకల పాప లయకారుడగు శివుని దర్శించి తరించదలచుతారు. ద్రౌపదితో 

కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరుతారు. ఎన్నో రోజులు కష్టించి 

గాలించినా శివదర్శనం జరుగదు. చివరికి కేదారనాథుని ఉనికి తెలుసుకొంటారు.  

అయితే, ఎన్నో కుతంత్రాలతోనూ, అధర్మముగానూ యుద్ధము చేసి తమవారిని 

వధించిన   పాండవులకు, తన ప్రగాఢ భక్తులని తెలిసినా, దర్శనము ఇచ్చుటకు శివునికి 

మనస్కరించదు. దీనితో శివుడు ఒక ఎద్దు వలె మారి, తనను గుర్తు పట్టకుండా 

ఉండుటకు, మరి కొంత గోగణమును సృష్టించుతాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన 

పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు 

ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో ఒక కాలు పైకెత్తి అటులనే 

నిలువమని చెబుతాడు. మరో వైపు నుండి మిగిలిన పాండవులు ఆవులను ముందుకు 

ఉరికిస్తారు. ఒక్కొక్క ఆవు లేక ఎద్దు భీముడి కాలు కింది నుండి దూరి పోయే ఏర్పాటు 

చేయించుతాడు ధర్మజుడు.   చివరికి శివుని రూపములోనున్న ఎద్దు మిగిలిపోతుంది. 

పాపము చేసిన పాండవులకు  దర్శనము ఇవ్వనూలేదు, భక్తులగు కారణముచే ఇవ్వకనూ 

ఉండలేడు.  అందుచే పాండవులను ఇంకనూ పరీక్షింపదలచి, భీముడి కాళ్లక్రింద దూరి 

ఎటూ పరమేశ్వరుడు వెళ్ళడు  కాబట్టి . హఠాత్తుగా మంచులోకి కూరుకుపోసాగినాడు. 

పాండవులు గమనించి, భీముని ఉసిగొలిపి  పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు 

యొక్క మూపురమును, శివభక్తి తత్పరుడైన భీముడు, గట్టిగా పట్టుకొన్నాడు. ఆ 

విధముగా నిలచిన భాగమునే లింగరూపముగా భావించి  పాండవులు పూజించి 

తరించినారు. ఇప్పుడు కేదార్ నాథ్ లో కనిపిస్తున్న లింగము అదే!. 

 నాసికాత్ర్యంబకమును గూర్చి తెలియజేయు సమయములో కేదారమునకు భారతీయ 

గోసంతతి మూపురము అన్న అర్థము కూడా ఉన్నదని చెప్పుకొన్నాము. మంచులో 

కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే నేపాల్ లోని 

ఖాట్మాండులో పశుపతినాథుని రూపములో  ప్రత్యక్షమవుతుంది. ఈ మాటను స్వయంగా 

శివుడే పార్వతితో చెబుతాడు.   నేపాల్ వెళ్లి ఖాట్మాండు పశుపతినాథుని ఆయన 

యొక్క ఆలయాన్ని దర్శించుకుంటే కలిగే ఆనందమే ఆనందము.

మిగిలినది మరొక మారు......

గౌరీ కుండ్ నుండి గుర్రాలు, డోలీలు, కండీలు మరియు కాలినడకలచే  మాత్రమే గుడిని 

చేరవచ్చు.

‘కండీ’ అన్న పదము ఎక్కువమందికి తెలియక పోవచ్చు. అందుకొరకు దానిని గూర్చి 

రెండు మాటలు తెలియజేస్తాను. కండీని గట్టి వెదురుదబ్బలతో అల్లుతారు. ఇది తిప్పి 

యుంచిన చిన్నదగు ఎద్దులబండి ‘జొల్ల’ వలె వుంటుంది. ఒక మనషి కూర్చునుటకు 

వీలుగా వుంటుంది. దిగువన దాని చిత్రమును చూడవచ్చు. ఏవయసు వారయినా 

ఒక్కరు మాత్రమే కూర్చొనవచ్చు. దీనిని నెత్తికి తగిలించుకొని ఒకవ్యక్తి  మాత్రమే 

మోస్తాడు.

ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు 

కేదార్‌నాధ్ లను చార్ ధామ్‌ లుగా వ్యవహరిస్తారు.

ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు 

వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువునిగా 

దర్శనం ఇస్తాడు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి 

దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో 

కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ 

సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు 

శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.

హృషీకేశ్ నుండి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు 

మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 

కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల 

లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు 

రావాలంటే హరిద్వార్ నుండియే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. . సొంతంగా 

ప్రయాణించాలంటే మాత్రం హృషీకేశ్ కు రావాల్సిందే. ఉదయం 8గంటలకు హృషీకేశ్ 

లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు 

బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే 

బయల్దేరాలి. హృషికేశ్ నుండి దేవప్రయాగ, రుద్రప్రయాగ మీదుగా అగస్త్యముని, గుప్త్ 

కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ 

ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావచ్చు. అన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి. 

సాయంత్రం 7తర్వాత ఈ దారిన ప్రయాణం చేయడం అతి కష్టం. ఇక్కడి ఏటీఎంలను 

ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా 

పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. గౌరీకుండ్ నుండి 

కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదారనాథుని గుడి ప్రతిష్ఠితమై ఉంది. గౌరీకుండ్ 

ఒక చిన్న ప్రాంతం. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదరీనాథ్ వెళ్లేందుకు మూల 

స్థానము. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే 

ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అంత సమయం వరకు బయటనుండి 

వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ 

ఉంటుంది. ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు 

గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు 

కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. 

ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు 

రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. వీళ్లంతా 

నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం 

సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 

సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. 

కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ 

వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది ప్రయాణము. 

ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు 

దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ 

ప్రయాణంలో ప్రధాన అవరోధము వాతావరణము. గౌరీకుండ్ లో మాములుగా ఉండే 

వాతావరణము నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది 

డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారనాథ్ కొండపైన 5డిగ్రీల కంటే 

తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతము, చలి లాంటి ప్రతికూల వాతావరణము 

అధికము గనుక ఈ గుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే 

దర్శించడానికి తెరచి ఉంచుతారు.

కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళదలిస్తే, 14 

కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో శ్రమకు ఓర్చి ప్రయాణము చేయవలసియుంటుంది. 

సాధారణముగా గుర్రాలపై వెళ్ళే యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు 

ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. 

దర్శనానంతరము తిరిగి వేరొక గుర్రమును మాట్లాడుకొని గౌరీకుండ్ భక్తులు చేరుతారు. 

పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార 

పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి 

వారికి రుసుము చెల్లించాలి. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు 

ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత 

ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. 

ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి 

నాలుగు గంటలు, ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా 

ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి 

సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా 

అరుదు. ఈ సేవలందించేవారిలో అనేకమంది నేపాలీయులే. వీరు విశ్వాసపాత్రులు. 

రుసుము మాత్రము యాత్రికులతో ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు 

అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత 

ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు వారి 

బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి 

యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస 

యజమానులు తీసుకొని రుసుములో కొంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత 

మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు 

వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ 

నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు 

కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి 

చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా 

ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి 

ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి 

యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని 

కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ 

దర్శనం చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడయితే గౌరీకుండ్ మార్గమే లేదు. అంతా 

హెలీకాప్టర్లోనే వెళ్ళవలెనని విన్నాను.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయము నా తీర్థయాత్ర ముగిసిన తరువాత పెద్దల ద్వారా 

తెలుసుకొన్నాను.

కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదట. ఆలింగమును వలయము అంటే 

స్త్రీలు చేతులకు ధరించే ఒక కొత్త గాజును పట్టుకు వెళ్ళాలి. రాగితో చేసినది ఆచరణ 

యోగ్యము. ఎందుకంటే మట్టిది మరీ హీనముగా వుంటుంది, బంగారు, వెండివి 

తీసుకుపోయి అచ్చటనే వదలివేయుటకు  ఆర్ధిక స్తోమత మధ్య తరగతి 

కుటుంబీకులమైన మనకు చాలదు. గర్భగుడిలో ప్రవేశించగానే కంటిముందు ఆ 

వలయమును పెట్టుకుని అందులో నుండి స్వామీ లింగమును  చూడాలట. కేదారము 

దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రము గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు 

వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని 

అందులోంచి కేదార లింగమును చూచుటకు కారణముగా చెబుతారు. ఆవిధముగా 

మనము ఉపయోగించిన ఆ వలయమును అక్కడే వదిలిపెట్టి రావాలి. అందుకే ఈ 

కారనమునకు గానూ ఒక రాగి కంకనమును వెంట ఉంచుకొనుట మంచిది. 

వాస్తవావాస్తావాలను పరిగణించక ఇకముందు వెళ్ళేవారు ఈ జాగ్రత్త తీసుకొని వెళితే 

మనసు తృప్తి చెందుతుంది.

ఇక నా అనుభవమును గూర్చి తెలియజేయుటకు మునుపు, ద్వాదశ జ్యోతిర్లింగముల 

గూర్చి చెబుతూ, కేదారమునకు పయనించు భక్తుల గూర్చి ఏమి తెలుపబడినదో, 

శివమహా పురాణములోని ఈ శ్లోకమును గమనించండి.

కేదారేశస్య భక్తా ఏ మారస్థాస్తస్య  వైమృతాః l

తే2పి ముక్తా భవత్యేవ నాత్రకర్యా విచారణాll

‘కేదారేశ్వరమునకు బయలుదేరిన వ్యక్తి యాత్రా మధ్యమున ఏవయినా ప్రాకృతిక 

ఇబ్బందులకు లోనై మరణించినాకూడా అతని యాత్ర సఫలమై మోక్షము సిద్ధించును. 

ఈ విషయమున వేరు ఆలోచన అవసరములేదు’ అని నొక్కి వక్కాణింప బడినది.

     స్వోత్కర్షగా భావించరన్న మీ సంస్కారము నాకు తెలుసు కాబట్టి నా జీవితములో 

జరిగిన ఈ సన్నివేశమును మీతో పంచుకొనుచున్నాను.

మిగిలినది మరొక మారు.......

11వ జ్యోతిర్లింగము-కేదార్ నాథ్ - 3వ భాగము   

నా కేదార్ నాథ్ యాత్రానుభవము

3వ భాగము

ఇది 1998, 99 నాటి మాట. బంధు మిత్రులమైన కొంత మందిమి కలసి ఉత్తరాది 

యాత్రకు పోయినాము. అది సుదీర్ఘమైన యాత్ర. మా ఉద్యోగములకు నెలరోజులు 

శెలవు తీసుకొని బయలుదెరినాము. మా యాత్రలకు గానూ యాత్రాచాలకుల(Travel 

Agents) సహాయము గైకొనక  అంతా సొంతమే చూసుకొన్నాము. నేనిపుడు కేవలము 

నా కేదార్ నాథ్ అనుభవము మాత్రమే మీతో పంచుకొంటున్నాను.

మేము హృషీకేశ్ లో విడిది చేసినాము. ఆ చుట్టుప్రక్కల చూడతగ్గ మందిరములు 

మఠములు చూసిన తరువాత కేదారమునకు పోయే రోజు రానే వచ్చింది. కేదార్ నాథ్ 

కు యంత్రచోదిత వాహన (Motor Vehicles ) సదుపాయము లేదు. అటువంటి 

వాహనములు గౌరీ కుండ్ వరకు మాత్రమే పోతాయి అని పైననే తెలియబరచటమైనది. 

మేము హృషికేశ్ నుండి ఏర్పాటు చేసుకొన్నా Van లో బయలుదేరి ఎటువంటి 

ఉడుదుడుకులు లేకుండా గౌరికుండ్ చేరుకొన్నాము. ఆరాత్రికి అక్కడ అద్దెకు తీసుకొన్న 

విశ్రాంతి గృహములో ఆహార నిద్రలు ముగించుకొని తెల్లవారుఝాముననే లేచి 

దంతదావన స్త్నాన సంధ్య పూజాది కార్యముల ముగించుకొని మా అమ్మమ్మ గారికి డోలీ 

ఏర్పాటుచేసి, నాపిల్లలిద్దరికి ఒక గుఱ్ఱము, నా శ్రీమతికి ఒక గుఱ్ఱము ఏర్పాటు చేసి 

మిగత వారంతా ఎవరికీ తోచిన ప్రయాణ సాధనమును వారు ఎన్నుకొనగా చివరకు 

నేను , వేరొక మిత్రుడు మాత్రము కాలినడకన 14 కిలోమీటరులు నడువ 

నిశ్చయించుకొన్నాము. అతను కాఫీ కొంచెము ఎక్కువగా త్రాగే అలవాటు ఉన్నందువల్ల 

ఒక ఫ్లాస్క్ లో కాఫీ పోసుకొని , ఫ్లాస్కు కొంతసేపతను కాసేపు నేను మెడకు 

తగిలించుకొని, మేమిరువురము కాలినడకన బయలుదేరినాము. మేము తీసుకొన్న 

ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ లేవు. నాకప్పటికి 55 సంవత్సరములు. అతనికి 50 

సంవత్సరములు ఉండవచ్చును.  నాకు నడక చాలా ఎక్కువ అలవాటు. ఒక 40 

కిలోమీటర్లు అవలీలగా నడిచే వాణ్ణి. దయవుంచి అతిశయమనుకోవద్దు. ఆస్య గ్రంధి లో 

నున్న నా చిరకాల మిత్రులకీ వాస్తవము తెలుసు. ఆ రోజు మాత్రము నామనసు ఎదో 

తెలియని ఆవేదన ఆలోచనతో నిండిపోయి వుండినది. ఆ శంభుడే దిక్కని 

బయలుదెరినాము. సగము దూరము నడచిన తరువాత ఆక్కడ ప్రాణవాయువు అతి 

తక్కువై వున్నదని, ఇంకా ఎత్తుకు పోయేకొద్దీ ఆమాత్రము కూడా ఉండదని, ఒక 

గంటలో స్వామీ దర్శనము ఆపుతారని, తిరుగు ప్రయాణములో వచ్చే యాత్రికులు 

చెప్పినారు. అన్నింటికీ మించి నేను ముందుకు , నామిత్రుని వేగముతో, నడువలేనని 

ఆతను నాతోనే వుంటే తానుకూడా ఆ రోజుకు దర్శనభాగ్యము కోల్పోతాడని అర్థమై 

పోయినది. నేనాయనకు నచ్చజెప్పి తానయినా దర్శనము చేసుకోనిమ్మన్న ఉద్దేశ్యముతో 

ముందుకు సాగానంపినాను. ఆతొందరలో 'తాను  దూర  సందు లేదు మెడకేమో  

డోలుఅన్నట్లు ఫ్లాస్కు నామెడకు శివుని హారమై కూర్చుంది. ఎక్కగలిగితే కేదారము

లేకుంటే అంతకన్నా ఎత్తయిన కైలాసము అన్న మొండి ధైర్యముతో  అడుగు ముందుకు 

వేసినాను.

నా శ్రీమతి, పిల్లలు బంధువులు , మిత్రులు చివరకు నాతో బాటూ నడచిన మిత్రుడు 

కూడా దర్శనము ముగించుకొని వెనుదిరిగినారు. దారిలో నాకు కనిపించి దర్శన 

సమయము ముగిసి పోయినదని కూడా తెలిపినారు. నాకు ఊపిరాడుట లేదు

ఎముకలు కోరికే చలి , వదలని వాన నాకు తోడురాగా , చెమటతో తడిసిన మేనితో ( 

అంటే శరీరము ఏమాత్రము సహకరించుట లేదు . నాపని ఐపోయినదన్న నిర్ణయానికి 

వచ్చివేసినాను). తడబడే అడుగులతో ప్రయాణమును ముందుకే సాగించినాను. 

పుణ్యక్షేత్రము లోనికి అడుగుపెట్టుటకు చివరిమెట్టు నుండి అడుగు ముందుకు 

వేయబోయేటపుడు అక్కడ వున్న ‘తేనీటి కొట్టు వ్యక్తి 'చాయ్' త్రాగమన్నాడు. దేవుని 

దర్శనము చేసుకొని వచ్చి త్రాగుతానన్నాను. ఆతను ఆలయ ద్వారములు మూసివేసినారు 

ఇక దర్శనము రేపే అన్నాడు. అతనికి జవాబు  కూడా చెప్పే పరిస్థితి లేని నేను 

మౌనముగానే లేని శక్తిని క్రోడీకరించుకొని శివ నామమును మదినిండా నింపుకొని 

మననము చేసుకొంటూ ఆలయ ప్రాకారము వద్దకు చేరినాను. మూసిన తలుపులగుండా 

అసలేమయినా కానీ పించుతుందేమో అని చూసినాను.  ఏమీ కనిపించలేదు. ఎంత 

పాపము చేసినానో మా అంతమందిలో నాకొక్కనికే స్వామి దర్శనము లభించలేదని 

వ్యాకుల చిత్తుడనై ఒక్క సారి ప్రహరీ చుట్టూ ప్రదక్షిణము చేసి తిరోగమనము చేయుటకు 

సిద్ధపడి మూడు వంతుల ప్రదక్షిణము నా శక్తినంతటిని కూడగట్టుకొని చేసినాను. అక్కడ 

జరిగింది ఒక చమత్కారము. స్వామి ప్రహరీ గోడకు  ఆ దిక్కున ఒక వామన ద్వారము 

(wicket door ) సరిగా  నేనక్కడికి చేరుతూనే తెరువబడింది. లోపలినుండి ఒక వ్యక్తీ 

బయట ఉన్న ఒక వ్యక్తితో గట్టిగా ఏదో చెబుతున్నాడు. ఆయన మాటలు అయ్యే వరకు 

పరమేశ్వరధ్యానాంకితుడనైన నేను, హిందీలో నా పిడచ గట్టుక పోయిన నోటితోనే 

స్వామిని చూడాలన్న నాకోరిక తెలుపుకోన్నాను, 'దైవం మానుష రూపేణ' అంటారు 

కదా! ఆయన ఆర్ద్రత నిండిన హృదయముతో రండి అని నా చేయి పట్టుకొని 

నడిపించుకు గర్భగుడిలోనికి తీసుకు పోయి కేదారనాథుని దర్శనము చేయించినాడు. 

నాతో బాటూ ఒక పెళ్ళయిన జంట మాత్రమే ఆసమయములో దేవుని సన్నిధానము లో 

వుండినది. నాకంటినీరు మందాకినిలో కలిసేతంత ప్రవహించినదేమో అన్నంతగా 

అశ్రుపూరిత నయనములతో ముకుళిత హస్తములతో తదేక ధ్యానముతో కేదార నాథుని 

తాకి, తడిమి  తనిసిన మనసుతో నాకు దర్శన భాగ్యము కలిగించిన వ్యక్తికి త్రికరణ 

శుద్ధిగా నమస్కరించి , ఒక్క క్షణము ప్రాంగణములో కూర్చొని వెనుదిరిగినాను.

దర్శనమునకు వెడలునపుడు నన్ను పలుకరించిన ‘తేనీటికొట్టు’ యజమానిని గుర్తించి, 

అచట నిలచినాను. ఆయన నన్ను ఆదరముగా కూర్చుండజేసి ఒక నిమ్మరసము చాయ్ 

ఇచ్చి త్రాగిన పిదప రెండవది కూడా ఇచ్చి డబ్బు వద్దన్నాడు. ఆయన ఎంత ఉన్నత 

మనస్కుడో! బలవంతముగా ఆయనకు డబ్బు చెల్లించి ఒక గుర్రమును ఏర్పాటు 

చేయించమని అడిగినాను. అతను వెంటనే ఒక అబ్బాయిని పిలిచి గుఱ్ఱము ను ఏర్పాటు 

చేయమన్నాడు. ఆ పిల్లవాడు గుఱ్ఱము ను నావద్దకు తెచ్చి ఎక్కమన్నాడు. నేను 

ఎక్కగలిగేటుగా వుంటే అసలు నడచి పోయి ఉండేవాడినన్నాను , చాయ్ వల్ల కలిగిన 

శక్తితో ! ఆ బాలుడు, తేనీటి కొట్టు యజమాని నన్ను జాగ్రత్తగా గుఱ్ఱము మీదికి 

ఎక్కించినారు. ఆ పిల్లవాడు గుఱ్ఱము కళ్ళెమును పట్టుకొని గమ్యము వరకూ నడిపించి 

తీసుకుపోతాడని తలచినాను, ‘అగ్గిరాముడు సినిమాలో N.T. రామారావు గారు 

భానుమతి గారిని తీసుకుపోయిన రీతిగా!, కానీ అట్లు జరుగలేదు.

ఆ పిల్లవాడు ఒక్కసారి గుఱ్ఱము వీపుపై గట్టిగా చరిచి 'చల్' అన్నాడు . అంతే! ఆ గుఱ్ఱము 

నన్ను ఏ రాణా ప్రతాప్ గానో, ఏ శివాజీ గానో , ఏ ఝాన్సీ లక్ష్మిబాయ్ గానో తలచి ఆఘ 

మేఘాలపై పరుగెడుతున్న రీతిలో ఉరికింది. గుర్రములపై, డోలీలో, తిరుగు 

ప్రయాణములో కూడా నడిచి వస్తున్న  నా మిత్రుని, మిగత అందరినీ వేనుకవేసి నా 

గమ్యమగు, మేము తీసుకొన్న విడిదికి చేర్చింది. అక్కడ కాచుకొనియున్న గుర్రము 

తాలూకు వ్యక్తి నన్ను క్రిందికి దించి కూర్చుండ జేసినాడు.  ఆటుతరువాతనే 

మావాళ్ళంతా ఒక్కొక్కరు గూడు చేరినారు. మావారంతా అంత వేగముగా గుఱ్ఱము 

పోతూవుంటే నీకు భయమనిపించాలేదా! అన్నారు. శివనామ స్మరణ తప్ప నాలో 

ఎటువంటి అనుభూతి, ఆలోచన లేవన్నాను.

నిజానికి, పరమేశ్వరుని సంకల్పము లేనిదే , నేను తిరిగి నా అనుభవము మీతో 

పంచుకొని యుండి ఉండలేను.

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్l

నగేంద్రకన్యావృషకేతనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ll

నమః పార్వతీ పతే హరహర మహాదేవ్.

స్వస్తి.

ఘృష్ణేశ్వరము-ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ పురాణ కథనము

 

పూర్వం దేవగిరి దుర్గములో సుధర్ము డు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి 

ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. కానీ 

వారు సంతానలేమిచే బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను 

భర్తకు ఇచ్చి వివాహం చేయించదలచి, వివాహానికి ముందే తాను, తన భర్త ఘష్మ తో 

ఉండుట చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాత 

కొంతకాలము అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేణ ఘుష్మకు 

మగ సంతానం కలుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని 

సుదేహ.. ఘుష్మ కుమారుని చంపి కోనేటిలో పడేస్తోంది. ఘష్మ అచటికి రోజూ స్నానము 

చేయ బోయి ఇసుకతో 108 శివలింగముల జేసి నిత్యమూ పూజించేదట. శివ భక్తురాలైన 

ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. 

అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ 

శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. 

దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని 

తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ 

స్వయంభువు కొలువయ్యాడు. ఘుష్మేనిడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం 

పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుష్మేశుడే కాలక్రమంలో  ఘృష్ణేశ్వరునిగా ప్రసిద్ధి 

చెందినాడని స్థల పురాణము.

ఆలయ విశిష్టత

పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ 

పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృష్ణేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక 

పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ కార్యక్రమములు 

చేయిస్తాడు. అంతేకాక దగ్గరగావున్న శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును 

తవ్వించినాడని కూడా ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే 

జన్మించి వంశప్రతిష్ఠను పెంచినాడని కథనం. భోస్లే తరువాత ఈ దేవాలయమును 

శివాజీ తాత జీర్ణోద్ధరణ చేయగా, 1769 లో ఈ దేవాలయమును కొత్తగా నిర్మించి 

పునరుద్ధరించింది. ఈ కట్టడమును పలు రకముల రాళ్ళతో నిర్మించుట జరిగినది

ముఖ్యముగా లేత వక్కరంగు(Rust Color), ఊదా రంగు(Pink), లేత పసుపు రంగు (Pale 

Yellow) రంగుల  శిలలను వాడుట జరిగినది.

దేవాలయము లోనికి అడుగు పెట్టగనే కోకిలా మాత విగ్రహము మనకు కనిపిస్తుంది.

ఆమె చెవి వద్ద చేతినుంచుకొని వచ్చినవారు ఎవరు అన్నది గ్రహించి ఘృష్ణేశ్వరునికి 

చేరవేస్తుందట.

అహల్యాబాయి ఇచట ఒక అద్భుతమైన సరస్సు నిర్మించినది. ఈ సరస్సు మెట్లు కలిగి  

నాచు తో కూడిన ఆకుపచ్చ నీటితో కూడియుంటుంది. ఈ తీర్థ కుండము ప్రధాన 

ఆలయం నుండి కొద్ది దూరంలో ఉంటుంది. దీని చుట్టూ  ఎనిమిది శివ మందిరాలు 

ఉన్నాయి.

ఇచట  త్రికాల పూజ మరియు హారతి  పగటిపూట మూడు వేర్వేరు సమయాల్లో 

చూడవచ్చు - రోజూ ఉదయం 6.00గం. లకు, మధ్యాహ్నం 12గం. లకు మరియు రాత్రి 

8.00 గం. లకు. శ్రావణ మాసములో, ఇచట రాత్రి 9.00 గంటలకు ప్రత్యేక పూజ 

జరుగుతుంది. మహా శివరాత్రి (ఫిబ్రవరి-మార్చి) న, పల్లకీ వాహనములో శివ విగ్రహాన్ని 

పైన తెలిపిన పుష్కరము వద్దకు ఊరేగింపుగా తీసుకొని వెళతారు.. స్వామికి 

సాయంకాలము వరకు పూజా భజనలు నిర్వహించి, సాయంత్రం 6.00 గంటలకు తిరిగి 

ఆలయానికి తీసుకువస్తారు.

అహల్యాబాయి కట్టించిన ఈ ఆలయము 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల 

వెడల్పు కలిగియున్నది. ఈ ఆలయము నేటికీ ధృఢముగా, సుందరముగా నిలిచి 

ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి 

దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి. 24 రాళ్ల 

స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించినారు. నందీశ్వరుడు ఏకశిల 

విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల 

వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు 

నిర్వహించవచ్చు.. గర్భగుడిలోనికి పురుషులు కట్టు పంచ తో దర్శనమునకు 

వెళ్ళవలసియుంటుంది. చొక్కా, బనియను మొదలగు పై వస్త్రాలను విడిచి వెళ్లాలి.

ఔరంగాబాద్‌ విమానాశ్రయము నుండి ఈ క్షేత్రము  ముప్పై కిలోమీటర్ల దూరంలో 

ఉంటుంది.

ఇంతటితో జ్యోతిర్లింగములగూర్చి నాకు తెలిసిన, నేను తెలుసుకొన్న మేరకు 

తెలియజెప్పినాను. దాసరి దోసము దండముతో సరి.

ఈద్వాదశ జ్యోతిర్లింగములకు మన పంచాంగము ప్రకారము, ఖగోళములో గుర్తించిన 

ద్వాదశ రాశులకు సంబంధము ఉన్నాడని పెద్దలు చెబుతారు. ఆ సంబంధమును గూర్చి 

ఈ దిగువ క్లుప్తముగా తెలియజేయుట జరిగినది. 12 జ్యోతిర్లిన్గాములను గురించి 

విస్తారముగా తెలియబరచినానన్న తలంపుతో ఇపుడు రాశులకు జ్యోతిర్లిన్గాములకు కల 

సంబంధమును మాత్రమే అతి క్లుప్తముగా తెలుపుచున్నాను.

రాశులు... జ్యోతిర్లింగములు

జ్యోతిర్లంగాలను సందర్శించుకోవాలనుకునే వారు తమ జన్మరాశులకు చెందిన 

జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం శుభదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశ 

జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం ఏ రాశికి చెందుతుందనేది ఒకసారి చూద్దాము.

రామేశ్వరం – మేషం

మేషరాశికి చెందిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం. 

బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించడం వల్ల చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకం నుంచి 

విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.

సోమనాథ్‌ – వృషభం

వృషభ రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం సోమనాథ్‌. గుజరాత్‌లో సముద్ర 

తీరాన వెలసిన క్షేత్రం ఇది. దక్షుడి శాపానికి గురైన చంద్రుడు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని 

ఆరాధించడం వల్ల తిరిగి తేజస్సును పొందగలిగినాడని, అందువల్ల దీనికి చంద్రుడి 

పేరిట సోమనాథ క్షేత్రమనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

నాగేశ్వరం – మిథునం

మిథున రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఇది 

గుజరాత్‌లో సముద్రతీరాన ద్వారకలోని దారుకావనంలో ఉంది. ఒకప్పుడు దారుకావన 

ప్రాంతాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. ప్రజలను విపరీతంగా పీడించేవాడు. 

తనకు నచ్చని వారిని నిష్కారణంగా చెరసాలలో బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే 

శివభక్తుడిని కూడా అలాగే చెరసాలలో బంధించినాడు. సుప్రియుడు ప్రార్థించడంతో 

శివుడు దారుకుని సంహరించి అక్కడ స్వయంభు జ్యోతిర్లింగ రూపంలో వెలసినాడని 

కథనం.

ఓంకారేశ్వరం – కర్కాటకం

కర్కాటర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర లింగం. ఇది 

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో వింధ్య పర్వత శ్రేణుల్లో వెలసిన క్షేత్రము. ఇక్ష్వాకు 

వంశానికి చెందిన మాంధాత మహారాజు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ 

జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించినట్లు ఒక గాథ ఉంది.

వైద్యనాథ్‌ – సింహం

సింహ రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది వైద్యనాథ లింగం. జార్ఖండ్‌లోని 

దేవ్‌ఘర్‌ జిల్లాలో ఉన్న వైద్యనాథ క్షేత్రాన్ని స్థానికంగా బైద్యనాథ్‌గా పిలుస్తారు. వైద్యనాథ 

లింగం సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగమేనని ప్రతీతి. వరుణుడి ప్రభావంతో శివుని 

మెప్పించి ఆయన ఆత్మలింగామును తీసుకొని వెళుతున్న రావణునికి మార్గమధ్యములో 

లఘుశంక తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో బ్రాహ్మణ రూపంలో 

అదేపనిగా తారసపడిన వినాయకుడి చేతికి ఆత్మలింగం ఇచ్చి, దానిని జాగ్రత్తగా 

పట్టుకుని, తాను రాగానే తన చేతికి ఇవ్వాలని కోరుతాడు. అయితే, నిమిషంలోగా 

రాకుంటే శివలింగాన్ని వదిలేసి తన దారిన తాను పోతానని చెబుతాడు వినాయకుడు. 

వినాయకుడు, రాలేదని తెలిసిన రావణుని పిలిచి  వచ్చేలోపే దాన్ని  అక్కడే వదిలేసి 

మాయమగుటతో ఆత్మలింగము అక్కడే ఉండిపోయిందని పురాణ కథనము.

మల్లికార్జునుడు – కన్య

కన్య రాశి వారు దర్శించుకోవలసినది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున 

జ్యోతిర్లింగం. శివుడు జ్యోతిర్లింగంగా శ్రీశైలంపై ఆవిర్భవించి, మల్లెపూలతో అర్చనలు 

అందుకోవడం వల్ల మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.

మహాకాళేశ్వరం – తుల

తుల రాశి వారు దర్శించుకోవలసినది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మధ్యప్రదేశ్‌లోని 

ఉజ్జయినిలో ఉంది ఈ క్షేత్రము. తన భక్తుడైన రాజు చంద్రసేనుడిపై శత్రురాజులు 

దండెత్తినప్పుడు అతడికి రక్షణగా శివుడు మహాకాళుడిగా వచ్చి, శత్రువులను సంహరించి 

ఇక్కడ జ్యోతిర్లింగముగా ఉద్భవించినట్లు పురాణ కథనం.

ఘృష్ణేశ్వరం – వృశ్చికం

వృశ్చిక రాశి వారు దర్శించుకోవలసినది ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దీనినే ధూషణేశ్వర 

లింగం అని, కుశేశ్వర లింగం అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ 

జిల్లా ఎల్లోరా గుహలకు అత్యంత చేరువలో ఉంది. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావంపై 

అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు పార్వతీదేవి తన పాపిట తిలకం 

దిద్దుకోవడం కోసం అరచేతిలో కుంకుమపువ్వ, పసుపు నీటితో కలుపుతూ ఉండగా 

ఆశ్చర్యకరంగా అది తేజోవంతమైన శివలింగాకృతి ధరించింది. నేలపై ఉంచగానే అది 

నేలలో కూరుకుపోయింది. శివుడు ఈ విషయం చెప్పగా, తన తేజోరూపమైన 

జ్యోతిర్లింగం పాతాళంలో కూరుకుపోయిందని చెప్పి, దానిని తన త్రిశూలంతో పైకి 

తీసుకొస్తాడు. శివుడు త్రిశూలంతో తవ్విన చోట ఉద్భవించిన గంగ ఇక్కడ 

ఎలగంగానదిగా ప్రవహిస్తోంది.

విశ్వేశ్వరం – ధనుస్సు

ధనుస్సు రాశి వారు దర్శించుకోవలసినది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ 

జ్యోతిర్లింగాల్లోనూ భక్తులు అత్యధికంగా దర్శించుకునేది, అత్యంత పురాతనమైనది, 

కాశీలోని పవిత్ర గంగా తీరంలో ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగమే! సాక్షాత్లు శివుడే కాశీ 

నగరాన్ని సృష్టించినాడని ప్రతీతి.

భీమశంకరం – మకరం

మకర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగము భీమశంకర జ్యోతిర్లింగము. ఇది 

మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది తీరాన 

వెలసింది భీమశంకర క్షేత్రం. అసుర సంహారానంతరము దేవతల కోరిక మేరకు 

సహ్యాద్రిపై, జ్యోతిర్లింగ రూపములో స్వయంభువుగా వెలసినట్లు పురాణాలు 

చెబుతున్నాయి.

కేదారేశ్వరం – కుంభం

 కుంభ రాశి వారు దర్శించుకోవలసినది కేదారేశ్వర జ్యోతిర్లింగము. ఉత్తరాఖండ్‌లోని 

రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల వద్ద కైలాస పర్వతానికి సమీపంలో ఉంది 

కేదార్‌నాథ్‌ క్షేత్రము. భీముడు, వృషభరూపుడగు శివుడు పారిపోవుట జూచి,  అదుపు 

చేయ ప్రయత్నించగా, అతడు మూపురాన్ని మాత్రమే పట్టుకోగలిగినాడు. ఆ మూపురమే 

ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసిందని పురాణాలు చెబుతాయి.

త్రయంబకేశ్వరం – మీనం

మీన రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము. 

త్య్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గోదావరి నది ఉద్భవించిన 

ప్రదేశానికి చేరువలో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు ముఖాలు ఈ 

జ్యోతిర్లింగంపై ఉండటం ఇక్కడి విశేషం. పాండవుల నాటిదిగా చెప్పుకొనే రత్నఖచిత 

కిరీటం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. ప్రతి సోమవారం ప్రదోష వేళ... అంటే 

సాయంత్రం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఈ కిరీటాన్ని 

దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు.

స్వస్తి.

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతిః స్వభావాత్ l

కరోమి యద్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll

ఓం ద్యౌః శాంతిః అంతరిక్షం శాంతిః పృథ్వీ శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః 

వనస్పతయః శాంతిః విశ్వేదేవాః శాంతిః బ్రహ్మా శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః

ఆకాశంలో శాంతి నెలకొనుగాక! అంతరిక్షంలో శాంతి నెలకొనుగాక! భూమండలంలో 

శాంతి నెలకొనుగాక! నీటిలో శాంతి నెలకొనుగాక! చేట్టుచేమలలో శాంతి నెలకొనుగాక! 

సకల దేవతలు శాంతిని ప్రసాదింతురుగాక! సమస్తమూ మనకు ప్రశాంతతను 

ప్రసాదించుగాక!

--- శాంతి సూక్తము.

No comments:

Post a Comment