లక్ష్మీకటాక్షము
https://cherukuramamohanrao.blogspot.com/2021/11/blog-post_12.html
‘కుచేలోపాఖ్యానము’
కథ అందరికీ తెలిసినదే! అందువల్ల ఆవిషయమును నేను ప్రస్తావించుట లేదు. ఒక్క విషయమును
మాత్రము ఇక్కడ ప్రస్తావించుచున్నాను. ద్వారపాలకును ద్వారా కుచేలుని వర్ణన, అతని
దీనావస్థ విన్న అరమాత్మునికి కంట నీరు జలజల రాలినది. తక్షణమే ఆ మహాభక్తుని, ఆత్మీయ
మిత్రుని ప్రవేశపెట్టమన్నాడు. ఆగని కంటినీటితో అట్లే ఆలింగనము చేసుకొన్నాడు తన
ప్రాణ మిత్రుని. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయమును గమనించినాడు కాళీదాస మహాకవి.
ఆయన
తన
'ఘటస్తవము' లో ఈ విధముగా చెప్పినాడు;
లక్ష్మీ
వశీకరణ చూర్ణ సహోదరాణి
త్వత్
పాదపంకజ రజాంసి చిరం జయంతిl
యాని
ప్రణామ మిళితాని నృణాం లలాటే
లుంపంతి
దైవ లిఖితాని దురక్షరాణి ll
తల్లీ
ఏ భక్తుడయితే నీ పాద పద్మములు మది తలచి, నుదురు నెలకు ఆన్చి నమస్కరించుచున్నాడో
ఆతని ఫాలమునకు నీ పాద రజస్సు అంటుటచే నుదుటిపై బ్రహ్మ వ్రాసిన చెడుగు అంతా తుడిపివేయబడి
ఐశ్వర్యవంతుని చేయుచున్నది అని తెలిపినాడు.
ఆ
విధముగా ఇక్కడ, ఆలింగనము చేసుకొన్న మిత్రుని శిరస్సు పరమాత్ముని హృదయ పరివేష్ఠితయైన
లక్ష్మీదేవి పాదములకు తగిలినదట. ఆ చరణ రజము తన శిరస్సును అంటినవెంటనే కుచేలుడు
సుదాముడైనాడు. అంటే ఐశ్వర్యవంతుడైనాడు అని, ఆపై మూడు గుప్పిళ్ళ అటుకులూ ఔపచారికమనీ తెలియజేస్తున్నాడు ఆ కాళీ
ప్రసన్నుడగు మహానుభావుడు.
ఇక్కడ
మనము తప్పక తెలుసుకొనవలసిన విషయము ఏమిటంటే భక్తుడు ప్రత్యేకముగా ఒకదేవతను ఆరాధించక
వేరు దేవతను తలచుచున్ననూ, ఆతని కోర్కె ఈడేర్చుటకు మరియొక దేవత సిద్దమౌను. ఇక్కడ
నిర్మల చిత్తము, నిశ్చల తత్వము మిక్కిలి అవసరము.
స్వస్తి.
No comments:
Post a Comment