కుచేలుడు
నిరుపేదయైన కారణము.
https://cherukuramamohanrao.blogspot.com/2021/11/blog-post_21.html
ఇది గర్గ్య భాగవతములో చెప్పిన మాట. బలరామ కృష్ణ సుదాములు
సాందీపని గారి శిష్యులు. గురుకులములో వర్ణ విచక్షణ ఉండదు. ఏ వర్ణమునకు తగిన విద్య
ఆ వర్ణమునకు నేర్పుతారు. ఒకరితోనొకరు, గురుకులములో సఖ్యతగా ఉంటారు. అసవర్ణులైనా
ఎంతో అన్యోన్యముగా ఉంటారు. అటువంటి అన్యోన్యత కలిగిన జంట శ్రీకృష్ణ కుచేలులది.
గురువు వేతనమేమీ లేకుండానే విద్య నేర్పించినా, లబ్ది
పొందినవారు ఈ
క్రింది శ్లోకార్థమునకు కట్టుబడి ఉందితీరవలసినదే! ‘విద్య దానము కాదు’. జిజ్ఞాసువుకు అది ఒక
విధముగా అసిధారా వ్రతము. గురువు కను సైగాలలో మెదలుతూ ఆయన కుటుంబ జీవనమునకు తగిన
వనరులను అడవి నుండి సమకూర్చుచూ, ఉన్నవారూ, ఉన్నతమైన వారు తమ శక్తిలోపము లేకుండా ధన
సహాయము చేయుచూ, గురువు వద్ద విద్య ఎర్వవలసి ఉంటుంది. ఈ క్రింది శాస్త్ర చోదిత
శ్లోకమును చూడండి.
గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాl
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపలబ్ధతేll
విద్యను అభ్యసించే
విషయంలో మూడు విధానాలు చెప్పబడినాయి.1.గురువుగారిని సేవించి,సపర్యలు
చేసి ,2.ఆయనకు సమ్మతమైన మేరకు పుష్కలమైన ధనమును ఇచ్చి 3.తన
దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్యను నేర్చుకొనుట మినహా నాలుగవ విధానము లేదు అని.
అందులో భాగాముగానే ఒకరోజు గురువుగారికి సమిధలు సమకూర్చుటకు శ్రీకృష్ణ
కుచేలులు అడవిలోనికి బయలుదేరినారు. అనూహ్యముగా మేఘములు కమ్ముకొని
వాన కురియుట మొదలుపెట్టుటచేత ఆశ్రమము వెళ్ళలేక
ఒకచేట్టునేక్కి కూర్చున్నారు. అందునా కుచేలుని పైకొమ్మపై కూర్చుండ తెలిపి తాను
క్రింది కొమ్మపై కూర్చున్నారు శ్రీకృష్ణులవారు. కారణము నిజమునకు ఏమిటంటే కుచేలుడు
అగ్రవర్ణుడు. అర్ధరాత్రి గడిచింది. ఇటు కుచేలునికీ అటు శ్రీకృష్ణునికి కూడా ఆకలి
వెయ మొదలైనది. తానూ తెచ్చుకొన్న కొన్ని అటుకులు మిత్రునితో పంచుకొంటే చాలవని తలచి
మూట విప్పి, తాను మాత్రమే తిన దోదగినాడు. దీనిని పైనుండి బ్రహ్మ గమనించుచున్నాడన్నది
గ్రహించలేక కుచేలుడు తనపనిలో తానూ నిమగ్నమైపోయినాడు. అటుకులు నమిలే కటకట శబ్దము
కుచేలుని నుండియే వచ్చుచున్నదని గ్రహించిన శ్రీకృష్ణుడు ‘ ఏమిటో నములు చున్నావే
కుచేలా! ఆకలగుచున్నది, నాకు కూడా కొంచెము పెట్టు’ అన్నాడు. అప్పుడు కుచేలుడు ‘అబ్బే
ఏమీలేదు, వర్షము వల్ల వచ్చే వణుకుతో
పపళ్ళు, క్రిందిపళ్ళు తగిలి శబ్దము వస్తూ వున్నది’ అని అన్నాడు. ‘ఓహో! లోకాలనేలే
సామికె అబద్ధము చెబుతావా’ అని అప్పటికప్పుడు కుచేలుని నుదుట శ్రీ క్షయః’ అని
వ్రాసినాడు. అది మొదలు అతని సంపద క్షీణించి క్షీణించి నిరుపెడగా మిగిలి పోయినాడు.
మరి కృష్ణుని వద్దకు ఉత్తచేతులతో పోకూడదని తెలిసినవాడగుతచే ఇంట ఉన్న పిడికెడు అటుకులూ, నాటి పాపమునకు
పరిష్కారమా!’ అన్నట్లు కట్టుకొని బయలుదేరినాడు. పైగా శాస్త్రము తెలిసినవాడాయె!
శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నదంటే:
దదాతి ప్రతిఘృణ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి l
భుంక్తేచ భోజయిత్యైవ షడ్విధం మిత్రలక్షణం ll అన్నది.
అడితెలిసినవాదయినందువల్ల కుచేలుడు అటుకులతో బయలుదేరినాడు.
మిగిలిన కథ మీకు తెలిసినదే!
స్వస్తి.
No comments:
Post a Comment