ధర్మరాజు స్వర్గారోహణము
https://cherukuramamohanrao.blogspot.com/2021/12/blog-post.html
మనకు భారతములో స్వర్గారోహణ పర్వము కలదు. కానీ అందలి వర్ణనలు
మనకు అంతు బట్టవు. నాటి మహనీయులు ఎవరయినా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు
వ్రాయరు. వారు వ్రాసే ప్రతి మాటా అక్షరసత్యమే! అంతటి బలమైన నమ్మకముతో ఈ వ్యాసమును
చదవండి. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి
నుండి స్వర్గానికి చేరుకోగలిగిన ఏకైక మార్గము ఇదే.
బద్రీనాథ్ క్షేత్రము మనకు తెలిసినదే! నుండి 5km దూరం లో వుండే చిన్న
గ్రామం.
భారతదేశముయోక్క చివరి గ్రామము కూడా ఇదే! ఇచ్చటి నుండియే
టిబెట్ ప్రారంభమవుతుంది.
ఈ గ్రామము యొక్క చివరన సరస్వతి నది మనకు ప్రవహిన్చుతూ
కనిపిస్తుంది అంటారు. ఇక్కడి నుండి ఆనది కొంత దూరం ప్రవహించైనా పిదప అలకనంద నది లో
కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది.
ఈ సరస్వతి నది పక్కన భీమపుల్
అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన
గా ఏర్పాటు చేసాడు అంటారు.ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద
అచ్చులు కుడా వుంటాయి.
ఈ వంతెన దాతిన తరువాత స్వర్గారోహణ మార్గం ప్రారంభమవుతుంది.
ఇచట నుండి చట్మోలి 8కి.మీ. దూరము. మార్గ మధ్యమద్యములో భృగుమహర్షి ఆశ్రమము
కన్పిస్తుంది. ఆతరవాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా
కుడా చెప్తారు. ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.
తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి
పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.
ఇక్కడినుండి 5కి.మీ. ప్రయాణం చేసిన తరువాత
వసుధార జలపాతము వస్తుంది.
ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ జలపాతం దాదాపు 120మీ
ఎత్తునుండి పడుతుంది.
ఇక్కడ గాలులు బలంగా వీస్తూ ఉండుట చేత ధార చాల పలుచగా నీటి
తుంపర లవలె పడుతుంది. పాపులపై ఈ జలధార పడదు అని స్థానికులు అంటారు.
తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే
అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం. పర్వతారోహకులకు ఇది ఒక విడిది
ప్రదేశం.
ఇక్కడే సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అనే రెండు నదులు ( హిమనీనదములు
) కలిసి #అలకనంద గా ఏర్పడతాయి. అక్కడి నుండి ముందుకు వెళితే ధనో
హిమనీనదం కు చేరుకుంటారు.
చట్మోలి నుండి లక్ష్మి వన్ 1కి.మీ. దూరము. (ఇది
12600 అడుగుల ఎత్తు లో ఉన్నది). తర్వాత లక్ష్మీవన్ ప్రాంతం
కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదం గా
ఉంటుంది.
ఇక్కడే లక్ష్మి నారాయణులు కొంతకాలము తపస్సు చేసినట్లు తెలిసినవారు
అంటూ ఉంటారు. ఇక్కడే ద్రౌపది తనువు చాలించిందట. ఇక్కడి
నుండి 2కి.మీ. పయనించితే బంధుర్ అనే ప్రాంతమును
చేరుకుంటాము. ఇక్కడే
ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసినట్లు చెబుతారు. బంధుర్ నుండి
సహస్రధార 4km ( 14000 అడుగుల ఎత్తులో ఉన్నది).
సహస్ర ధార నుండి చక్ర
తీర్ధము 5కి.మీ. (15000 అడుగుల ఎత్తులో ఉన్నది). చక్రతీర్థము
విష్ణుమూర్తి తన సుదర్శన చక్రమును కింద
పెట్టుట వలన ఏర్పడిన సరస్సు గా తెలిసినవారు చెబుతారు. ఇక్కడే అర్జునుడు తనువు
చాలించినాడని తెలియవస్తూ ఉన్నది.
చక్రతీర్ధము నుండి సతోపంత్ 5కి.మీ. ఈ సతోపంత్
అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు. ఇది 5 పర్వతాల మధ్య
వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే సరస్సు.
ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని
గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని అంటారు.
ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.ఇక్కడే భీముడు
తనువు చాలించాడని చెప్తారు.
సతోపంత్ to స్వర్గారోహిణి 8 km:- ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు.
మార్గం లో చంద్రకుండ్ & సూర్యకుండ్ అనే
సరస్సులు ఉంటాయట.
ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే కుక్క తోడూ రాగా స్వర్గానికి
ప్రయాణించాడు అంటారు.
నిజానికి స్వర్గారోహిణి అనేది 6
పర్వతాల సమూహం గా తెలుపుతారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది
ముఖ్యమైంది. ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ
ప్రాంతానికి చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం
ఉంటుంది.
ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం
( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే
స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.
Climbing history:-Swargarohini
1 has been climbed by a 4-man team from West Bengal. The first civilian to
reach the summit on 29 June 2016 at 6:45 am was leader, Thendup Sherpa. The
expedition was organised by The Natures Foundation Kanchrapara of West Bengal.
Its members were Suman Dey, Debabrata Dutta (team leader), Bikramjeet Nath and
Bikramjeet Debnath. It was very technical between Camp 1 and Camp 3. There was
no site for Camp 2, but ultimately after long hard work, the team successfully
summited Swargarohini 1, the first civilians to do so. Suman Dey Summit member
Swargarohini I has seen many climbing attempts. As of 1994, fifteen
attempts had been made. On 25 October 1974, Charles Clarke (England); Dilsher
Singh Virk, Peter Fuhrman and Bruce MacKinnon (Canada); and Mohan Singh and
Rattan Singh (India) made the first ascent of the west summit of Swargarohini
I, ascending from the west side. The first ascent
came on 3 May 1990, by a team of instructors from the Nehru Institute of
Mountaineering. They climbed from the Ruinsara Valley on the north side, via
the eastern col connecting the peak to the rest of the range, and found
challenging rock climbing to achieve the col, leading to easier snow slopes
above. However, other sources claim that this ascent stopped 5 m (16 ft.) short
of the summit due to the presence of an unstable cornice. The south face of the
peak was attempted unsuccessfully in 1991. On 7 June 1993, an expedition from
Sweden made the first undisputed ascent of the peak via this face. The summit
team comprised Birger Andrén, Ingela Nilsson,
and Ake Nilsson. They ascended a rock ridge on the eastern side of the south
face, leading to the easy east-southeast ridge.
సతోపంత్ తాల్ google route map
https://www.youtube.com/watch?v=WtxonUTCZU8 Trek to Satopant lake and
Swargarohini Glacier. https://www.youtube.com/watch?v=j11fIRxFxo0 స్వర్గారోహిణి ఎక్కిన వారి ప్రయాణ అనుభవాలు చదవాలంటే https://www.himalayanclub.org/hj/47/8/the-first-ascent-of-swargarohini-i/
పాండవులు బొందేతోనే స్వర్గము చేర ప్రయత్నించినారు అన్న
భారతములోని విషయమును వాస్తవమని నమ్మి నా చేతనైన మేరకు మీముందుంచుచున్నాను.
నేను, స్వర్గారోహణ మార్గము యొక్క వివరములను తెలుసుకోవలెననియే కానీ ఆదారిన వెళ్ళవలెనని
కాదు. కారణము నాకు వయసు సహకరించదు. అందుచేత
తెలుగు English
భాషలలో నాకు తెలిసిన సమాచారం సేకరించినాను. నా ధృడమైన నమ్మకము ఏమిటంటే వ్యాసులవారు,
ధర్మాత్ముడగు ధర్మరాజు, ఆయన తమ్ములు, వారి ఇల్లాలిని గూర్చి భారతములో ఈ
ప్రస్తాపనాను గూర్చి విస్తారముగా వ్రాయటమే! నాటి మహనీయులు అబద్ధాములను ఆడారు, అభూత
కల్పనలు చేయరు అన్నది నా ధృడ నమ్మకము. మనము చూడనంత మనకు తెలియనంత మాత్రాన, వ్యాసుని
వంటి పెద్దలు చెప్పిన మాటలు అబద్ధములు కానవసరము లేదు. ఇందుకు సంబంధించిన విశేషములు
ఇంకా తెలిసివుంటే ఎవరైనా అభిప్రాయ వేదికపై వ్రాసి పుణ్యము కట్టుకోనవచ్చును.
స్వస్తి...
No comments:
Post a Comment