కాంచీపురం
https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post.html
''పుష్పేషు జాతీ పురుషేషు విష్ణుః నారీషు రంభా నగరేషు కాంచీ'
అన్నది మహాకవి కాళీ దాసు చెప్పిన మాట. .
కాంచి' అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము. ఈ పట్టణము అతి ప్రాచీనమైనది.
ఇది వేగావతీ నది యోడ్డున వుంది. చాలాకాలమీ పట్టణము పల్లవుల చోళుల
తదనంతరం పాండ్యుల ఆపైన విజయ నగర రాజుల పరిపాలన లో ఉండినది. వారి తరువాత ముస్లిం
క్రైస్తవ ప్రభుత ఏలుబడిలోకి పోయింది. ఇంకాంచీపురం
కాంచి అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము. ఈ పట్టణము అతి
ప్రాచీనమైనది. ఇది వేగావతీ నది యొడ్డున వుంది. చాలాకాలమీ పట్టణము పల్లవుల చోళుల
తదనంతరం పాండ్యుల ఆపైన విజయ నగర రాజులు పరిపాలించినారు . వారి తరువాత ముస్లిం
క్రైస్తవ ప్రభుత ఏలుబడిలోకి (788–820)పోయినది. ఇందులో 'ఘటికాస్థానము'
లనబడు గురుకులములుండేవి .(ఘటికా స్థానమని ఎందుకంటారు అన్నవిషయాన్ని
వేరోకసారి ముచ్చటించు కొందాము).
ఇక్కడ వుండే దేవాలయాలు లెక్కకు మిక్కుటములు. అందుకే 'కంచి
లోని గుళ్ళు తిరుపతి లోని గుండ్లు లెక్కించలేమంటారు.' ఒకప్పుడిది
జైన బౌద్ధ ధర్మములకు ఆలవాలము. 4 నుండి 9వ శతాబ్దము వరకు ఇది పల్లవుల రాజధాని.
4. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారి కాలము
క్రీ.పూ.509-477 అని నిర్ద్వంద్వముగా పండిత కోట వెంకటాచలం గారు నిరూపించినారు. ఆ
విషయము వేరొకసారి ప్రస్తావించుతాను. ప్రస్తుతానికి క్రీ.శ.788–820 కాదని గ్రహించ
గలిగిన చాలు. వారి కాల నిర్ణయమును గూర్చి వేరోకసారి ప్రస్తావించుతాను. వారి చేతనే
స్థాపించబడి వారే మొదటి గురువై విలసిల్లిన గురు పీఠము కల్గిన పట్టణమిది. ఈ పీఠమును
వారు 6 సం. మాత్రమే అలంకరించినారు.ఇక ఈ పీఠము నధిష్ఠించి నడిచే దేవునిగా
కొనియాడబడిన చంద్ర శేఖర సరస్వతీ స్వామివారిని గూర్చినే నెక్కువగా చెప్ప నక్కర
లేదు.
కంచి పట్టుకు తుది మెట్టు. ఇప్పటికీ అక్కడి నేతపనివారు
(సాలె వారు) చాలామంది తెలుగువారే. ఒకప్పుడు అంతా తెలుగు వారే. ఆరోజుల్లో ఈ నగరము
అత్యుత్తమమైనదిగా పేరుగాంచి యుండినది. అందుకే 'నగరేషు కాంచి' అన్నారు కాళీదాస మహాకవి గారు. యువాన్ త్సువాంగ్ అన్న చైనా బౌద్ధ భిక్షువు
ఈ పట్టణాన్ని 7వ శతాబ్దములో సందర్శించినపుడు ఇది 6 మైళ్ళ (అంటే ఇంచుమించు 10 కి.
మీ.) పరిధి కలిగియుండినదని తన పుస్తకములో వ్రాసుకొన్నాడు. ఇక్కడి ప్రజలు ధైర్యమూ
నీతి న్యాయము ధర్మమునకు నిజాయితీకి కట్టుబడిన వాళ్ళని తన పుస్తకములో
తెలియబరచినాడు.
చైనాకు బౌద్ధ ధర్మమును గొనిపోవుటయేగాక షావోలిన్ సన్యాసి మఠమున ‘కుంగ్ ఫూ’
ను ప్రవేశపెట్టిన బోదిధర్మ ఇక్కడివాడు .
'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి అవంతికాపురీ ద్వారావతి చైవ సప్తైతే మోక్ష
దాయకాః' అన్న ఈ ఆర్యవాక్కు ననుసరించి ఈ క్షేత్రము (అంటే దేవాలయములు కాక ఈ
పట్టణ భూమియే) మోక్ష దాయకమయిన 7 క్షేత్రములలో ఒకటి. కంచి రెండు గా
విభజింప బడినది
వైష్ణవములో ముఖ్యమైన రెండు శాఖలు 1.వడఘలై 2.తేంఘలై . మొదటి తెగకు
శ్రీరంగము, అహోబిలము రెండవదానికి కాంచీపురము తిరుమల ముఖ్య మఠములు
కలిగియున్నవి. కంచి లోని తిరుకోయిలూర్ లో వీరి మఠము గలదు.
ఇక్కడి అనేక ముఖ్యమైన ప్రాంతములలో అతిముఖ్యమైనవి నాలుగు.
1. కంచి వరద రాజ పెరుమాళ్ : ఇక్కడ ఈయన ఆది లోనే వెలసినస్వామి. వీరి అతి
పురాతన దేవాలయము విష్ణుకంచి లో గలదు. ప్రసిద్ధి చెందిన
బంగారు,వెండి బల్లులుండేది ఇక్కడే.
విష్ణుకంచి కాంచీపురంలో ఆగ్నేయం వైపు ఉంటుంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి
వరదరాజస్వామి ఆలయం. అంతేకాక కామాక్షీ మందిరంలో చోరవిష్ణువు అని ఉన్నాడు.
ఆయన కూడ 108దివ్యక్షేత్రములలో ఒకడు. ఈ వరదరాజస్వామి ఆలయాన్ని విష్ణుకోటి,
పుణ్యకోటి అని పిలుస్తారు. ఇంద్రుడు ఒకానొక శాపానికి గురై ఏనుగు రూపం ధరించి,
తపస్సు చేసి శాపవిమోచనం పొందిన చోటు విష్ణుకంచి. ఏనుగు రూపాన్ని ఇక్కడ వదిలి
దేవతగా మారి వెళ్ళి పోయిన ఆఏనుగు శరీరమే హస్తిగిరి అన్న కొండగా మారింది.
ఆగిరిపై నారాయణుడు వెలిసినాడు. నరసింహ మంత్ర ఉపాసన చేసినాడు కనుక
ఇంద్రుని గుండెల్లోనుంచి నరసింహస్వామి వెలికి వచ్చినాడు. అందుకే హస్తిగిరి
నరసింహస్వామి లోపల ఉంటాడు. పైన వరదరాజస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడే
బ్రహ్మ, మహాయజ్ఞము చేసినాడు. అక్కడ శుక్లుడు, హేముడు అనే వేదవేత్తలైన
బ్రహ్మచారులుండేవారు. వీరిద్దరూ గౌతమ మహర్షి శిష్యులు. వారుభయులూ ఒకసారి
గౌతమ మహర్షి ఆజ్ఞమేరకు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళి అభిషేకం కోసం నదీ
జలాలను కూడా తెచ్చుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో ఒకచోట జలపాత్రను పెట్టి
ఎండు కట్టెలు ఏరుతున్నారట. వారికి తెలియకుండా ఆచెట్టుమీద ఉన్న బల్లి ఈనీటిలో
పడిందట. ఆనీటిని చూసి గౌతమమహర్షి మీరిద్దరూ బల్లులుగా పుట్టండి అని
శపించారట. ఇంద్రుడు హస్తిరూపంలో తొండంతో వీరు ఉన్న కొమ్మని విరిచాడు.
వీరిద్దరూ ఇంద్రునిపై పడ్డారు. ఇంద్రుని తపస్సు వల్ల వారిద్దరూ పవిత్రులై వారి దేహాన్ని
విడిచిపెట్టి వారి వారి రూపాలను పొంది మోక్షమును అందుకొన్నారు కాంచీపురంలో
ఉన్న బల్లులు. మానవశరీరం హస్తిగిరి, ఇంద్రియాలు ఇంద్రుడు, బల్లులు ఇడ, పింగళ
నాడులు. ఇక్కడ విష్ణ్వారాధన చేస్తే కోటి పుణ్యములు
లభిస్తాయి అన్నది ఆర్య వాక్కు.
మత్స్యావతారం ఎత్తి, జలాలలో దాగిన సోమకుణ్ణి వధించి, వేదాలను కాపాడిన శ్రీమహావిష్ణువు... సప్త
మోక్షపురాలలో ఒకటైన తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామిగా నీటి కొలనులో
విశ్రమిస్తాడు.
నాలుగు దశాబ్దాలకు ఒకసారి పైకి వస్తాడు. వివిధ అలంకారాల్లో అర్చనలు అందుకుంటాడు. మళ్ళీ
జలగర్భంలోకి చేరుకుంటాడు. ఏ ఆలయంలోనూ కనిపించని ఈ విశేషానికి కంచిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్
ఆలయం ప్రసిద్ది. 2019 లో దర్శనమిచ్చిన స్వామీ తిరిగీ 2059 లోనే దర్శనమిచ్చుట జరుగుతుంది.పురాణ
కాలంలో ఛతుర్మఖ బ్రహ్మ దివ్వమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచేత అత్తి చెట్టు
కాండంతో శ్రీవరదరాజ స్వామి(వరములను ఇచ్చేటి శ్రీ నారాయణుని)విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించినారు.
అత్తిని తెలుగులో కూడా అత్తి అని లేక మేడి అని అంటారు. మేడి లో బ్రహ్మ మేడి అన్నది ఒక వృక్షవిశేషము.
తరుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చివేసి , దేవాలయ సంపదను దోపిడి చేస్తున్న సమయంలో108 దివ్యదేశాల్లో ఒకటైన కంచిలో వరదరాజ పెరుమాళ్గా ఆ వైకుంఠనాథుడు భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో గరుడ విగ్రహం చాలా చాలా భారీగా ఉంటుంది. ఇంతటి లోహపు విగ్రహము ఆ కాలములో ఇతర ప్రసిద్ధ విష్ణ్వాలయములలో ఉండేవి కాదు. ఈ
విగ్రహంపైనే వరదరాజస్వామి ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులు ఎప్పటికీ
చిన్నవిగా ఉంటాయి. వీనిని సాధారణముగ పంచలోహాలతో తయారుచేస్తారు. ప్రతి సంవత్సరం
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడ సేవకు సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ
వాహనాన్ని ఉప్పు చింతపండుతో తోముటయే కాక ఇప్పటి బజారులో లభ్యమయ్యే కొన్ని మెరుగులు దిద్దే
వస్తువులను కూడా వాడుతారు. ఇది నతో శ్రమతో కూడిన పని. ఈ పనికి, నాఅంచనా తప్పు కావచ్చు,
దాదాపు 15, 20 మందిని పురమాయించుతారు. దాన్ని శుభ్రం చేసే క్రమంలో వారు ఎంతో అలసిపోతారు.
‘ఈ గరుడ వాహనానికి మెరుగులు దిద్దుట అంతా ఊరేగింపుకే! ఇంత చేసి అలసిపోయిన ఆ పనివారు
అనుకునేవారట “ఈయనేమన్నా వరాలు ఇస్తాడా ఏమన్నానా?, అదేదో స్వామి వారికి చేస్తే కోరికలూ
తీరుతాయి, పుణ్యమూ దక్కుతుంది”. ఆవిధముగా “కంచి గరుడ సేవ” అన్న జాతీయము
రూపుదిద్దుకోనింది. ఎప్పుడైనా మనం చేసిన పనులు వృథా అయినప్పుడు ఈ గరుడ సేవతో పోలుస్తూ ‘
కంచి గరుడ సేవ’ అనే జాతీయాన్ని వాడుతుంటారు.
మనదేశమును తన శక్తికి మించి దోచుకొన్న రాబర్ట్ క్లైవు, స్వామి దయ కోసమేమో, వజ్రాలహారాన్ని ఆయనకు చేయించినట్లు చెబుతారు.
2.కామాక్షీ దేవి: కంచి లో తల్లి లీలలు అనూహ్యములు అనంతములు.
ఈమె విగ్రహములోని తీక్షణతను తగ్గించి శాంతింప జేసినవారు శంకరాచార్యులవారు.
అమ్మవారి ఎదుట శ్రీ చక్రమును ప్రతిష్ఠించి పూజలు చేయ ,వారు
నిర్దేశించినారు. వారిమాట నేటికి అమలు జరుగుచున్నది. అమ్మనుఆరాధించిన ఒక మూగకు
మాటలు వచ్చుటే గాక ఆ మహానుభావుడు మూక పంచశతి తి అను మహాకావ్యము అమ్మవారి
దయాపరాయణత్వమును గూర్చి వ్రాసి మూకకవిగా అమ్మవారి భక్తకోటి హృదయాలలో చెరగని ముద్ర
తో నిలచిపోయినాడు. ఆ మహనీయుని పాదదోయికి శతసహస్ర వందనములు.
3. ఎకామ్ర నాధుడు : స్వామి స్వాయంభు లింగము. ఈ లింగము పంచ భూత లింగములలో మొదటిది. దీనిని పృథివీ లింగము అంటారు. జంబుకేశ్వరము (తిరువానిక్కావిల్) ఆపో లింగము. ఇక్కడ గర్భ గుడిలో దేవుని వద్ద ఎప్పుడూ తడిగానే వుంటుంది. అరుణాచలము తేజోలింగము. తమిళము లో తిరువణ్ణామలై అంటారు. కాళహస్తి వాయు లింగము. గర్భ గుడిలోని దీపము,గాలి వచ్చే అవకాశము లేకుండానే
ఎప్పుడూ రెపరెపలాడుతూనే వుంటుంది. మిగిలింది ఆకాశ లింగం. స్వామి అమ్మవారితో
ఒక తెరలోపల వుంటారు. ఈ తెరనే మాయ అంటారు. తెర తీస్తే అక్కడ చర్మ
చక్షువులకేమీ కనిపించదు. 'ఆకాశం గగనం శూన్యం' అన్నది అందరికీ తెలిసిన
విషయమే కదా. ఇదే చిదంబర రహస్యము . ఇచ్చట నటరాజ విగ్రహము మనము
చూడవచ్చు. ఆయన ఈ జగన్నాటక
సూత్ర ధారి.
ఇక ఈ ఎకామ్రనాధ దేవాలయము 23 ఎకరముల విస్తీర్ణములో వుంది. ఫాల్గుణ మాస
బహుళ పక్షంలో అంటే మార్చి చివర ఏప్రిల్ మొదటి వారములో 3 దినములు స్వామీ
పాదాలమీద సూర్యకిరణములు పడతాయి.
ఇక్కడి ఆమ్ర వృక్షము దాదాపు 3500 సం.ల వయసు కలిగినదని చెబుతారు. అంత
విస్తీర్ణములో ఇది ఒకటే మామిడి చెట్టు. దీని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఫలము మాత్రమె
కాస్తుందని జనశ్రుతి . చెట్టును చూస్తూనే ఎన్నో వేల యేళ్ళదని మనకు ఇట్టే తెలిసి
పోతుంది.
4. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారి కాలము క్రీ.పూ.509-477 అని
నిర్ద్వంద్వముగా పండిత కోట వెంకటాచలం గారు నిరూపించినారు. ఆ విషయము
వేరొకసారి ప్రస్తావించుతాను. ప్రస్తుతానికి క్రీ.శ.788–820 కాదని గ్రహించ గలిగిన
చాలు. వారి కాల నిర్ణయమును గూర్చి వేరోకసారి ప్రస్తావించుతాను. వారి చేతనే
స్థాపించబడి వారే మొదటి గురువై విలసిల్లిన గురు పీఠము కల్గిన పట్టణమిది. ఈ
పీఠమును వారు 6 సం. మాత్రమే అలంకరించినారు.ఇక ఈ పీఠము నధిష్ఠించి నడిచే
దేవునిగా కొనియాడబడిన చంద్ర శేఖర సరస్వతీ స్వామివారిని గూర్చినే నెక్కువగా చెప్ప
నక్కర
లేదు.
ఇప్పటికే చాలా వ్రాసినానేమో. పైన తెలిపిన విషయాలు నాల్గింటినీ కలిపి ఒక సీస
పద్యము వ్రాసినాను. ఈ పద్యమును 'ముక్త పద గ్రస్త' ముతో అలంకరించినాను . ప్రీతితో
చదువ ప్రార్థన .
వారించి మహిమచే వాంఛితాల వరద
వరదరాజులు బ్రోచు 'వ' 'ర'
'ద' యనుచు
కామాక్షి కన్నులు కామకోటిని చేర్చు
కామకోటినిచేర్చు కడలి యడుగు
ఏకామ్రనాథుని ఎన్ని మదిన గొల్వ
కొల్వ వీలే లేని కోర్కెలడచు
కామకోటీ పీఠ కరుణా సుధా ధారి
దారి చూపు తనదు దరినిజేర
అన్న చెల్లి బావ ఆదిశంకర పీఠ
పీఠ మయ్యి కంచి పేరుగాంచ
కాంచ పుడమి తల్లి కటికి నయ్యెను కాంచి
కాంచి నిలుప భక్తి కలుగు ముక్తి
తమిళములో 'వ' అంటే 'రా'అని, ఇక తెలుగులో 'ర'అన్నా 'ద' అన్నా 'రా' అనే. అంటే
వరదరాజస్వామి భక్తులను రా రా రా అని పిలిచి కోర్కెలు తీర్చి మనల బ్రోచుటకు సిద్ధము
గా వున్నాడు.
కోట్లకొలది వున్నా కామములను అంటే కోర్కెలను తీర్చి మనలను కామకోటికి అనగా మోక్షమునకు అనగా కామితార్థముల అంచుకు (కోటి) చేర్చుటకు కామాక్షి తల్లి సిద్దముగా వున్నది .(కోటి అంటే అంచు, కొస, కొన, అని అర్థము). కామమునకు అంచు మోక్షము.
ఎందుకంటే చతుర్విధ పురుషార్థములు ధర్మార్థ కామ మోక్షములు. మూడవదైన
కామము పిదప వచ్చేది (అంటే కామమునకంచు ) మోక్షమే.
ఇక ఎకామ్ర నాథుని మనసారా కొలిస్తే అంటే స్వామిని సేవిస్తే కొలుచుటకు వీలేలేని కోర్కెలను అణచుతాడు.
కామ కోటి పీఠ కరుణా సుధా ధారి అంటే కంచి కామకోటి పీఠ అధిపతి అనగా
చంద్రమౌళీశ్వరుడు, ఇంకొక విధంగా ఆలోచిస్తే నడచే దేవుడైన చంద్ర శేఖర సరస్వతి
స్వాములవారు తన వద్దకు చేరేదారిని చూపుతాడని కూడా అనవయించుకొన
వచ్చును.
కావున ఆవిధమైన అన్న (వరద రాజులవారు అంటే విష్ణువు) ఆయన చెల్లెలు కామాక్షీ
దేవి, ఆమె భర్త యగుటవల్ల విష్ణువుకు బావయైన ఏకామ్రేశ్వరుడు, ఆ పైన చంద్రమౌళీశ్వరుడు, చంద్రశేఖర సరస్వతీ సంయమీంద్రుల పీఠములకు పీఠమై పేరుగాంచిన కంచి భూమికి వఢ్యాణ్ణమై చేలగగా అట్టి కంచి ని గాంచి అంటే చూసి, (తిలకించి) భక్తి నిలిపిన ముక్తి కలుగును .
స్వస్తి.
No comments:
Post a Comment