రామాయణ పారాయణ శ్లోకములు
(మొదటి
శ్లోకము అవాల్మీకము)
https://cherukuramamohanrao.blogspot.com/2022/10/15.html
వందే వానర నారసింహ ఖగరాట్
క్రోడాశ్వ వక్త్రాన్వితం
నానాలంకరణం త్రిపంచనయనం
దేదీప్యమానం రుచా
హస్తాబ్జైః అసి ఖేట పుస్తక
సుధాకుంభం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం
సర్వారి గర్వాపహమ్
సర్వారిష్ట నివారకం శుభకరం పిగాక్ష
మక్షాపహం
సీతాన్వేషణ తత్పరం కపివరం,కొటీందు సూర్య
ప్రభం
లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవు
సమ్మానినం
దేవేంద్రాది సమస్త దేవ వినుతం
కాకుత్స దూతం భజే
భావం
——వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతోను
అనేక
అలంకారాలతో ,దివ్య కాంతి తో ,దేదీప్యమానమైన 15 నేత్రాలు ,పద్మాలవంటి హస్తాలు
ఖడ్గం,డాలు,పుస్తకం,అమృత కలశం ,అంకుశం ,పర్వతం ,నాగలి ,మంచంకోడు
(ఖట్వాంగం) పాము, చెట్టు, ధరించిన వాడు
, మరియు అన్నివిధములైన అరిష్టములను తొలగించే వాడు, పసుపు వన్నె కలిగిన నేత్రద్వయము కలిగిన వాడు,సీతాన్వేషణ
తత్పరుడు,కపిశ్రేష్ఠుడు,కోటి సూర్య
చంద్ర ప్రకాశము గల్గినవాడు , లంకాద్వీపమును భయభ్రాంతి
గావించినవాడు, సుగ్రీవాది సకల సన్నిహితులచే సంమానింప బడిన
వాడు . దేవేంద్రాది సకల దేవతలచే నుతిమ్పబదేడు వాడు,అగు
శ్రీరాముని దూతయైన హనుమంతునికి నమస్కరించుచున్నాను.
శరణాగతుడై
వచ్చిన విభీషణునికి రక్షణ ఇవ్వవలదని ఒక్క హనుమంతుడు తప్ప అందరూ
చెప్పినవారే
! కానీ రాముడు వారందరితో ఇతడు" 'రాఘవం శరణం గతః'శరణ్య
శరణం గతః'
అనినాడు.నాకు
ఇతడు ఇకపై మిత్రుడే, శరణాగతుడు కూడా కాదు." అని నొక్కి
వక్కాణించుతాడు.
అసలు ఈ మాట చూడండి ఎంత సంస్కారవంతమైనదో!
సకృదేవ
ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే
అభయం
సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ
ఒక్కసారి
నేనే త్రాతనని నమ్మి,
నేను నీవాడను అని శరణు కోరినవాని, సర్వ
భూతములనుండి కూడా రక్షణ కల్పించుట నా వ్రతము. మానవ, దేవ,
దానవ, పశుపక్ష్యాది సమూహముల నుండి ఎవరైనాసరే
ఏవయినా సరే నా అభయమునకు అర్హులు. అసలు ' సకృత్ +ఏవ 'అనడములోనే అసలుమర్మము దాగివుంది.ఒక్కసారి 'రక్షమాం'
అని దృఢమైన నమ్మకముతో అంటే చాలుఆయన రక్షకునిగా నిలుస్తాడు. అసలది
ఆయన వ్రతము. కానీ మనది 'ఏరు దాటించితే ఎంగన్న' వ్రతము. భక్తీ, యోగము, తపస్సు
ఎన్నివున్నా పరమాత్మ పై అచంచల విశ్వాసము అత్యంత ప్రాముఖ్యము. ఈ శ్లోకము సర్వులకూ
సర్వదా పఠనీయము. శ్రీ రాముడు ఎంతటి మహానీయుడో చూడండి.పాశ్చాత్య పుస్తకాలలో ఇటువంటి
కమనీయ గుణాభిరాముడు భూతద్దము పెట్టి వెదకినా దొరకడు.
ఇంకొక
ముఖ్యమైన విషయం :
ధర్మాత్మా
సత్యసంధస్యరామో దాశరధిర్యధిఃl
పౌరుషేచాప్రతిద్వన్ద్వః
శరైనంజహిరావణింll
ఈ
మాటలనే మంత్రముగా జేసి రావణ కుమారుడైన ఇంద్రజిత్తు పైకి వదిలి అతనిని
కూల్చినాడు.
అసలు ఈ మాటల సారాంశమేమి?
అవి మంత్రమని మనమేవిధముగా
చెప్పగలము.
చంపేది లక్ష్మణుడు చచ్చేది మేఘనాధుదనబడు ఇంద్రజిత్తు. కానీ బాణము పై
ఆవాహన
చేసిన మంత్రము రామునికి సంబంధించినది. అది విశేషము. అసలు ఈ
విశేషములో
గల విశేషము ఎంతో ముఖ్యమైనది ఒకటి ఉంది. ఈ శ్లోకములో మూడు
విశేషణములు
రామునికి వాడబడినాయి. 1.
ధర్మాత్మ 2. సత్యసంధస్య 3.పౌరుషేచ
అప్రతిద్వందః, ఈ మూడిటినీ మన
మూడవ కన్నుతో ఒకసారి చూస్తాము.
1. చెట్టు చాటునుండి వాలిని చంపిన వ్యక్తీ ధర్మాత్ముడా?
2. తండ్రికి, ప్రజలకు యౌవరాజ పట్టాభిషేకమునకు
ఇచ్చగించినట్లు తెలిపి తెల్లవారిన వెంటనే
అడవులకు
పోవుట సత్యసంధత అనిపించుకొంటుందా?
3. ఖరునితో యుద్ధము చేయునపుడు మూడడుగులు వెనుకకు తగ్గిన రాముడు
పౌరుషమందు
ఎదురులేనివాడా?
1. పై సందేహమును వాలియే రామునితో వెలిబుచ్చినాడు.
దానికి రాముడిచ్చిన జవాబు ఒక పర్యాయము చూద్దాము.
శ్రీరాముడు వాలిని సంబోధించడమే ఆయన యొక్క పరిణతిని తెలుపుతుంది. ఆయన వాలిని “వాలీ!
నీవు వయసు వచ్చిన బాలుడవు. నేను కాననలకు బయలుదేరు
సమయమున భరతుడు రాజ్యము తనకు వలదని పట్టుబట్టినా, నేను తనకు నచ్చజెప్పి ‘త్వం రాజా భారత
భవ స్వయం వారాణాంl అహమపి రాజరాట్ మృగాణాంll’ అని
తెలిపినాను అందుచేత నేను ఆతని ఆదేశమును పాలించుచూ వన్యమృగ శాసకుడనైనాను. నీవే
చెప్పుకొన్నట్లు నీవు మృగానివి, పైగా రాజువైయుండి బ్రతికియున్న తమ్ముని భార్యను
బలవంతముగా అనుభవించుచున్న వానివి. అందుచే దోషివి. అదికాక అగ్నిసాక్షిగా నేను
సుగ్రీవ మిత్రుడను. రావణునితో మైత్రి
ఘటించిన నిన్ను నేను మిత్రునిగా చేసుకొని ధర్మమునకు కళంకము నాపాదించలేను.
సుగ్రీవుడు నిన్ను శరణుకోరినా, రక్షించవలసిన
రాజువైయుండి కూడా ఆతనిని ఉపేక్షించి వెడలగొట్టితివి. నీవు ఏదిఏమయినా
తిర్యగ్జాతికి చెందిన వాడవే. దూరమున
ఉండుటచే నీ దృష్టి నాపై పడలేదుగానీ, నాబాణము నీ గుండెనే
చీల్చినది, వీపును కాదు. కావున నాకేదోషము అంటదు” అని శ్రీరాముడు వాలికి తెలియజేసినాడు. అప్పుడు వాలికూడా
“పురుషోత్తమా నీవు ఏది పలికితివో అది వాస్తవము. నీచేత మరణించుట సంతోషదాయకము” అని అసువుల
బాసినాడు. ఈ మాత్రము చాలు శ్రీరాముడు వాలి విషయములో ధర్మ పథమును వీడలేదు అనుటకు.
2. ఇపుడు రాముని సత్య సంధత గురించి
పరిశీలిద్దాము. ముందురోజు
పట్టాభిషేకానికి తండ్రివద్ద ప్రజల సమక్షములో కూడా తన సమ్మతిని తెలిపినాడు, కానీ తరువాత రోజు
కైకేయి స్వార్థము దశరథుని మేధోదిగ్బంధము చేయుటచే కుమారుని అడవులకు పంప సమ్మతిస్తాడు. అసలు నాటి ధర్మము
ప్రకారము 14 సంవత్సరములు వనవాసము చేసిన
రాకుమారుడు రాజ్యాధిపతియగు అధికారమును కోల్పోతాడు. అందుకేనా అన్నట్లు కైకేయి
నవ
పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితఃl
చీరాజిన
జటాధారి రామో భవతు తాపసఃll
(2-11-27)
అని
అంటుంది. ఆమె అన్నట్లే దండకారణ్య నివాసము తరువాత సమయము సీతాన్వేషణకే సరిపోతుంది.
తండ్రి మొదట చెప్పిన మాట యగు పట్టాభిషేకమునకు రాముడు ఒప్పుకొన్నా కైకేయి మరియు
తండ్రి ద్వారా అడవులకు పోవలెనను మాట విన్న తరువాత, ఆ మాటకే కట్టుబడుతూ, ఈ విధంగా అంటాడు.
ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితంl
ధర్మ సంశ్రితమే తచ్ఛ పితుర్వచనముత్తమంll
అంటే ధర్మముతో కూడిన సత్యము అత్యంత
ఆచరణయోగ్యము. దశరథుడు రెండవ
పర్యాయము చెప్పిన మాటలో అట్టి ధర్మయుత సత్యము దాగి ఉన్నది కాబట్టి అదే తనకు
యోగ్యమని చెబుతాడు. ఇక్కడ ఇంకొక విషయము ఉన్నది. సుమంతుడు రామలక్ష్మణ సీతలను
రథమునందు కూర్చుండబెట్టుకొని పోతూవుండగా రథమును ఆపమని దశరథుడు సుమంతుని
ఆదేశించుతాడు. రాముడు ఆపవలదని చెబుతూ, తిరిగీ పైన తెలిపిన శ్లోక భావార్తములో “ రథ
చక్రముల సవ్వడి మూలమున వినిపించలేదని చెప్పమంటాడు” అట్లు చెప్పకుండియుంటే తన తండ్రి
అసలు మాట తప్పినవాదవుతాడు. పైగా తానూ ధర్మమార్గామును వీడి రాజ్యమునకై అర్రులుచాచినట్లవుతుంది.
అందుకే రాముడు ధర్మముతో కూడిన సత్యమార్గమును అనుసరించినాడు.
3. ఇక మూడవ మాట పౌరుషేచ అప్రతిద్వందః. ఖరునితో
యుద్ధము చేయునపుడు 3 అడుగులు శ్రీరామచంద్రుడు వెనుకకు తగ్గినాడు అన్న అపవాదు.
ఇద్దరు యోధుల నడుమ యుద్ధము జరుగబోవు క్షణమున యోధుడు ప్రత్యాలీఢ పాదమును ముందుంచి
బాణము సంధించుటకు వెనకడుగు వేస్తాడు. అంటే ఒకే చోటున ఉన్న రెండు పాదాలలో
కుడిపాదముతో వెనుకడుగు వేసి ఆపై ఎడమ పాదమును కుడి పాదము వద్దకు చేర్చి తిరిగీ
కుడిపాదమును వెనుకకు వేయుటతో యుద్ధమునకు సన్నద్ధమైనట్లు ప్రస్ఫుటమౌతూవుంది. కావున ఆయన
‘పౌరుషేచ అప్రతిద్వందుడైనాడు’ కానీ అన్యథా కాదు.
ఇంకొక
మాట. పై మూల మంత్రములో శ్రీరామునికి ‘దాశరథి’అన్న శబ్దము ఉపయోగించబడింది. కొందరు వెకిలిగా
రాముడు 'పాయస పాత్రుడు' కానీ 'దశరథ
జాతుడు' కాదు కదా అని అన్నారు. దశరథుని శక్తి ఆ పాయసములో నిక్షిప్తము
చేయబడినదని నా బాల్యమున ధర్మానుసారులైన పండితులు చెప్పగా విన్నాను. ఆ యాగమే ‘పుత్రకామేష్టి.
దానిని గూర్చి, సమగ్రముగా జరిపించిన వశిష్ఠ మహర్షికే
తెలియగలదు. రామాయణములో విడివిడిగా జరిగిన
ఈ ఉదంతముల నుటంకించిన వారికిఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .
ఒకసారి
పరికించండి. యుద్ధము జరిగేది లక్ష్మణ మేఘనాథుల మధ్యన. లక్ష్మణుడు బాణమును
అభిమంత్రించినది రాముని పేరుపై. అప్పటికి ఉన్న యుద్ధ మంత్రములగానీ , లేక తన సుగుణ
సంపదను,భాతృభక్తిని, మంత్రముగా
చేసిగానీ వాడలేదు. అదిచాలు రాముడెంత గొప్పవాడు అని మనము తెలుసుకోడానికి, కువిమర్శకుల నోరు మూయించడానికి. పై శ్లోకము మంత్రము. కులాతీతమైన మంత్రము.
తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ నూతన
కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన శ్లోకముతోబాటూ
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతేl
అభయం
సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమll
అన్న శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో
మననము చేసుకొనేది.
ఈ ఒక్క మంత్రమే అన్నింటికీ జవాబుచెప్పింది.
దీనిని మూల మంత్రమంటారు. ఎందువల్లనంటే ఈ మంత్రమునభిమంత్రించి లక్ష్మణుడు
ఇంద్రజిత్తుపై వదలిన వెంటనే శిరస్త్రాణ, కుండలసహితమైన బంగారు కాంతులీను
ఇంద్రజిత్తుని తల మొండెము నుండి తొడిమెను విడిచిన పండులా వేరుపడినది. ఈవిధంగా షోడశ
గుణాకరుడైన రాముని గూర్చి, ఎంతైనా చెప్పుకొంటూనే
పోవచ్చు. రామాయణములో విడివిడిగా జరిగిన ఈ
ఉదంతముల
నుటంకించిన వారికి ఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .
పై
శ్లోకము మంత్రము. కులాతీతమైన మంత్రము. తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ నూతన
కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన
సకృదేవ
ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే
అభయం
సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ
అన్న
శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో మననము చేసుకొనేది.
ధ్యాన
శ్లోకములన్నీ వరుసగా :
వందే
వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితంl
నానాలంకరణం
త్రిపంచనయనం దేదీప్యమానం రుచాl
హస్తాబ్జైః
అసి ఖేట పుస్తక సుధాకుంభం కుశా ద్రిం హలంl
ఖట్వాంగం
ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్l
సర్వారిష్ట
నివారకం శుభకరం పిగాక్ష మక్షాపహమ్l
సీతాన్వేషణ
తత్పరం కపివరం,కొటీందు సూర్య ప్రభమ్l
లంకాద్వీప
భయంకరం సకలదం సుగ్రీవు సమ్మానినమ్l
దేవేంద్రాది
సమస్త దేవ వినుతం కాకుత్స దూతం భజేll
ధర్మాత్మా
సత్యసంధస్యరామో దాశరధిర్యధిఃl
పౌరుషేచాప్రతిద్వన్ద్వః
శరైనంజహిరావణింll
సకృదేవ
ప్రపన్నాయ తవాస్మీతి చయాచతేl
అభయం
సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమll
స్వస్తి.
No comments:
Post a Comment