ఆర్య-ద్రావిడసమస్య
https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post_22.html
అనేకయుగాలుగా భారతీయులకు ఇలాంటి సమస్యయే లేదు. ఆర్య ద్రావిడ
రెండూ
సంస్కృతపదాలే. ఆర్య అంటే శ్రేష్ఠుడు,పూజ్యుడు,మాన్యుడు,ఉదారచరితుడు,
శాంతచిత్తుడు
(శబ్ద కల్పద్రుమం) ద్రవిడ (ద్రావిడ)అంటే దక్షిణ భారతం. కారణము అది
మూడువైపులా
నీటిచే (ద్రవముచే) ఆవరించబడియున్నది. అందుచే ఆ ప్రాంత
నివాసులను ద్రావిడులు
అనవచ్చును. ద్రావిడ శబ్దమునకు తమిళులకు ఎటువంటి
స్వామ్యమూ లేదు. స్కాందపురాణము
ప్రకారము పంచ ద్రావిడులు అంటే
గుజరాత,మరాఠా, కర్ణాట, తమిళ, ఆంధ్ర దేశములకు
చెందిన వారు. మరి
ఈప్రాంతములన్నీ పారావార పరివేష్ఠితములే కదా! ఇక అనార్యుడు అంటే
మర్యాదహీనుడు. దాసుడంటే సేవకుడు. దస్యుడు అన్నది ఋగ్వేద పదము. అర్థం
అసురుడు.
(దస్యోర్హంతా ఇన్ద్రః) . మన చరిత్ర పాఠ్య పుస్తకాలలో, క్రీ.పూ.1500
ప్రాంతాలలో ఇక్కడకు గుంపులుగా వచ్చిన ఆర్యజాతులు ఆదిభారతీయులైన
ద్రావిడులను జయించి వారిని అనార్యులు, దాసులు, దస్యులు అనివ్యవహరించి దక్షిణాదికి తరిమివేశారనే కట్టుకథ చదువుతాము. ఈ కపట,
కుటిల, అనృతమయ విషయ సృష్టికర్తలు ఆంగ్లేయులు. కారణము ఉత్తర భారతీయులు కూడా తమవలెనే
దోపిడీదారులు అన్న అవాస్తవమును, ఆస్తావము అన్న రంగుటద్దమున జూప చాలా వరకూ
కృతకృత్యులైనారు. రాను రానూ ఇది భాషోత్పత్తి శాస్త్ర (philology) సమస్య గా రూపుదిద్దుకొన్నది.
మనకు ఇటలీ వాసులతో ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లుంది. 15
వశతాబ్దములో
గోవా వచ్చి అక్కడ 5 సంవత్సరాలు నివసించిన ఇటలీ
యాత్రికుడు ఫిలిప్పో సాసెట్టి,
అనేక ఇటాలియన్ మరియు సంస్కృతం భాషా పదాల సారూప్యత
చూచి ఆశ్చర్య
పడినాడు. అదేశతాబ్దంలో హంపీ విజయనగరం దర్శించిన మరొక ఇటలీయాత్రికుడు
నికోలో కొంటీ తెలుగు వాచ్యభాషను " ప్రాచ్యదేశాల ఇటాలియన్ " (Italian
of the East
అన్నాడని మనంనేటికీ మురిసి పోతున్నాము. అసలు అతను తన ఇటాలియన్
భాషలో
ఏమన్నాడో మనకు తెలియదు. ఈ ప్రసంగం తరువాత 18వ
శతాబ్దంలో కలకత్తాలో
కంపెనీ న్యాయాధికారి ఐన సర్ విలియం జోన్సు గ్రీకు, లాటిన్, సంస్కృతాల మధ్య నున్న
సారూప్యతను ఏషియాటిక్
సొసైటి పత్రికలో (1786) ప్రస్తావించినాడు.
ఆర్యదండయాత్రలు (Aryan
Invasion Theory - AIT) అనే కట్టుకథ 200
సంవత్సరాలు
భారత చరిత్రలో ముఖ్య స్థానం ఆక్రమించడానికి ఇది మూలకారణము. అప్పుడు
ఆర్యులు
భారతదేశముపై దండెత్తి ఉత్తర భారతాన్ని ఆక్రమించియుండినారు. ఇండో-
యూరపియన్
మూలభాషనుండి సంస్కృతము పుట్టినదన్న సందేశమును మన నెత్తిన
రుద్ది దేశీయభాషలపై
స్వారీ చేసి, చేయించినారు. వారి ఉపదేశ సారాంశము ఏమింటే
అప్పుడు సంస్కృతం ఎంతో,
ఇప్పుడు ఆంగ్లమూ అంతే! ఇంగ్లీషే మీకు జ్ఞానాన్ని
ప్రసాదించేది.
భారతదేశానికి జ్ఞానోదయం నాడూనేడూ ఐరోపానుండే రావాలి అన్న
వారి విషపూరిత భావనను
అలవంతముగా మన మెదడు లోఇకి చొప్పించినారు.
బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ (1814 - 1891) తిరునల్వేలి
ఎవాంజలిస్టు చర్చి బిషప్. క్రైస్తవ
మతప్రచారానికి తాను తమిళం నేర్చుకోవడం
తప్పనిసరి అని అర్థము చేసుకొన్నాడు.
ముఖ్యంగా నిమ్నకులాలవారిని క్రైస్తావము లోనికి
అట్లు చేసినచో మార్చుట తెలిక అని
గ్రహించినాడు. కృష్ణరాయల కాలంవరకు "జనని
సంస్కృతము సకలభాషలకును" అనే
అబిప్రాయం ఉండేది. దక్షిణాది భాషలైన తమిళ,
తెలుగు, కన్నడ,మళయాళాలలో
అనేక
సంస్కృతపదాలున్నప్పటికీ, ఇవి సంస్కృతంనుండి
ఉద్భవించలేదని, బహుశా సంస్కృతం
కంటె ప్రాచీనమైనవనీ, స్థానికమైనవనీ ప్రతిపాదించినాడు Uncalled . దక్షణ దేశాన్ని
సూచించే ద్రవిడ
అనే సంస్కృత పదాన్నే ఈ భాషలకు ఉపయోగించాడు. బ్రాహ్మణులు
ఉత్తరాది వారు. ఆర్యభాషలు
ఐరోపానుండి వచ్చినవి. వారు వర్ణ వ్యవస్థను
ఉపయోగించుకొని మిమ్ములను
అణగద్రొక్కుతున్నారు వంటి వాదన అంతర్లీనంగా
ఆయన పరిశోధనల వెనక ఆంతర్యం.
కాల్డ్వెల్ తిరునెల్వేలి జిల్లా లోని నిమ్న-జాతి చానార్
తెగకు చెందినవారు కేవలం
తమిళం
మాట్లాడేవారు మాత్రమె కాక, "స్వదేశీ ద్రావిడ" ప్రజలుగా,
వారిని చిత్రీకరించి
జాతిపరంగా మరియు మతపరంగా, వారిని
ఉన్నత-కుల అణచివేతదారుల నుండి
అనగా "బ్రాహ్మణీయ ఆర్యులు"గా
పేర్కొన్నాడు. భాషాశాస్త్రం యొక్క పరిధికి వెలుపల
ఉన్న ఈ విపరీతమైన ఊహాజనిత వాదనలు
"స్వదేశీ ద్రావిడులను బ్రాహ్మణ
ఆర్యులు
అణచివేసినారని నొక్కిచెప్పే చరిత్రను అభివృద్ధి చేసి కృతకృత్యుడైనాడు. .
ఏది
ఏమైనప్పటికీ, కాల్డ్వెల్ యొక్క వ్యాకరణం యొక్క మొదటి
ప్రకాశనమునకు, చానార్లు
"ధృఢమైన ప్రతిఘటనను చూపించినారు"
ఎందుకంటే వారు "బ్రాహ్మణ నాగరికత
నుండి విడిపడు ఆలోచనను ఇష్టపడలేదు". పట్టుదల కలిగిన ఆ
ఆంగ్లేయుడు ఎట్టకేలకు, కట్టకడపటికి, తుట్టతుదకు,
చిట్టచివరికి, కృతకృత్యుడైనాడు.
ఏమయితేనేం భాషా శాస్త్రంతో మొదలైన ఆర్య-ద్రావిడ పదాలు
జాతిరంగు
సంతరించుకున్నాయి.150 సంవత్సరాల దేశరాజకీయాలను ప్రభావితం
చేసినాయి.
ఎక్కడో మధ్య ఆశియా, ఐరోపానుండి వచ్చినవారగు
ఆర్యులు, సింధునాగరికత కంటె
ముందునుండీ ఉన్న ద్రావిడులను
వారి సంస్కృతిని ధ్వంసంచేసినారు అనే వాదనలు
మత ప్రచారానికి, ద్రవిడ
వేర్పాటువాదానికి బాగా పనికి వచ్చు విధముగా వాడుకొన్నారు. ఇది శ్రీలంక
చరిత్రనుకూడా నేటికీ ప్రభావితము చేస్తూనే ఉన్నది.
రామాయణంలో రామ రావణ యుద్ధం ఉత్తర దక్షిణ దేశాల
సంబంధాలను కొంతవరకు ప్రభావితంచేసినది. అయోధ్యరాజు లంకాధిపతిని ఓడించి లంకలో తన
భక్తుని సింహాసనం పై కూర్చోబెట్టడం దాక్షిణాత్యులకు నచ్చలేదు. పెరియార్
రామస్వామినాయకర్ నుండి కరుణానిధి వరకుగల రామునిపైగల విద్వేషపు మూలం ఇదే. కాని
అప్పుడు అగస్త్యమహర్షి కాశీ నుండి తెంకాశీకి రావడం, ఆయన తమిళభాషకు చేసిన సేవ, రావణుని వలె శివభక్తిని దక్షణాన ప్రొత్సహించడం ఆద్వేషాని తగ్గించి
సాంస్కృతికంగా దేశ ఏకతను ప్రోత్సహించినాయి. రావణునిది వైదిక సాంప్రదాయమే. ఆయన
దేవతకూడా! శ్రీచక్రంలో ఆయనను అర్చిస్తారు. నెల్లూరులో రావణునికి గుడి ఉందని విన్నాను.
రామరావణ వైరం జన్మాంతర సంబంధము. అంగ్లేయుల ఆలోచనలు వేరు.
For other arguments in this direction, you
might also read this thought provoking book by Rajiv
Malhotra and Aravindan Neelakandan “Breaking India - Western Interventions in
Dravidian and Dalit Fault Lines” (Amaryllis, 2011)”.
స్వస్తి.