Friday, 28 February 2014

Pride

PRIDE

I am a genious no doubt
With immense talents stout
Make master piece unique
With mere chunk of clay great magic
But calamly said the dust
Let not pride rest in your bust   
For some day I shall knead your back into crust

Thursday, 27 February 2014

TIME


Time is a wheel jurning round i feel
without a stop or without a leap
you should run as long as you can 
with no break to attain the cake

though its run is so uniform
it does wonders of any form
it makes some rise it makes fall
always move with one and all

move with time for name and fame
if you work hard you'll win the game
don't stop my dear to see the fun
for' time and tide will wait for none

  Find the truth
colourful things are bound to glitter
when the back ground is black
                        - c. rama mohan rao

Sunday, 23 February 2014














చిత్రంలో పెద్దలు బ్రహ్మానందం గొట్టిముక్కుల,పోడూరి శ్రీనివాసరావు, వడ్డాది సత్యనారాయణ మూర్తి, ఆదూరి రామకృష్ణ,వింజమూరి 

వెంకటప్పారావు,వాసుదేవరావు కొండూరు, దుర్గ భమిడపాటి, మణి వడ్లమాని, బాలమూర్తి, కళ్యాణి గౌరి కాశీభొట్ల,గంటి 

సుజల,ఉషారాణి నూతులపాటి, ప్రభ,కామేశ్వరి,శ్రీధర్ తదితరులు — in Hyderabad, Andhra Pradesh.



Kalyani Gauri Kasibhatla


Guru thulyulu cheruku vaaritho chithram

                            సభికులనుద్దేసించి ప్రసంగిస్తున్న శ్రీ చెరుకు రామమోహనరావు గారు — in Hyderabad.
















చెరుకు వారు వినిపిస్తున్న ఫేస్ బుక్ దండకం — in Hyderabad.


Wednesday, 19 February 2014

THIS IS HOW YOU HAVE TO BE

Please read carefully and relate with our life....you may enjoy more...



1) Heavy rains remind us of challenges in life. Never ask for a lighter rain. Just pray for a 

better umbrella.That is attitude.


2) When flood comes, fish eat ants & when flood recedes, ants eat fish.Only time matters. 

Just hold on, God gives opportunity to everyone!...


3) Life is not about finding the right person, but creating the right relationship, it's not how 

we care in the beginning, but how much we care till ending.


4) Some people always throw stones in your path. It depends on you what you make with 

them, Wall or Bridge? Remember you are the architect of your life.


5) Every problem has (n+1) solutions, where n is the number of solutions that you have 

tried and 1 is that you have not tried. That’s life.



6) It is not important to hold all the good cards in life. But it’s important how well you play 

with the cards which you hold.


7) Often when we lose all hope & think this is the end, God smiles from above and says, 

`Relax dear it’s just a bend. Not the end'. Have Faith and have a successful life.



8) When you feel sad, to cheer up just go to the mirror and say, `Damn I am really so 

cute` and you will overcome your sadness. But don’t make this a habit coz liars go to hell.


9) One of the basic differences between God and human is, God gives, gives and forgives. 


But human gets, gets, gets and forgets. Be thankful in life!


10) Only two types of persons are happy in this world. First is Mad and second is Child. Be 

Mad to achieve what you desire and be a Child to enjoy what you have achieved.


ఇంతి- చేమంతి- పూబంతి


ఇంతి- చేమంతి- పూబంతి

కపిత్థస్యఫలంచైవయథా కుంజర భక్షితంl
తస్య సారంచ ఘృణ్ణీయాత్ తాతా హవిరసం ప్రభోll
ఈ శ్లోకము నుండి మనకు కావలసిన మేరకు అర్థమును గ్రహించితే, ఏ విధముగా వెలగ పండును మ్రింగిన కరి డొల్లను యథాతథముగా విసర్జించి అందులోని గుజ్జును తానూ గ్రహించుతుందో అదేవిధముగా ఏ దేశపు సంస్కృతి నుండియైనా మంచిని గ్రహించి చెడును విసర్జించమంటున్నది ఈ శ్లోక సారము. యజ్ఞకుండములో దేవతల కొరకు మనమెన్నో ధర్మబద్ధమైన వస్తువులను వేస్తాము. వాని సారమును ఆయా దేవతలు హవిస్సుల రూపములో గ్రహించుతారు. మరి దేవతలే కదా ......
నేను వ్రాసిన ఈ పద్యాన్ని శ్రద్ధతో కొంచెము మనసు పెట్టి చదవండి.
ఫ్రిజ్జి గృహము, పవరు ప్రియమైన భార్యౌను
భర్త అందులోని పాయసమ్ము
పవరు లేని ఫ్రిజ్జి పాయసమ్మునకెట్లు
ఉనికినిచ్చదెట్లు పనికి వచ్చు

పెద్దలీవిధంగా చెప్పినారు.
పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మాపి సర్వతః
భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ (మహా భారతము)
కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము.ఎంత నిజమైన మాటో చూడండి. ఇది మన సంస్కృతి. దీనిని పునరుద్ధరించండి. ధర్మాన్ని కాపాడండి. వయసు ఒకే విధంగా వుండదు.నిన్నటి యువకులము నేటి వృద్ధులము. నేటి యువకులు రేపటి వృద్ధులు. అంతే తేడా. అనురాగము పెంచండి. ప్రేమ అను రాగము ఆలపించండి. ప్రేమానురాగాలను పంచండి.
స్త్రీ ని అర్థము చేసుకోండి.
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి
భోజ్యేషు మాతా శయానేషు రంభా షట్కర్మ యుక్తా సహధర్మ పత్ని
ఇన్ని గుణాలు కలిగినది స్త్రీ. ఒకవేళ తనలో తప్పులేవైనా వున్నా మచ్చికతో మార్దవముతో చెబితే అర్థము చేసుకొంటారు.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతా స్తఫలాక్రియాః
ఇది మనుస్మృతి లోని శ్లోకము.దీనివల్ల మాకు ఏమి అర్థమౌతుంది . స్త్రీలను మనము ఎంతగా గౌరవిస్తామన్న విషయము అర్థముకావటములేదా ! మరి మనము ఎందుకు స్త్రీలపై చిన్న చూపు చూస్తున్నామని నలుగురిచేత అభిశంసింప బడుతున్నాము. విష్ణుభక్తి పరాయణుడే కావచ్చు కానీ దైత్యుడై కూడా ప్రహ్లాదుడు తన దృష్టికి ఆడవాళ్ళు అడ్డుపడితే వారలను మాతృ భావముతోచూసి దృష్టి ప్రక్కకు మరల్చేవాడని తెలుగుభాగవతమున పోతన గారు శెలవిస్తారు. అదే స్త్రీలను నీచ దృష్టితో చూసిన రావణ దుర్యోధనుల గతి ఏమైనదో ఒకసారి మనము పరికిస్తే అర్థమౌతుంది. నేడిది గతమైనది. కొందఱు యువకులకు అసంగత  మైనది. 

చాటింగులతో మొదలై

మీటింగుల దాక వెళ్లి మీరిన మదమున్

డేటింగు చేసుకొనుచును 

చీటింగుల కంపవాత చిక్కిరి రామా!

ఒక ప్రఖ్యాత నటుని కుమారిత తండ్రిపాలనలో తానూ గోప్పనటియైనా తండ్రి యొక్క కాముక గుణ సంచయమును పుణికిపుచ్చుకొని నానా న్యూన విలాస కేళికలపై వ్యామోహ తీవ్రంబుచే ఈ రోజు తండ్రి వద్దకు పోలేక తండ్రిచే విడువబడిన తల్లిని చేరలేక, తమ ఘాతుక కామమునకేరజేసిన కాముకులలో ఏ ఒక్కరూ చేరదేయక ఒక మహానగరములో ఒంటరిగా ఒక చిన్న గదిలో ఉంటూ తన వద్తాద డబ్బు పుష్కలముగా ఉన్నా,   ఒక్కర్తెయే US పోలేక, ప్రాణాంతకమైన గర్భ రోగ వ్యాధిచే ఇచటనే ఉండిపోలేక సతమత మౌతూ సాన్త్వనకై ఆశతో ఎదురు చూస్తూవున్నది. ఇదీ విశృంఖలత, స్త్రీలకు అడగకుండానే ఇచ్చే బహుమానము.

 కొందరు పురుషుల దృష్టిలో స్త్రీ ఆటబొమ్మ. చాటింగులతో తో మీటింగులనుండి డేటింగులకు, ఆపైచీటింగులకు,  సెల్లు మాటలనే సొల్లు మాటలకు ఒక అడుగు ఇంకా ముందుకు పోయి 'LOVE JIHAD' లకు ఎరలను జేసి తమ  యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత వయస్సు లోనే బాలికలను విషయవాంఛలకు లోబడ జేసి మొగ్గ గా చిదిమేస్తున్నారు, మొక్కగా తుంచేస్తున్నారు. మరి లొంగకుంటే   స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, మానభంగాలు ఇలాఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, ‘అరణ్యరోదన’ యై పనికి రాకుండా పోతూవుంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా, సమతా,మమతా, మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్నా ఉన్నది  ఒక్కటే మార్గం. అది మన సంప్రదాయాలను పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే! ఈ మాటలు కేవలము పురుషులకే కాదు స్త్రీలకు కూడా! ఈ నాడు వేషధారణలో కానీ, భారతీయ సంస్కార ఆచరణలోగానీ ఆవగింజంత గౌరవములేకుండా విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు నేటి వనితా యువత. ఇది తమకు, తమ కుటుంబానికి, తమ బంధు వర్గానికి, తమ ధర్మానికీ, తమ దేశానికి ముప్పు వాటిల్లునని ఊహించక తప్పుచేయుచున్నారు.

ప్రతి ఇంట్లో అమ్మరూపంలో ఉన్నది ఆ పరాశక్తే! కనుకనే ‘మాతృదేవోభవ’ అని వేదాలు బోధించినాయి. తిరిగీ   మనుస్మృతిలోని ఈ క్రింది శ్లోకాన్ని  మరొక్కమారు మీ ముందుంచుచున్నాను.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃl
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతాస్తఫలాక్రియాఃll
ఎక్కడ స్త్రీలు పూజింప బడుతారో,అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యములన్నీ నిష్ఫలములనితెల్పి, 'స్త్రియః శ్రియశ్చ గేహేషు నవిశేషోస్తి కశ్చన' స్త్రీలు గృహానికి లక్ష్మీ సమానులే !, ఇంతకు మించిన  విశేషషణము స్త్రీకి వేరేదయినా కూర్చగలమా! నిజానికి ఇది విశేషణము కాదు, స్వభావోక్తి. అందుకనే వివాహ సమయంలో కన్యాదాత 'కన్యాం కనక సంపన్నాం' అని  “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయదదాతి' అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంట బుట్టిన ఆడపిల్లను, తండ్రి, సోదరులు, బాగాచూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చ వలెనని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.
పితృభి: భ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా: l
పూజ్యా భూషయితవ్యాశ్చ  బహు కళ్యాణమీప్సుభి:ll
అనగా తండ్రి, సోదరులు, భర్త, మరదులు అందరు స్త్రీలని  గౌరవించాలని, వారుకోరిన భూషణవస్త్రాదులనిచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా  అండగాఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో
పితారక్షతి కౌమారే/ భర్తారక్షతి యౌవ్వనే /
రక్షంతిస్తావిరే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి.
బాల్యములో తండ్రి, యౌవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలని, రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తే, మనువును, ప్రాచీన సంప్రదాయాలను ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకము యొక్క
అర్థమును  అవగాహనా రాహిత్యముతో  చివరి పాదము యొక్క చివరి వాక్యము అనగా  'నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అన్నది మాత్రంగ్రహించి,  మనువు స్త్రీలకు వ్యతిరేకి, స్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారు. అట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిరశంఖారావమే! వారెన్నటికీ  తమ ప్రవర్తన మార్చుకోరు. ‘మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే’ అన్నాడు భర్తృహరి.

నేటి తలిదండ్రులకు డబ్బు మీద, పైకప్పు మేకప్పుల మీద, Star Hotel తిండ్ల మీద, తప్ప భావితరానికి తాము అందజేయవలసిన సాంస్కృతిక సంపద ఎంత వరకూ వారసత్వముగా అందివ్వగలుగుచున్నాము అన్న ఆలొచానకు తావివ్వరు. బాల్యంనుండియే మంచిఅలవాట్లు, సత్సాంప్రదాయాలు నేర్పిస్తే, భావితరాలు బాగుపడవా! మరి పై విధముగా మాత్రమే ఆలోచించేవారు భావితరాలకు ఏమివ్వగలరు.
 స్త్రీలను గూర్చి మనువు ఇంకా ఏమంటున్నాడో చూద్దాము.
శోచంతి జామయోయత్రl వినశ్వత్యాశు తత్కులంl
నశోచంతితు యత్రైతాlవర్ధతే తద్ధిసర్వదాll
అనగా ఆడపడుచులు ఏయింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుంది. లేదా నశిస్తుంది.
తస్మానేతాన్సదా పూజ్యాఃl భూషణాచ్చాదనాశనైl
భూతికామైర్నరైర్నిత్యంl సత్కారేషూత్సవేషుచll
తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకొనేటప్పుడు, ఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టి, వస్త్రాలు,భూషణాదులనిచ్చి సంతృప్తి  పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుంది. కనుకనే పండగ రోజులలోకూతుళ్ళని, అల్లుళ్ళని పిలచి, ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం. ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో  స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది.

ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివేమంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.
సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం, సఖ్యాన్మేమాయోష్టా:l
అనగా ఈ ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! 'ఆపత్సు మిత్రం జానీమః' కష్టాలలో ఆదుకొను వాడేమిత్రుడు. అట్టిమిత్రభావముతో భార్యాభర్తలు ఉంటే, వారిమధ్య కలతలు, కార్పణ్యాలు, ఆవేశకావేశములు, అసమానతలకుతావు లేకుండా నిత్య వసంతములా వారి జీవితం సాగిపోతుంది.
సంతుష్టో భార్యయాభర్తాl భర్తా,భార్యా తధైవచl
యస్మిన్నేవ కులేనిత్యంl కళ్యాణం తత్రవై ధృవంll
అనగా భార్యా,భర్తలు పరస్పరం ఒకరిని,ఒకరు గౌరవిచుకొంటూ,ప్రేమానురాగాలతో సంతుష్టులుగా ఉంటారో ఆయిల్లునిత్యకల్యాణం, పచ్చతోరణంగా విలసిల్లుతుంది అని చెబుతూనే  
యదిహ స్త్రీనరోచేతl పుమాంసంన ప్రమోదాయేత్l
అప్రమోదాత్ పునః పుంసఃl ప్రజనం నప్రవర్తతేll
అని చెబుతున్నాడు. భార్యను భర్త కష్టపెడితే, ఆభార్య భర్తకు సహకరించదు. అపుడు ఆ ఇంట వశం వర్థిల్లదు. అని వివరించి,

అనుకూల కళత్రోయఃl తస్య స్వర్గ యిహైవహిl
     ప్రతికూల కళత్రస్యl నరకో నాత్ర సంశయఃl

                                  స్త్రియాంతు రోచమానాయాంl సర్వం రోచతేకులంl
 స్త్రియామరోచమానాయాంl సర్వమేవ నరోచతేll
భార్యలు అనుకూలంగా ఉండి, సంతోషంగా ఉంటే ఆ గృహం స్వర్గమే. లేకుంటే నరకమే. ఇలా ఎన్నోవిధాలుగా వేలవేలసంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది, అని మన ప్రాచీనసాహిత్యం తెలుపుతోంది.
 అహంకారానికి ఇరువురూ తావివ్వకుంటే జీవితము పూవులబాటే.Divorce, తలాక్ మన సాంప్రదాయము లో లేని విషయాలు. 'ప్రాణం వాపి పరిత్యజ్జ మానమే వాభి రక్షతుఅన్న సంస్కృతి మనది.

 మనము ఈకాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నాము. ఆధునికులు కొందరు పిల్లలకు స్వేచ్చనిస్తే, దానిని 'బ్రహ్మకైనపుట్టురిమ్మతెగులు' అన్నభావన కలిగించే విపరీతవస్త్రధారణ, పాశ్చాత్యనాగరికతకు వర్తిస్తుందేమో కాని భారతీయ సంప్రదాయానికి, వర్తించదు. సెల్ ఫోనుసంబాషణ, చదువు పేరుతో ఇంటికి ఆలస్యంగా వస్తూ, బైకులపై షికారులు చేస్తూ  కాలాన్నిదుర్వినియోగ పరుస్తూ,పతనమే పరమావధిగా ప్రాకులాడే యువతను  మనము చూస్తున్నాము. ఇది ఆడపిల్లల్లో ఏర్పడిన వ్యసనముగా మనము తలువవచ్చు. ఈ విధానంలో ఆడపిల్లలే కదా ఎక్కువగా నష్టబోతున్నారు. విసుగు,కోపం, అలజడి, మానసిక అశాంతి, అసంతృప్తి, భార్యా,భార్తలమధ్య అవగాహనారాహిత్యం, పిల్లల్ని సరిగాపట్టించుకోనందున అధిక

స్వేఛ్చ వంటి అవగుణాలు సమాజంలో పెరుగుతూ,సంబంధ, బాంధవ్యాలను తెంచుతూ, వైదిక జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారణం ప్రాచీన సంప్రదాయాలను, పెద్దలమాటలను పట్టించుకోకుండా కొత్త వింత పాత రోత అనుకొనుటయేనని, గమనించినచో అనిపిస్తుంది.

ఉదయకాల ఉషోదయాలని తిలకిస్తూ, హరిత తరువులు, పక్షుల కిలకిలారావాలు, వికసించే పుష్పాలు, వాటిలోని పుప్పొడిపైనుండి వచ్చే చల్లని పిల్లగాలుల సుఖస్పర్శలు, వెన్నెల రాత్రులలో నదీ సైకత వేదికపై విహారాలు, పచ్చని కంబళ్ళు పరచినట్లుండే పర్వత సానువుల సోయగాలు తిలకిస్తూ, కదిలేమబ్బుల్ని,ఎగిరే కొంగలబారుల్నిచూస్తూ, దేవాలయాల మంగళ వాద్యాలను,ఘంటా నాదాల్ని, గుడి గోపురపు గూళ్లలోని పావురాయి కువకువలు వింటూ,
ఒడ్డును తాకి విరిగి, ఒరిగే సముద్రకెరటాలను, పసిపాపల నవ్వులను, పతంగాల(గాలిపటాల) విహారాలను, రంగు రంగుల సీతాకోక చిలుకలను, నీలిమేఘాలలో, గాలి కెరటాలలో దోబూచులాడే నిండు పున్నమి చంద్రుని, ఎలమావి చివురులు మెసవి కూసే పిక కూజితాలను, ఇంకా ఎన్నెన్నో ప్రకృతి పరమైన అందాలను ఆనందాలను అనుభవించమని పరమాత్మ మనకిస్తే,  ప్రకృతిని కలుషితంచేస్తూ,మనం ఇంకేదో కావాలని, లేనిదానికోసం,తెలియని దానికోసం పరితపిస్తూ,పరిభ్రమిస్తూ కాలాన్నిమేధస్సును,మన విజ్ఞానాన్ని వృధాపరుస్తూ నిస్సారమయిన బ్రతుకు బ్రతికుచున్నాము.

అలాకాకుండా శృతి,స్మృతి, వేదోపనిషత్తులలో చెప్పిన విషయాలకు సంబంధించిన 
వ్రాతలను చదివి ఆకళింపుజేసుకుని, మన సంప్రదాయాలని ఆచరిస్తే జగమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది అనుటలో సందేహంలేదు. లేకుంటే నిత్యానందమన్నది గగనకుసుమ, అరణ్యరోదన, బధిరశంఖారావ, అజాగళ స్తన న్యాయములవలె కనరానిదై, వినరానిదై, జీవితము వ్యర్ధమైపోతుంది.
ఇదినిజము. ఇదేనిజము.
స్వస్తి.

















Saturday, 15 February 2014

Photo: NTR as Sri Krishnadevaraya - My pencil drawing.
ఇది పొన్నాడ మూర్తి గారు వేసిన చిత్తరువుకు నేను వ్రాసిన వ్యాఖ్య 


రాయలెట్లుండెనో ఏమొ రాదు తెలియ 



కళల కాణాచి యని తప్ప కలియజూడ 



రామ రావుకె చెల్లునా రాచ ఠీవి 


అతని కన్నట్టి తెలుగమ్మ అమరచరిత


Friday, 14 February 2014

card---accord

లవ్...ఒక పోస్ట్ కార్డు 

జీవితం...విజిటింగ్ కార్డు

భార్య...మెమోరీ కార్డు

భర్త....ఏటి ఎం కార్డు 

ప్రేయసి...డెబిట్/క్రెడిట్ కార్డు  

పక్కింటి వాళ్లు...గ్రీటింగ్ కార్డు

మరదలు పిల్ల...రీచార్జ్ కార్డు 

తల్లి తండ్రులు...పాన్ కార్డులు 

పిల్లలు...మన ఇడెంటిటీ కార్డులు 

స్నేహితులు...మన ఆధార్ కార్డు...(అనింటికీ పనికొస్తారు!!)

పై వాస్తవం ...రేషన్ కార్డు 

అవసరానికి వాడే ...ట్రంప్ కార్డు 

ఇది సదా గుర్తుంచవలసిన రికార్డు 

తగిలించండి ఇంట్లో ఇది కలిగిన బోర్డు 

(by  R.V.ప్రభు-- అచ్చంగా తెలుగు)

Thursday, 13 February 2014

పూజారి - ప్రసాదము



పూజారి-ప్రసాదము
నేను చాలామందిని ఒక స్వీట్ పాకెట్ బజారులో కొని తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి ఇవ్వండి అని దేవాలయంలోని అర్చుకునికి ఇస్తారు. స్వీట్ స్టాల్స్ నుండి తెచ్చినవో మన ఇంట్లో చేసినవో, స్వీట్స్ కానీ దద్దోజనము పుళిహోర లాంటివి కానీ   నైవేద్యంగా ఇవ్వకూడదు. దేవాలయానికి దేవునికి పండ్లు మాత్రమే తీసుకు వెళ్ళాలి. అలాకాదు మేము ఫలానా నైవేద్యం పెట్టించ దలచుకున్నాం అనుకున్న వారు ముందురోజే అర్చకునికి సంబారములనిచ్చి నైవేద్యం ఏర్పాటు చేయించుకోవాలి. నైవేద్యం పెట్టిన తరువాత మీరు కొంత ఉంచుకొని ఇవ్వండి మేమే పంచుతాం ప్రసాదం అంటారు. అలా చేయకూడదు.
శిఖరం, ప్రాకారం, లోపలి గోడ, ముఖ మంటపం, అర్థ మంటపం, మహామంటపం, ధృవమూర్తి, విమానంలో ఉన్నటువంటి మూర్తి, ఇలా ఎనిమిది క్రింద విడగొట్టి ఈ ఎనిమిదిమందిలో ఎనిమిదో వంతు శక్తి అర్చకునికి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వర శక్తిని అంటే ఆ మూలవిరాట్టు లోని శక్తిని అర్చకునియందు  ఆరోపింపబడి ఉంటుంది. ఇది ఆగమ శాస్త్రములలో చెప్పిన మాట. ఆయన చరమూర్తి అంటే గుడి ప్రాగానములో ఉన్నంతసేపూ దేవునితో సమానము. అందుకే పూర్వము పూజారిపై ఎంతో భక్తి ప్రపత్తులు చూపేవారు భక్తులు. అందుకే అంత ప్రాధాన్యత కలిగిన అర్చకుడు మాత్రమే ప్రసాదమును తయారుచేసి వినియోగించుటకు అర్హుడు. అందుకని దేవాలయంలో ప్రసాదాన్ని అర్చకుడు ఇవ్వాలి. అంతేకానీ వేరెవరూ ఇవ్వకూడదు.
దేవాలయ ఆవరణలో దైవీయ ప్రకంపనలు ఉంటాయి కాబట్టి. కాసేపు కూర్చొమ్మని  శాస్త్రములు, అవి చదివిన మన పెద్దలు నిర్దేశించినారు.
ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌
...అని మనుస్మృతి చెబుతోంది. ధర్మాన్ని వధిస్తే అది తిరిగి మనను వధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదు.
స్వస్తి.?

Friday, 7 February 2014

కపర్దీ కాపాడు 

శివునికి కాలకాలుడు అన్నపేరు కలదు. ఆయన యమునికి యముడు. ఆయనను ఒకసారి తలచుకొందామని తలంపు.
ఇది సీస పద్యము.
ఇంద్ర గణములారు ఇన గణమ్ములు రెండు
పాద పాదమునకు బరగు చుండు
ఆటవెలదియైన తేటగీతియునైన
చెప్పవలయు తుదిని సీసమునకు

ఇందు యతి నియమముంది కానీ ప్రాస నియమము లేదు. ప్రాస అంటే పద్యముయోక్క ప్రతి పాదములోను  రెండవ అక్షరము తానుగా కానీ గుణింతముతో కూడుకొని గానీ రావలయును. ప్రాసనియమము లేకున్నను ఈ సీసమునందు ప్రాస నియమము పాటించి వ్రాయ ప్రయత్నించినాను. ఈ ప్రాస కొంత దుష్కరము కూడా. ఈ మాటలు జిజ్ఞాసువుల కొరకు వ్రాసినాను. పొగరుతో వ్రాసిన మాటలు కావు. తప్పుగా తలవరని మనవి. 

కర్ణామృతంబైన కథల కారకుడీవు

వర్ణాల కందని వస్తువీవు 

వర్ణనా తీతమౌ వర భూరుహము నీవు 

పర్ణఛాయల నీదు బరగనివ్వు   

జీర్ణమైతిని విధి చీర్ణ సమ్మెట పోట్ల 

చూర్ణమైపోనట్లు చూడుమయ్య 

కీర్ణుండ  జరచేత శీర్ణుండ బ్రతుకనే 

ఆర్ణవం దాటించు పూర్ణ పురుష 


బాల్యమందున  న బుద్ది నే బడయనైతి 

యౌవ్వనపు క్రొవ్వు తోడ నిన్నరయనైతి 

కాలునకు చేరువగునెడ కలిగే బుద్ధి 

కాలకాలుడ కావుమా కరుణ తోడ 

అర్థములు :
వరభూరుహము =కల్ప వృక్షము 
పర్ణ చాయలు = ఆ కల్ప వృక్షము యొక్క ఆకుల నీడలు 
చీర్ణము = ఉలి 
కీర్ణుడు = ఆవరింప బడినవాడు 
జర = ముసలితనము 
శీర్ణుడు = చిక్కి శల్యమైనవాడు 
ఆర్ణవము= సముద్రము 


పరమేశ్వరా!

చెవులకింపైన కథలు కల్గినవాడవు, అక్షరాలకు అందనివాడవు అంటే వర్ణనాతీతుడవు,  పొగడలేనంత మహిమలుకలిగిన కల్పవృక్షము నీవు, నీ నీడలలో నన్ను ఉండనివ్వు. విధి యొక్క ఉలి సమ్మెట పోట్లకు బాగా గురియైన వాణ్ణి. నేను పొడి పొడి కాకుండా చూసుకో. ముసలితనముచేత కప్పబడి చిక్కిన  వాడను . ఈ బ్రతుకనే సముద్రము దాటించు మహానుభావా. 

చిన్న వయసు లో బుద్ది వికసించ లేదు. యౌవ్వనములో క్రోవ్వుతో కళ్ళు కనిపించ లేదు. యమునికి చేరువైతినని తెలిసినతరువ్వత నాకు బుద్ది కలిగింది. యమునికి యముడైన మహాప్రభో నన్ను కాపాడు తండ్రీ. 















Thursday, 6 February 2014

బ్రాహ్మణులు (నాడు-నేడు)

బ్రాహ్మణులు (నాడు-నేడు)

ఎన్నో సినిమాలలో ఎన్నెన్నో సభలలో ఎన్నెన్నెన్నో సందర్భాలలో బ్రాహ్మణులను ఏదో ఒక 

కారణంగా నిందించడము మననము రోజూ చూస్తూ ఉండేదే. వారిపై విసిరినన్ని అసభ్య 

అసహ్య అశ్లీలకరమైన విసుర్లు వేరేవ్వరిమీదా విసిరి ఉండరేమో. ఎక్కడికీ 

భరించలేకపోతే తప్ప వారివైపునుండి ఎటువంటి వ్యతిరిక్తత బయట పడదు. ఇది వారి 

పూర్వీకులు చేసిన నియమ నిష్ఠాగరిష్ఠత యొక్క ప్రతిఫలము. అంటే బ్రాహ్మణులకు 

జన్మతః వచ్చే 'సత్వ గుణ సపన్నత.' జగద్గురు శంకరాచార్య, చాణక్య, ఆర్యభట, 

వరాహమిహిర, భాస్కర, నిన్నమొన్నటి శ్రీనివాస రామానుజన్, విశ్వేశ్వరయ్య, ఈ 

విధముగా చెప్పుకొంటూ పోతే ఆ పట్టిక చేంతాడంత. వీరిలో స్వార్థము, 

ఆశాపాశములను చూడగలమా! వారేరోజూ తమకొరకై తమ విజ్ఞానమును 

 వాడుకోలేదు. లోక క్షేమమే వారి ధ్యేయము.   

మనము దైవ స్వరూపులుగా భావించే రామ, కృష్ణ, ఈశ్వర ఇంద్రాది దేవతలు ఎవరూ 

బ్రాహ్మణులూ కారు. విశ్వామిత్రుడు, జనకుడు, మతంగుడు,శబరి,

చండాలుడైన ధర్మ వ్యాధుడు ఈ విధంగా ఎందరో క్షత్రియులు శూద్రులు సత్వగుణ 

సంపన్నులై బ్రహ్మత్వమును సాధించి బ్రాహ్మణులైనవారు ఉన్నారు. ఈ కలియుగములో 

కూడా చెంచు జాతికి చెందిన భక్త కన్నప్ప, పంచముడగు భక్త నందనుడు,కుమ్మరియగు 

భక్త కుంభారుడు,  పంచముడగు తిరుమళిశై యాళ్వార్

 

శూద్రుడగు తిరుమంగై ఆళ్వార్ (చోళరాజు వద్ద సేనాధిపతిగా ఉండినాడు) మొదలైన 

వారంతా పుట్టుకతో బ్రాహ్మణులు కాదు. కానీ అందరూ దైవ సాయుజ్యమును పొందిన 

వారే! అంతెందుకు కుమ్మరి మొల్ల అవివాహితగా తన జీవితాని మల్లికార్జున 

సాన్నిధ్యములో గడిపింది. సత్వగుణ సంపన్నతే సద్బ్రాహ్మణ తత్వము. ఈ విధమైన 

సత్వసాధకులను, సత్య శోధకులను  ఎందరినో మనము చరిత్ర పుటలలో గాంచవచ్చును. 

పుట్టుకతో బ్రాహ్మణుడైనవాడు, దేవాలయములలోని వీరి విగ్రహములకు 

నమస్కరించకుండా వున్నారా! ప్రవచనకారులగు బ్రాహ్మణులు తమ ఉపన్యాసములలో 

వీరి గొప్పను చెప్పకుండా ఉన్నారా! తిన్నడు అనగా భక్త కన్నప్ప యొక్క అచంచల మూఢ 

భక్తిని గూర్చి కాళహస్తి మహాత్మ్యము వ్రాసిన ధూర్జటి బ్రాహ్మణుడు. ఆయన తన 

‘కాళహస్తీశ్వర శతకమున కూడా ఈశ్వరుని సంబోధించుతూ

    ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా

     నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో

     ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం

     సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ  కాళహస్తీశ్వరా !

  ఓ శ్రీకాళహస్తీశ్వరా  ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ 

పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ 

వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ 

శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు   ఏ విద్య నభ్యసించినది .  

బోయవాడైన తిన్నడు  ఏ మంత్రమును చదివి   నిన్ను సేవించి ముక్తి పొందినాడు .  కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ  ! అని తన ఆత్మను నివేదించుకొన్నాడు.

ఒక నిజమైన బ్రాహ్మణుడు అనుదినము తన సంధ్యావందన దేవతార్చనలు 

ముగించునపుడు 'సర్వెజనాః సుఖినోభవంతు' సర్వం సమస్త సన్మంగళాని సంతు' అని 

చెప్పుట  తన విధి బాధ్యత కర్తవ్యము. అంటే బ్రాహ్మలు ఈ దైవకార్యాలు ఎంతగా చేస్తే ఈ 

లోకము అంత సుఖమయమై ఉంటుంది. ఇక్కడ మరోకమాట చెబుతాను.

మనము నివసించే ఈ భూమియే కాక సమస్త లోకములు సుఖముగా ఉండవలెనని ఆ 

పరమాత్ముని ప్రార్థించే ‘స్వస్తి వాచన’ మంత్రములలో ‘గో బ్రాహ్మణేభ్యః శ్హుభామస్తూ 

నిత్యం, లోకాస్సమస్తాః సుఖినోభంతు’ అన్నమాట వస్తుంది. దీనికి కొందరు బ్రాహ్మణులు 

మాత్రమే, సకల శుభములతో కూడిన సుఖమయజీవనము గడుపవలెనని దేవుని 

కోరుచున్నారని వక్రభాష్యము చెబుతారు. దాని పాఠము ఈ దిగువన సవిస్తారముగా 

ఉంచుచున్నాను.

స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం

న్యాయేన మార్గేణ మహీం మహీశాః

గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!

 

విశ్వ శ్రేయస్సును కాంక్షించే శాంతి మంత్రమిది. ‘స్వస్తిః’ అంటే క్షేమం, శుభం. మనిషి 

జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే.. క్షేమం (భౌతిక జీవితం), శుభం (ఆధ్యాత్మిక 

జీవితం) రెండు పట్టాలు. రెంటి మధ్య సమదూరంతో పాటుగా సమన్వయం సాధిస్తేనే 

రైలు గమ్యాన్ని చేరుతుంది. అలా రెంటినీ సమన్వయం చేసుకుంటూ గమ్యం చేరడమే 

జీవిత పరమార్థం. ఈ రెంటిలో దేన్ని విస్మరించినా ప్రయాణం అర్ధాంతరంగా 

ముగుస్తుంది. కాబట్టి ఈ రెండూ (క్షేమం, శుభం).. ‘ప్రజాభ్యః’ అంటే ప్రజలకు లభించును 

గాక. ‘పరిపాలయంతాం’.. అంటే విశ్వ విశ్వాంతరాల్లో ఉన్న జీవులందరికీ క్షేమాన్ని

శుభాన్ని అందించి భగవంతుడు పరిపాలించుగాక అని అర్థం.

న్యాయేన’ అనగా స్వధర్మమును తప్పకుండా ఉండడం న్యాయం. ఏ విధమైన బయటి 

ప్రలోభాలకూ, భయాలకూ లోనుగాకుండా అంతరంగ ప్రబోధాన్ని అనుసరించి 

నడుచుకోవడం స్వధర్మం అవుతుంది. దాన్ని అనుసరించడం న్యాయం. ‘మార్గం’ అంటే 

త్రోవ, అన్వేషణ. మన జీవితానికి ఏది భద్రతనిస్తుందో దాన్ని నిరంతరం అన్వేషించడం 

మార్గం. ‘భద్రత’ అనేది.. ఆరోగ్యం, సంపద, గౌరవం ఈ మూడింటి సమష్టి తత్త్వం. 

ఇతరుల సర్వాంగీన వికాసంలో మన ఆనందాన్ని, వికాసాన్ని చూపేదే భద్రత. ఇది 

ఇతరుల అస్తిత్వాన్ని, వారి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తుంది.

ఇప్పుడు ‘గోబ్రాహ్మణేభ్యః’ అన్న విషయమునకు వివరణ ఇస్తాను.

మనకు గోవు తల్లితో సమానమన్నది వేదవాక్యము. అట్టి గోవులు శుభమునుగల్గి 

సుఖముగా వుంటే యజ్ఞ యాగాది క్రతువులు నిరాఘాటముగా జరుగుతాయి. 

పంచగవ్యము లేకుండా క్రతువులు జరుగవు కదా! శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత 3వ 

అధ్యాయములో ఈవిధముగా చెబుతాడు.

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।

అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 3 -10 ।।

సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి 

ఇలా చెప్పినాడు, "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త 

కోరికలను తీరుస్తాయి." ఈ యజ్ఞములు చేయించుటకు బ్రాహ్మణులు కూడా అవసరమే 

కదా! వారు సమకట్టి యజ్ఞ యాగాదుల చేయించితే హవిస్సులు అగ్నిద్వారా దేవతలకు 

అందుతాయి. ఆ హవిస్సులే దేవతలకు ఆహారము. వారు తృప్తి చెందితే 

పంచభూతములు సహకరించి ఈ భూమిని సుభిక్షముగా ఉంచుతాయి. అందుచే వేదమున ఆమాట చెప్పబడినది. ఈధర్మము అన్నిలోకాలు సుఖముగా ఉండవలెనని కోరుకొంటుంది. నిన్న మొన్న పుట్టిన మతములవలె సంకుచితత్వము కలిగినది కాదు.

    మారుతున్న కాలములో బ్రాహ్మణుల ప్రవర్తన బాగా పరివర్తన చెందినది,చెందుతూ 

ఉన్నది, పూర్తిగా చెందిపోతుందేమో. ఏది ఏమైనా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట 

ఈలోకము సుఖముగా వుండాలని కోరేవారు తప్పకవుంటారు వారి ప్రార్థనల ప్రభావము 

ఈ జగతి పై తప్పక వుంటుంది. కాలానుగుణమైన మార్పు ఈ బ్రాహ్మణులలో ఎంత 

వచ్చింది అన్నదే ఈ నాడు-నేడు లో నేను తెలియబరచదలచుకొన్నది. బ్రాహ్మణులలో 

కలిగిన మార్పును గూర్చి తప్పించితే ఎవరినీ కించపరచుట నా ఉద్దేశ్యము కాదు. ఈ 

మార్పులను నాదు-నేడుగా విభజించి పద్యరూపములో ఉంచినాను.

నాడు: 

స్త్నానము సంధ్యయున్ మరియు శాస్త్ర పురాణ సముచ్చయంబులున్

మానక శిష్యకోటికిని మానసమొప్పగ విద్య నేర్పుచున్

దానము ధర్మమున్ గలిగి తత్పరతన్ పరమాత్ము నెంచుచున్

పూనికతోడ లోకహిత పూర్ణుడు గాంచగ నాడు బ్రాహ్మడున్

నమకమ్మున్ చమకమ్ముతోడుత మహన్యాసంబుతో ధ్యాసతోన్

విమలంబైన స్వరంబుతో నమితమౌ విస్వాసమున్ భక్తితోన్

అమలానంద మనంబుతో నభిరతిన్ ఆజన్మమున్ గొల్చుచున్

భ్రమ పాపాంకిత పంకముల్ గడుపగా ప్రార్థింత్రు సద్వైదికుల్

నేడు:

'ఆరు' కక్ష్యను దాటి ఆపైకి చేరంగ

సంధ్య వార్చుట మాను చతురుడయ్యె

ఎనిమిదోతరగతి ఏకంగ దాటేసి

సినిమా షికార్లలో సేద తీరె

పదినుండి పండ్రెండు పడికట్ల నడుమన

మీసాలు వేసాలు మితిని మీరె

గ్రాడ్యుయేషనులోన కాలెట్టినంతనే

అంగనా సంగతి నాత్మ బూనె

తల్లిదండ్రుల ధర్మ తత్పరతలెల్ల

చూచి యవహేళనము సేయు చూపు ముదిరె

బ్రాంది బీరుల బార్ల బార్ల నిలిచి

తీర్థ సేవనమందితా తీరె సేద

తెల్లవారినతోడ తేనీరు సేవించి

జాగింగు చేసేసి జంట తోడ

బ్రష్షింగు బేతింగు బహుశీఘ్రముగ చేసి

కనగ నూడిల్సుతో కడుపు నింపి

కం కమ్ము కమ్మంచు కన్నబిడ్డలనంత

స్కూలుకు కారులో చొరగజేసి

అమ్మగారొకచోట అయ్యగారొకచోట

కార్యాలయంముల గడిపి గడిపి

పగటి యాకలి కేంటీను పాలు జేసి

రాత్రి కన్నమ్ము స్టవ్ లోనె రగుల బెట్టి

వీధి వంటలకొట్టుకు విధిగ బోయి

కూరలను తెచ్చి కడుపున కూరుతారు

పిల్లల ప్రేమబోయె కన పెద్దలు చేరిరి వృద్ధ వాటికల్

ఇల్లను పేరు నిల్చెనది ఇమ్ముకు మారుగ నిచ్చి బాధలన్

ఉల్లము చిల్లులయ్యె గన ఊహలు మొత్తము జారిపోవగన్

చెల్లని కాసుగా మిగిలె జీవిత యంత్రము త్రుప్పు పట్టగన్

ధనము వెనువెంట పరుగెత్తి దాసులగుచు

బరగ ధర్మమ్ము మనమెడ బాసినాము

వెనుకకొసారి చూసిన వివరములను

బడయ గలమయ్య ఈనాటి బ్రాహ్మణులము

ధనము వెనువెంట పరుగెత్తి దాసులగుచు

బరగ ధర్మమ్ము మనమెడ బాసినాము

వెనుకకొసారి చూసిన వివరములను

బడయ గలమయ్య మన తెల్గు బ్రాహ్మణులము

కళ్యాణమునకన్న కల్గియుండొకరేటు

విధిగ శ్రాద్ధానికి వేరు రేటు

బారసాలకు గల్గు భారమౌనొక రేటు

అక్షరాభ్యాసాని కమిత రేటు

సత్యనాథ వ్రతము  తలపగ నొక రేటు 

ఉపనైన విధికి వేరొక్కరేటు

కొత్త ఇంటిని జేర కొత్తదౌ నొక రేటు

శాంతి హోమాలకు చాల రేటు

అంత, పెట్రోలుకివ్వాలి పెచ్చురేటు

రేటు నొప్పిననే అయ్య గేటు దాటు

మార్చె బాపడు కాంక్షతో మంచి రూటు

మారదలచుట నిజముగా  మంచి థాటు


ధర్మ ఏవ హతోహంతి ధర్మోరక్షతి రక్షితః l

తస్మాధ్ధర్మోనహంతవ్యో మానో ధర్మో హతో వధిత్ ll

స్వస్తిః ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం l

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినోభవంతుll

స్వస్తి.

 


Bhaskarananda Natha చాలా చక్కగా చేప్పారండీ
Raghu Kumar Yeleswarapu Good one every should think about this. No need to blame others. You are always correct sir.
Pprao Pendikatla మన భారత దేశ సంసృతి సంప్రదాయాలను కాపాడే బ్రాహ్మణులను కించపరచి దేశమీదా మన ఆచారాలమీద చులకన భావాన్ని కల్గించడం ద్వారా విదేశీ మతాల ఉచ్చులో పడి పాలుపంచుకుంటోంది
Kalyani Gauri Bhamidipati చాల సున్నితమైన విషయాన్ని చాల కూలంకషంగా పరిశీలించి, వీపు చరిచారు...భ్రష్టు పట్టి...మొత్తం...కమ్యునిటీ బలహీనమైపోయి నిర్వీర్యమయిపోతోంది...కాలానితో పాటూ...అవసరానికంటే మించి మార్పులు ఆపాదించుకుని... అందరి దృష్టిలో చులకనైపోయి...పలచబడింది...భ్రామణ్యం......
Mukkavilli Dharma Prakasa Rao చాలా చక్కగా విసదికరించారు. బ్రాహ్మణ జన్మ ప్రతివారికి కలగదు.
Pvr Murty చాలా చక్కగా చెప్పారు.
Subhash Chandra Bose M ఎంతో చక్కగా వున్నది వున్నట్లు కళ్ళకు కట్టినట్లు చెప్పేరు. ప్రస్తుతం బ్రాహ్మణత్వం కుంటికాలుతో వంకర నడక నడుస్తోంది. చూస్తూ విస్తు పోవడం తప్ప చెయ్యగలిగిందేమీలేదు.
Vijaya Suvarna Vijaya Suvarna బ్రాహ్మణుల అధోగతి పయనం చాలా విపులంగా వ్రాసారు రామమోహనరావు గారు, ఈ పరిస్తితికి విచారించే వాళ్ళు బహు కొద్ది మందే , అసలు పట్టించుకోని వాళ్ళే కోకొల్లలు. ‘అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట ఈలోకము సుఖముగా వుండాలని కోరేవారు తప్పకవుంటారు వారి ప్రార్థనల ప్రభావము ఈ జగతి పై తప్పక వుంటుంది’ అని మీరు వ్రాసిన వాక్యం చదివి మా చిన్ని ప్రయత్నం పెర్కొందామని.....
మేము ఉండడం విదేశాల్లో అయినా, మా అదృష్టం కొద్ది, మా నగరంలో వేద పండితులు ఉన్నారు. వారి వద్ద ఒక పాతిక మందిమి గత పది సంవత్సరాలుగా వేదపారాయణం నేర్చుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం ఒక చోట చేరి అధ్యయనం చేసుకుంటాము ముగింపు హారతి లో చదివే శ్లోకాల్లో సర్వేజనాః సుఖినోభవంతు తో బాటుగా, మన దేశం, మేమున్న దేశం, కూడా న్యాయమార్గం లో నడుచు గాక అని ప్రార్తిస్తాము.
స్వస్తిప్రజాభ్యః పరిపాలయన్తాం, న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం, లోకా సమస్తా స్సుఖినోభవంతు ||
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ, దేశోయం క్షోభరహితః బ్రహ్మణా స్సన్తు నిర్భయాః ||
సర్వేభవంతు సుఖినః సర్వేసంతు నిరామయాః, సర్వేభద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
అసతోమా సద్గమయా... తమసోమా జ్యోతిర్గమయా... మృత్యోర్మా అమృతంగమయా.
ఓం శాంతి శాంతి శాంతిః ....
Cheruku Ramamohanrao Cheruku Ramamohanrao అమ్మా బ్రాహ్మల పరిస్థితి ఏమిటంటే
ఏ నాటి అగ్రహారమొ
మానాటికి మాన్యమాయె మా పని దీరన్
మీనాటి కండ్రిగాయెను
నానాటికి తీసికట్టు నాగంభొట్టూ
Sriramachandramurthy Poduri Chala baga visleshincharu
Chivukula Bala Bhaskar పెద్దలు చాల చక్కగా ఈ సమస్యను విశధీకరించారు ...మరి ఈ సమస్య కి పరిష్కారం...ఏమిటి...
Chivukula Bala Bhaskar ఎక్కడో విదేశాలలో వున్నవాళ్ళు ...అంత బిజీ జీవితంలో కుడా ....మన ధర్మాన్ని పాటించడానికి పడే తపన... ఈ కర్మ భూమి లో వున్నా మనం ఏమి చేయలేకపోతున్నాం.
Chivukula Bala Bhaskar మనం మన ధర్మాన్ని వదిలివేసి నందుకే ...మనము చులకన అయ్యాము ...కనుక మనం మన ధర్మాన్ని తిరిగి పాటిస్తే ...మన గౌరవం కాపాడుకోవచ్చు....

Cheruku Ramamohanrao బాలభాస్కర్ చివరన నీవు చెప్పిందే. మనకు,ప్రస్తుత పరిస్తితుల్లో, ఎంతవరకు వీలయితే అంత వరకు మన ధర్మాన్ని పాటించడమే.
Cheruku Ramamohanrao వాసుదేవరావు గారు నేటి దుస్థితికి 'వాక్యాలు' చాలవు 'కావ్యాలు' కావాలి.