పూజారి-ప్రసాదము
నేను చాలామందిని ఒక స్వీట్ పాకెట్ బజారులో కొని తీసుకెళ్ళి
నైవేద్యం పెట్టి ఇవ్వండి అని దేవాలయంలోని అర్చుకునికి ఇస్తారు. స్వీట్ స్టాల్స్ నుండి
తెచ్చినవో మన ఇంట్లో చేసినవో, స్వీట్స్ కానీ దద్దోజనము పుళిహోర లాంటివి కానీ నైవేద్యంగా ఇవ్వకూడదు. దేవాలయానికి దేవునికి
పండ్లు మాత్రమే తీసుకు వెళ్ళాలి. అలాకాదు మేము ఫలానా నైవేద్యం పెట్టించ
దలచుకున్నాం అనుకున్న వారు ముందురోజే అర్చకునికి సంబారములనిచ్చి నైవేద్యం ఏర్పాటు
చేయించుకోవాలి. నైవేద్యం పెట్టిన తరువాత మీరు కొంత ఉంచుకొని ఇవ్వండి మేమే పంచుతాం
ప్రసాదం అంటారు. అలా చేయకూడదు.
శిఖరం, ప్రాకారం, లోపలి గోడ,
ముఖ మంటపం, అర్థ మంటపం, మహామంటపం,
ధృవమూర్తి, విమానంలో ఉన్నటువంటి మూర్తి,
ఇలా ఎనిమిది క్రింద విడగొట్టి ఈ ఎనిమిదిమందిలో ఎనిమిదో వంతు శక్తి
అర్చకునికి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వర శక్తిని అంటే ఆ మూలవిరాట్టు లోని శక్తిని
అర్చకునియందు ఆరోపింపబడి ఉంటుంది. ఇది ఆగమ
శాస్త్రములలో చెప్పిన మాట. ఆయన చరమూర్తి అంటే గుడి ప్రాగానములో ఉన్నంతసేపూ
దేవునితో సమానము. అందుకే పూర్వము పూజారిపై ఎంతో భక్తి ప్రపత్తులు చూపేవారు
భక్తులు. అందుకే అంత ప్రాధాన్యత కలిగిన అర్చకుడు మాత్రమే ప్రసాదమును తయారుచేసి
వినియోగించుటకు అర్హుడు. అందుకని దేవాలయంలో ప్రసాదాన్ని అర్చకుడు ఇవ్వాలి.
అంతేకానీ వేరెవరూ ఇవ్వకూడదు.
దేవాలయ ఆవరణలో దైవీయ ప్రకంపనలు ఉంటాయి కాబట్టి. కాసేపు కూర్చొమ్మని
శాస్త్రములు, అవి చదివిన మన పెద్దలు
నిర్దేశించినారు.
ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్
...అని మనుస్మృతి చెబుతోంది. ధర్మాన్ని వధిస్తే అది తిరిగి మనను
వధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం
చేయకూడదు.
స్వస్తి.?
Excellent 👍
ReplyDeleteExpressing the modalities explicitly is simply superb sir. Dhanyosmi
ReplyDeleteదేవాలయంలో ప్రసాదమును తయారుచేసి నివేదించవలసినది ఒక్క అర్చకుడేననేవిషయంలోగల శాస్త్రీయ సత్యాలను, దేవాలయం,దేవుని అర్చామూర్తి లలో అర్చకునికి ఉండే ఎనిమిదవ వంతు శక్తిని గురించి బాగా వివరించారు.బజారు లో స్వీట్ లు పనికిరావనే విషయాలు బాగా వివరించారు.మను స్కృతిలోని ధర్మో రక్షతి రక్షితః అనే శ్లోకాన్ని పూర్తిగా అందించేరు.చాలా జ్ఞాన దాయకమైన సందేశం అండీ రామ మోహన రావు గారూ.అనేక అభినందనలండీ.
ReplyDelete