కవయామి వయామి యామి
https://cherukuramamohanrao.blogspot.com/2014/09/blog-post_12.html
భోజ రాజు ధారా నగరాన్ని పాలించే కాలములో కవి కాని పాలితుడు
ఉండేవాడు కాదనే ప్రతీతి వుండేది.రాజుకు ఒకసారి ఈ విషయములోని నిజానిజాలను
పరిశీలించే యోచన కలిగినది.'రాజు
తలచితే దెబ్బలకు కొదవా'
అన్నట్లు వెంటనే తన చారులను దేశము నలువైపులా పంపి కవి కానివాదేవడైనా దొరికితే
పట్టుకు రమ్మన్నాడు.వెదకగా వెదకగా ఒక సాలెవానికి కవనము రాదని తెలిసి ఆతనిని రాజ్కువద్దకు తోడుకొని పోయినారు.సరస్వతీ
కటాక్ష దీధితీ పరివృత ముఖారవిందుడగు భోజరాజును చూసిన ఆ నేతరి మానస సముద్రము,పున్నమి
చంద్రుని జూచినట్లు కవితా లహరులతో
ఉవ్వెత్తున ఎగసిపడింది.
రాజు ఆతనిని జూసి 'కవిత్వము
అల్లగాలవా ?' అని
ప్రశ్నించినాడు.
ఆటను వెంటనే ఇట్లు చెప్పినాడు." కావ్యం కరోమి
(కావ్యమును అల్లగలను.)చారుతరం నహి కరోమి (కానీ అతి సుందరముగా అల్లలేను.)
యత్నాత్ కరోమి (ఒకవేళ ప్రయత్నిస్తే) చారుతరం కరోమి (అత్యంత
సుందరముగా అల్ల గలను.) భూపాల మౌళి మణిరంజిత పాద పీఠ(రాజుల కిరీటములయంధలి మణులచే
ప్రకాశింపబడిన పాదములు గలవాడా ) హి సాహసాంకా!( ఓ సాహస విక్రమార్క
బిరుదాంచితుడా)కవయామి(కవిత్వమల్లగలను)వయామి (బట్టలనల్లగలను అంటే నేయగలను) యామి
(అనుమతించితే పోగలను.)
అంటే 'రాజులందరూ తలలు వంచి మీ పాదాలకు నమస్కరించు సమయములో వారి
వారి కిరీటములందలి మణుల విశేష కాంతి మీ పాదాలపై పడుటచే ప్రకాశవంతమగు పాదములు
కలిగిన సాహస విక్రమార్క బిరుదాంచిత భోజరాజా! నేను కవిత్వమును అల్లుతాను, బట్టలను
నేస్తాను,అనుమతిస్తే
బయలు దేరుతాను కూడా.' అన్నాడు.
దీనితో ధారా నగరములో కవులు కానివారు లేరు అని నిరూపించి మరీ
వెళ్ళినాడు.
స్వస్తి.
No comments:
Post a Comment