Tuesday, 31 March 2015

తెలుగు -- తెగులు

తెలుగు -- తెగులు 

01/04/15
ఈ రోజు vvs శర్మ గారు ఒక చిన్న మాట - సామవేదం వారి నోట వచ్చినది ప్రకటించినారు.
దానికి వారి మాటలు , నామాటలు జోడించి ఈ క్రింద ప్రచురించు చున్నాను.
ప్రశ్న : "గురువుగారు! అచ్చ తెలుగంటే ఏమిటి?"
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు : "ఇప్పటి తెలుగు వారికి అర్థంకానిది నాయనా!"
vvs శర్మ గారి మాట : తమిళులు రైల్లో పక్కవారికి తమిళం వస్తుందని తమిళంలో పలకరిస్తారు. తెలుగు వాళ్ళు పక్కవాళ్ళకి రాదు 
అని ఊహించుకుంటారు.మద్రాసులో అరవం నేర్చుకున్నారు, హైద్రాబాదు వెళ్ళి నాలుగు ఉర్దూ పదాలు నేర్చుకున్నారు. 
కాన్వెంటుకి వెళ్ళి బట్లరు ముక్కలు ఒంట పట్టించుకున్నారు. సినిమాలుచూచి సుత్తి, కేక, కొత్త జాతీయాలు సృష్ణ్టించారు. ఆత్మ 
న్యూనతాభావం (inferiority complex) అనుకుంటాను. ఆత్మ విశ్వాసం ఉండాలి. భాషపై అభిమానం ఉండాలి. ఇవి ఇంట్లో నేర్పాలి.
నాలుగు నా మాటలు : శర్మగార్లుభయులు చెప్పిన మాటలు అక్షర సత్యములు. కర్నాటక,తమిళనాడు, కేరళ రాష్ట్రములలోవారి 
వారిమాతృభాష తప్పనిసరి. మనపూర్వులు కొందరు తమ పేరుపలుకుబడి కొరకు కంకణము మరీ వాడుకభాష అన్న పేరుతో 
ఈభాషను నాశనముచేయుటకు నాంది పలికినారు. vvs శర్మగారుచెప్పినట్లుగా దిశానిర్దేశము లేని యువత తాము మాట్లాడేదే 
తెలుగన్నభ్రమలోపడినారు. తప్పుఒకరిదికాదు. కానీ మహా పండితులైవుండికూడా తెలుగు వినాశనమునకు కట్టుకొని మరీ 
వాడుక భాష అన్న విషబీజము నాటిన వారిని తెలుగునాడు క్షమించుతుందో లేదో చదువరులవితరణకు వదులుచున్నాను.
అసలు ఈ తెలుగు పదాలకు అర్థముతెలిసిన వారు బహు తక్కువ అని నా అభిప్రాయము తుుటుము, గమి, అన్నవి
గుంపునకు పేర్లు. వేలిచెనుఅంటే వేడల గొ్ట్టెేను అని అర్థము. 
తెక్కలికాడు అంటేదొంగ అనిఅర్థము. వదచక్కేలిక అంటేకుబేరుడు, తమ్మిచూలి అంటే బ్రహ్మ, సోకుదయ్యము అంటే గాలి, పక్కిడాల 
వేల్పు అంటే విష్ణువు, పాపతాల్పు అంటే శివుడు,. ఈవిధంగా ఈ కాలము వారికి అర్థము కాని ఎన్ని పదములైనా చెప్పవచ్చును.
ఇదీఅచ్చ తెలుగు. మరి తత్సమశబ్దములతో కూడిన తెలుగు తెలుసునా అంటే అదీ అంతంతే. ఇక తత్సమ శబ్దముల విషయానికి 
వస్తే లేలిహాన, జిహ్మగ అన్నవి పాములకున్నఅనేకమయిన పేర్లలో రెండు మాత్రమే.
ఈస్థితిలో నన్నయ , తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథ, పెద్దన మొదలయిన మహానుభావుల గ్రంథాలు తాకుటకుకూడాయోగ్యతలేని 
దయనీయమైన పరిస్థితిమనది.

ఏమిచేస్తాము. గొరగంగా మిగిలింది జుట్టు.

ఏనాటి అగ్రహారమొ
మా నాటికి మాన్యమాయె మాపని దీరన్
మీ నాటి మాన్యమాయెను
నానాటికి తీసి కట్టు నాగం భొట్టు

దారీ తెన్నులేనేలేక ఈ తీరాయెనా ...

Sastry Kv గురువు గారు అనుమతిస్తే వారి విశ్లేషణకు ఇష్టత తెలిపినా తెలుగు రాని తెలుగువాడిగా బాధ కలుగుతోంది. ఇన్నాళ్లూ నాకు 

తెలుగు బాగానే వచ్చని, శ్రీమద్భాగవతం, శ్రీ మహా భారతం లలోని పద్యాలను అర్ధం చేసుకుని ఆస్వాదించగలుగుతున్నానని భావిస్తున్న 

నాకు ఆ ప్రతిభ నాది కాదని, అంత తేలిక భాషలో రాసిన ఆ మహానుభావులదని తెలుసుకున్నాను. ధన్యవాదములు. మరి నాలాగ ఎందరో! 

ఐతే దీనికి పరిష్కారం ఏంటి?

శాస్త్రి వ్రాసిన మాటలలో అంతర్లీనమైన బాధ కనిపిస్తూ వుంది. ఎందుకో నాకు ఆ మూడు పంక్తులు చదివినందుకే మనసు ద్రవించి నాకు తోచిన 

నాలుగు మాటలు వ్రాస్తున్నాను. వాస్తవానికి నేను తెలుగులో poor ఆంధ్రము లో weak . ఈ చిన్న వాక్యములో కూడా రెండు ఆంగ్ల 

పదాలను వాడవలసి వచ్చింది. అసలు విషయానికి వస్తే నేను ఏ భాషా ప్రత్యేకముగా చదువలేదు. మల్లెలు కట్టిన దారానికి కూడా 

మంచివాసన అబ్బినట్లు నా బాల్యములో నేనున్న వీధిలో గొప్ప పండితులు వుండేవారు. వాళ్ళు ' ఏమిరా బాగున్నావా' అన్నా నాలోపల 

ఎదో ఆనందము కలిగేది. బహుశ వారి మేని నంటిన గాలి కాస్త నాకూ సోకిందేమో ! నేను 5 వ తరగతి వరకు పాఠశాలకు పోయిన  పాపాన 

పోలేదు. ఇంట్లో తల్లిలేని నాకు మా అమ్మమ్మే అమరము త్రికాండలలో  ప్రథమ కాండ మాత్రమె, ఆంద్ర నామ సంగ్రహము చదివింప  జేసేది. ఆ 

 పునాది తప్పించి నేను ప్రత్యేకముగా ఏ భాషా చదువలేదు. ఈ రోజు పాండిత్యము లేకపోయినా  నా ఆలోచనలకు అక్షర రూపము కల్పించే 

సామర్థ్యము వచ్చింది . తెలుగు కాకుండా ఐదు భాషలు  మాట్లాడ గలను. మూడు భాషలు వ్రాయగలను, నాలుగు భాషలు చదువగలను. 

ఆంగ్లములో అంతో ఇంతో ఎంతో కొంత కవిత్వము కూడా వ్రాయగలను. దయతో దీనిని స్వోత్కర్షగా భావించవద్దు. అది నా మాత్రు భాష 

గొప్పదనము.అంతయు పరమేశ్వరానుగ్రహము. నడవడి అన్నింటికీ ముఖ్యము. దానిని సాధించితే దేనినైనా సాధించవచ్చు. 


 మన గురుకులాలలో శిక్ష, విద్య అన్న రెండు భాగాలు ఉండేవి. క్రమశిక్షణ కూడా శిక్షలో ఒక భాగమే ! అసలివి మన దేశీయ విద్యా విధాన 

రథమునకు రెండు చక్రములు. T.B. మెకాలే ఇదేవిషయమే తన నివేదికలో బ్రిటీషు పార్లమెంటుకు నివేదించినాడు. శిక్ష, విద్య, 

గురుకులాలను నిర్మూలించి ఆంగ్లపాఠశాలాలను ఏర్పాటుచేయించుటలో కృతకృత్యుడైనాడు. వారికి తోడు నీడై , విలియం బెంటింక్ కు అంతే 

వాసియై మన రాజారామమోహన్ రాయ్ గారు కూడా నిలిచినారని చదివియుండినాను. అటువంటి వారి యనుగ్రహముతో మన భాషకు 

తల్లియైన సంస్కృతాన్ని ఆనాడు , మనతల్లియైన తెలుగును ఈనాడు సజీవ సమాధి చేసి చేతులు దులుపుకోన్నాము.

ఈకాలము పిల్లలకు daddy కి good morning చెప్పు. aunty కి ta ta చెప్పు . one,two, three చెప్పు ఉదయము లేస్తూనే 

చెప్పించేవి ఇవి. ఇందులో 'చెప్పు'లు తప్ప మిగిలిన  దానిలో ఎంత తెలుగు వుందో చెప్పేవారికే తెలియాలి. మనము  విచక్షణా రహితులమై 

ఎంత భావదాస్యానికి లోనవుతూవున్నామో చూడండి. US and UK are developed countries అని మనము వినియుంటాము. 

past participle అయిన developed తీసుకొన్నప్పుడు, అవి, ఎదుగుదల కారణాంతరములచే నిలిచి పోబడిన దేశములుగా 

భావించవలసి వస్తుంది. put పుట్ అయితే  but బట్  ఎందుకయ్యింది. నైఫ్ అని ఆంగ్లములో వ్రాస్తే knife వ్రాయవలె. మరి k ఎందుకో ! 

ఇటువంటివి ఆ భాషలో కోకొల్లలు.దక్షిణాది భాషలకు ద్రావిడశబ్దము తగిలించుటే కృతకముు. ప్రపంచభాష ఏదయినా సంస్కృత జన్యమేనని 

చంద్రశేఖరయతీంద్రులవారి మాట. వారి పాండిత్యము అపారము. వారొకఅనర్ఘ రత్నము. మరిమనము వారిని నమ్మము. తన మాతృభాష 

యైన తమిళము కూడా సంస్కృతజన్యమేనని నొక్కి వక్కాణించిన మహనీయులు వారు. వారికి స్వపర భేదములుండవుగదా! మనకు 

క్రిస్టియన్మిషనరీకి చెందిన కాల్డ్వెల్ మాట శిరౌధార్యము. ఆతడు కేవలము క్రైస్తవము ప్రాకజేయుటకు సృష్టించిన పదమది. ఆర్యద్రావిడసృష్టి 

చేసిన వారిలో వారు ప్రముఖులు. చెన్నపట్టణమునకు సెయింట్ థామస్ వచ్చినాదన్న కల్పిత గాధను సృష్టించి, అకుంఠితమైన భారత 

దేశమునుండి, తమిళులను, ద్రావిడ భాషలన్న పేరుతో దక్షిణాది భాషలను ,వానిని మాతృభాషలుగా గల్గిన దాక్షిణాత్యులను విభజించి 

పుణ్యము మూట కట్టుకొన్నారు. పొరుగింటి పుల్లగూర ఎట్లయినా రుచి ఎక్కువ కదా !  వారి భావానువర్తులై దేవనాయాగం వంటి 

అవకాశవాదులు 1969 లో క్రైస్తవము పుచ్చుకొని అసలు మన సనాతన ధర్మమే అబద్ధాల పుట్ట అనీ, తిరువళ్వారు సెయింట్ థామస్ వద్ద 

క్రైస్తవ తీర్థము పుచ్చుకోన్నాడని 'Was Tiruvalluvar A Christian' అన్న పుస్తకము రచించి పుణ్యము కట్టుకొన్నాడు. ఈ పుస్తకాన్ని 

ఏకంగా నాటి DMK ముఖ్యమంత్రిగారే  ఆవిష్కరించినారు. ఈ విధముగా ఒకటిగా వున్న గొలుసు లంకెలను త్రుంచి మనలను విభజించి, 

ఒకవేళ మతము మారకున్నా, మనలను తమ మతమునకు దగ్గరజేసుకొన్నారు.

నేడు మన పరిస్థితి ఏమిటంటే మన భాష పై మనకు గౌరవము లేదు, మన ధర్మము గొప్పదనమేమిటో మనకు తెలియదు. మన సంస్కృతి 

మనకందుబాటులో లేదు. కారణం మనకు తెలుగు రాదు. మనకు  వేములవాడ భీమన లోని  ఉద్దండ లీల, నన్నయలోని ఉభయ వాక్ప్రౌఢి, 

తిక్కనలోని  ఔచిత్య భావ పదబంధం, ఎర్రాప్రెగ్గడలోని  ఉక్తి వైచిత్రి  శ్రీనాథుని సీసపద్యములు, పోతన అనుప్రాసాయుతమైన అద్భుత కవితా 

శైలి, నాచన సోముని నవీన గుణ తత్వము అన్నీ ఈనాడు గాలికి ఎగిరిపోయిన ఎండుటాకులే. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ 

వ్యూహం మనకు పరబ్రహ్మ పదార్థమే ! తెలుగంటే ఏమిటో తెలియని తెలుగుజాతికి వారసులము మనము. 


మరి ఇప్పుడు మన కర్తవ్యమేమిటి?

కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. 

తెలుగు మాధ్యమం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా 

అర్థం చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక 

సంపదకి దూరం కావటమే. పునాది లేని భవనము అంటే కేవలము రాళ్ళు సున్నమే అన్నది గ్రహించగలిగితే తెలుగునకు ఒక 100 

సంవత్సరాల పిమ్మటనైనా తెలుగునకు పునర్వైభవము తేగలుగుతామేమో !


ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ 

అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, 

చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా?తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు 

సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. అందుకే 'తెనుగు తేనె 

ఊట తేటరా గమనించు రామమోహనుక్తి రమ్య సూక్తి' అని వ్రాసుకొన్నాను.


మనము ఇకనైనా కళ్ళు తెరిచి పిల్లలను క్రెచ్చి, ప్రీకేజీ, ఎల్కేజీ, యుకేజీ, అనిచదివించకుండా ఓపికతో లేక ఓపికచేసుకొని తల్లిదండ్రులు 

'అమరము' 'ఆంధ్రనామ సంగ్రహము' నేర్పించితే ఒకఏడాది తరువాత మెల్లమెల్లగా చిన్నచిన్నశతకాలు, రుక్మిీణీకల్యాణము, 

గజేంద్రమోక్షము, ప్రహ్లాద చరిత్రము, విదురనీతి వంటి ఘట్టాలు నేర్పించితే వారు ప్రపంచములోనిఏ భాషనైనానేర్వగలరు.

స్వస్తి.



































No comments:

Post a Comment