Saturday, 7 March 2015

మఖేశ్వరాలయము

మఖేశ్వరాలయము
మఖము అంటే యజ్ఞము. ఆయనకు ఆ ఆలయములో మఖము ప్రీతియైయున్దనోపు, అందుకే మఖేశ్వరుడైనాడు. ఆ దేవాలయము లో లింగము పెకలింపబడి ,పగులగొట్టబడి, వెండి త్రాడుతో చుట్టబడి ఉంటుంది. దానిని ప్రవక్త గారు ముద్దు పెట్టుకోన్నారట. అందువల్ల ఇప్పటికీ యాతీకుల కది ఆనవాయితీ అయిపోయింది.పాణివట్టము విడిగా ఉండిపోయింది. గర్భ గుడి మిగిలింది. ఇంత జరిగినా పద్ధతి లో మార్పు లేదు.  ఆ గర్భగుడి చుట్టూనే 7 ప్రదక్షిణములు చేస్తారు ఆ పవిత్ర యాత్రకొచ్చిన యాత్రికులు . 7 ఎందుకు అంటే , మఖమునకు మూలము అగ్ని, అగ్నికి సప్త జిహ్వుడు అన్న పేరు ఒకటుంది, ఆ సప్త జిహ్వుని ప్రీతికై ఈ 7 ప్రదక్షిణలు. వాళ్ళు గుండు గీయించుకొని తెల్లటి పంచ కట్టుకొని తెల్ల అంగవస్త్రము పైమీద కప్పుకొని శుచిగా ఆ ప్రదక్షణలు చేస్తారు. ఈ సనాతన ధర్మ విదివిదానములను పూర్తిగా విడువలేదన్నమాట.ఆ 'గర్భ' గుడినే 'కాబా' అంటారు . ఆ ప్రాంతాన్ని అల్-హరం అంటారు. ' హరం' అంటే ఈశ్వరుడే కదా ! ఆ 'మఖ'మే(యే) 'మక్కా' అయినది. ఆ ప్రాంతములో ఒకప్పుడు సంత జరిగేది. అందులో ప్రధానముగా శాస్త్ర చర్చలు జరిపేవారు, ఆ కాలములో కాశీ లో జరుగుతున్న విధంగా. ఆలయమునకు దగ్గరగా నిరంతరమైన నీటియూట వుంది. దానిని 'జంజ' అంటారు. వాళ్ళు 'గ' ను 'జ' గా పలుకుతారు కాబట్టి 'గంగ' 'జంజ' ఆ తరువాత 'జంజం'అయ్యింది. యాత్రీకులు దానిని పవిత్ర జలముగానెంచి చెంబులతోనో, సీసాలతోనో తమ తమ ఇండ్లకు తెచ్చుకొంటారు. ఈ 'మక్కా' ఎక్కడ వుంది అంటే అరేబియా దేశములో. 'అర్వము' అంటే గుఱ్ఱము . అందువల్లనే జాతి గుఱ్ఱములు  దొరికే ఆ దేశాన్ని అర్వదేశమన్నారు. వారి భాషలో 'వ' కు బదులు' 'బ' పలుకుతారు కాబట్టి 'అరబ్' దేశము రానురాను అరేబియా దేశము అయినది.
అంతే కాదు ఇంకొక ముఖ్యమైన విషయము ఉన్నది. 'కాబా' లోపల బంగారురేకుపై చెక్కబడిన ఒక కవిత వ్రేలాడబడియుండేది. దానిని అరబ్బీ భాషలో ' శాయర్ - ఉల్ - ఓకుల్' అంటారు. దాని అర్థము 'చిరఃస్మరణీయము"అని. ఆ రేకు ఇప్పటికి కూడా టర్కీ దేశపు రాజధానియైన ఇస్తాంబుల్ నగరములోని 'మాక్తాబ్ -ఏ - సుల్తానియా' అన్న జగత్ప్రసిద్ద గ్రంథాలయము నందున్నదని ప్రసిద్ధ చరిత్రకారుడు P.N. ఓక్ గారు Was the Kaaba Originally a Hindu Temple? అన్న గ్రంధములో తెలిపినారు.మఖేశ్వరాలయముఆ కవిత ' అబూ అమీర్ ఆసామి' అన్న 'హారూన్-అల్-రషీద్' ఖలీఫా గారి ఆస్థాన కవీశ్వరుడు, ఇస్లాం కు ముందు వ్రాయబడిన కవిత్వము, తరువాత బనీ-ఉమ్- మయ్యా వంశపు అంతము వరకు, అక్కడినుండి హారూన్ గారి కాలము వరకు 3 భాగములుగా సంకలనము చేసి సంపుటీకరించినాడు. అందులోని 315 వ పుటలో ప్రమర వంశజుడైన విక్రమాదిత్యుని గూర్చిన ప్రశంస వున్నది. మరి మనమెంత నిర్భాగ్యులమంటే ,కాళీదాసాది నవరత్నములను కలిగి, దేశమును విదేశీ దండయాత్రలనుండి కాపాడి అరేబియా వంటి దేశములో కూడా సంస్కార భక్తి భావములనేర్పరచిన మహనీయుని పేరు మన చరిత్రలో లేదు. ఆ మాటకొస్తే అదే వంశజుడైన భోజుని పేరు కూడా లేదు. ఈయన కాలములో కాళీదాసు పేర వేరొక పండితుడువుండినాడని తెలియ వచ్చుచున్నది. ఆ వంశము వాడేయైన శాత వాహనుని పేరు మాత్రమే ప్రబలముగా వినిపిస్తుంది. పైన పేర్కొన్న విక్రమాదిత్యుని పెరున విక్రం సంవత్ (56 B C E)మొదలైనది. శాతవాహనుడు రాజ్యాధికారము చేతబూనిన తరువాత శత్రు సంహారము చేసి రాజ్యమును కట్టుదిట్టము చేసి శాలివాహన శకమునకు(78 A D)నాంది పలికినాడు. కానీ పైన తెలిపిన ఆధారముతో ఉజ్జయిని పాలకుడైన విక్రమాదిత్యుడు ఎంతటి మహానుభావుడో తెలుస్తుంది.

' శాయర్ - ఉల్ - ఓకుల్' లో ఈ విధముగా వున్నది ' లోక కల్యాణమును పరమావధిగానెంచి అరబ్ దేశీయులలో భక్తీ భావమును పెంచిన విక్రమాదిత్యుని శాసన కాలములో నుండిన ప్రజలెంత అదృష్టవంతులు ' అని సాగుతుంది. ఇది అవాస్తవమని యన్న వాదన కూడా వినిపించుతుంది. నిజము దేవుడెరుగు నీరు పల్లమెరుగు.

పై కారణాలవల్ల జమైత్ ఉలేమా కు చెందిన మత గురువు ముఫ్తీ మొహమ్మద్ గారి వ్యాఖ్యలు వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయా అన్న ఆలోచన పాఠకులమైన మనలో రేకెత్తిస్తున్నాయి.                            











No comments:

Post a Comment