Monday, 21 August 2017

హృదయము-మంత్రపుష్పము


హృదయము-మంత్రపుష్పము
ఆంగ్ల శబ్ద కోశములో HEART అన్న మాటకు అర్థమయితే ఇచ్చినారు కానీ దాని పుట్టుకను గూర్చి నేను పరిశీలించినంత మేరకు కానరాలేదు. నా ఉద్దేశ్యములో 'హృత్' శబ్దము నుండి HEART పుట్టివుంటుంది. మనలనుపాలించిన వారు కదా మన భాషను తమ భాషకు మాతగా ఒప్పుకొనుటకు ఆభిజాత్యము అడ్డము వచ్చి  యుండవచ్చు.
సంస్కృతములో మాత్రము నిరుక్తమున ఎంత హృద్యముగా 'హృదయము' అన్న మాటకు వ్యుత్పత్తి చెప్పినారో అది తెలిపిన వారి మేధస్సును వర్ణింప నాతరము కాదు. వారు హిమవన్నగము వంటివారయితే నావంటి వారందు పిపీలిక సమానులు (పిపీలికము=చీమ). ఈ శ్లోకమును గమనించండి:
తదేతత్ త్ర్వక్షరంహృదయమితి, హృత్ ఏకం మహాక్షరం ద ఇత్యేకాక్షరం
యమిత్యేకం యివం హరతేర్ దదాతేరాయతేర్ హృదయ శబ్ద నిరుక్తః
'హృ' అంటే హరతి = గ్రహించునది
'' అంటే దదాతి = తిరిగి ఇచ్చునది
'' అంటే అయతి= ప్రవహింప జేయునది
మొత్తము గుండెయొక్క కార్యక్రమమంతా మూడు అక్షరములు కల ఒక పదములో వచ్చివేసినది. దీనిని 'సింధు' అనటము కూడా కద్దు. నదులు సంద్రమునకలిసి తిరిగి వర్షముతో నదులుగామారి సంద్రమున కలుస్తున్నాయో రక్తము కూడా గుండెతో అదే సంబంధమును నిరంతరమూ కలిగియున్నది కదా!
హృదయము యొక్క అర్థమును గూర్చి తెలుసుకొన్నాము. ఇపుడు ఆ హృదయమును గూర్చి వేదములోని మంత్రపుష్పమునందు ఏమి తెలిపినారో చూద్దాము.
మంత్రపుష్పమును విధిగా పూజల్లోనూ, వ్రతములలోనూ, దేవాలయములలోనూ పూజావసాన సమయమును చెబుతూ వుంటారు. అందువల్ల ఆ మంత్రమును మన హృదయమునకు సంబంధించిన మేరకు మీ ముందుంచుతూ నాకు చేతనయినంత వరకు  వివరించుతాను.
పద్మ కోశ ప్రతీకాశగ్౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా
సంతాపయతిస్వం దేహమపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ ||
మంత్రార్థమును తెలుపుటకు మునుపు మంత్రం పుష్పము అన్న పేరును గూర్చి తెలుసుకొందాము. పుష్పములు స్నిగ్ధత సౌకుమార్యము కలిగినవి. వానిలో శ్రేష్ఠతమమయినది తామర. అందుకే ఎర్ర తామర లక్ష్మీ నివాసమయితే తెల్లతామర వాణీ విలాసము. మన శరీరములో కూడా ఒక ఎర్రతామర మొగ్గ వుంది. మంత్రపుష్పము దాని గూర్చియే తెలుపుతుంది కాబట్టి అది మంత్రపుష్పము అయినదని నా ఊహ.
ఇపుడు ఈ మంత్రార్థమును నా శక్తి మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. నావేవయినా తప్పులు వుంటే విజ్ఞులు సవరించగలరు. హృదయము తలక్రిందులుగా వున్న తామర మొగ్గవలె భాసిల్లుచున్నది. నిష్ఠి అంటే తెలుగులో ముచ్చెన గుంత అంటారు. ఈ గుంత అటు కంఠానికీ ఇటు ఎదకు మధ్యన వుంటుంది. దానినుండి క్రిందికి వితశ్శాంతిఅంటే జానెడు దూరము, మరియు నాభ్యం ఉపరి అంటే బొడ్డునుండి పైకి జానెడు దూరములో ఈ మొగ్గ వున్నది. మరి కొలత ఏవిధముగా చేయాలి అన్నది తరువాతి సందేహము. కుడి ప్రక్కకా ఎడమ ప్రక్కకా లేక నిటారుగానా అన్న సందేహము వస్తుంది. నిటారుగా రెండు చేతులను ఉపయోగించి అటు నాభినుండి ఇటు నిష్ఠి నుండి లంబముగా అంటే నిటారుగా ఉంచితే రెండూ కలుస్తాయి. అందువల్ల అక్కడ అది లేదు అని తెలుస్తుంది. ఇక కుడి ఎడమ. గుండె 99 శాతము మానవులకు ఎడమవైపునే వుంటుంది కానీ 1 శాతము కుడివైపు కలిగినవారు కూడా వుంటారు. దీనిని Dextrocardia అంటారు ఆంగ్లములో. ఇది పారంపర్యముగా వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది. ఆంగ్లములో దీనిని congenital అంటారు. మరి పారంపర్యముగా వస్తూవుంది అన్నా కూడా దానికీ ఒక ఆది అన్నది ఉంటుందికదా! కాబట్టి మనము ‘కుడిఎడమయినా పొరబాటు లేదు’ అనుకోవలసి వస్తుంది. కాబట్టి మన రెండు చేతుల జానలను అటుగానీ ఇటు గానీ బొటన వ్రేళ్ళను ఆయా కేంద్రములనుడి కదిలించక చిటికెన వ్రేళ్ళను ఎడమకు (కుడి కూడా తీసుకొనవచ్చును అని చెప్పుకొన్నాము) కదిలించుతూ పోతే ఎక్కడ తాకబోతాయో అది హృదయస్థానము. కత్తులు కటార్లు ఈటెలు బాకులు వాడకుండా హృదయస్థానమును లక్షల సంవత్సరముల క్రితమే నిర్ణయించిన మన పూర్వీకుల ప్రతిభ, ప్రశస్తిని ఏమని ఎంతని పొగడ గలము. జ్వాల+ మాల+ ఆకులము అంటే నిప్పురవల మాల ను బోలుతూ చెదరుతూ అంటే చుట్టుప్రక్కల వ్యాపించుతూ వుంది.   విశ్వస్య ఆయతనం మహత్ అంటే ఈ విశ్వము యొక్క పుట్టుకకు మూలము అదియే! ఈ విషయమునే NASA(USA) కూడా ద్రువపరచడము జరిగింది. ఇంకా వారు భగవంతుడు ఇక్కడ ఉంటాడా అని పరిశోధనలు చేస్తున్నారట. ఒక్క విషయము ఆలోచించుదాము. మనిషిలో వేడి లుప్తమయితే మృతుడే! మరి వేడి ఉన్నంతవరకు మనిషి బ్రతి ఉన్నాడు. మరి ఆవేడికి కూడా మూలము ఉండవలెను కదా! ఆ మూలమే దేవుడు. ఆ మూలము ఎక్కడుంది ఆ మూలములో ఆయన ఎక్కడున్నాడు అన్నది చూద్దాము. సంతతగ్ం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం అంటే ఆ హృదయము వద్ద ఎల్లపుడు శిలాభిః (‘ర’’ల’యోరభేదః) అంటే శిరలు (శిలాభిః) లంబముగా ఆ పద్మ కోశమునకు ఆనుకొని వ్రేలాడుతున్నాయి. ఆ కోశమునకు అంతమందు సుషిరగ్ం  సూక్ష్మం అంటే మిక్కిలి చిన్నదియైన ఒక రంధ్రము వుంది. తస్మిన్, అందులో సర్వం ప్రతిష్ఠితం అంతా అందులోనే ప్రతిష్ఠింపబడి వుంది. అక్కడ అంటే ఆ రంధ్రములో మహత్తరమగు అగ్ని వుంది. దానివలననే ఈ ప్రపంచమంతా వెలుగుతూ వుంది.

    ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి ఉంటుంది. మరి ప్రకృతిలోని మానవేతర స్థావర జంగమములకు లోపల ఈ వెలుగు లేదా! అంటే వానికి మానవ భాషలో తెలిపినా అర్థము చేసుకోనలేవు. అందుకే వేదము మానవులకు చెప్పబడింది. మళ్ళీ విషయమునకు వస్తే అది విశ్వార్చిర్ విశ్వతోముఖః అంటే దానివలననే ఈ విశ్వము అంతా వెలుగుచున్నది ఎందుకంటే విశ్వతోముఖః అది ప్రపంచమంతా  వ్యాపించి యున్నది. విశ్వము వెలుగుతూ వుంటే మరి సూర్య చంద్రాగ్నులు అవసరము లేదు కదా! అంటే సూర్యుడు అగ్నిగోళం, చంద్రుడు, తనపైబడు సూర్య కిరానా పరావర్తనముచే మాత్రమే వెలుగుచున్నాడు. ఇక అగ్నిది ప్రకృతితో కాకుండా మానవునికి సంబంధించిన వరకు అది పరిమిత ప్రయోజకత్వమునే ప్రసాదించుతుంది. కాబట్టి ఆ మూడు లేకపోతే ప్రాణికోటి లేదు అని తలువ వచ్చును. కావున అవి వుంది తీరవలసిందే! మరి ఈ వెలుగు మాటేమిటి. మనము ప్రకృతిలో గమనించితే పచ్చటి చెట్లలో ఒక కాంతిని చూస్తాము. అది వాడిపోయిన చెట్లలో అగుపించదు. వయసులో వున్న యువతీయువకులలో వుండే కళ ముదుసలివారిలో చూడలేము. అంటే ఏ వెలుగయితే మనలో ఉన్నదని చెప్పుకొన్నామో అది మెల్లమెల్లగా అధోముఖము పడుతూ ఉందన్నమాట. అసలు రంగులతో నిమిత్తము లేకుండా దాదాపు సమానమగు వయసులో ఉన్నవారి మధ్యన కూడా వర్చస్సులో కాంతో భేదములను చూడవచ్చు. లోపలి వేలుగునుబట్టే బయట నిగారింపు కనబడుతూవుందన్నమాట. నేటికి కూడా తపోసాధకులగు గురువుల ముఖములు ఎంతో వెలుగుతో, ప్రసన్నతతో, ఇంకా చూడవలెననిపించే రీతిగా వుంటాయి. దానికి వారి సమగ్ర సాధనయే కారణము.
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః అంటే ఏ వెలుగును గురించియయితే ఇంతవరకూ మాట్లాడుకొన్నామో దాని మధ్యన ఒక అగ్ని శిఖ ఊర్ధ్వ ముఖముతో భాసిల్లుచూ వున్నది. అందులో అణువును బోలి ఊర్ధమునకు చూసే ఒక అంతశ్శిఖను కలిగియున్నది. నీలతోయదము అంటే వర్షము కురియుటకు సిద్దముగానున్న నీలమేఘము. దాని మధ్యలో మెరిసే మెరుపువలె ప్రస్ఫుటమగుచూ ఇక ఛేదించలేని అణు రూపమై ప్రభావించుతూ వున్నది. అదే మంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్
ఈ మెరుపులో, నీవార ధాన్యము యొక్క ముల్లు, (నేను చూడలేదు కానీ వడ్లగింజ కున్న ముల్లుతో పోల్చుకొన వచ్చును.) అంతటి చిన్న ముల్లు లాంటి వెలుగులో పరమ పరమాణు రూపములో ఊర్ధ్వముఖముగా ప్రజ్వరిల్లే జ్యోతి మధ్యలో పరమాత్మ నివసితూవున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రదులంతానేకాదు పరమస్వరాట్ అయిన సకలచరాచర సృష్టికి మూలకారకుడు కూడా వున్నాడు.
    ఇక్కడ Science పరముగా ఒక మాట చెప్పుకోనవలస్డినది వున్నది. మన గుండెలో sinoatrial node అనే ఒక స్థానం ఉంది, దానినుండి ఒక విద్యుత్తరంగము లాంటిది వెలువడి గుండెను పని చేయిస్తూ వుంది. దీనికి కొంత దూరంలో atrioventricular node  ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే గుండె పని చేస్తుంది. ఈ sinoatrial node  నుండి  విడుదలయ్యే విద్యుత్తు ఏవిధముగా పుడుతుంది అన్నది మన Scientists కు ఇంకా తెలిసిరాలేదు. , దీనినే pacemaker అని చెబుతున్నారు మన Scientists. గుండెను పని చేయించేది ఇదే. మన వేదములోని మంత్రపుష్పము దీని లోని ఆ అత్యంత పరమాణు రూపమునే పరమాత్మ అంటూ వుంది.
చివరిగా, చదివిన వారికి వచ్చే చిన్నదయినా అతి పెద్ద సందేహమును నాకు తెలిసిన రీతిలో తీర్చి నా వ్యాసమునకు భారత వాక్యము పలుకుతాను. ఆ వెలుగు మనకు కనబడుట లేదే? కనబడదా? ఎందుకు కనబడదు. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అన్న వేటూరి వారి మాట మీకు తెలిసినదే కదా! ఆ వెలుగును చూడగలిగిన వారే ఋషులయినారు. మరి మనమో, లోపల తళుక్కుమన్నపుడల్లా సంసారమో, పిల్లలో, అందమయిన అమ్మయిలనో/అబ్బాయిలనో సినిమాలనో, షికార్లనో చూసుకొంటూ ఇంకా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము.
ఇకనైనస మేలుకొని, మెలుకువలో కళ్ళు మూసుకొని అంతర్ముఖులమై అనుదినమూ ధ్యానించితే పరమాత్ముని మనలోనే సందర్శించగలము. దానికి అంతః శుద్ధి, బాహ్యశుద్ధి, త్రికరణ శుద్ధి తోడయితే అసలు మనమే పరమాత్మ స్వరూపులమని తెలుసుకొనగలుగుతాము.

స్వస్తి.

Saturday, 19 August 2017

శ్రేయాంసి బహు విఘ్నాని

శ్రేయాంసి బహు విఘ్నాని

'ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ' అన్నది భర్తృహరి సుభాషితము. నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే  యెంతో బాధ కలుగుతుంది. ఇది ఏ విధముగా ఉన్నదంటే 'అమ్మ పెట్టదు అడుక్కొనీ తిననివ్వదు' అన్నట్లుంది. శిశు ప్రసవము జరుగుటకు ఒక అరగంట లేక గంట పట్టినా ఆ తల్లి తొమ్మిది మాసములు ఆ శిశువును ఎంతో జాగ్రత్తగా కడుపులో పెట్టుకొని చూసుకొంటుంది. వ్యాస వాల్మీకులు ఇరువురూ 'క్షమయా నిష్ఠితాం జగత్ ' అన్నారు. అదీ కాక
 ' శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి
   అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాంతి వినాయకాః'
లోక శ్రేయస్సు కొరకు పాటుపడే మహనీయులకు విఘ్నాలు కొల్లలు. అదే హీనకార్యనులను ఆచరించే వారికి విఘ్నాలు కూడా విపరీతమైన దూరములో ఉండును, అన్నది ఆర్య వాక్కు. మరి పైన చెప్పిన విషయములలో ఒకదానిని గూర్చియైనా మన ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఆలోచిస్తున్నారా! ప్రభుత్వము చెడుగు మాత్రమె చేయుటకు ఏమయినా కంకణము కట్టుకోన్నదా! ఇపుడుప్రభుత్వము చేపట్టిన ఈ 'విముద్రీకరణ (demonetisation)' ప్రక్రియను తీసుకొందాము.నోట్ల మార్పిడి లో కష్టాలు లేవని కాదు, ఎవరికైనా కష్టం వస్తే స్వాంతన పలుకవలసినప్రసార మాధ్యమాలు మానవ సహజమైన వైఫల్యములను ప్రత్యేకముగా ఎత్తి చూపుతూ ప్రభుత్వమును విమర్శించుట అత్యంత బాధాకరమైన విషయము.,  ప్రభుత్వమూ యొక్క నోట్ల మార్పిడి విషయములో ప్రసార మాధ్యమాలు అనుసరిస్తున్న విధానము ఎంత దుఃఖదాయకమైన విషయమొ గమనించండి.

1. రెండున్నర లక్షల వరకూ యెవరైనా బాంక్ లో జమ చేసుకోవచ్చు అన్న విషయమును ప్రజా బాహుళ్యమునందు ఎంతయినా ప్రచారము చేయవచ్చును కదా!
 2. పొలం అమ్మిన డబ్బులు బాంక్ లో వేసుకోవచ్చు. మహా అయితే కొంత టాక్స్ కట్టాలి అంతే కానీ చింత పడ నవసరము లేదని చెప్పకుండా, పదే పదే కష్టాలు మాత్రమే చూపినందుకు, అవునేమో అని నమ్మి 52 లక్షలు ఉన్న ఒక మహిళ ఆత్మ హత్య చేసుకొంది. ఈ ఉదంతము జరిగిన పిదపనైనా ప్రసార మాధ్యమములవారు ఒక్కసారయినా ఆత్మా విమర్శ చేసుకొన్న దాఖలాలు కనిపిస్తున్నాయా?
3. 73 సంవత్సరాల వృద్ధుడుపంక్తి(Que) లో నిలబడలేక చనిపోయినాడని చెప్పే మీడియా అక్కడ క్యూ లో ఉన్న వారు ఆ వృద్దుని ముందుగా పంపియుంటే ఈ ఘోరము జరిగియుండేదికాదు, అని తెలియజేయగాలిగినారా!  మరి మన పాత్రికేయులు, దూర శ్రావని, దూర దర్శిని మాధ్యమాలలో ఆ సంస్కారం  లేకపోయింది కదా! ఇది తమ పొరబాటుగా, పొరపాటుననైనా తలచినారా?
4. ఈ వాస్తవాన్ని ఒకపరి గమనించండి. జపాన్ లో సునామీ వచ్చినపుడు, వచ్చిన రోజుమొదలు పరిస్థితి చక్కబడే వరకు, అచటి  ప్రతి వ్యాపారస్తుడు తాము విక్రయములను తగ్గింపు ధరలకు వస్తువులనమ్మి  ప్రజలకు సేవ చేసిన విషయం ప్రసారం చేసి ఉంటే కనీసం కొంత మంది అయినా ప్రభావితం అయ్యే వారు కాదా! మన వ్యాపారులు తమ లాభములలో కొంత తగ్గించుకొని అమ్మితే దేశమునకు , ప్రజలకు సేవచేసినట్లగునని ఎందుకు తెలియజేయ కూడదు?
5. సునామీ నుండీ జపాన్ తేరుకొనుటకు 10 రోజులు పట్టినా, ప్రభుత్వ కార్య నిర్వాహకులు, ఎవరి వస్తువులు వారికిచ్చినారు. అందుకే కదా అది చిన్న దేశం అయినా ప్రపంచంలో అంతా గౌరవంగా బ్రతుకుతోంది. మరి ఈ విషయమును ప్రసారం చేసి ఉంటే బాగుండేది కాదా!
6.అమెరికాలో జంట టవర్లు కూలిపోయినపుడు,ప్రతిపక్ష పార్టీ లు గాని ప్రజలు కాని ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు.మీడియా కూడా తప్పుడు వార్తలు వ్రాయకపోగా, ప్రజలకు ధైర్యము కలిగించే వార్తలు మాత్రమే వ్రాసినారు. ఆవిధముగా చేయుటచే అమెరికా తన పెద్దరికము 
మన దేశము లో మీడియా చేస్తున్న మేలు కన్నా కీడు యెక్కువగా ఉంది.
యెక్కువగా మీడియా ప్రసారాలు చూస్తే అసలు దేశములో జీవించే అవకాశం లేదేమో అనే అనుమానం మనకే కలుగుతుంది.
ఈ మీడియాకు  సరి అయిన దిశానిర్దేశం యెప్పుడు యే కోర్టు ఇస్తుందో అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఒక్క సారి మన వీర సైనికులు పడుతున్న కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మూడు నాలుగు గంటల క్యూలో కరెన్సీ  మార్చుకునే కష్టం యెంత.
నల్ల ధనం తో టెర్రరిస్ట్లు పేట్రేగిపోతుంటే 70 సంవత్సరాలు ఈఁ దేశాన్ని అస్థిరపరిచే  నల్ల కుబేరుల భరతం పట్టే దమ్మున్న నాయకుడు మన ప్రధాన మంత్రి అని గర్వపడే ప్రతి పౌరులకు నమస్సులు.
మీడియా యెంతగా   ప్రయత్నించినా క కా పార్టీ లు యెన్ని తప్పుడు కూతలు కూసినా కొన్ని రోజులు చిన్న చిన్న కష్టాలు ఉన్నా ఇప్పటికైనా ఒక గొప్ప నాయకుడు మన దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మేమూ సహకరిద్దాము   అని మీడియా మైకుకు చెప్పిన హీరోల్లారా జోహార్ జోహార్.
అసలు ఇంట్లో 100, 50, 10 నోట్లే లేనట్లు ప్రతి పేదవాడు కేవలము 500 లేదా 1000 నోట్లు మాత్రమే ఉన్నట్లుగా చూపిన ఓ మీడియా ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకో.
సారీ మీకు రేటింగ్స్  పెంచుకోవడం తప్ప మరేమీ అవసరం లేదనుకోండి.
దేశం యేమైనా మా చానల్ రేటింగ్ మాకు చాలు అనే కుటిల మీడియా కారణముగా మీడియా పై నమ్మకం పోగొట్టే అవకాశం ఉంది.
యెప్పుడూ నిరాశా నిస్పృహ వార్తలే కాకుండా మంచి వార్తలు ప్రసారం చేసి పుణ్యం తెచ్చుకోండి
"సత్యం వధ ధర్మం చెర "
శ్రీ రావు గారి సౌజన్యముతో ........

Friday, 11 August 2017

భారత దేశము వక్రీకరింపబడిన చరిత్ర

భారత దేశము వక్రీకరింపబడిన చరిత్ర
అది 1971వ సంవత్సరం. ఇందిరాగాంధీ దేశ మొదటి మహిళా ప్రధాని కావడం కోసం వామపక్షాల మధ్దతుకై ప్రయత్నాలు చేస్తోంది. మొదటినుండి దేశ వ్యతిరేక భావాలుగల వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి. వెంటనే వారు మధ్దతు కు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు. అదేంటంటే కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని..... సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో కన్హయ్య కుమార్ లాంటి దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడినాయి.
ఒప్పందం ప్రకారం 1972లో ప్రముఖ మత ఛాందసవాది డా. నూరుల్ హస్సన్ కు కేంద్ర విద్యా శాఖ ఇవ్వబడింది. అప్ప్పటికే "క్లేమెంట్అట్లీ" వల్ల విద్యావ్యవస్థ లో సగం చచ్చిన దేశ ఇతిహాసాన్ని మంత్రి హాసన్ పూర్తిగా నాశనం చేయడం మొదలెట్టాడు.
అప్పటిదాకా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే శివాజీ లాంటి దేశభక్తుల పాఠాలకు బదులుగా దేశంపై దండెత్తి దోపిడీలు చేసిన ఘజనీ మొహమ్మద్ లాంటి దొంగల చరిత్రను సిలబస్ లో ప్రవేశ పెట్టినారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక పుస్తకాల్లో రామాయణ, భారతాలను ఓ కట్టు కథగా కూడా సిలబస్ లో చెప్పారంటే మీరే అంచనా వేయండి.
ప్రపంచంలోని సైన్స్ ను తనలో ఇముడ్చుకున్న వేదవిద్యను పూర్తిగా తీసివేసినారు. మత పిచ్చి సుల్తాన్ ఔరంగజేబ్ పరమతస్థుల పై సాగించిన అకృత్యాలను, నర మేధాన్ని, పాఠాల నుండి తొలగించినారు. అసహనంతో ఆతను కూల్చిన వేలాది హైందవ మందిరాల వివరాల్ని దశలవారీగా తుడిచి పెట్టి అతన్ని ఒక సౌమ్యుడిగా చిత్రీకరించారు. దక్షిణాన టిప్పు సుల్తాన్ అనబడే నరహంతకుడు హైందవుల నెత్తుటితో పారించిన ఏరులను, చెరబట్టిన రాజ స్త్రీలను చరిత్రపుటల్లో మాయం చేశారు. అనేకమంది రాజస్థాని కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న పరమత ద్వేషి అక్బర్ ను ఒక కథానాయకుడిగా (జోధా-అక్బర్) చూపించారు. లేని ప్రేమ కథను సృష్టించి, దాన్ని సలీం కు ఆపాదించి తేజోమహాలయమనే శైవ క్షేత్రాన్ని తాజ్ మహల్ గా విద్యార్థి దశనుండే జనాల్ని పూర్తిగా నమ్మించారు. RSS నేత గాడ్సే, గాంధీ ని చంపిన కథను ప్రవేశపెట్టిన అదే సిలబస్ నుండి ఔరంగజేబ్ చేతిలో సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ పాశవిక హత్యోదంతాన్ని తొలగించినారు. వీర్ సావర్కర్ లాంటి వీరుల చరిత్రను వక్రీకరించి అవమానించినారు. NRIల సహకారంతో బ్రిటిష్ వారిని గద్దె దింపిన నేతాజీ ని కాదని ఎవరెవరినో స్వాతంత్ర్యానికి కారకులుగా అభివర్ణించినారు.
మన దేశంపై బడి దోచుకుని, ఈ దేశ స్త్రీలను చెరబట్టిన మొఘలులను హీరోలుగా అభివర్ణించినారు. వారి ఏడో భార్య, ఎనిమిదో ఉంపుడుగత్తెల చరిత్ర ని చదవాల్సిన దుస్థితిని మన పిల్లలకు కల్పించారు. ఇక ఇలాంటి చరిత్రలు చదివితే అఫ్జల్ గురు, కసబ్ లను కీర్తించే కన్నయ్య కుమార్ మరియు వేముల రోహిత్ వంటి దేశ ద్రోహులే పుడతారు కాని ఛత్రపతి శివాజీ లెక్కడయినా పుడతారా?
ఒక్కమాటలో చెప్పాలంటే దేశ వ్యతిరేక విధానాన్ని దగ్గరుండి అమలు చేశాయి గత "ఖాన్-గ్రెస్" ప్రభుత్వాలు.
ఈనాటికీ బోర్డ్ లో కాంగ్రెస్ హయాంలో నియమింపబడ్డ ఈ రచయితలే మన పిల్లల పాఠ్య పుస్తకాలు రచించుచుండుట మన దురదృష్టకరం. ఈ తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడైనా జరగాలి. మరింత నష్టం వాటిల్లకముందే ఈ లోపాయకారి విద్యావ్యవస్థను కూకటివేళ్ళతో సహా పెకలించి వేయాలి. మోది గారి ప్రభుత్వం దీన్ని పునర్వ్యవస్థీకరించి, మన భావి తరాల్లో విదేశీభక్తులు పుట్టకుండా చూడాలి.
నెహ్రూవియన్ సామ్యవాదులు, కమ్యూనిస్టులు...లెఫ్ట్ చరిత్రకారుల సహకారంతో పరస్పర సమన్వయంతో పనిచేసి మధ్య, ఆధునిక యుగ భారత చరిత్రను పూర్తిగా వక్రీకరించి, ఎవ్వరికీ సంబంధం లేనిదిగా తయారు చేసినారన్నదానీలో రహస్యమేమీ లేదు. ఒక గొప్ప హీరో, నిష్కళంక దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన సుభాష్ చంద్రబోస్‌పై... దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గూఢచర్యం కొనసాగించాడన్న విస్పష్టమైన, వివాద రహిత సమాచారం బయటకు పొక్కడంతో, అంతటి గొప్ప మనీషిపై ఒక పద్ధతి ప్రకారం కొనసాగించిన తప్పుడు ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారన్న తప్పుడు సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేశారు. 


విమాన ప్రమాదం చోటు చేసుకోలేదని తైవాన్ ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినా, రెండు మూడు కమిషన్లు విమాన ప్రమాదం సత్యదూరమని నిగ్గు తేల్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు! పశ్చిమ బెంగాల్‌ను మూడు దశాబ్దాల పాటు పాలించిన కమ్యూనిస్టులు, నేతాజీ విషయంలో అసలు నిజాన్ని వెలుగులోకి రాకుండా తొక్కిపట్టడానికి కారణం, సుభాష్‌ను ఖైదు చేసి హత్య చేయించింది స్టాలిన్ కావడం వల్లనే!

అర్యులు విదేశీయులని, వీరు మనదేశం పైకి దురాక్రమణకు పాల్పడ్డారన్న దగ్గరినుంచి చరిత్ర వక్రీకరణ ప్రారంభమైంది. వలసవాదులు తమ స్వప్రయోజనాలకోసం సైద్ధాంతీకరించిన అంశాలనే, హిందూ వ్యతిరేక చరిత్రకారులు, కమ్యూనిస్టులు దౌర్జన్యంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా హిందూ జాతీయ వాదులను నిందిస్తూ.. మీరు కూడా మొఘల్స్, ఐరోపా వలస వాదుల మాదిరిగానే దురాక్రమణ దారులుఅంటూ యెగతాళి చేశారు. ఇదంతా చాలా జాగ్రత్తగా అల్లిన కట్టు కథ అని ఎటువంటి అనుమానం లేకుండా రూఢి అయింది.

అసలు ఆర్యుల దురాక్రమణ జరిగిందా? ఇందుకు స్టీఫెన్ నాప్ అనే మేధావి రాసిన పుస్తకాలను చదివితే తెలుస్తుంది. ఆయన ఆధ్యాత్మికత, వైదిక సంస్కృతి, తూర్పు తత్వశాస్త్రాలపై అనేక పుస్తకాలు రాశాడు. ఆయన ఈవిధంగా పేర్కొన్నాడు‘‘ఆర్యులు భారత్‌పై దురాక్రమణ జరిపినారన్నది కేవలం కుట్ర మాత్రమే. 1866, ఏప్రిల్ 10న లండన్‌లో జరిగిన రాయల్ ఆసియాటిక్ సొసైటీ రహస్య సమావేశంలో కావాలనే ఈ తప్పుడు చరిత్రను సిద్ధాంతీకరించాలని నిర్ణయించారు. ఆర్యులు కూడా విదేశీ దురాక్రమణ దారులేనన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తే, ఇంగ్లీషువారు విదేశీయులని ఏ భారతీయుడు చెప్పడానికి వీలుండదు. భారత్ మొదట్నుంచీ విదేశీయుల పాలనలోనే కొనసాగిందన్న ప్రచారం చేయడం వల్ల, దయాళువులైన క్రైస్తవుల పాలనలో దేశం బానిసగా మిగిలిపోవాలి. ఈ రాజకీయ నిర్ణయాన్ని, సిద్ధాంతాన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో అమలు జరిపినారు.’’ 


బాగానే ఉంది కానీ 2004 నుంచి పదేళ్ల పాటు దేశం మళ్లీ క్రైస్తవ పాలన కిందికి వెళ్లడం పురాకృతం తప్ప మరోటి కాదు!

పరమత విద్వేషులైన ఇస్లాం చొరబాటుదార్లు కత్తులు చేతబూని తమను నానా హింసల పాల్జేసిన చరిత్రను హిందువుల స్మృతిపథం నుంచి తొలగించడానికి యత్నిస్తున్న భారత మేధావులను కోయిన్‌రాడ్ ఎల్‌స్ట్ తన పుస్తకం నెగాషియనిజం ఇన్ ఇండియాలో దుయ్యబట్టాడు. హిందూ ముస్లింల మధ్య సంఘర్షణ కొనసాగిందన్న అంశాన్ని చాలామంది భారతీయ చరిత్రకారులు, జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు తీవ్రంగా ఖండిస్తారు,’ అని కూడా ఆయన పేర్కొన్నారు. గంగా-యమునా మైదానం ముఖ్యంగా ఈ దొంగల, దోపిడీదార్ల దురాక్రమణకు గురైంది.

మనదేశానికి చెందిన కమ్యూనిస్టులు, ఉదారవాదులు ఈ తిరస్కారాన్ని కేవలం హిందువులను ఎగతాళి చేయడానికి చాలా అలవోకగా వాడారు. కమ్యూనిస్టులు భారత్ లేదా దేశ ప్రజలకు ఎన్నడూ విధేయులుగా ఉండలేదు. వీరిపై బహుళ ప్రాచుర్యం పొందిన ఒక సామెత ఉండనే ఉంది. ‘‘రష్యాలో వానలు పడితే భారత కమ్యూనిస్టులు గొడుగులు తెరుస్తారు’’ అన్నదే ఆ సామెత. అటువంటి కమ్యూనిజం ప్రపంచంలోని చాలా దేశాల్లో కుప్పకూలిపోయింది. ఇప్పటి వరకు కమ్యూనిజాన్ని నెత్తిన మోసిన చైనా దాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం భారత కమ్యూనిస్టులు, ‘అంతరించి పోయే జాతి’! మరి కమ్యూనిజాన్ని పునరుద్ధరించాలన్న ఆశతో ఉన్న వీరు చైనా విషయంలో నోరు మెదపరు!

దాన్నట్లా ఉంచుదాం. చరిత్ర వక్రీకరణ అంశానికి మళ్లీ వద్దాం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చెప్పే మరో సిద్ధాంతం ఏమంటే.. ముస్లిం పాలకులు ఎన్నడూ హిందూ దేవాలయాలను కూలగొట్టలేదని. కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని ధ్వంసం చేసింది ఔరంగజేబు కాదని, కేవలం హిందువులు మాత్రమే అంతర్గత కలహాలతో దాన్ని ధ్వంసం చేశారంటూ ఈ జోకర్లేచెబుతారు. సీతారామ గోయెల్ రాసిన హిందూ టెంపుల్స్-వాట్ హాపెన్డ్ టు దెమ్పుస్తకంలో ఈ విధంగా రాశారు. ‘‘1985, అక్టోబర్ 21న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన లేఖలో, మధురలోని కేశవానంద దేవాలయాన్ని ధ్వంసం చేసి ఈద్గా మైదానాన్ని రూపొందించిన ఔరంగజేబును సమర్ధిస్తూ పన్నెండు మంది మార్క్సిస్టు ప్రొఫెసర్లు ర్యాలీ నిర్వహించినారు. ఈ మార్క్సిస్టు ప్రొఫెసర్లు ఒక రాజకీయ కారణాన్ని కనిపెట్టినారు. హిందూ దేవాలయాలు రాజకీయ కుట్రలకు కేంద్రాలుగా మిగిలాయి. అందువల్ల సుల్తానులు తప్పని సరిగా వీరిని అణచివేయాల్సి వచ్చింది. ఈ విధానంలో తప్పనిసరి పరిస్థితుల్లో హిందూ దేవాలయాలు ధ్వంసమైతే వారిని తప్పు పట్టలేం. ఈ సుల్తానులు ప్రజల సుఖ శాంతుల కోసం ఎంతగానో కృషి చేసినారు.

తప్పుడు సమాచారం ఇవ్వడం, కల్లబొల్లి కబుర్లు చెప్పడంలో కమ్యూనిస్టులకు మించిన వారు లేరు. 


విమాన ప్రమాదసిద్ధాంతాన్ని ప్రచారం చేయడం ద్వారా నేతాజీని భారత్‌కు ఆవలే ఉంచడంలో కమ్యూనిస్టులు నెహ్రూలోని పదవీ లాలస, ఈర్ష్యను బయటపడకుండా ఉంచేందుకు ఎంతో సహాయం చేశారు. 


మైసూర్ నిరంకుశ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను తీసుకోండి. మలబార్ ప్రాంతానికి చెందిన దాదాపు లక్షమంది హిందువులను, 70వేల మంది క్రైస్తవులను జైళ్లలో పెట్టి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. వందల మంది నాయర్ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలను శ్రీరంగపట్టణానికి అపహరించుకొని రావడమో, డచ్ వారికి బానిసలుగా అమ్మేయడమో చేసినాడు. పాల్‌ఘాట్ కోటను పట్టుకున్న తర్వాత, అమాయక హిందూ బ్రాహ్మణుల తలలను కోటలో వేళాడదీసి హిందువుల్లో భయోత్పాతాన్ని సృష్టించినాడు. టిప్పు ఒక మత ఛాందస వాది. అతని సమాధిమీద ‘‘హైదరీ సుల్తాన్ మత విశ్వాసం కోసం మరణించాడు’’ అని చెక్కి వుంది. మరి మన కమ్యూనిస్టులకు అతనొక స్వాతంత్య్ర సమరయోధుడు! స్వాతంత్య్ర సమరయోధుడనేవాడు, తన స్వదేశానికి చెందిన ఇతర మతస్తులను సమూలంగా నాశనం చేస్తాడా? మత మార్పిడులకు పాల్పడతాడా? మలబార్ ప్రాంతంలోని నిస్సహాయులైన హిందువులపై అతను జరిపిన దాష్టీకాలను ఎవ్వరూ ఎన్నటికీ మరువలేరు. శ్రీరంగపట్టణం సమీపంలోని మెల్కొటెకు చెందిన ప్రజలు నేడు కూడా దీపావళి పండుగను జరుపుకోరు. ఈ దేవాలయ పట్టణంలో అదే రోజున ఎంతోమంది బ్రాహ్మణులను టిప్పు సుల్తాన్ దారుణంగా హతమార్చినాడు. 


కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూరదర్శన్ టిప్పు స్వోర్డ్పేరిట ఒక సీరియల్‌ను ప్రసారం చేసింది. అందులో టిప్పు సుల్తాన్‌పై పొగడ్తల వర్షమే ఉంటుంది. తనను తాను ఒక ఉదారవాదిగా చెప్పుకునే ఒక కన్నడ నటుడు ఈ విగ్రహ విధ్వంసకుడికోసం ఎప్పడూ గొంతెత్తుతూనే ఉంటాడు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల వ్యవహారశైలి ఈవిధంగా ఉన్నప్పుడు నిజమైన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ గురించిన అసలు వాస్తవాలను మరుగు పరచడం పెద్ద ఆశ్చర్యకరం కాదు.

అసలు దేశంలో వంశపారంపర్య పాలనకు బీజం వేసినవాడు మోతీలాల్ నెహ్రూ అన్న సంగతి మీకు తెలుసా? మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నెహ్రూ కుటుంబానికి అంతటి అత్యున్నత స్థాయి కల్పించారు. అందువల్ల వారి అసలు రంగు ఎవ్వరికీ తెలియదు. 1928, జూలై నెలలో నాయకత్వం విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, మోతీలాల్ నెహ్రూ... గాంధీకి ఒక లేఖ రాశారు. పార్టీని జవహర్లాంటి యువకుల చేతిలో పెట్టాలన్నది ఆ లేఖ సారాంశం. అధ్యక్ష పదవికి సర్దార్ పటేల్ సరైన వాడన్న ఉద్దేశం పార్టీ వర్గాల్లో సుస్థిరంగా నాటుకొని ఉన్నప్పటికీ, మరుసటి సంవత్సరం నెహ్రూ పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. అంటేవంశపారంపర్యత అనేది నెహ్రూ కుటుంబ సభ్యుల జన్యువుల్లోనే ఉంది. అందువల్ల రాహుల్ గాంధీకి ప్రోత్సాహమిస్తున్న సోనియాను తప్పు పట్టడంలో అర్థం లేదు. ఆమె కేవలం తన మామగారి తండ్రిని అనుసరిస్తున్నదంతే! కానీ మన ఉదారవాదులను ప్రశ్నించండి నెహ్రూ ఆయన కుటుంబ సభ్యులను ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటూ ఊదర కొట్టేస్తారు.

ఇక ఛత్రపతి శివాజీని కూడా ఈ సూడో చరిత్రకారులు వదల్లేదు. ఒక చిన్న పాటి దోపిడీ దారుగా మాత్రమే చిత్రించారు. మరి వీరంతా, అరబిందో, రామకృష్ణ, వివేకానంద లేదా రవీంద్రనాథ్ ఠాగూర్‌లను అంగీకరిస్తారావీరసావర్కర్ హిందూత్వ భావనను వ్యక్తంచేసినందుకు ఆయన్ను ఎగతాళి చేశారు. తన జీవితకాలమంతా దేశం కోసమే త్యాగం చేసిన అతనికి సమానమైన త్యాగమూర్తి కాంగ్రెస్‌లో ఎవరైనా ఉన్నారా? బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలు వీరి దృష్టిలో దేశభక్తులు కారు! వారంతా నిజమైన దేశభక్తులు కావడం, హిందూ జాతీయ వాదానికి పూర్తిగా మద్దతు తెలపడమే అందుకు కారణం. ఈ సందర్భంగా వారు తమ కుటుంబాలను గురించి పట్టించుకోలేదు కూడ. అదే కమ్యూనిస్టులకు మాత్రం చైనా మరియు రష్యాలంటే ఎంతో మక్కువ. నెహ్రూ మాత్రమే కమ్యూనిస్టులతోను, లార్డ్ వౌంట్ బాటన్‌తోను సన్నిహితంగా మెలిగారు. తద్వారా తనలోని చీకటికోణాన్ని బయటపడకుండా జాగ్రత్తవహించి చరిత్రను వికృతం చేశారు. ఇప్పుడు సమర్ధించరాని వ్యక్తిని ఎవరు సమర్ధిస్తున్నారు? కేవలం చరిత్ర కారుల ముసుగు కప్పుకున్న వామపక్షాల వారు మాత్రమే!!


Monday, 7 August 2017

పురుష ధర్మములు

పురుష ధర్మములు

పురుష ధర్మములను గమనించండి . మనకూ బాధ్యతలు వున్నాయని తెలుసుకొందాం .పాటించుదాం పదిమందికీ పంచుదాం.

పురుష ధర్మమును కూడా బోధించింది  శాస్త్రము. ఎందుచేతో ఈ శ్లోకము జన బాహుళ్యానికి చేర లేదు.

           కార్యేషు యోగీ, కరణేషు దక్షః

          రూపేచ కృష్ణః క్షమయా తు రామః

         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం

         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

--> కార్యేషు యోగీ :
పనులు చేయుటలో  యోగి వలె, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి
--> కరణేషు దక్షః
 , కార్యనిర్వహణలో దక్షత అంటే నాయకత్వ లక్షణము,  సమర్ధత కలిగి యుండవలెను.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె అందగాడై వుండాలి.

--> క్షమయా తు రామః.
ఓర్పులో రామునిలాగా ఉండాలి. క్షమ అన్న సంస్కృత పదమునకు అసలయిన అర్థము ఆంగ్లములో tolerance, తెలుగులో 'సహనము'. ఏదయినా తప్పు చేసి క్షమించండి అనింటే సహించండి అని అర్థము.
--> భోజ్యేషు తృప్తః
 వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
 సుఖదుఃఖాలలో, మంచి చెడ్డలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండి, పాలు పంచుకోవాలి.
ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా కొనియాడబడతాడు.

  

Saturday, 5 August 2017

స్నేహితము, మైత్రి -- మైత్రీ దివసము, సహవాసమునకు రామానుజన్ నిర్వచనము


స్నేహితము,  మైత్రి -- మైత్రీ దివసము  

సహవాసమునకు రామానుజన్ నిర్వచనము

https://cherukuramamohanrao.blogspot.com/2017/08/happy-friendship-day.html

ఆస్యగ్రంధిలోఅందరూ ఒకరినొకరు ఎక్కువగా Friend (మిత్రమా), Dear Friend అంటూ సంబోధిస్తూవుంటారు. కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. నచ్చని వారిలో నేనూ ఒకడిని. పరిచయము అన్నది స్నేహితము కాజాలదు. అట్లు ఆపరిచయము స్నేహితముగా మారుటకు కొంతకాలము పడుతుంది, అదీ ఇరువురి నడుమ భావసారూప్యము ఏర్పడితేనే! ఈ విషయము దవండి.

సహవాసమునకు రామానుజన్ గారి నిర్వచనము శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ అన్నది రామానుజం గారి పూర్తి పేరు. ఈయన డిసెంబర్ 22, 1887 న జన్మించి ఏప్రిల్ 26, 1920 న పరమపదించినారు.  20 శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఈయన ఒకరు. అతి పిన్న వయసులో పరమపదించుట ఈదేశమునకు కలిగిన దురదృష్టము.

ఈయనకు పది సంవత్సరముల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధము ఏర్పడినది. బాల్యముననే  గణితము పట్ల ఆయనకు  ప్రకృతి సిద్ధమైన ఇష్టము గణితములో ఎదో చేయవలెనన్నది ఆయన అభీష్టము. బాల్యముననే తన సొంతంగా సిద్ధాంతములను  రూపొందించ ప్రారంభించిన బాల మేధావి ఇతడు. ఈయన  ఎన్నో గణిత సిద్ధాంతములను (Hypothesis)  ప్రతిపాదించుట జరిగినది. అవన్నీ తిరుచిరాపల్లి దగ్గరవున్న నామక్కల్ అన్న ఊరిలోని నరసింహస్వామి దేయాలయములోని, స్వామివారి అర్దాంగియైన నామగిరి అమ్మవారు ఆయనకు కలలో కనిపించి ఏవేవో ఆయన మనోఫలకముపై వ్రాస్తే నిదుర లేచిన పిమ్మట ఆయన చిత్తుకాగితములలో వానిని వ్రాసిభద్రపరచేవాడట.  ఈ నామగిరి దేవి ఆయన కలలో కనిపించి ఇంగ్లాండ్ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చుట చేతనే ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ హార్డీ గారి పిలుపు మేరకు వెళ్ళినట్లు చెబుతారు. ఒకసారి ఒక జిజ్ఞాసువు ఆయన స్నేహితులను గూర్చి తెలుసుకొన దలచి మీకు ఎవరెవరు స్నేహితులు అని అడిగినాడట. అందుకు ఆయన నాకుతగిన స్నేహితుడు ఇంతవరకూ దొరకలేదన్నాడట. అందుకు అతను " మీ ఉద్దేశ్యములో సహవాసము ఏ విధముగా ఉండవలెనని కోరుకొంటారు" అని అడిగినాడట. రామానుజన్ గారు అందుకు ఈ విధముగా జవాబు చెప్పినారు "వారు 220, 284 సంఖ్యల్లాగా వుండాల"ని.

అడిగిన వ్యక్తికి అది అర్థము గాక విశధపరుచుమని అడిగినాడట. అందుకు రామానుజన్ గారు ఈ విధముగా విశధపరచినారు:

"220 కి కారణాంకాలను (Factors) వ్రాస్తే అవి 1,2,4,5,10,11,20,22,44,55,110,220.

అదేవిధంగా 284 కు వ్రాస్తే అవి 1,2,4,71,142,284.

ఇప్పుడు మనము ఏ సంఖ్యలను అనగా 22౦ మరియు 284 ను మనము గ్రహించినామో

అవి పై పట్టికలలో తొలగించితే మనకు, 1,2,4,5,10,11,20,22,44,55,110 మరియు 1, 2,4,71,142 మిగులుతాయి. ఇప్పుడు ఆ శ్రేఢులను విడివిడిగా కూడితే ఎంతవస్తుందో చూస్తాము.

1+2+4+5+10+11+20+22+44+55+110 = 284

1+2+4+71+142 = 220

అంటే ఒకరిలో ఒకరు మమేకమై వుండిపోయేటంతగా మనసులు కలిస్తేనే సహవాసము.

ఎంత గొప్ప మాటనో చూడండి. అంతేగానీ ఆస్యగ్రంధిలో ‘Dear Friend’ 'మిత్రమా' సంబోధనలు నిరర్థకములు.

'Happy Friendship Day'

అని అంటూ శుభాకాంక్షా సందేశములు ఎక్కువగారావటము Friendship Day రోజు ఎక్కువగా జరుగుతూవుంటుంది కదా! దానికి సంబంధించి నేను ఈ నాలుగు మాటలు వ్రాయవలసి వచ్చింది. మిత్రత అమిత్రత అన్నవి ఎటువంటివంటే:

దూరస్తోపి సమీపస్తో యోవై మనసి వర్తతే l

యోవై చిత్తేపి దూరస్తో సమీపస్తోపి దూరతః ll

నిజమైన స్నేహితుడు ఎల్లలు దాటినా ఎల్లపుడూ మన మనసులోనే ఉంటాడు. అట్లు

కానివాడు పక్కనే వున్నా పరాయివాడే!

ఈ మాట గమనించండి:

దూరీ కరోతి దురితమ్ విమలీ కరోతి

చేతశ్చిరన్తనమఘం చులికీ కరోతి l  

భూతేషు కిన్చ కరుణాం బహులీ కరోతి

సత్సంగతిః క‍థయ కిం న కరోతి ll

లోకే సర్వేషాః స్నేహితాః భవంతి ఏవ కింతు సర్వేపి ఉత్తమాః న భవంతి l

తథా అపి ఉత్తమానాం ఏవ సహవాసః కరణీయః ఇతి వదన్ సుభాషితకారః ll

నిర్దుష్ట కారణాని వదతి సజ్జనానామ్ సహవాసేన  దోషాః గఛంతి |

 

మనః శుద్ధం భవతి | అన్యేషాం జంతూనాం ఉపరి ప్రీతిః భవతి |

 

సజ్జనానాం సహవాసః అస్తిచేత్ కిం కిం వయం నప్రాప్నుమః | అర్థాత్ సజ్జనానాం సహవాసేన వయం సర్వం ప్రాప్నుం శక్నుమః l కంలో అందరికీ స్నేహితులు ఉంటారు.  కానీ వాళ్లందరూ మంచివారే అయి వుండనవసరము లేదు కదా! కానీ మన ప్రయత్నము మాత్రము సత్సాంగత్యము కొరకే . మంచి స్నేహితం మనలోని దోషాలను తొలగిస్తుంది. పాలూ చక్కర కలిస్తేనే కదా Decoction కు సార్థకత. సుజన మైత్రి మనసులను నిర్మలముగా వుంచుతుంది.  సాటి ప్రాణికోటి పైన ప్రేమ దయ కలిగింప జేస్తుంది. సత్సాంగత్యముతో సాధింపలేనిది ఏమీ ఉండదు. కావున మంచి స్నేహితుని ఎన్నుకొందాము. అసలు మన నీతి శాస్త్రము ఎంత మంచిమాట చేబుతూవుందో చూడండి.

శీలం శౌర్యమనాలస్యం పాండిత్యం మిత్ర సంగ్రహః l

అచోరహరణీయాని పఞ్చైతాన్యక్షయో నిధిః ll

శీలము, శూరత్వము,  పాండిత్యము,పని చేయుటలో అలసత్వము లేకపోవుట, సన్మిత్ర సంపాదన, ఈ ఐదూ దొంగలించ బడలేనివి.

మంచి గ్రంథాలు చదవడం, మంచి మనుషులను కలిసి మాట్లాడటం, మంచి వ్యక్తులతో స్నేహం చేయడం చాలా ముఖ్యం. దీన్నే

సత్సాంగత్యం అంటారు. దాని ప్రాధాన్యాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి ఇలా చెబుతున్నాడు...

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు

గౌరవమొసంగు, జనులకు కలుషమడచు

కీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి జేయు

సాధుసంగంబు సకలార్థ సాధనంబు

సత్సాంగత్యము అనేది మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. బుద్ధికుండే జడత్వాన్ని పోగొట్టి చైతన్యవంతుల్ని చేస్తుంది. లోకంలో గౌరవాన్ని కలిగిస్తుంది. సతసాంగత్యం వల్ల లోపల ఉండే కల్మష భావాలు పోతాయి. మంచి పేరు వస్తుంది. జ్ఞానం వికసిస్తుంది.

ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ‘సతసాంగత్యం’ అంటే వేరే ఏదో కాదు. మంచి గ్రంథం చదవడం. భగవద్గీత చదవడం,భర్తృహరి సుభాషితాలు చదవడం కూడా సత్సాంగత్యమే. ‘సాధుసంగంబు’ అంటే వట్టి సాధువులతో స్నేహం అని మాత్రమే కాదు,

మంచి మనుషులతో స్నేహం చేయడం. ఇది అందరూ పాటిస్తే సుఖదుఃఖాలను

సమానస్థాయిలో తీసుకోవడం సాధ్యమవుతుంది.

ఉత్సవే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే l

రాజద్వారే శ్మశానేచ య తిష్ఠతి స బాంధవః ll

ఆనందములోన ఆపత్తులోనూ దుర్భిక్షము లోనూ దుష్ట బాధలందును మహారాజు ఆస్థానములోనైనా మరుభూమియందైనా అండగా నిలచినవాడే అసలైన బాంధవుడు. మిత్రుడు కూడా బంధువే! బాంధవ్యము అంటే చుట్టములు మాత్రమే కాదు స్నేహితులు కూడా! అసలు సూర్యునికి మిత్రుడు అన్న నామాంతరముంది.  మరి నిజంగానే ఈ సృష్ఠికి ఆయన మిత్రుడే కదా! ఆయన వెలుగేలేని ఒక రోజునైనా ఉహించగలమా! ఎన్ని చిక్కటి మబ్బులకైనా చిక్కక, అంతో ఇంతో ఎంతో కొంత తనకు వీలయినంత వెలుతురు లోకానికి పంచే ఆయన, మిత్రులు అనిపించుకోదలచిన వారలకు, ఆదర్శప్రాయుడు. అట్టి మైత్రి మనకు ఆడర్శమున్ కావలెను.

ఆయన సహాయ సహకార సౌజన్యములులేక మనమేపనయినా చేసుకోగలమా! స్నేహత ధర్మమంటే అది. మరి రాత్రి వుండదే అంటే అది నీ విశ్రాంతి కొరకే! అసలు స్పెనేహమును గూర్చి వేదము ఈవిధముగా చేబుతూవుంది.

యః స్థిత్యాజ సఖి విధగం సహాయం నతస్య వాచ్యపిధాగో ఆస్తి l

ఎవరయితే సేహధర్మము తెలిసినటువంటి స్నేహితుని విడిచిపెదతాడో అట్టి వ్యక్తి యొక్క పేరును ఉచ్చరించుట కూడా పాపమే! ఇది వేదవాక్కు. అట్లని మిత్రుడు ధర్మమార్గము తప్పినపుడు అతనిని మందలించి తిరిగీ సత్యపథమున ఉంచవలసిన బాధ్యత కూడా స్నేహితునిదే!

పెద్దలు చెప్పిన ఈ మాటను గమనించండి.

దదాతి  ప్రతిఘృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి l

భుంక్తేచ భోజయిత్యైవ ఇత్యేతత్ మిత్ర లక్షణం ll

కష్ట సుఖాలు ,మంచిచెడ్డలు, ఆపదానందాలు అన్నింటిలో భాగస్వామ్యము కలిగినవాడే అసలైన మిత్రుడు. ఇద్దరు  నిజమైన స్నేహితులు భూమి పై లేకున్నా వారి స్నేహము అజరామరము. అది దినదినమూ గుర్తుండేది. దానికి రోజులతో పని ఉండదు.

కృష్ణ కుచేల, రామ సుగ్రీవ మైత్రి మనకు ఆదర్శము. అంతేగానీ స్నేహితానికి ఒక దినము కేటాయించుట, 'Happy Friendship day' చెప్పుట ఇవన్నీ సహవాసమునకు అద్దము పట్టవు.  ఒక బక్కెటలోని నీళ్ళు దోసిలినిండా తీసుకొని కొంత దూరము

నడచిపిదప దోసిలి చూసుకొంటే నీళ్ళుండవు. దోసిలి ఖాళీ అయివుంటుంది. మనలను దోసిలిగానూ మన సంస్కృతిని నీళ్ళగానూ భావించితే పోను పోనూ సంస్కృతి శూన్యము అవుతుంది అన్నది అర్థమౌతుంది.

పరదేశీయ సంస్కారము అవసరము ఉన్నచోట వాడవలసిందే కానీ మనకున్న సంస్కారమును ఎప్పటికీ వదలకూడదు. అన్నము ప్రతిరోజూ తింటాము గానీ అప్పళాలు తినముకదా! సీమ దొరలకు జీన్సు కావాలి గానీ భారతీయులకు పత్తి బట్టలు శ్రేష్ఠము కాదా!

అందుకే 'ముందు' మనకు నచ్చని\సరిపడని విషయములను 'నలుగురితోబాటు నారాయణ'  అని తలవక, చేయకుండా వుంటే ఒకరికిచెప్పగలము.

सन्तोषः परमो लाभः सत्सङ्गः परमा गतिः

विचारः परमं ज्ञानं शमो हि परमं सुखम्

సంతొషః పరమో లాభః సత్సఙః పరమా గతిఃl

విచారః పరమం జ్ఞానం క్షమోహి పరమం సుఖంll

సంతోషము సంతృప్తి కలిగియుండుటే అన్నింటికీ మించిన లాభము. జ్ఞానులైన పెద్దల సాంగత్యమే మనోవికాసమునకు పరమావధి. ఒక విషయమును గూర్చిన విచార విమర్శలు చేసి తెలుసుకోనుటయే నిజమైన జ్ఞానము. క్షమించుటకు మించిన పరమ సుఖము లేదు. కావున ఆకాంక్షలు తెలుపుకొనుటతో సహవాసము వృద్ధిచెందదు. ఆత్మీయత, ఆప్యాయత, అనురాగము, అంతఃకరణ, అనుకంపన, అవినాభావము అన్నవి నిజమయిన సహవాసమునకు అంగములు. వాటిని కలిగి పరిచయమునకు అడుగు ముందునకువేసినవాడే స్నేహితుడు కాగలుగుతాడు. సహవాసానికి వయసుతో నిమిత్తము లేదుకానీ, పెద్దలతో సహవాసముచేసి వారిని గౌరవించుటవల్ల వారి వాత్సల్యమును పొందుటయేగాక వారినుండి ఎంతో విజ్ఞానమును గ్రహించవచ్చును.

ఈ విషములు మనసున వుంచుకొని స్నేహితము చేస్తే మనుషుల మధ్య సంఘీభావము ఏర్పడుతుంది.

1958లో పరాగ్వేలో జాయిస్ హాల్ అణు వ్యక్తి తొలిసారిగా స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిపాదించినారు. ఇది ప్రపంచ సెలవుదినం ద్వారా స్నేహాలను జరుపుకునే సెలవుదినం. యునైటెడ్ స్టేట్స్‌లో సమకాలీనత  కారణంగా ఇది ఆగష్టు 7కు  మార్చబడినప్పటికీ, అసలు వేడుకల తేదీ ఆగస్టు 2.

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, 1998లో, నేన్ అన్నన్ విన్నీ ది పూహ్‌ను ఐక్యరాజ్యసమితిలో స్నేహపూర్వక ప్రపంచ అంబాసిడర్‌గా పేర్కొన్నాడు. ఈ స్మారక దినమును  U.N. Department of Public Information and Disney Enterprises, co-hosted by Kathy Lee Gifford చేయుట జరిగినది. ఇందులో ఏదయినా మనకుఅ తార్కికమగు లేక చారిత్రికమగు కారణమేదయినా అగుపించుతూ జన్నదా! ఇది వేలంవెర్రి కాక వేరేమిటి.  'రామ సుగ్రీవ మైత్రి'తిథి ని గానీ 'శ్రీ కృష్ణ కుచేల మైత్రి' గానీ సహవాసమునకు పరాకాష్ఠ, వారే మనకు ఆదర్శము. 

Friendship Day

For me Friendship isEternal and Every Day is a Friendship Day. Though Sudama and Krishna met only once after their departing from Gurukula or Alumni, without any communication between them their friendship is sustained. Sri Krishna being God incarnation did not forget that Sudama is a Brahmin. I opine that is friendship. Friendship can never be for a day nor is it to be reminded on a particular day. In Ramayana we see that friendship in between Rama and Sugreeva.In kaliyuga we find the same in Raja Bhoja and Kalidasa ll.

 

 I expressed what 'Friendship' is without minsing woords. Please do not mistake me for my expression.

స్వస్తి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      .