Saturday, 19 August 2017

శ్రేయాంసి బహు విఘ్నాని

శ్రేయాంసి బహు విఘ్నాని

'ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ' అన్నది భర్తృహరి సుభాషితము. నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే  యెంతో బాధ కలుగుతుంది. ఇది ఏ విధముగా ఉన్నదంటే 'అమ్మ పెట్టదు అడుక్కొనీ తిననివ్వదు' అన్నట్లుంది. శిశు ప్రసవము జరుగుటకు ఒక అరగంట లేక గంట పట్టినా ఆ తల్లి తొమ్మిది మాసములు ఆ శిశువును ఎంతో జాగ్రత్తగా కడుపులో పెట్టుకొని చూసుకొంటుంది. వ్యాస వాల్మీకులు ఇరువురూ 'క్షమయా నిష్ఠితాం జగత్ ' అన్నారు. అదీ కాక
 ' శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి
   అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాంతి వినాయకాః'
లోక శ్రేయస్సు కొరకు పాటుపడే మహనీయులకు విఘ్నాలు కొల్లలు. అదే హీనకార్యనులను ఆచరించే వారికి విఘ్నాలు కూడా విపరీతమైన దూరములో ఉండును, అన్నది ఆర్య వాక్కు. మరి పైన చెప్పిన విషయములలో ఒకదానిని గూర్చియైనా మన ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఆలోచిస్తున్నారా! ప్రభుత్వము చెడుగు మాత్రమె చేయుటకు ఏమయినా కంకణము కట్టుకోన్నదా! ఇపుడుప్రభుత్వము చేపట్టిన ఈ 'విముద్రీకరణ (demonetisation)' ప్రక్రియను తీసుకొందాము.నోట్ల మార్పిడి లో కష్టాలు లేవని కాదు, ఎవరికైనా కష్టం వస్తే స్వాంతన పలుకవలసినప్రసార మాధ్యమాలు మానవ సహజమైన వైఫల్యములను ప్రత్యేకముగా ఎత్తి చూపుతూ ప్రభుత్వమును విమర్శించుట అత్యంత బాధాకరమైన విషయము.,  ప్రభుత్వమూ యొక్క నోట్ల మార్పిడి విషయములో ప్రసార మాధ్యమాలు అనుసరిస్తున్న విధానము ఎంత దుఃఖదాయకమైన విషయమొ గమనించండి.

1. రెండున్నర లక్షల వరకూ యెవరైనా బాంక్ లో జమ చేసుకోవచ్చు అన్న విషయమును ప్రజా బాహుళ్యమునందు ఎంతయినా ప్రచారము చేయవచ్చును కదా!
 2. పొలం అమ్మిన డబ్బులు బాంక్ లో వేసుకోవచ్చు. మహా అయితే కొంత టాక్స్ కట్టాలి అంతే కానీ చింత పడ నవసరము లేదని చెప్పకుండా, పదే పదే కష్టాలు మాత్రమే చూపినందుకు, అవునేమో అని నమ్మి 52 లక్షలు ఉన్న ఒక మహిళ ఆత్మ హత్య చేసుకొంది. ఈ ఉదంతము జరిగిన పిదపనైనా ప్రసార మాధ్యమములవారు ఒక్కసారయినా ఆత్మా విమర్శ చేసుకొన్న దాఖలాలు కనిపిస్తున్నాయా?
3. 73 సంవత్సరాల వృద్ధుడుపంక్తి(Que) లో నిలబడలేక చనిపోయినాడని చెప్పే మీడియా అక్కడ క్యూ లో ఉన్న వారు ఆ వృద్దుని ముందుగా పంపియుంటే ఈ ఘోరము జరిగియుండేదికాదు, అని తెలియజేయగాలిగినారా!  మరి మన పాత్రికేయులు, దూర శ్రావని, దూర దర్శిని మాధ్యమాలలో ఆ సంస్కారం  లేకపోయింది కదా! ఇది తమ పొరబాటుగా, పొరపాటుననైనా తలచినారా?
4. ఈ వాస్తవాన్ని ఒకపరి గమనించండి. జపాన్ లో సునామీ వచ్చినపుడు, వచ్చిన రోజుమొదలు పరిస్థితి చక్కబడే వరకు, అచటి  ప్రతి వ్యాపారస్తుడు తాము విక్రయములను తగ్గింపు ధరలకు వస్తువులనమ్మి  ప్రజలకు సేవ చేసిన విషయం ప్రసారం చేసి ఉంటే కనీసం కొంత మంది అయినా ప్రభావితం అయ్యే వారు కాదా! మన వ్యాపారులు తమ లాభములలో కొంత తగ్గించుకొని అమ్మితే దేశమునకు , ప్రజలకు సేవచేసినట్లగునని ఎందుకు తెలియజేయ కూడదు?
5. సునామీ నుండీ జపాన్ తేరుకొనుటకు 10 రోజులు పట్టినా, ప్రభుత్వ కార్య నిర్వాహకులు, ఎవరి వస్తువులు వారికిచ్చినారు. అందుకే కదా అది చిన్న దేశం అయినా ప్రపంచంలో అంతా గౌరవంగా బ్రతుకుతోంది. మరి ఈ విషయమును ప్రసారం చేసి ఉంటే బాగుండేది కాదా!
6.అమెరికాలో జంట టవర్లు కూలిపోయినపుడు,ప్రతిపక్ష పార్టీ లు గాని ప్రజలు కాని ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు.మీడియా కూడా తప్పుడు వార్తలు వ్రాయకపోగా, ప్రజలకు ధైర్యము కలిగించే వార్తలు మాత్రమే వ్రాసినారు. ఆవిధముగా చేయుటచే అమెరికా తన పెద్దరికము 
మన దేశము లో మీడియా చేస్తున్న మేలు కన్నా కీడు యెక్కువగా ఉంది.
యెక్కువగా మీడియా ప్రసారాలు చూస్తే అసలు దేశములో జీవించే అవకాశం లేదేమో అనే అనుమానం మనకే కలుగుతుంది.
ఈ మీడియాకు  సరి అయిన దిశానిర్దేశం యెప్పుడు యే కోర్టు ఇస్తుందో అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఒక్క సారి మన వీర సైనికులు పడుతున్న కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మూడు నాలుగు గంటల క్యూలో కరెన్సీ  మార్చుకునే కష్టం యెంత.
నల్ల ధనం తో టెర్రరిస్ట్లు పేట్రేగిపోతుంటే 70 సంవత్సరాలు ఈఁ దేశాన్ని అస్థిరపరిచే  నల్ల కుబేరుల భరతం పట్టే దమ్మున్న నాయకుడు మన ప్రధాన మంత్రి అని గర్వపడే ప్రతి పౌరులకు నమస్సులు.
మీడియా యెంతగా   ప్రయత్నించినా క కా పార్టీ లు యెన్ని తప్పుడు కూతలు కూసినా కొన్ని రోజులు చిన్న చిన్న కష్టాలు ఉన్నా ఇప్పటికైనా ఒక గొప్ప నాయకుడు మన దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మేమూ సహకరిద్దాము   అని మీడియా మైకుకు చెప్పిన హీరోల్లారా జోహార్ జోహార్.
అసలు ఇంట్లో 100, 50, 10 నోట్లే లేనట్లు ప్రతి పేదవాడు కేవలము 500 లేదా 1000 నోట్లు మాత్రమే ఉన్నట్లుగా చూపిన ఓ మీడియా ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకో.
సారీ మీకు రేటింగ్స్  పెంచుకోవడం తప్ప మరేమీ అవసరం లేదనుకోండి.
దేశం యేమైనా మా చానల్ రేటింగ్ మాకు చాలు అనే కుటిల మీడియా కారణముగా మీడియా పై నమ్మకం పోగొట్టే అవకాశం ఉంది.
యెప్పుడూ నిరాశా నిస్పృహ వార్తలే కాకుండా మంచి వార్తలు ప్రసారం చేసి పుణ్యం తెచ్చుకోండి
"సత్యం వధ ధర్మం చెర "
శ్రీ రావు గారి సౌజన్యముతో ........

No comments:

Post a Comment