పూర్ణమదః పూర్ణమిదం
https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post.html
పూర్ణమదః పూర్ణమిదం
ఈశావాస్యోపనిషిత్తు"ఈశావాస్యమిదగ్గ్
సర్వం" అనే మంత్రముతో
ప్రారంభమవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది.
ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తుల లాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది.
యజుర్వేద భాగమైన శుక్లయజుర్వేదము లోని వాజసనేయసంహిత లోని 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ సంహితలో ఈ ఉపనిషత్తు
40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన
ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే
సాధనను "ఈశ విద్య" అంటారు.
ఈశావాస్య
ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.
ఓం
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతేl
పూర్ణస్య
పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతేll
ఓం
శాంతిః శాంతిః శాంతిః.
పూర్ణమనెడి
పదమునకు అర్ధము, సంపూర్ణమైనది,
అన్నిటిని కలిగినది. అంటే అది భగవత్ స్వరూపము. ఇది కాక వేరొక అర్థము
లేనిది. ఏమియును లేనిది అని అంటున్నప్పుడు ‘శూన్యము’ యనెడి అర్థము ఒకటి కాగా
అన్నిటిని కలిగియున్న, భరించుచున్న ‘పూర్ణము’ అన్నది మరియొక
అర్థము. ఇందలి నిజానిజములను పరిశీలింతము. ‘0’ మరియు ‘∞’ (Infinity,
అనంతము) అన్వయించుకొన వచ్చును. ఇక్కడ భారతీయులకు
పాశ్చాత్యులకూ ఒక తేడా ఉన్నది. మన సంఖ్యలు ఒక ఊహా వృత్త విభాజకములు, వారిది ఒక
సరళరేఖా విభాజక సముదాయములు. అందుచేత వారికి
ఆ సరలరేఖకు ఆద్యము ‘0’ అంతము ‘∞’. మనకు అట్లు కాకాక ఆదిలోకే అంతము చేరిపోయి అది పూర్ణమౌతుం. వారు ‘0’ - ‘0’ = ‘0’ అని ‘∞’ - ‘∞’ = ‘∞’ అని వేరు వేరుగా
వ్రాసుకొంటారు. మనకు శూన్యము అనంతము అంతా ఒకటే! కాబట్టిరెండూ పూర్ణమే! ఒకే
సంఖ్యనుండి అదేసంఖ్యను కూడినా తీసివేసినా ఆ ఫలితము ఒకటే అయితే ఆ సంఖ్యలు వేరువేరు
కాజాలవు కదా! ఈ పూర్ణమే భగవత్ స్వరూపము.
ఈ వాస్తవమే కఠోపనిషత్తులో ఈ విధముగా చెప్పబడినది.
అణోరణీయాన్మహతో మహీయా
నాత్మా2స్య జంతోర్నిహితోగుహాయామ్
తమః క్రతు పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మహిమా నమాత్మనః (2.20)
అంటూ వున్నది కఠోపనిషత్తు.
మనకు అణువే కనబడదు. అణోరణీయాన్ - అణువులో అణువు
వంటిది, మహతో మహీయాన్ - మనముచెప్పలేనంత పెద్దదిగా
ఉంహించుకున్న దాని కంటె పెద్దది. జీవుల (సకల ప్రాణుల) హృదయగుహలో ఉన్నది. అదియే
ఆత్మ. అక్రతుః- అంటే ఏకార్యమూ లేనివాడు. చూచేవాడు చూడబడేదీ అదే కాబట్టి ఆత్మకు ఏ
ఇతర కార్యములేదు. పశ్యతి - దేహాత్మాభావన లేనివాడే హృదయగుహలోని వస్తువును చూడగలుగుతున్నాడు.
వీతశోకః - శోకములేనివాడు అవుతున్నాడు. ధాతుప్రసాదాత్ మహిమానమాత్మన - విధాత
ప్రసాదమువలన ఆత్మను మహత్తును చూడగలుగుతున్నాడు.
తిరిగీ అసలు విషయమునకు వస్తే ఆ పరమ పదార్థము మానవుల ఇంద్రియములకు గోచరమగునది
కాదు. ఆకాశము వంటిది. ఆకాశమును మన పూర్వులు శూన్యముతో పోల్చినారు. భూమి గోళము
అన్నది మనకు తెలిసిన విషయమే! కావున ఆకాశము కూడా ఒక పూర్ణ గోళమగుచూ భూమిని ఆవరించి
యున్నట్లె కదా! అప్పుడది పూర్ణము. అనగా అది పరమాత్మ తత్వమగు ‘మహతో మహీయాన్’ ను ధృవ పరచుచున్నది.
కావున
మన తత్వ శాస్త్ర రీత్యా అయినా గణిత శాస్త్ర రీత్యా అయినా పై శ్లోకము యొక్క
సారాంశము
‘0’ - ‘0’ = ‘0’ ‘∞’ - ‘∞’ = ‘∞’
‘0’ + ‘0’ = ‘0’ ‘∞’ + ‘∞’ = ‘∞’
ఇదే
పూర్ణత్వము ఇదే పూర్ణ తత్వము
ఒక పాఠకుడు తన విమర్శ యొక్క సారాంశముగా భగవద్గీత 2వ అధ్యాయములోని 16వ శ్లోకమును ఉటంకిస్తూ 'Matter can neither be created nor destroyed' అని తెలితెలిపినారు పుట్టుక నాశము లేనివాడు భగవంతుదనియే కదా భగవద్గీత చెప్పుచున్నది, ఈ matter ను మాయ ఆవరించి ఉంటుంది, ఆ మాయ శాశ్వతము, భగవద్గీత ౨వ శ్లోకము యొక్క వివర ణ ఈ దిగువన తెలియజేయబడినది, చదువగలరు,
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।
అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.
భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా
సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)క్షరం ప్రధానమమృతాక్షరం హరః
క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)
సంయుక్తమేతత్ క్షరమక్షరం చ
వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)
ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.
. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).
2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.
3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చియి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?
ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.
సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స
తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా
తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్
నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం
చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం
కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)
భగవంతుడు ఈ జగత్తును సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో కూడా వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు.
చాలా విశదంగా చక్కగా చెప్పినారు sir
ReplyDeleteమీ కు జోహారులు
అందరూ చదవ వలసిన విషయం
Chala baagundi. Poornatvamloni poornam paripoornamga. Chepabadindi
ReplyDeleteVery informative
ReplyDelete