లోగుట్టు - ఏడుచేపల కధ
https://cherukuramamohanrao.blogspot.com/2014/11/blog-post_56.html
మన పెద్దలు చెప్పిన కధలలో, ఏడుచేపల కథ ఒకటి. కథను గమనించితే అందు నీరు
వదిలి సగము ఎండిన చేపలు, గడ్డిమోపు, చీమ ఇవన్నీ మానవ భాషలో
మాట్లాడుయ్తాయి. అవి మానవ భాషలో మాట్లాడకుంటే చదువరులమైన మనకు అర్థము
కాదు. అసలీకథలో ఏదైనా మర్మముతో కూడిన చక్కటి అంతరార్ధము ఉందా అన్నది
చూద్దాము.ఒకసారి కథను పునశ్చరణ చేసుకొందాము.
అనగనగా
ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుమందీ వేటకు పోయి
రు.
ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టినారు.
అందులో
ఒక చేప ఎండలేదు. ఇక ఇక్కడనుండి ప్రశ్నలు మొదలయినాయి.
రాకుమారులు అడుగ మొదలిదినారు. ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ ‘గడ్డిమోపు
అడ్డువచ్చింది’. ‘గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డమోచ్చినావు?’ ‘ఆవు మేయలేదు’.
‘ఆవా
ఆవా ఎందుకు మేయలేదు?’ ‘పాలేరు తాడు విప్పలేదు’.
‘పాలేరా పాలేరా ఎందుకు విప్పలేదు?’ ‘అవ్వ బువ్వ పెట్టలేదు’. ‘అవ్వా అవ్వా బువ్వ
ఎందుకు పెట్టలేదు?’ పిల్లవాడు ఏడుస్తూ ఉండినాడు’. పిల్లవాడా పిల్లవాడా ఎందుకు
ఏడుస్తూ
వుందినావువు?’ ‘చీమ కుట్టింది’.
‘చీమా చీమా ఎందుకు కుట్టినావు?’ ‘నా బంగారుపుట్టలో చేయిపెడితే కుట్టనా?’ ఇది
అమ్మమ్మ
నా బాల్యములో చెప్పిన కధ.
ఒకసారి తెలుగు పండితుడు గొప్ప జిజ్ఞాసువు అయిన మా మేనబావ యగు కీ.శే. శాకల్య
రామూర్తి గారిని నేను సరియగు సమయములో ఈ కథను ఎగతాళి చేస్తూ
మాట్లాడినప్పుడు ఆయన ఈ విధముగా వివరించ
మొదలుపెట్టినారు. -
ఈ కధలో రాజు సాధకుడు. ఆ సాధకుని దేహంలో వున్న ఏడు చక్రాలు (మూలాధార,
స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం) చక్రాలు ఆ రాజు యొక్క
ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులు వేటకు అంటే పరమాత్ముని వెదకుతూ
ధ్యానస్థితికి వెళ్ళినారు. ఏడు చేపలు తెచ్చినారనగా తన ధ్యానమునకు అవరోధమైన
మనస్సు మరియు అరిషడ్వర్గములను నియంత్రించినారు సాధన అనే తపస్సు అనగా
ఎండలో
ఎండబెట్టినారు. అందులో మనస్సనే చేప ఎండలేదు. ఎందుకెండలేదన్న విచారణ ఇక్కడ
ప్రారంభమైనది. ‘మనసా, మనసా
ఎందుకు ఎండలేదు?’ బుద్ధి అడ్డు వచ్చింది. అంటే ఇక్కడ వక్ర గతిని పట్టిన బుద్ది. ‘బుద్ధీ
బుద్ధీ ఎందుకు అడ్డము వచ్చినావు? అనగా ‘వివేకము అద్దము వచ్చి మేయనివ్వలేదు.’
కారణము వారు సాధనా పథములో మొదలే ఉండుటయే! దుర్బుద్దీ దుర్బుద్దీ ఎందుకు
మేయలేదు?’ ‘సద్
బుద్ధీ అనబడే
పాలేరు మాయ అనే తాడును విప్పలేదు’. సద్బుద్ధీ, సద్బుద్ధీ ఎందుకు మాయను
విప్పలేదు?’ ‘భక్తీ అనే అవ్వ జ్ఞానమనే బువ్వ పెట్టలేదు’.
‘భక్తీ, భక్తీ ఎందుకు బువ్వ పెట్టలేదు?’ ‘ప్రాపంచిక బంధాలు అనబడే ఏడిపిస్తున్నాయి.
ప్రాపంచిక బంధాలూ, ప్రాపంచిక బంధాలు ఎందుకు
ఏడిపిస్తున్నారు?’ ‘వైరాగ్యము కుట్టింది’. ‘వైరాగ్యమా, వైరాగ్యమా ఎందుకు
కుట్టికుట్టినావు?’ ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?’ అన్నది
వైరాగ్యము.
ఇప్పుడు ఈ కధను చివరనుండి మొదటకి జాగ్రత్తగా అవగాహన చేసుకొంటూ
చేరుదాము.
పుట్ట అంటే వ్యక్తి దేహమని అర్ధం. మరి వైరాగ్యము కలుగవలసినది దేహము అనబడు
కర్మేంద్రియ జ్ఞానేంద్రియా సమూహమునకేగా! నేలమీద కూర్చున్నప్పుడు దేహము ఏ
విధముగా విస్తరించి ఉంటుందో, పైకి పోనూ పోనూ ఏవిధముగా కుంచించుకొని
ఉంటుందో పుట్ట కూడా అదే విధముగా క్రింద విశాలంగా, పైకి వెళ్తున్నకొలదీ త్రిభుజ శీర్షముగా ఉంటుంది. పుట్టకు రంద్రాలు ఉన్నట్లే మానవదేహంలో కూడా (నవ)రంద్రాలు
ఉన్నాయి. ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు ఏమిటీ జన్మ అని అన్పిస్తుంది. అలా
అనిపించినప్పుడు కొందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస మొలకెత్తి అంతర్ముఖం అవుతారు.
పుట్టలో చేయి పెట్టడమంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అంతర్ముఖం కావడమే! ఆ విధముగా
అంతర్ముఖము అగుటచే, వైరాగ్యమనే చీమ కుట్టుట జరుగుతుంది. వైరాగ్యము
కలిగినపుడు
ప్రాపంచిక బంధాలు భోగాలు దుఃఖపూరితములని గ్రహిస్తాడు. భక్తి అపుడు జ్ఞానమనే
బువ్వని పెడుతుందని
గ్రహించి బుద్ధితో మాయ అనే
తాడుని విప్పుకుంటాడు. అప్పుడు వివేకము కలుగుటచే అవివేకమనే అడ్డును
తొలగించుకొంటాడు. అప్పుడు
అరిషడ్వర్గాలుతో పాటు మనస్సు
కూడా ఎండి అంటే అదుపులోనికి వచ్చి ధ్యానము పై ధ్యాస కుదిరి
శత్చాక్రముల్నదిరోహించిచక్రాలు అధిరోహించి సాధకుడు సహస్రారమును సాధించి
ఆత్మసాక్షాత్కారాన్నిపొందుతాడు.
ఇదీ
నేను తెలుసుకొన్న మేరకు ఈ కథలోని బాహ్యార్థ అంతరార్థ గూఢార్థము.
నాకు ఈ ఆధ్యాత్మిక బోధ చేసిన మా బావ గారికి త్రికరణ శుద్ధిగా నమస్కారము.
స్వస్తి.
Very good analysis done sir. Thanks for publishing such a unimaginable information.
ReplyDelete