Sunday, 27 May 2018

ఏకనాథుడు (సంత్ ఏకనాథ్)


ఏకనాథుడు (సంత్ ఏకనాథ్)
https://cherukuramamohanrao.blogspot.com/2018/05/blog-post_27.html
ఏకనాథుడు (సంత్ ఏకనాథ్) వార్కరీ సాంప్రదాయానికి చెందిన మరాఠీ పండితుడు మరియు కవి. విఠోబాను ఆరాధించాడు. మరాఠీ సాహిత్యంలో ముందు తరము వారైన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు మొదలైన వారికీ, తరువాతి తరం వారైన తుకారాం, సమర్థ రామదాసుకీ ఒక వారధిగా నిలిచిన వాడు. ఆయన 16వ శతాబ్దం చివరిలో జీవించినట్లు ఒక అంచనా .  పైథన్ లోని 'ఏకవీర' వీరి కులదైవము. ఈయన భాగవత పురాణాన్ని ఏకనాథ భాగవతం పేరుతోనూ, రామాయణాన్ని  భావార్థ రామాయణము అన్న  పేరుతోను  మరాఠీలో వ్రాసినాడు. ఈయన శ్రీకృష్ణునికి పరమ భక్తుడు. రామునికీ అంతే. ఈయన ఉ మూలము అద్వైతమే! శంకరాచార్యుడు సంస్కృతంలో రాసిన 14 శ్లోకాల హస్తామలకం అనే రచనను 764 పద్యాలతో మరాఠీ లో ఆయన తిరగవ్రాసినాడు.

వాల్మీకి రామాయణము 24 వేలశ్లోకములు కలిగినదైతే వీరి రామాయణము 40 వెల శ్లోకములు కలిగియున్నది. ఈయన అపారమగు రామ భక్తుడు కూడా! ఈయనను గూర్చి ఒక చిన్న ఉదంతమును వుటంకించుతాను.
'యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రకృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనికదా ఆంజనేయ స్వామిని గూర్చి చెప్పినారు. రాముని ఎక్కడ కీర్తించుచున్నా సజల నయనుడై అవనత శిరస్కుడై, ముకుళిత హస్తుడై, తదేక ధ్యానములో ఉంటాడట ఆ రాక్షసాంతకుడు.
ఒక సందర్భములో తనరామాయణ కావ్యములో సీతమ్మను వెదకుటకై హనుమంతుడు లంకజేరి అచటి వన భవన విహారాదులను ఆశ్చర్యముగా తిలకించుచున్నాడట. ఈవిధమగు తన్మయతతో ఏకానాధుడు వ్రాస్తూవుంటే ఆంజనేయుడు అచటనే కూర్చుండి తదేకముగా ఆ రచనను పరికించుచున్నాడట. ఏకనాధుడు, తన రచనలో హనుమ ఆ లంకా పురిలో ఎచటికేగినా తెలుపు తప్ప వేరు కనబడుట లేదని వ్రాసినాడు. హనుమ ఆశ్చర్య చకితుడై ఏకనాధుని కట్టెదుట కనిపించి నాకు అంతా ఎరుపురంగులో కనబడితే నీవు తెలుపని వ్రాసినావే అని అడిగినాడట. దానికి ఆయన, నా అంతరాత్మ 'తెలుపు' అని తెలిపింది అందుకే అట్లు వ్రాసినాను అని చెప్పినాడట. పావని కూడా ఊరుకోలేదు. ఆయన వెంటనే స్వయముగా 'ఎర్రగా' వున్నట్లు చూసిన నేను చెబుతూవున్నా నీవు గ్రహించుట లేదే! అని గద్దించినాడట. వాదము పెరిగింది. ఇరువురూ రామ భక్తులగుటచే ఆ శ్రీరామచంద్రుని చేతనే  పరిష్కరింప జేసుకొన దలచినారు. రాములవారిని, వారు ప్రార్థించిన వెంటనే ఆయన ప్రత్యక్షమయి కారణము అడిగితే ఇరువురూ విషయమును వివరముగా చెప్పినారు. తప్పొప్పులను నిర్ణయించమన్నారు.  శ్రీరామచంద్రుడు  ఇరువురి దృష్టీ సరియైనదే అని తీర్పునిచ్చినాడు. ఆ తీర్పు ఇరువురికీ మింగుడుపడలేదు. అది ఎట్లు? మా ఇరువురిలో ఒకరిది మాత్రమె యదార్థము కావలెను అని ముక్తకంఠముతో అన్నారు. అందుకు శ్రీరామచంద్రుడు, హనుమంతుడు లంకాప్రవేశ సమయములో రాజసిక గుణముతో అడుగు పెట్టినాడు. తనకేంతసేపు అటు తనతండ్రి రామయ్య ఇటు తల్లి సీతమ్మ , ఇరువురినీ ఇడుముల బడదోసిన రావణుని రావణుని లంకనూ మట్టుబెట్టుటయే  తన లక్ష్యము. కావున రాజసముతో అరుణారుణ నేత్రుడైన హనుమంతునకు అంతా  రాజసవర్నమగు ఎరుపుగానే కనిపించింది అది వనమైన భావనమైనా ఆకయినా పూవయినా చెట్టయినా పుట్టయినా! పైగా అది త్రేతాయుగాపుమాట. ఎకనాతుడు కలియుగామువాడు. రసమచరిత సర్వస్వమూ ఆకళింపుజేసుకొన్న సాత్వికుడు, నిర్మలుడు, నిశ్చల భక్తి పరాయణుడు.  మరి తెలుపు సాత్వికతకు ప్రతీక. కావున ఆయన కంటికి అంతా తెలుపుగానే కనిపిస్తుంది కావున ఇరువురిదీ సబబే, సమంజసమే! అని అన్నాడట. భాస్క్తులిరువురూ ఆర్ద్రచిత్తులై స్వామికి సాష్టాంగ ప్రనామములను ఆచరించినారట.
చూచినారుకడా పరమాత్ముని భక్త వాత్సల్యము. వర్ణనలు ఎన్ని దాగినా, ఎట్లుసాగినా రాముడే నాయకుడు, రాముడే రక్షకుడు.
పైన తెలిపినది రామ పారమ్యతకు సంబంధించినది అయితే ఇపుడు చెప్పబోయేది శ్రీకృష్ణునకు సంబంధించినది. 
ఏకనాధులవారిని గూర్చి ఎన్నో ఉదంతములు ప్రచారములో వున్నాయి. అందులో ఇపుడు నేను తెలుపబోయేది ఒకటి. ఇది శ్రీ కృష్ణ సంబంధమయినది.

ఒకనాడు ఆయన తండ్రి శ్రాద్ధమున కై వివిధ రకములైన వంటకాలు చేయించినాడు. ఆ సువాసనలు వీధిలో పోతూ వున్న హరిజన బాలునికి నోరూరించినాయి. ఆ బాలుడు ఎకనాధుని వసకితి గుమ్మము వదలకుండా అక్కడే నిలుచుంది పోయినాడు. ఎదో పనిమీద లోపలినుండి గుమ్మము వద్దకు వచ్చిన ఎకనాతులవారు ఆ అబ్బయిని వివరములు అడిగినాడు. ఆ పిల్లవాడు అసలు విషయము చెబుతూనే, అతని హృదయము ఆర్ద్రతా భరితమయిపోయింది. శ్రాద్ధానికి చేసిన పిండివంటలను ఆ బాలునికి విస్తరి వేసి వడ్డించినాడు.ఆయన దృష్టిలో ఆ బాలుడు హరిజనుడు కాదడు సాక్షాత్తు హరియే! ఆ బాలకృష్ణుడే!

శ్రాద్ధ బ్రాహ్మణార్థమునకు వచ్చిన బ్రాహ్మణులు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహోదగ్రులై  ఎకనాథుతులవారిని అనరాని మాటలు అంటూ వెళ్ళిపోయినారు. అంతటితో వారు ఆగక బ్రాహ్మణ సంఘముచేత ఆయనను  వెలివేయించినారు. కానీ భక్తుడగు 
ఏకనాధుడు ఏ మాత్రమూ చింతించక తాను పరమ నిష్ఠాగరిష్ఠుడు భగవత్తత్పరుడూ    కావున ఆయన ప్రార్థనను ఆలకించి పిత్రుదేవతలే స్వయంగా వచ్చి ఆ నాటి శ్రాద్ధ కర్మలనుపూర్తి చేశి సంత్రుప్తులై ఎకనాథుని దీవించి వెడలినారట.
మరియొక ఉదంతము. ప్రతిదినమూ ఏకనాధులవారు  గోదావరి లొ స్నానంచేసి సంధ్యానుష్ఠానములు ముగించుకొని తిరిగి ఇంటికివచ్చి దేవతార్చన చేసుకొనే వారు. .ఒకరోజు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఒక కొంటెవాడు  అతనిపై తుపుక్కున ఉమ్మి నాడు. మైలపడుటచే ఏకనాధుడు కిమ్మనక మరల నదిలో స్నానం చేసి వచినాడు. మరల మరలా ఆ కుర్రడు 108 మార్లు వుమిశినాడు. ఆట్లు చేసి చేసి ఆతని నోరు ఎండిపోయింది. ఎకనాథుడు అన్నిమార్లూ ఏమాత్రము విసుగు చెందక స్నానమాచరించి వచ్చినాడు. పశ్చాత్తాప తప్తుడగు ఆ కొంటెవాడు, అన్నిమార్లు స్నానము చేసినా ఇసుమంతయూ విసుగు చూపని  ఏకనాథుని కాళ్ళపై బడి అతను క్షమాభిక్ష వేడినాడు. ఏకనాథులవారు  ఆ యువకుని లేవనెత్తి ఆలింగనము చేసికొని "నాయనా నీవు నాకు చాలా ఉపకారం చేసినావు. ఒకే దినం 108 సార్లు గోదావరిలో స్నానం చేసిన పుణ్యమును  నాకు దక్కించినావు." అని అతన్ని ఓదార్చి పంపినాడు. ఎకనాథులవారి సహనశీలతకు, క్షమా గుణానికీ జోహారు లర్పించి గ్రామవాసులంతా ఆయనకు పాదాభివందనము చేసినారు.
ఇట్టి సహనమును  'తితీక్ష'అని వివేకచూడామణి వర్ణిస్తుంది. సహనం శత్రువులను మిత్రులుగా చేస్తుంది. ఈ సహనాన్నే 'తితీక్ష'అని వివేకచూడామణి వర్ణిస్తుంది.
సహనం సర్వ దుఖానాం, అప్రతీకార పూర్వకం 
చింతా విలాపరహితం సా తితిక్షా నికాద్వాతే
సమస్త దుఃఖములను ప్రతీకారబుద్ధి తో కాక,చింత,బాధతో కాక సహనంతో అనుభవించు 
టయే తితీక్షగా నిర్వచించ బడినది.
అసలు రామాయణ భారతములలో కూడా వాల్మీకి వ్యాసులవారాలు 'క్షమయా (అనగా సహనము) నిష్ఠితాం జగత్' అని చెప్పినారు. 
సుఖదుఃఖా లను,మానావమానములను ఆగ్రహానుగ్రహములను, పై సమదృష్టిని  సాధించుటయే  సాధకునికి వుండవలిసిన సద్గుణము. 

స్వస్తి.


No comments:

Post a Comment