మానిని వృత్తము
నేను ఈ రోజు 'మానిని' వృత్తములో ఈ క్రింద వ్రాసిన పద్యమును గమనించండి. ఇది చదువుల తల్లి సరస్వతికి
సమర్పించిన పద్యము.
ఈ వృత్తము కూడా మాన్యవరులు ఆంధ్ర వాల్మీకి రామాయణమైన'మంధరము' నుండి ప్రేరణ పొందినదే . ఈ
పద్యము హనుమంతుడు
రావణుని అంతఃపురము చూచు సందర్భమున 'మంధరము'లో వ్రాయబడినది . 'ఇన్ని కట్టుబాట్లతో ఒక
పద్యము వ్రాయుట ఎంత
కష్టమో' అని ఒక ఆప్తుడన్నాడు. అమోఘమైన కావ్యములు వ్రాసిన మహా పురుయ్షుల గోప్పదనమును ఏమని
పొగడము. వారికి
సంస్కృతాంధ్రము లనెడు తన స్తన్య క్షీరమునిచ్చి పంపినదేమో ఆతల్లి. వారికి మనసారా అంజలించుదాము.
విషయానికి వస్తే ...
ఈ వృత్తానికి గణములు ఈ క్రింది విధముగా వుంటాయి
'UII UII UII UII UII UII UII U'
అంటే 7 భగణములు ఒక గురువు . 13వ అక్షరము యతి . ప్రాస నియమము కలదు .
ఇది 'మానిని' కాబట్టి అదే పదముతో పద్యము మొదలుపెట్టినాను . కఠినమనిపించిన పదములకు మొదట
అర్థములు వ్రాసి
ముందునకు సాగుతాను.
మానిని=స్త్రీ ; మాలతి= జాజి (అందంగా, ఆకర్షణీయంగా అత్యంత సువాసన కలిగి వుంటుంది . అందుకై
అమ్మను ఆమెతో పోల్చినాను);
మాక్షిక= తేనె (మక్షికము అంటే ఈగ లేక తేనెటీగ ; తేనెటీగ వలన తయారవుతుంది కావున అది
మాక్షికమైనది.);
మాతృక= తల్లి ; సామపు = సామవేదపు ; తానము= శాస్త్రీయ సంగీతములో తదరినా ... అంటూ ఆలాపన
చేసి పాట మొదలు పెడతారు. దానిని 'తానము' అంటారు.
తాతకు = తండ్రికి(బ్రహ్మ విశ్వానికి తండ్రి) , బ్రహ్మకు (శుక తాతం తపొనిధిమ్ =శుకుని తండ్రి, తపోనిదియైన
వ్యాసుడు అని విష్ణు సహస్ర నామము .); నాతికి= ఆయనకు స్త్రీ అయినటువంటి ఆయనకు భార్య
అయినటువంటి అని అర్థము .
ఇక పద్యము చదువుతూ ఒక వేళ పదములు కఠినముగా వుంటే పైన చూచుకొనగలరు.
మానిని మాలతి మాకగు మాయని మాలిమి మాక్షిక మాతృకకున్
వాణికి అక్షర శ్రేణికి పుస్తక పాణికి సామపు బాణికినిన్
తానము గానము తాపము బాపగ తాతకు నాతని నాతికినిన్
వేనకువేలగు మ్రొక్కులు వెట్టుచు వేడుక నర్చి భజింతు మదిన్
చదువుల తల్లికి సాష్టాంగ ప్రణామములతో ,
తత్సత్
నేను ఈ రోజు 'మానిని' వృత్తములో ఈ క్రింద వ్రాసిన పద్యమును గమనించండి. ఇది చదువుల తల్లి సరస్వతికి
సమర్పించిన పద్యము.
ఈ వృత్తము కూడా మాన్యవరులు ఆంధ్ర వాల్మీకి రామాయణమైన'మంధరము' నుండి ప్రేరణ పొందినదే . ఈ
పద్యము హనుమంతుడు
రావణుని అంతఃపురము చూచు సందర్భమున 'మంధరము'లో వ్రాయబడినది . 'ఇన్ని కట్టుబాట్లతో ఒక
పద్యము వ్రాయుట ఎంత
కష్టమో' అని ఒక ఆప్తుడన్నాడు. అమోఘమైన కావ్యములు వ్రాసిన మహా పురుయ్షుల గోప్పదనమును ఏమని
పొగడము. వారికి
సంస్కృతాంధ్రము లనెడు తన స్తన్య క్షీరమునిచ్చి పంపినదేమో ఆతల్లి. వారికి మనసారా అంజలించుదాము.
విషయానికి వస్తే ...
ఈ వృత్తానికి గణములు ఈ క్రింది విధముగా వుంటాయి
'UII UII UII UII UII UII UII U'
అంటే 7 భగణములు ఒక గురువు . 13వ అక్షరము యతి . ప్రాస నియమము కలదు .
ఇది 'మానిని' కాబట్టి అదే పదముతో పద్యము మొదలుపెట్టినాను . కఠినమనిపించిన పదములకు మొదట
అర్థములు వ్రాసి
ముందునకు సాగుతాను.
మానిని=స్త్రీ ; మాలతి= జాజి (అందంగా, ఆకర్షణీయంగా అత్యంత సువాసన కలిగి వుంటుంది . అందుకై
అమ్మను ఆమెతో పోల్చినాను);
మాక్షిక= తేనె (మక్షికము అంటే ఈగ లేక తేనెటీగ ; తేనెటీగ వలన తయారవుతుంది కావున అది
మాక్షికమైనది.);
మాతృక= తల్లి ; సామపు = సామవేదపు ; తానము= శాస్త్రీయ సంగీతములో తదరినా ... అంటూ ఆలాపన
చేసి పాట మొదలు పెడతారు. దానిని 'తానము' అంటారు.
తాతకు = తండ్రికి(బ్రహ్మ విశ్వానికి తండ్రి) , బ్రహ్మకు (శుక తాతం తపొనిధిమ్ =శుకుని తండ్రి, తపోనిదియైన
వ్యాసుడు అని విష్ణు సహస్ర నామము .); నాతికి= ఆయనకు స్త్రీ అయినటువంటి ఆయనకు భార్య
అయినటువంటి అని అర్థము .
ఇక పద్యము చదువుతూ ఒక వేళ పదములు కఠినముగా వుంటే పైన చూచుకొనగలరు.
మానిని మాలతి మాకగు మాయని మాలిమి మాక్షిక మాతృకకున్
వాణికి అక్షర శ్రేణికి పుస్తక పాణికి సామపు బాణికినిన్
తానము గానము తాపము బాపగ తాతకు నాతని నాతికినిన్
వేనకువేలగు మ్రొక్కులు వెట్టుచు వేడుక నర్చి భజింతు మదిన్
చదువుల తల్లికి సాష్టాంగ ప్రణామములతో ,
తత్సత్
- గారు.
- పాదంఘ్రి రేణువును మాత్రమే .
- రసాత్మకంగా ఉన్నాయి.
No comments:
Post a Comment