పొడుపు పద్య భాషా చిత్రము
పొడుపు పద్యాలు చాలా
విధాలు చూచినాము.
ఇపుడు పొడుపులో
భాషాచిత్రము చూద్దాము.
ఈ శ్లోకమును గమనించండి.
కిమస్తి యమునాంతరే? కిం వదంతి విటం వేశ్యా?
ఆంధ్రగీర్వాణ
భాషాభ్యాం ఏకమేవ ఉత్తరం వద!
యమునా నదిలోపల
ఏమున్నది?
విటునితో వేశ్యలు
ఏమందురు?
ఆంధ్ర- సంస్కృత భాషలకు
సరిపడే విధంగా ఒకే సమాధానం చెప్పండి.
సమాధానం - నీలంజలం
1. కిమస్తి యమునాంతరే?
యమునా నదిలోపల
ఏమున్నది? - నీలం జలం
2. కిం వదంతి విటం వేశ్యా?
విటునితో వేశ్యలు
ఏమందురు? - నీ లంజలం
ఎంత చమత్కారంగా ఉందో
కదా సమాధానము.
సంస్కృత చాటువు -- నపుంసకము
మనము
సంస్కృత చాటువులను గూర్చి అపుడపుడు చర్చించుకొంటూనే ఉన్నాము. ఆ వరుసలో ఈ చాటువును
కూడా ఒకసారి గమనించండి.
ఒక
ప్రేమికుడు సంస్కృత వ్యాకరణకర్త యగు పాణిని ఈ విధముగా దుయ్యబట్టుతున్నాడు
నపుంసకమితి
జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః |
తత్తు
తత్రైవ రమతే హతాః పాణినా వయమ్||
మనస్సు
నపుంసకలింగానికి చెందిన మాట అని పాణినిమహాశయుడు తన వ్యాకరణంలో చెప్పినాడు. ఆ మాట
నమ్మి నా మనస్సును నా ప్రేయసివద్దకు రాయభారము పంపినాను. ఆ నపుంసక మనసు
నాకుమేలుచెయ్యడానికి బదులు నా ప్రియురాలితోనే నిలచిపోయి నా కొంప ముంచింది.
పాణినిమహాశయులు ఈ విధముగా నా కొంప
ముంచి పుణ్యం మూట కట్టుకుంటాడని ఊహించలేక
పోయినాను.
తన
బాధనుగూడా ఆ ప్రియుడు ఎంత చమత్కారముతో చెప్పినాడో చూడండి.
అదీ
సంస్కృతముయోక్క గొప్పదనము.
చెరుకు రామ మోహన్ రావు
శివాయ విష్ణురూపాయ - ఒక సంస్కృత చాటువు
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేI
శివశ్చ హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంII
యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణుమయః శివఃI
యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషిII
అని చెప్పుచున్నది మనకు వేదార్థము. ఈ శ్లోకములు చాలా మందికి తెలిసే వుంటాయి. ఈశ్వరునికి కాలుడు అని ఒకపేరు. పైగా ఆయన లయుడు. తమోగుణ ప్రతీక అంటారు ఆయనను. కానీ ఆయన శరీరము అంతా తెలుపే. దానికి తోడూ తెల్లనైన భస్మము ధరిస్తాడు. వెండికొండలో ఉంటాడు. స్వచ్ఛమైన చంద్రుని కలిగియుంటాడు. ఆయన వాహనము నంది తెలుపు. ఎప్పుడూ చల్లదనము కలిగియుంటాడు. అభిషేక ప్రియుడు. ఈవిధముగా అన్నీ సత్వగుణ ప్రధానములగు గుణములనే కలిగియుంటాడు. మరి విష్ణువో సత్వగుణ ప్రధానుడు. కానీ ఆయన నలుపు. ఆయన పవళించే ఆదిశేషుడు నలుపు. ఆయన వాహనము గరుత్మంతుడు నలుపు. ఆయన స్థితి నిరత నిద్ర.
మనము కాస్త పరిశీలనాత్మకముగా ఆలోచించితే శివుని స్వరూప స్థితిగతులు సత్వగుణ సూచకములు. కానీ ఆయన లయ కర్త. మరి విష్ణువో బాహ్యలక్షణములన్నీ తామసికములు కానీ కర్తవ్యము మాత్రము దుష్ట శిక్షణ లోక రక్షణ. ఈ విధమగు ఆలోచన చేస్తే వారిది అభేద వ్యాజ్యము అని మనకు అర్థమైపోతుంది.
ఈ చాటువు గమనించండి. ఎంత చక్కగా మనకు ఆ అర్థము సార్థకమౌతుందో అర్థమౌతుంది.
వాసుదేవ ఇతి వామదేవ ఇతి ఆస్తి కల్పక మహీరుహద్వయం
యద్యపీహ సుమభేద సంభవః నాస్తి తత్ర ఫలభేద సంభవః
వాసుదేవుడు అంటే విష్ణువు. వాసుదేవుని కొడుకైనందువల్ల వాసుదేవుడైనాడు కృష్ణుడు. మరి విష్ణువుకు మున్డునున్దియే వాసుదేవుడను నామము కలదు. ఆయన భూభారత. అందుచే భూమినుండి లభ్యమయ్యే వసువులకు కూడా ఆయనే నాథుడు. అందుకే వాసుదేవుడు. ఇక వామదేవుడు అంటే శివుడు. వామదేవ శబ్దానికి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. సులభమైన అర్థమును గ్రహించుదాము. మనము తూర్పును చూస్తూ నిలబడి ధ్యానాదులు చేయవలెను. అప్పుడు మన ఎడమచేయి ఈశాన్యమును చూపిస్తుంది. అక్కడ వున్నవాడు వామదేవుడు. 'వామము' అంటే ఎడమ అని అర్థము. శివునికి ఎడమవైపు పార్వతివుంటుంది. ఆమెకు దేవుడు అంటే ఆమె భర్త.
ఇక విషయానికి వస్తాము.
పై శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే 'వాసుదేవుడు' 'వామదేవుడు' అనునవి రెండు కల్పవృక్షములట. ఆ వృక్షములకు పూవులు వేరట కానీ ఫలమేమో ఒకటేనట. ఇది చోద్యము కాదా! ఇందులో వున్న నిగూఢార్థమును తెలుసుకొంటే ఆశ్చర్యపోతారు. వాసుదేవ లో 'సు' వామదేవ లో 'మ' అంటే సు-మ మాత్రమె తేడా. (సుమము అంటే పూవే కదా!). మిగతా అంతా ఒకటే. ఇరువురిలో ఎవరిని ఆరాధించినా ఫలమొకటే! ఎంత గొప్ప సందేశమును ఎంత చమత్కారముగా చెప్పినారో చూడండి. శంకరులవారు ఉపదేశించినది ఈ అద్వైతమే!
స్వస్తి
అణోరణీయాన్ మహతోమహీయాన్
“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,
హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” హాస్యానికి
ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార
భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి
ఆనందించండి.
“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారట.
“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,
హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” హాస్యానికి
ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార
భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి
ఆనందించండి.
“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారట.
ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.
మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి వదిలి వేసారు. వారి భావానికి తగిన విధంగా నేను పూరిస్తాను చిత్తగించండి.” అని పలికి, సరస్వతీ మాతను మనసులో ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం - - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. చూసారా! కాళిదాస కవితావైభావం. మరొక్కసారి పైశ్లోకం చదివి ఆనందించండి.
చమత్కార శ్లోకము
లక్ష్మీ దేవికీ, పార్వతీదేవి కీ మధ్య సాగిన ఈ సరస సంభాషణను సాదరముగా చదవండి.
శ్లోll భిక్షార్థీ ప్రయాతః సుతను?బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?
జానే బృందావనాన్తే,క్వ చ స మృగ శిశు:? నైవ జానే వరాహం
బాలే,కశ్చిన్న దృష్ట:? జరట వృష పతి:?గోపా ఏవాస్య వేత్తా
లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కాన్యయో త్రాయతాం వః
లక్ష్మీ దేవి చుట్టపు చూపుగా కైలాసానికి వెళ్ళిందట. పార్వతి ఆమెను సాదరముగా తోడుకోనివచ్చి ఉచితాసీనురాలిని చేసి కుశలప్రశ్నలు అడిగింది. పిచ్చాపాటి మాట్లాడుకోన్నతరువాట సరసము శ్రుతిమించి లక్ష్మీదేవి ఎగతాళిగా పార్వతీ నీ భర్త భిక్ష మడుక్కునేందుకు ఎక్కడికి వెళ్ళినాడు?పార్వతి గడుసుగా బలిచక్రవర్తి యాగానికి వెళ్ళాడు సుందరీ అన్నది.
ఈ రోజు మీ తైతక్కలు ఎక్కడ ? అన్నది లక్ష్మి , పార్వతి వెంటనే బృందావన ప్రాంతం లో అనుకుంటాను అన్నది. మీ అందాల మృగ శిశువు (వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు కదా!) ఎక్కడ?అన్నది లక్ష్మి ఎగతాళిగా, అందుకు పార్వతి ఈ వరాహాల (విష్ణువు వరాహావతారం) సంగతి నాకేం తెలుస్తుంది అన్నది. మీ ముసలి ఎద్దు ఏదీ కనపడదే? అన్నది లక్ష్మి. ఎద్దులూ,ఆవుల విషయం ఆవులు కాచే వాడికే తెలియాలి. ఇలా ఎకసక్కాలాడుకునే లక్ష్మీ,పార్వాతులు మిమ్మల్ని కాపాడుదురు గాక.
ఎంత సుందరమైన భాష ఎంత సుందరమైన భావము. ఇంతటి గొప్ప భాషను చేయి జార్చుకొన్నందుకు మనము సిగ్గుపడవలెనేమో!
భోజనం దేహి రాజేంద్రా.....
కాళీదాసుకు, భోజుని
ఆస్థానానికి సబంధించినదే మరోచాటుశ్లోకం. ధారానగరమునకు దగ్గరలోని ఒక అగ్రహారములో
పేదబ్రాహ్మణ దంపతులుంటారు. తాను
పెద్దకవినని బడాయి పోతూ వుంటాడు ఆబ్రాహ్మడు భార్యతో! ఆమె వినివిని వేసారి 'పేదరికమునకు తోడుగా గంపెడు పిల్లలున్నారు కదా మనకు కుటుంబ పోషణతో
సతమతమౌతున్నారుకదా, మీరెందుకు
భోజునిఆస్థానమునకు పోయి మీకు తోచిన కవిత్వము ఏదయినా చెప్పి ఆయన వద్దనుండి
బహుమతులను గ్రహించుక రాగూడదాఅంది. బ్రాహ్మడు బిక్కమోగమువేసినాడు కానీ ఎట్లయితే
అట్లావుతుందని మేకపోతు గాంభీర్యమును ప్రదర్శిస్తూ భార్యతో "అలాగే"
అన్నాడు.అతడు ధారానగరము చేరుసరికి సాయంకాలమైపోవుటతో నగరములోని ఒక సత్రములో
బసచేసినా డతను.
భోజనము
ముగించుకొని సత్రములోని గుడ్డిదీపము ముందు కూర్చొని కవితా రచన చేయ మొదలు
పెట్టినాడు. ఎట్టకేలకు,
కట్టకడపటికి, తుట్టతుదకు, చిట్టచివరకుఒకపాదమువ్రాయగాలిగినాడు. అదికూడాఏమిటంటే
“
భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం" అని. అంటే రాజా నాకు పప్పు నెయ్యితో
కూడిన అన్నము పెట్టించమన్నాడు. దానివల్ల ఆబ్రాహ్మణుడు ఈక్రింది శ్లోకాన్ని
రుజువుచేసినాడు.
అలంకార
ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః
నమస్కార
ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః
అర్థము
నేను విశదపరచ నక్కర లేదు. తరువాత వ్రాయుటకు చేతగాక
ఆ తాళపత్రమును తలక్రింద పెట్టుకొని
నిద్రకు ఉపక్రమించినాడు.
ఆ
కాలములో రాజు మారువేషములో పరాయి వూర్లనుడి శత్రుదేశపు గూఢచారు లేవరైనా దేశములో
ప్రవేశించినారా అని ముఖ్యముగా సత్రములు చావిళ్ళు
చూసేవారు. ఆ రోజు రాజుతోబాతూ కాళీదాసు కుడా వున్నాడు. రాజు గమనించకుండా
ముందుకు సాగినాడు కానీ కాళీదాసు బ్రాహ్మణుని తలక్రింద గాలికి రెపరెపలాడే తాళ
పత్రమును చూసి అందులో ఏమి వ్రాయబడి ఉన్నదో అన్న సంశాయముతో మీలాగా అచ్చోటికి వెళ్లి
ఆ తాలపత్రమును దీసి చదివినాడు. కాళీదాసుకు బ్రాహ్మణుని బాధ అర్థమైనది.
ఆటను
వెంటనే "మాహిషంచ శరశ్చంద్రః చంద్రికా ధవళం దధి” అనగా శరదృతువులోని
పండువెన్నెల ధవళ కాంతితో నొప్పారే బర్రె పెరుగుతో కూడినదై వుంటే
మిక్కిలిసంతోషమని పూర్తిచేసి ఆ బ్రాహ్మణుని తలక్రింద పెట్టి తన దారిన
రాజుతో గూడా చక్కగా వెళ్ళిపొయినాడు.
తెల్లవారి
లేచి తన స్త్నాన సంధ్యాదులను ముగించుకొని తాళపత్రాన్ని చూస్తే అది పూర్తి చేయబడివుంది. సంతోషముతో ఎగిరి గంతేసి బిరబిరా భోజరాజువద్దకు బయలుదేరినాడు
బాపడు, ఎవరు పూర్తి చేసియుండవచ్చు అన్న ఆలోచనే లేకుండా! . ఆస్థానమునకు వెళ్లి తన ప్రవర చెప్పుకొని (Introduction ) తన
పద్యము విన్నవించినాడు. రాజు రెండవపాదము విని మురిసి మైమరచి ఇది మా కాళీదాసు రచనను
బోలివుంది దానికి అక్షర లక్షలు గ్రహించామన్నాడు. బ్రాహ్మణుడు విషయము అర్థము
చేసుకొన్నవాడై కృతజ్ఞతా పూర్వకమైన చూపును కాళిదాసునివైపు సారించి అశ్రునయనాలతో అక్కడ నుండి
కదిలినాడు.
ఆ
కాళీ వరప్రసాదుని కనికరము అటువంటిది.
భారతదేశ వినీలాకాశములో సంస్కృతము, కవిత్వము సూర్యచంద్రులు. ఆవెలుగులే మనకు లేకపోతే భారత భూమిపై వేలుతురేలేదు. అందునా భోజకాళీదాస కథలు కవనభవన సోపానములు. చదవండి. మన సంస్కృత సంస్కృతిని తెలుసుకొండి.
కాళిదాసు – భోజుడు
సంస్కృతము బాల్యములో నేర్చుకొనే అవకాశము లేకపోయినవాళ్ళు, ఆ భాష ప్రాశస్త్యమును, భగవత్ సాక్షాత్కారము పొంది మహాకావ్యములను రచించిన కాళిదాసాది మహాకవుల గొప్పదనమును, అలంకార సమలంకృతమై యొప్పారు కావ్య వైచిత్రిని తెలుసుకొనవలెనంటే ఆదిగా ఆ భాషపై మక్కువను ఏర్పరచుకోవలసి యుంటుంది. అట్టి జిజ్ఞాసకు ఉపాధే భోజ కాళీదాసు కథలు.ఉడుతా భక్తిగా, నేను పండితుని గాకున్నా, పాఠకులలో ఒక తపనను కలిగించు నెపముతో అప్పుడప్పుడు భోజ కాళీదాస కథలను అందిస్తూ వస్తూవున్నాను. అందులోని ఒక భాగమే ఈ కథ.
ఒకనాడు భోజరాజు కొలువు దీరి యుండగా,ఒక సన్యాసి వచ్చి ఆయనను ఆశీర్వదించినాడు. రాజు ఆయనతో స్వామీ! కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించినారు. నిత్య ఉపవాసాలతో కృశించి ఏమిసాధించదలచుకొన్నారు. నేను చెప్పబోవు ఈ మాట మీకు తెలియనిదికాదు .
అగ్నిహోత్రం గావాలంబం సన్యాసం పలపైత్రుకంI
దేవేరాచ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్II
కలియుగములో అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసము, సన్యాసము, తద్దినములందు మాంస వినియోగము, కట్టుకొన్న భార్యకు సంతాన లేమి (అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము చేసుకోనుటగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు అని విశదముగా తెలిపినారు కదా మరి మీరెందుకు పాటించుచున్నట్లు? అని అడిగినాడు.
పైపెచ్చు “గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.” అనికూడా అన్నాడు.
అందులకా యువసన్యాసి “రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది ఏముంటుంది? ‘లోకో భిన్న రుచి’ అన్న నానుడి తమకు తెలియనిది కాదు.
ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్ పశుభిర్నరాణామ్ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాలుగు గుణములు పశువులలోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్య గుణము. మనుష్యులో ధర్మమనునది విశేష గుణము. ధర్మాచరణలేని మనుష్యుడు అపుడు పశువుతో సమానము కాదా! ఈ ధర్మమూ అతని వృత్తి ప్రవృత్తులబట్టి మారుతూ వుంటుంది. రాజధర్మము వేరు మరియు యిచ్ఛాపూర్వక సన్యాసమును స్వీకరించిన సన్యాసి ధర్మమూ వేరు.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవలసి యున్నది. విద్యవలననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనగలడు. తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును కూడా పొందగలడు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నరయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్ ॥ అని కఠోపనిషత్తు 3-9
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగలడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది. ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషులని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతయని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి. దానిని సాధించుటయే ధ్యేయముగా నేను ఈ సన్యాసాశ్రమమును స్వీకరించినాను. నన్ను సరియగు రీతిలో అర్థము చేసుకోనగలరని నానమ్మకము. దయతో ఈ మాటను కూడా ఆలకించండి:
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహ-శాంతి:ప్రియా గేహినీ
వృత్తి: వన్యలతాఫలై: నివసనం,వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నివ్వృతి:
తేషాం యిందు కళావతంస యామినాం మొక్షేపి నో నః స్పృహాII
లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే మా ఇళ్ళు, శాంతికామిని శాంతిగామిని మా ఇల్లాలు, అడవులలో తీగెలతో,పండ్లతో సహవాసమే మా జీవన విధానము. చెట్టు పట్టలే మాకు వస్త్రాలు, సద్వచన ప్రవాహ స్నాతులము అంటే మంచి మాటలు అనుగంగా తరంగముల నోలలాడువారము , ఇటువంటి నిరంతర సుఖసౌఖ్యములు గల్గిన మాకు నిజానికయితే స్వర్గము పై కూడా కాంక్ష ఉండదు. బ్రహ్మైక్యమే మా ధ్యేయము అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము కావలసి వస్తే
చెప్పండి అని విధేయతతో అడిగినాడు. అప్పుడు అతడు “రాజా! ఇంతగా సాదు సాంగత్యము పై అభిలాష చూపే మీ తీయనైన మాటలు తలదాల్చి ఒక్క కోరిక కోరుతాను.నేను సాటి సన్యాసగణముతో కాశీయాత్రకువెళుతున్నాను. దయచేసి మీ సభలోని పండితులను భార్యా సమేతంగా మాతో పాటు యాత్రకు పంపించండి. త్రోవ పొడుగునా శ్రమ తెలియకుండా పండిత గోష్టులు జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.” అన్నాడు ఆ సన్యాసి. రాజు అందుకు వల్లె యనగా రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళినారు, ఒక్క కాళిదాసు తప్ప. మీరు ఎందుకు వెళ్ళలేదు? అని రాజు కాళిదాసును అడిగినాడు. కాళిదాసు ఈ విధముగా బదులిచ్చినాడు.
తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో దూర వర్తినఃI
యస్య గౌరీశ్వర: చిత్తే / తీర్థం,భోజ పరం హి సఃII
భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారు, ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజునకు మనసులో ఒకప్రక్క ఎదో కినుక ఉన్నది. కానీ తెలియబరచలేదు బాహాటంగా!
కొద్దిరోజుల తర్వాత భోజరాజు బయటి దేశముల నుండి వచ్చిన పండిత సదస్సును ఏర్పాటుచేసి వారికి భూరి సంపదలను దానము చేసినాడు. కాళిదాసును మీ నుండి కూడా కవనమును వినగోరుచున్నామన, కాళిదాసు ఈ విధముగా పలికినాడు.
మేరౌ, మందర కందరాసు, హిమవత్సానౌ.మహేంద్రాచలేI
కైలాసస్య శిలా తలేషు, లయ ప్ర్రాగ్భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గణైః: వుద్గీయ మానం యశఃII
చారణులనే దివ్య గాయకుల బృందాల చేత, నీ కీర్తి గురించి మేరు మంధర పర్వతపు గుహలలో,హిమాలయ మలయ పర్వత శిఖరాగ్రముల మీదా, సహ్యాద్రి మీదనేగాక అనేకానేక ప్రదేశములయందు, కొనియాడబడుతున్న నీ కీర్తి వినబడినది.
అప్పుడు భోజుడు సంతోషముతో పులకరించిన శరీరము కలిగినవాడై, కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని నేను వినగలిగే వాడిని కాదు కదా! అని తలచుతూ, నిర్మొహమాటముగా మనసులోకలిగిన తన తప్పిదమును కాళిదాసు కు మనవి చేసుకొన్నాడు. ఎంతటి సౌశీల్యమో చూడండి. కవనములో ఎంతటి సౌందర్యమో చూడండి. భాష భావానికి ఎంతగా ఒదిగిపోతూవుందో చూడండి. సంస్కృతముతో జీవితమునే సంస్కృతము చేసుకొందాము.
స్వస్తి.
No comments:
Post a Comment